jagansrmil

అక్కడ ఇక రసవత్తరం…!

కొద్ది నెలల్లో జరగనున్న ఆంద్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. వివిధ జిల్లాల్లోని 175 నియోజక వర్గాలకు జరిగే పోరులో ప్రధానంగా ఐదు రాజకీయ పక్షాలు తలపడనున్నాయి. దీని కోసం ఇప్పటి నుంచే ఎత్తులు, పై ఎత్తులు, సమీకరణలకు నడుం బిగించాయి. ముఖ్యమంత్రి జగన్ సోదరి షర్మిల తాజాగా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడంతో  రాజకీయ రచ్చబండ వద్ద కొత్త తరహా చర్చలకు తెరలేపింది. జననేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో అంధ్రలో ఒక్కసారిగా జవసత్వాలు…

Read Full News
jagan kcr

మాజీ సి.ఎం.తో జగన్…

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఆంధ్రప్రదేశ్ సి.ఎం. వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. హైదరాబాద్ నందినగర్ లోని కేసీఆర్ నివాసానికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మాజీ మంత్రి కేటిఅర్ ఆయనకు స్వాగతం పలికారు.

Read Full News
shrmil rahul

రాహుల్ ప్రధాని కావాలి…

రాహుల్ గాంధీని దేశ ప్రధానిగా చూడాలన్నది తన తండ్రి రాజశేఖర్ రెడ్డి ఆశయమని కాంగ్రెస్ నేత వై.ఎస్. షర్మిల చెప్పారు. వై.ఎస్.ఆర్. తెలంగాణ పార్టీని ఆమె కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. డిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ  కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి షర్మిలను పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం షర్మిల మాట్లాడుతూ స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీలో గొప్ప నేత అని, ఆయన…

Read Full News
banana c

రాజకీయాల్లో”అరటి పండ్లు”…!

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో “అరటి పండు”పార్టీల ఎత్తుగడలు అంతుపట్టకుండా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ నడిపిస్తున్న జనసేన, వై.ఎస్.షర్మిల ఆధ్వర్యం లోని వై.ఎస్.ఆర్.తెలంగాణ (వైఎస్ఆర్ టి) పార్టీలు ఎన్నికల సమయంలో వ్యవహరిస్తున్న తీరు రాజకీయ పరిశీలకులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావిడి మొదలవ్వగానే తమ బలం ఎంత ఉన్నదనే కనీస విషయాన్ని అంచనా వేసుకోకుండా బరిలోకి దిగడం వెనుక అసలు రహస్యం ఏమిటనే  కోణంలో చర్చలకు తెర లేస్తోంది. తెలంగాణ శాసనసభకు గత నెలలో జరిగిన…

Read Full News
brs C

గేరు మార్చిన“సారు”–దారి తప్పిన“కారు”!

తెలంగాణలో మళ్ళీ అధికారం చేపట్టడం ఖాయం.., ఆ తర్వాత ఏకంగా దేశాన్నే ఏల వచ్చు అనే  గంపెడు ఆశలతో మొన్న జరిగిన ఎన్నికల ముందు “ఒంటెత్తు” వ్యూహా రచనలు చేసిన భారత రాష్ట్ర సమితి (బి.ఆర్.ఎస్.) పరిస్థితి ఇప్పుడు గందరగోళంగా మారింది. తెలంగాణలో దశాబ్ద కాలంగా తిరుగులేని అధికారం చెలాయించిన బి.అర్.ఎస్. పార్టీ గత ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూడడంతో నేతల ఆలోచనలన్నీ కుడితిలో పడ్డ ఎలుకలా మారాయి. ఆరేడు నెలల కిందటి పరిస్థితులు తమకు అనుకూలంగా…

Read Full News
guntr

“కుర్చీ మడత”…

సూపర్ స్టార్ మహేశ్ బాబు తాజా చిత్రం “గుంటూరు కారం” లోని ‘కుర్చీ మడత పెట్టి’ ఫుల్ సాంగ్ విడుదలైంది. ఇప్పటికే విడుదలైన ఈ పాట ప్రోమో భారీ హైప్ క్రియేట్ చేయగా పూర్తి పాట మంచి ఆదరణ పొందుతోంది. మాస్ బీట్ తో సాగే ఈ పాటలో మహేశ్, శ్రీలీల స్టెప్పులు అదిరి పోయాయి. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది.

