mlrdy goa

గోవాలో అలా…

ఎన్నికల హడావిడి లేదు… మంత్రి హోదాలో బాధ్యతలు లేఫు..మల్కాజిగిరి నుంచి మొన్న బిఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్నికైన చామకూర మల్లారెడ్డి సేద తీర్చుకోవడానికి గోవా వెళ్ళారు.

Read Full News
covid 23

జాగ్రత్త…!

భారత్‌లో కోవిడ్ పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 819 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధికంగా కర్ణాటకలో 279 కేసులు నమోదు కాగా, మహారాష్ట్రలో 61, కేరళలో 54 కేసులు నమోదయ్యాయి. దీంతో, మొత్తం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4,050 కి చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గత 24 గంటల్లో ఆరుగురు కరోనా కారణంగా మృతి చెందారు. ఈ నేపథ్యం లోనే 890 మంది…

Read Full News
godrej

గోద్రెజ్ అగ్రోవెట్..

ప్రఖ్యాత పారిశ్రామిక సంస్థ గోద్రెజ్ అగ్రోవెట్ కంపెనీ ప్రతినిధి బృందం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయింది. తెలంగాణలో ఇప్పటికే ఈ కంపెనీ పలు వ్యాపారాలు నిర్వహిస్తోంది. వంట నూనెలు, డెయిరీ, అగ్రో, వెటర్నరీ సర్వీసెస్, అగ్రో కెమికల్స్, పశువుల దాణా, వెటర్నరీ సర్వీసెస్ రంగాల్లో బిజినెస్ కొనసాగిస్తోంది. మలేషియాకు చెందిన సిమ్ డార్బీ కంపెనీతో కలిసి ఖమ్మం జిల్లాలో ఇంటిగ్రేటేడ్ ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ కాంప్లెక్స్ ను ఈ కంపెనీ ఏర్పాటు చేస్తోంది. గోద్రెజ్…

Read Full News
sai sharmila

పెళ్ళికి ఆహ్వానం…

తన కుమారుని వివాహానికి హాజరు కావలసిందిగా వైఎస్ షర్మిలా రెడ్డి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ని ఆహ్వానించారు. రాజ్ భవన్ లో గవర్నర్ ని కలిసిన షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహానికి కుటుంబ సమేతంగా రావాలని వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు.

Read Full News
squre

“రామా”ఎట్ “టైమ్స్ స్క్వేర్”..

ప్రపంచంలోనే అతి గొప్ప కూడలి అమెరికా వాణిజ్య నగరమైన న్యూయార్క్ లోని “టైం స్క్వేర్”. ఇక్కడ సహజంగా ప్రపంచ ప్రఖ్యాత కార్యక్రమాలనే లైవ్ టెలీకాస్ట్ చేస్తారు. ఇప్పుడు ఆ లిస్టులో మన అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్టను కూడా చేర్చారు. ఈ నెల 22వ తేదీన అయోధ్య లో ప్రధాని మోడీ చేతుల మీదుగా జరగనున్న శ్రీరాముల వారి ప్రాణ ప్రతిష్టను టైం స్క్వేర్ సెంటర్ లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.ఈ సంధర్బంగా ప్రధాని మోడీ చేయనున్న…

Read Full News
jyoth cf

“దీపం” వెనుక “చీకటి”ఎంత..?

తెలంగాణ ఉద్యమంలో అమరులైన త్యాగదనులకు నివాళిగా ఉద్యమ పార్టీ బిఆర్ఎస్  ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆవిష్కరించిన అమరవీరుల స్మారక కేంద్రం “అమరజ్యోతి” నిర్మాణ వ్యయంపై క్రమంగా ఆరోపణలు గుప్పుమంటున్నాయి.  ఉద్యమ స్ఫూర్తి ఉట్టిపడేలా, చూడగానే అమరులను స్మరించుకునేలా సకల హంగులతో నగరం నడిబొడ్డున తళుకులీనుతున్న అమరజ్యోతి నిజంగా తెలంగాణకు గర్వకారణమని చెప్పడంలో సందేహం లేదు. దాన్ని ఏర్పాటు చేయాలనే సంకల్పం కలిగినందుకు అప్పటి ప్రభుత్వాన్ని కొనియడక తప్పదు. అమరజ్యోతి కేంద్రాన్ని అద్భుతంగా రూపకల్పన చేసినందుకు అధికార యంత్రాంగాన్ని సైతం…

