jyoth cf

“దీపం” వెనుక “చీకటి”ఎంత..?

తెలంగాణ ఉద్యమంలో అమరులైన త్యాగదనులకు నివాళిగా ఉద్యమ పార్టీ బిఆర్ఎస్  ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆవిష్కరించిన అమరవీరుల స్మారక కేంద్రం “అమరజ్యోతి” నిర్మాణ వ్యయంపై క్రమంగా ఆరోపణలు గుప్పుమంటున్నాయి.  ఉద్యమ స్ఫూర్తి ఉట్టిపడేలా, చూడగానే అమరులను స్మరించుకునేలా సకల హంగులతో నగరం నడిబొడ్డున తళుకులీనుతున్న అమరజ్యోతి నిజంగా తెలంగాణకు గర్వకారణమని చెప్పడంలో సందేహం లేదు. దాన్ని ఏర్పాటు చేయాలనే సంకల్పం కలిగినందుకు అప్పటి ప్రభుత్వాన్ని కొనియడక తప్పదు. అమరజ్యోతి కేంద్రాన్ని అద్భుతంగా రూపకల్పన చేసినందుకు అధికార యంత్రాంగాన్ని సైతం…

Read More
ap electn

ఆంధ్రలో కేంద్ర అధికారులు…

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి రాజుకుంటోంది. భారత ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్‌, ఎలక్షన్ కమీషనర్లు అనూప్ చంద్ర పాండే, అరుణ్ గోయల్‌ విజయవాడ చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా, కృష్ణ జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు, ఎస్పీ జాషువా, జాయింట్ కలెక్టర్ డా. పి.సంపత్ కుమార్, మున్సిపల్ కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌ వారికి స్వాగతం పలికారు. నగరంలోని నోవాటెల్ హోటల్లో 9,…

Read More
IMG 20240108 WA0045

జాతర…జాగ్రత్త…

మేడారం జాతరలో వైద్య, ఆరోగ్య పరంగా పూర్తిస్థాయిలో జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. మేడారం జాతర ఏర్పాట్లు, ఆరోగ్య పరిరక్షణ పై తెలంగాణ సచివాలయంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య, ఆయుష్, ఫుడ్ సేఫ్టీ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నెల నుండే భక్తులు లక్షలాదిగా రానున్నట్టు మంత్రి తెలిపారు. ఇప్పటి నుండే ప్రధాన ప్రాంతాలలో మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేయాలని సూచించారు. మందులు, పరీక్ష పరికరాలు,…

Read More
IMG 20240108 WA0044

కొత్త సీటులో “స్మితా”…

గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలక బాధ్యలను నిర్వహించిన స్మితా సబర్వాల్ బదిలీలో భాగంగా రాష్త్ర ఫైనాన్స్ కార్పొరేషన్ మెంబర్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టారు.

Read More
kobra

కాటేస్తున్న”కోబ్రా”…!

“కోబ్రా” పేరు వింటేనే ఒళ్ళు జలతరిస్తుంది.ఎందుకంటే అది ఒక ఆఫ్రికా ఖండంలో కనిపించే భయకరమైన సర్పం.అది కాటు వేస్తే కాటికి వెళ్ళవలసిందే.అది సర్పాలకు రారాజు. కాలకూట విషాన్ని చిమ్మే విషసర్పం. బయో ఉత్పత్తులను తయారు చేసే దేవగాన్ కంపెనీ “కోబ్రా” బ్రాండ్ పేరుతో ఒక బయో ఉత్పత్తిని తయారు చేసి మార్కెట్ లోకి వదిలిందే ఆ కోబ్రా…కౌలురైతును కాటు వేసింది.ఆ దెబ్బతో రైతు అప్పులు పాలైయాడు. రాజులాగా బ్రతకలసిన ఓ కౌలురైతు ప్రైవేటు వెహికిల్ కు డ్రైవర్…

Read More
nusing cf copy

నిర్లక్ష్యం నీడలో “నైటింగెల్స్”…

ఆరోగ్య రంగంలో అత్యంత కీలకమైన నర్సింగ్ వ్యవస్థ తెలంగాణ రాష్ట్రంలో అస్తవ్యస్తంగా మారింది. ఒకప్పుడు ఉన్నతాధికారుల నిరంతర పర్యవేక్షణలో పద్ధతి ప్రకారం కొనసాగిన ఈ వ్యవస్థ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తీవ్ర నిర్లక్ష్యానికి గురైందనే విమర్శలు వెల్లువెత్తుతన్నాయి. అనేక నియమ, నిబంధనలను తుంగలో తొక్కి కొందరు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం అందుతోంది. నర్సులు, నర్సింగ్ స్కూళ్లు, కాలేజీల్లో పనిచేస్తున్న ట్యూ టర్లు, ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు వంటి వారి పదోన్నతులు, బదిలీలు, పోస్టింగులు…

Read More
IMG 20240104 WA0055

జాతీయ హోదా కావాలి..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి దిల్లీ పర్యటనలో పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా తో భేటీ అయిన సీఎం రాష్ట్రానికి ఐపీఎస్‌ అధికారుల కేటాయింపును పెంచాలని విజ్ఞప్తి చేశారు. అంతకు ముందు కేంద్ర జల్‌ శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ ను సీఎంతో పాటు, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, సీ.ఎస్‌. శాంతి…

Read More
jagansrmil

అక్కడ ఇక రసవత్తరం…!