Read Full News
batti pwr

విద్యుత్ కు “అప్పుల” షాక్…

గత ప్రభుత్వం చెల్లించాల్సిన అప్పులు, బకాయిలతో విద్యుత్ రంగం పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిందనిరాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, విద్యుత్ శాఖల మంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిబద్దతో ప్రణాళికా బద్ధంగా ముందు చూపుతో అడుగులు వేయాల్సిన అవసరం ఉందన్నారు. మణుగూరు బిటిపిఎస్ విద్యుత్ ప్లాంటును సందర్శించిన అనంతరం విద్యుత్ శాఖ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో భట్టి మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ప్రాజెక్టులు పరిశీలిస్తూ వాస్తవ పరిస్థితులను ప్రజలకు తెలియచేస్తున్నామని చెప్పారు….

Read Full News
IMG 20231230 WA0025

రేవంత్ తో…

నటులు అక్కినేని నాగార్జున, అమల దంపతులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినందుకు అభినందించారు. అదేవిధంగా నందమూరి బాలకృష్ణ కూడా రేవంత్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

Read Full News
IMG 20231229 WA0005

Jindal meets Jagan…

JSW Group Chairman Sajjan Jindal called on Chief Minister YS Jagan Mohan Reddy at the Camp Office here on Thursday.Jindal explained about the progress of Kadapa Steel Plant and thanked the Chief Minister for extending cooperation in expediting the project.He said that their steel plant at Kadapa would play key role in the industrial progress…

Read Full News
funds copy

గడి దాటని“దొర”-గల్లంతైన“నిధులు”!

తెలంగాణలో మొన్నటి వరకు ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వానికి కేంద్రంతో కొన్నేళ్ళుగా తెగిపోయిన సంబంధాల వల్ల వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్రంతో సన్నిహితంగా ఉండాల్సిన “ఒంటెద్దు” ప్రభుత్వంలో తానే అన్నీ అన్నట్టు వ్యవహరించి చివరకు రాష్ట్రపతి, ప్రధాని వంటి వారిని సైతం లెక్క చేయకపోవడంతో రాష్ట్రానికి రావలసిన నిధులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. రాజకీయంగా విభేదాలు ఉన్నా పరిపాలన పరంగా చేయాల్సిన పనులను కూడా వ్యక్తిగతంగా…

Read Full News
Screenshot 20231228 213438 WhatsApp

మోడీ మెడిసిన్ ఖతం..

దేశంలో నరేంద్ర మోడీ అనే మెడిసిన్ కు గడువు తేదీ అయిపోయిందని, మోడీ మెడిసిన్ ఇక పని చేయదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర లోని నాగ్ పూర్ లో జరిగిన కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ సభలో రేవంత్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ ఎప్పుడూ చప్పన్ ఇంచ్ ఛాతీ అని గొప్పలు చెప్పుకుంటారనీ. ఆయన నేతృత్వంలో నడుస్తున్న లోకసభలోనే ఒక సామాన్యుడు ప్రవేశించి హంగామా చేస్తుంటే ఏమి చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. డబుల్ ఇంజిన్…

Read Full News
landcruser

“కారు”కలలు…!

గత పదేళ్లుగా కుటుంబం పోగేసుకున్న ఆస్తులను చూస్తూ మొన్న జరిగిన శాసన సభ ఎన్నికల్లోనూ ప్రజలు ముడోసారి కూడా తమనే గద్దెనెక్కిస్తారనే అత్యాశ బిఆర్ఎస్ అధినేతల్లో గట్టిగా ఉన్నట్టు తేలిపోయింది. దశాబ్ద కాలం పాటు అధికారం చెలాయిస్తూ, సమర్ధవంతులైన అధికారగణం చుట్టూ ఉన్నా ఎన్నికల పలితాల తీరు తెన్నులను ముందుగానే అంచనా వేయలేక పోవడం “ఒంటెద్దు” ప్రభుత్వ ఓటమికి కారణంగా కనిపిస్తోంది. ఎన్నికల సమయంలోనైనా కనీసం ఇంటలిజెన్స్ అధికారుల మాటలు వింటే బాగుండేదనే వాదనలు ఆ పార్టీ…

Read Full News
vijay

సాల్యూట్ “కెప్టెన్”….

ప్రముఖ తమిళ నటుడు, రాజకీయ నాయకుడు విజయ్​కాంత్​(71) కన్నుమూశారు. తమిళనాడులోని చెన్నై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. దీంతో ఒక్కసారిగా తమిళ చిత్రపరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. విజయ్​కాంత్ మరణం పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. విజయ్​కాంత్‌ గత కొన్నాళ్లుగా అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఎలాంటి బహిరంగ కార్యక్రమాలు, పార్టీ సమావేశాలు వంటి కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. గత నెల 18న జలుబు, దగ్గు, గొంతునొప్పి…

Read Full News