rain

ఇంకా పొంచి ఉంది…

తెలుగు రాష్ట్రాల్లో వాయుగుండం ప్రభావంతో వర్షాలు, వరదలు పొంచి ఉన్నాయి. అనేక జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రేపటికి వాయుగుండంగా బలపడే అవకాశాలు ఉన్నాయని,దీనివల్ల కొన్నిచోట్ల అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వివరించారు. ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ లోని నాలుగు జిల్లాల్లో రెడ్ ఎలర్ట్, మరో నలుగు జిల్లాల్లో ఆరంజ్ ఎలర్ట్ జారీ చేసింది. అదేవిధంగా తెలంగాణ లోని మూడు జిల్లాలలో…

Read More
kl c

కె.ఎల్.లో ఆత్మహత్య…

గుంటూరు జిల్లా తాడేపల్లి సమీపంలోని కే ఎల్ యూనివర్సిటీ లో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. పశ్చిమ బెంగాల్ కు చెందిన సౌరదీప్ చౌదరి అనే విద్యార్ధి భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. చౌదరి ఆత్మహత్య ఉదంతన్ని కాలేజి యాజమాన్యం గోప్యంగా ఉంచిన కొంత సమయానికి విద్యార్ధుల జోక్యంతో బయటికి పొక్కింది. చౌదరి ఎందుకు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడనే వివరాలు తెలియాల్సి ఉంది.

Read More
iith c

నైపుణ్యం కోసం మార్పులు…

విద్యార్ధుల్లో  నైపుణ్యాన్ని వెలికి తీయడానికి విద్యా విధానంలో అనేక మార్పులు తీసుకువస్తున్నాట్టు ఐ.ఐ.టి. హైదరాబాద్ సంచాలకులు ప్రొఫెసర్ బి.ఎఎస్. మూర్తి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన జాతీయ విద్యా విధానం మూడేళ్ళ లో గణనీయమైన మార్పు తెచ్చిందని పేర్కొన్నారు. ఈ నెల 29 వ తేదిన జరగనున్న జాతీయ విద్యా విధానం మూడో వార్షికోత్సవం సందర్భంగా కేంద్ర మనవ వనరుల అభివృద్ధి శాఖ దేశ వ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఐ.ఐ.టి.ల ఉప కులపతులతో  నిర్వహించిన…

Read More

కెనడాలో హత్య…

కెనడాలో గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో ఓ భారతీయ విద్యార్థి హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే, ఒంటారియా ప్రావిన్స్ లో గుర్ విందర్ నాథ్ (24) అనే యువకుడు పిజ్జా డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నాడు. ఈ నెల 9వ తేదీన తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో మిస్సిసాగా అనే ప్రాంతంలో పిజ్జా డెలివరీ చేసేందుకు వెళ్లాడు. ఆ సమయంలో గుర్ విందర్ పై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు…

Read More
bus flood

కొంచెంలో తప్పింది..

ఒరిస్సా రాష్ట్రానికి చెందిన ఒక ప్రైవెట్ ట్రావెల్స్ బస్సు వరద నీటిలో చిక్కుకుంది. ఒరిస్సా రాష్ట్రం నుండి ఆంద్రప్రదేశ్ కి బయలుదేరింది. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం కల్లేరు గ్రామ పంచాయతీ పరిధిలోని కుయుగూరు – నిమ్మలగూడెం గ్రామాల జాతీయ రహదారిపై వరద నీటిలో చిక్కుకుంది. కుయుగూరు వాగు వరద నీరు రహదారిపై చేరడం, తెల్లవారు జామున 4.30 గంటలకు చీకటిగా ఉండడంతో డ్రైవర్ కి వరద నీరు సరిగా కనిపించ లేదు. దీంతో వరద…

