nzb revanth c

80 సీట్లు మావే…!

తెలంగాణలో త్వరలో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 80 సీట్లకు ఒక్క సీటు తగ్గినా ఏ శిక్షకైనా సిద్ధం అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నిజామాబాద్ రూరల్, నారాయణఖేడ్, నియోజక వర్గంలలో జరిగిన విజయభేరి జనసభలలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. కేసీఆర్ కు పదవి పోతుందన్న భయంపట్టుకుందని, అందుకే మతి తప్పి మాట్లాడుతుండో, మందేసి మాట్లాడుతుండో తెలియదు కాని, కాంగ్రెస్ కు 20 సీట్లు కూడా రావని కేసీఆర్ మాట్లాడడం ఆశ్చర్యంగా…

Read Full News
cong menifesto

“ఆరు”మాత్రమే కాదు…ఇంకా అనేకం…

పొరుగు రాష్ట్రం కర్ణాటకలో మాదిరిగా కొద్ది రోజుల్లో జరిగే తెలంగాణ శాసన సభ ఎన్నికల్లోనూ గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ జనాకర్షణకు ప్రయత్నిస్తోంది. అధికార బిఆర్ఎస్ ని ఎదుర్కోవడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. కాంగ్రెస్ అధికాయకత్వం ప్రచార రంగంలోకి దిగుతోంది. వచ్చే ఎన్నికల్లో తమకు అధికారం ఇస్తే చేపట్ట్టే సంక్షేమ కార్యక్రమాలను ఇప్పటికే రూపకల్పన చేసింది. ప్రధానంగా “సిక్స్ పెయింట్” పార్ములా పై దృష్టి సారించింది. కర్ణాటకలో పార్టీ గెలుపినకు దోహదం చేసిన ఆరు ఆకర్షక పధకాలను…

Read Full News
cong comunist

కలిసిన “కాంగీ”-కామ్రేడ్స్…

ఎఐసిసి ఆదేశాల మేరకు సిపిఐ,కాంగ్రెస్ జాతీయ నాయకత్వంతో, రాష్ట్ర నాయకత్వంతో సంప్రదించి ఒక ఒప్పందానికి వచ్చినట్టు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పారు. దేశంలో మోడీ కారణంగా, రాష్ట్రంలో కెసిఆర్ కారణంగా ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు. ఎన్ డి ఎ కూటమిని ఇండియా కూటమి ఓడించాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, సిపిఐల మధ్య స్పష్టంగా పొత్తు ఖరారైందని, కొత్తగూడెం నియోజకవర్గంలో సిపిఐని గెలిపించేందుకు కాంగ్రెస్ శ్రేణులు సహకరించాలని, కలిసి పని చేయాలని ఎఐసిసి…

Read Full News
revant 768x512 1

“మేడి”పాపం కేసీఅర్ దే…

కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజ్ ప్రమాదానికి కేసీఆర్ కుటుంబమే కారణమని, కాళేశ్వరం అవినీతిలో మొదటి దోషి కేసీఆర్ కుటుంబమే అని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగడం పై సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ తో దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. ఈ బ్యారేజి ద్వారా లక్ష కోట్లను కేసీఆర్, కాంట్రాక్టర్లు దోచుకున్నారన్నారు. నాణ్యత లోపం వల్ల మెడిగడ్డ ప్రమాదం జరిగిందనీ, కేంద్ర హోంమంత్రి, గవర్నర్ ,ఎన్నికల కమిషన్ మేడిగడ్డ పై విచారణకి ఆదేశించాలనీ డిమాండ్…