కొద్ది నెలల్లో జరగనున్న ఆంద్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. వివిధ జిల్లాల్లోని 175 నియోజక వర్గాలకు జరిగే పోరులో ప్రధానంగా ఐదు రాజకీయ పక్షాలు తలపడనున్నాయి. దీని కోసం ఇప్పటి నుంచే ఎత్తులు, పై ఎత్తులు, సమీకరణలకు నడుం బిగించాయి. ముఖ్యమంత్రి జగన్ సోదరి షర్మిల తాజాగా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడంతో  రాజకీయ రచ్చబండ వద్ద కొత్త తరహా చర్చలకు తెరలేపింది. జననేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో అంధ్రలో ఒక్కసారిగా జవసత్వాలు…

Read More
jagan kcr

మాజీ సి.ఎం.తో జగన్…

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఆంధ్రప్రదేశ్ సి.ఎం. వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. హైదరాబాద్ నందినగర్ లోని కేసీఆర్ నివాసానికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మాజీ మంత్రి కేటిఅర్ ఆయనకు స్వాగతం పలికారు.

Read More
shrmil rahul

రాహుల్ ప్రధాని కావాలి…

రాహుల్ గాంధీని దేశ ప్రధానిగా చూడాలన్నది తన తండ్రి రాజశేఖర్ రెడ్డి ఆశయమని కాంగ్రెస్ నేత వై.ఎస్. షర్మిల చెప్పారు. వై.ఎస్.ఆర్. తెలంగాణ పార్టీని ఆమె కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. డిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ  కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి షర్మిలను పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం షర్మిల మాట్లాడుతూ స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీలో గొప్ప నేత అని, ఆయన…

Read More
banana c

రాజకీయాల్లో”అరటి పండ్లు”…!

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో “అరటి పండు”పార్టీల ఎత్తుగడలు అంతుపట్టకుండా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ నడిపిస్తున్న జనసేన, వై.ఎస్.షర్మిల ఆధ్వర్యం లోని వై.ఎస్.ఆర్.తెలంగాణ (వైఎస్ఆర్ టి) పార్టీలు ఎన్నికల సమయంలో వ్యవహరిస్తున్న తీరు రాజకీయ పరిశీలకులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావిడి మొదలవ్వగానే తమ బలం ఎంత ఉన్నదనే కనీస విషయాన్ని అంచనా వేసుకోకుండా బరిలోకి దిగడం వెనుక అసలు రహస్యం ఏమిటనే  కోణంలో చర్చలకు తెర లేస్తోంది. తెలంగాణ శాసనసభకు గత నెలలో జరిగిన…

Read More
brs C

గేరు మార్చిన“సారు”–దారి తప్పిన“కారు”!

తెలంగాణలో మళ్ళీ అధికారం చేపట్టడం ఖాయం.., ఆ తర్వాత ఏకంగా దేశాన్నే ఏల వచ్చు అనే  గంపెడు ఆశలతో మొన్న జరిగిన ఎన్నికల ముందు “ఒంటెత్తు” వ్యూహా రచనలు చేసిన భారత రాష్ట్ర సమితి (బి.ఆర్.ఎస్.) పరిస్థితి ఇప్పుడు గందరగోళంగా మారింది. తెలంగాణలో దశాబ్ద కాలంగా తిరుగులేని అధికారం చెలాయించిన బి.అర్.ఎస్. పార్టీ గత ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూడడంతో నేతల ఆలోచనలన్నీ కుడితిలో పడ్డ ఎలుకలా మారాయి. ఆరేడు నెలల కిందటి పరిస్థితులు తమకు అనుకూలంగా…

Read More
guntr

“కుర్చీ మడత”…

సూపర్ స్టార్ మహేశ్ బాబు తాజా చిత్రం “గుంటూరు కారం” లోని ‘కుర్చీ మడత పెట్టి’ ఫుల్ సాంగ్ విడుదలైంది. ఇప్పటికే విడుదలైన ఈ పాట ప్రోమో భారీ హైప్ క్రియేట్ చేయగా పూర్తి పాట మంచి ఆదరణ పొందుతోంది. మాస్ బీట్ తో సాగే ఈ పాటలో మహేశ్, శ్రీలీల స్టెప్పులు అదిరి పోయాయి. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది.

Read More
batti pwr

విద్యుత్ కు “అప్పుల” షాక్…

గత ప్రభుత్వం చెల్లించాల్సిన అప్పులు, బకాయిలతో విద్యుత్ రంగం పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిందనిరాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, విద్యుత్ శాఖల మంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిబద్దతో ప్రణాళికా బద్ధంగా ముందు చూపుతో అడుగులు వేయాల్సిన అవసరం ఉందన్నారు. మణుగూరు బిటిపిఎస్ విద్యుత్ ప్లాంటును సందర్శించిన అనంతరం విద్యుత్ శాఖ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో భట్టి మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ప్రాజెక్టులు పరిశీలిస్తూ వాస్తవ పరిస్థితులను ప్రజలకు తెలియచేస్తున్నామని చెప్పారు….

Read More