Read More
station

స్టేషన్ లోనే శవం…

పోలీస్ స్టేషన్ లో శవం బయట పడి కలకలం రేపింది. నిత్యం రద్దీగా ఉండే పోలీస్ స్టేషన్ లోనే శవం ఏంటి అనే సందేహం రావొచ్చు. కానీ ఇది నిజం. ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి జిల్లా పుత్తూరు అర్బన్పోలీసు స్టేషన్ లో ఈ సంఘటన చోటుచేసుకుంది. స్టేషన్ ఆవరణలో ఫిర్యాదుదారుల కోసం నిర్మించిన టాయిలెట్ లో శవం కనిపించే సరికి సిబ్భంది ఒక్కసారిగా విస్తుపోయారు. ఆ వ్యక్తి చనిపోయి మూడు రోజులై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. వ్యక్తి…

Read More
Screenshot 2023 07 24 161235

భలే అడ్డా..వేస్కో..

పట్ట పగలు…అత్యంత రద్దీ ప్రాంతం… నిత్యం వేల కొద్ది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ట్రాఫిక్ ని అదుపు చేయడానికి పోలీసులు సతమతమయ్యే ప్రదేశం భాగ్యనగరంలోని హైటెక్ సిటీ జంక్షన్. ఆ సెంటర్ ని పోకిరిలు తాగడానికి అడ్డగా మార్చుకున్నారు. ఏ డివైడర్ పక్కనో, గల్లీ లోనో కాదు ఏకంగా పోలీసులు విధులు నిర్వర్తించే ట్రాఫిక్ బూత్ లోనే కావడం గమనార్హం. ఆ బూత్ నే అడ్డాగా మార్చుకొని ఇద్దరూ వ్యక్తులు కూర్చొని మద్యం తాగుతూ బిర్యానీ తింటున్న…

Read More
amit bandi

“షా “తో సంజయ్…

బిజెపి తెలంగాణ శాఖ మాజీ అధ్యక్షులు బండి సంజయ్ కేంద్ర హోం మంత్రి అమిత్ షా ని ధిల్లీలో కలిశారు. సంజయ్ అధ్యక్షునిక వైతోలగిన తర్వాత ధిల్లీ వెళ్ళడం రదే మొదటి సారి. అయితే, అమిత్ షా ని మర్యాదపూర్వకంగా కలిసినట్టు సంజయ్ తెలిపారు.

Read More
pawan kkd 2

కేసు పడింది…

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమపై చేసిన వ్యాఖ్యలు, ఆరోపణలకు తీవ్ర మనస్తాపం చెందినట్టు విజయవాడ సివిల్ కోర్టులో ఓ మహిళా వాలంటీర్ పవన్ కల్యాణ్ పై పిటిషన్ వేసింది. పవన్ మాటలు మానసిక వేదనకు గురిచేశాయని పేర్కొంది. ఈ మేరకు వాలంటీర్ దాఖలు చేసిన పిటిషన్ కోర్టు విచారణకు స్వీకరించింది.

Read More
speaker

మణిపూర్ మంట…

లోక్ సభ వర్షాకాల సమావేశాల్లో మణిపూర్ మంట రాజుకుంది. విపక్షాల నినాదాలు, ప్లకార్డులతో పార్లమెంట్ హాల్ హోరెత్తింది. ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌ అంశంపై ప్రధాని ప్రకటన చేయాలని విపక్షాలు డిమాండ్ చేయడంతో  సమావేశాల్లో ప్రతిష్టంభన నెలకొంది. దీనిపై చర్చకు సిద్ధమేనని కేంద్రం ప్రకటించినప్పటికీ ఆ  చర్చకు ముందే ప్రధాని ప్రకటన చేయాలని విపక్షాలు పట్టుపట్టాయి.సోమవారం సమావేశాలు ప్రారంభం కాగానే విపక్ష పార్టీలు లోక్‌సభలో ప్లకార్డు లతో దర్శనమిచ్చాయి. “ఇండియా ఫర్ మణిపుర్‌” మణిపుర్‌ పై ప్రధాని ప్రకటన…