Read Full News
ap electn

ఆంధ్రలో కేంద్ర అధికారులు…

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి రాజుకుంటోంది. భారత ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్‌, ఎలక్షన్ కమీషనర్లు అనూప్ చంద్ర పాండే, అరుణ్ గోయల్‌ విజయవాడ చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా, కృష్ణ జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు, ఎస్పీ జాషువా, జాయింట్ కలెక్టర్ డా. పి.సంపత్ కుమార్, మున్సిపల్ కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌ వారికి స్వాగతం పలికారు. నగరంలోని నోవాటెల్ హోటల్లో 9,…

Read Full News
IMG 20240108 WA0045

జాతర…జాగ్రత్త…

మేడారం జాతరలో వైద్య, ఆరోగ్య పరంగా పూర్తిస్థాయిలో జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. మేడారం జాతర ఏర్పాట్లు, ఆరోగ్య పరిరక్షణ పై తెలంగాణ సచివాలయంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య, ఆయుష్, ఫుడ్ సేఫ్టీ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నెల నుండే భక్తులు లక్షలాదిగా రానున్నట్టు మంత్రి తెలిపారు. ఇప్పటి నుండే ప్రధాన ప్రాంతాలలో మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేయాలని సూచించారు. మందులు, పరీక్ష పరికరాలు,…

Read Full News
IMG 20240108 WA0044

కొత్త సీటులో “స్మితా”…

గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలక బాధ్యలను నిర్వహించిన స్మితా సబర్వాల్ బదిలీలో భాగంగా రాష్త్ర ఫైనాన్స్ కార్పొరేషన్ మెంబర్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టారు.

Read Full News
kobra

కాటేస్తున్న”కోబ్రా”…!

“కోబ్రా” పేరు వింటేనే ఒళ్ళు జలతరిస్తుంది.ఎందుకంటే అది ఒక ఆఫ్రికా ఖండంలో కనిపించే భయకరమైన సర్పం.అది కాటు వేస్తే కాటికి వెళ్ళవలసిందే.అది సర్పాలకు రారాజు. కాలకూట విషాన్ని చిమ్మే విషసర్పం. బయో ఉత్పత్తులను తయారు చేసే దేవగాన్ కంపెనీ “కోబ్రా” బ్రాండ్ పేరుతో ఒక బయో ఉత్పత్తిని తయారు చేసి మార్కెట్ లోకి వదిలిందే ఆ కోబ్రా…కౌలురైతును కాటు వేసింది.ఆ దెబ్బతో రైతు అప్పులు పాలైయాడు. రాజులాగా బ్రతకలసిన ఓ కౌలురైతు ప్రైవేటు వెహికిల్ కు డ్రైవర్…

Read Full News
nusing cf copy

నిర్లక్ష్యం నీడలో “నైటింగెల్స్”…

ఆరోగ్య రంగంలో అత్యంత కీలకమైన నర్సింగ్ వ్యవస్థ తెలంగాణ రాష్ట్రంలో అస్తవ్యస్తంగా మారింది. ఒకప్పుడు ఉన్నతాధికారుల నిరంతర పర్యవేక్షణలో పద్ధతి ప్రకారం కొనసాగిన ఈ వ్యవస్థ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తీవ్ర నిర్లక్ష్యానికి గురైందనే విమర్శలు వెల్లువెత్తుతన్నాయి. అనేక నియమ, నిబంధనలను తుంగలో తొక్కి కొందరు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం అందుతోంది. నర్సులు, నర్సింగ్ స్కూళ్లు, కాలేజీల్లో పనిచేస్తున్న ట్యూ టర్లు, ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు వంటి వారి పదోన్నతులు, బదిలీలు, పోస్టింగులు…

Read Full News
IMG 20240104 WA0055

జాతీయ హోదా కావాలి..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి దిల్లీ పర్యటనలో పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా తో భేటీ అయిన సీఎం రాష్ట్రానికి ఐపీఎస్‌ అధికారుల కేటాయింపును పెంచాలని విజ్ఞప్తి చేశారు. అంతకు ముందు కేంద్ర జల్‌ శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ ను సీఎంతో పాటు, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, సీ.ఎస్‌. శాంతి…

Read Full News