Read More
Screenshot 2023 07 24 114251

ఇంతే పడుకుంటా…

అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం ఫలితంగా జనం నానా ఇబ్బందులు పడుతుంటారు. ముఖ్యంగా వర్షాలు వచ్చినప్పుడు రోడ్ల విషయంలో పడే బాధలు అన్నీ ,ఇన్నీ కావు. గల్లీ గల్లీలో రోడ్ల సమస్య పట్టిపీడిస్తుంది. ఇలాంటి సమస్యతోనే అలసిపోయాడు ఓ వ్యక్తి. రోడ్డు దుర్బర పరిస్థితిని అధికారుల దృష్టికి తీసుకెళ్ళడానికి నిరసన తెలియజేయలనుకున్నాడు. అంతే.. నడిరోడ్డుపై కూర్చోలేదు… కానీ పడుకున్నాడు… ఎలా అంటారా…ఏలూరు నగరంలో గంగానమ్మ గుడి వద్ద రహదారిపై నీరు నిలవడంతో ఓ వ్యక్తి వినూత్న నిరసన తెలిపలనుకున్నాడు….

Read More
tomato lorry

తుపాకీ గస్తీ..

అసలే ఆకాశాన్ని అంటిన ధరలతో కొండెక్కి కూర్చున్న టమాటోలకి మార్కెట్ లో ఇంతా, అంతా డిమాండ్ లేదు. కూరలోకి ఒక్క టమాట దొరికిన చాలానే ఆలోచన. అందుకే వాటిని సాగుచేస్తున్న రైతులు దొంగల బెడద నుంచి కాపాడలేక నానా తంటాలు పడుతున్నారు. ఎలాగో పంటను కోసి మార్కెట్ కి చేరవేద్దామంటే రవాణా భయం. వాటిని తీసుకువెళ్తున్న లారీ గమ్య స్థానానికి చేరేంత వరకు రైతుకు గుబులే. మొన్న ఆదిలాబాద్ జిల్లలో ఓ టమాటోల లారీ బోల్తా పడగా…

Read More
cycle c

“బర్త్ డే” సిప్..

ప్రకృతి సిద్ధమైన నీరా తాగడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందని మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రాష్ట్ర పురపాలక , ఐటి శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పుట్టిన రోజు సందర్భంగా తెలంగాణ క్రీడ ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్ లో నీరా కేఫ్ పాయింట్ వద్ద కేకును కట్ చేశారు. ఇక్కడ మంత్రి మాట్లాడుతూ అనేక ఔషధ గుణాలు కలిగిన నీరా సేవించడం వల్ల కిడ్నీ, క్యాన్సర్ వంటి రోగాలు రాకుండా…

Read More
Screenshot 2023 07 23 154142

“నయా”గరా…

ములుగు-వాజేడు మండలంలో ఓ ప్రకృతి దృశ్యం వెలుగు చూసింది. అరుణాచలపురానికి కిలోమీటర్ దూరంలో అద్భుత జలపాతం బయటపడింది. ఇంత కాలం సన్నని ధారగా ప్రవహించిన ఈ జలపాతం ఇటీవల కురుస్తున్న వర్షాలకు తన రూపు మార్చుకొని చూడ చక్కని జలపాతంగా మారింది. స్థానికులు దీన్ని గుండం జలపాతంగా పిలుస్తున్నారు. ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఉంది. అదేంటంటే ఈ జలపాతం వద్ద నీరు సముద్రపు నీరు మాదిరిగా నీలి రంగులో ఉండడం విశేషం. అందుకే పర్యాటకులు మరి ఆసక్తిగా…

Read More
bus

చెరువులో పడి…

బంగ్లాదేశ్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మరణించిన వాళ్ళల్లో ఏడుగురు మైనర్లు, ఐదుగురు మహిళలు కూడా ఉన్నారు. మరో 35 మందికి పైగా గాయపడ్డారు. ఝలకతి సదర్ ఉప జిల్లా పరిధిలోని ఛత్రకాండ ప్రాంతంలోని చెరువు వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ప్రాణాలతో బయటపడిన…

Read More