Read Full News
wgl rahul

కాంగ్రెస్ గెలుపు ఖాయం…

రాష్ట్రంలో అధికారం ఒక కుటుంబానికే పరిమితమైందని,  దొరల తెలంగాణ-ప్రజల తెలంగాణకు మధ్య ఎన్నికలు జరగబోతున్నాయని  కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ అన్నారు. వరంగల్ బస్సు యాత్రలో ఆయన మాట్లాడుతూ  తెలంగాణ ప్రజలు రాజ్యాధికారం చేపట్టాలని ఆశించాం, కానీ,  రాష్ట్రంలో కేసీఆర్ ప్రజలకు దూరమవుతూ వస్తున్నారని పేర్కొన్నారు. మీ ఉత్సాహం చూస్తుంటే కొద్ది రోజుల్లో జరిగే ఎన్నికలలో బిఆర్ఎస్, కేసీఆర్ ఓటమి ఖాయమనిపిస్తోందని వ్యాఖ్యానించారు. దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వం తెలంగాణలోనే ఉందనీ, బీఆర్‍ఎస్ అవినీతితో ప్రజలు…

Read Full News
rahul priyanka 1

రామప్పలో రాహుల్…

తెలంగాణా ఎన్నికల ప్రచారానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు వరంగల్ జిల్లా లోని రామప్ప ఆలయంలో పూజలు చేశారు. దేవాలయంలో పూజల అనంతరం వారిద్దరూ ములుగులో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. రాహుల్, ప్రియాంక వెంట తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, పలువురు నేతలు ఉన్నారు.

Read Full News
IMG 20231015 WA0034

మేనిఫెస్టోలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు..

జర్నలిస్టుల ఇంటి స్థలాల అంశాన్ని తమ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టే అంశాన్ని పరిశీలిస్తామని, ఈ విషయాన్ని శ్రీధర్‌బాబు నేతృత్వంలోని మేనిఫెస్టో కమిటీకి నివేదిస్తామని తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఈ మేరకు డెక్కన్‌ జర్నలిస్ట్స్‌ హౌసింగ్‌ సొసైటీ (డీజేహెచ్‌ఎస్‌) అధ్యక్షులు బొల్లోజు రవి, ఉపాధ్యక్షులు మరిపాల శ్రీనివాస్, కోశాధికారి చిలుకూరి అయ్యప్ప, డైరెక్టర్లు జి.ప్రతాప్‌రెడ్డి, దండ రామకృష్ణ, సభ్యులు క్రాంతి తదితరులు ఆదివారం రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. ఎన్నికల మేనిఫెస్టోలో జర్నలిస్టుల…

Read Full News
Screenshot 20231014 161826 WhatsApp

సిగ్గుండాలి….

నలభై ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో పనిచేసి, పదవులు, అధికారం అనుభవించి నేడు అదే పార్టీని వీడి పోవడం సిగ్గుచేటు వ్యవహారమని పి.సి.సి. అధ్యక్షులు రేవంత్ రెడ్డి పొన్నాల లక్ష్మయ్య పై విరుసుకు పడ్డారు.

Read Full News
rahul security

సభకు గ్రౌండ్ ఇవ్వరా…

ఈ నెల 16,17 తేదీలలో హైదరాబాద్ లో జరగబోయే సీడబ్ల్యూసీ సమావేశాలు, బహిరంగ సభ నేపథ్యంలో హాజరయ్యే జాతీయ నాయకుల భద్రత కల్పించాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు డీజీపీ అంజనీ కుమార్ కు వినతిపత్రం సమర్పించారు. అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 16, 17న తాజ్ కృష్ణలో సీడబ్ల్యూసీ సమావేశాలు జరుగుతాయన్నారు. 17న విజయ భేరి బహిరంగ సభను నిర్వహిస్తున్నామని, దీనికి సంబంధించి భద్రతను అందించాలని డీజీపీని…

Read Full News
IMG 20230822 WA0004

“సిట్టింగ్” షాక్…

భారాసా పార్టీకి చెందిన ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖ నాయక్ భర్త శ్యామ్ నాయక్ కాంగ్రెస్ లో చేరారు. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆయనను కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు.

Read Full News
Screenshot 2023 07 18 120918

స్వాగతం..

కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత తొలిసారి గాంధీ భవన్ కి వచ్చిన పొంగులేటి శ్రీనివాస రెడ్డిని పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, మల్లు రవి తదితరులు కండువా కప్పి ఆహ్వానించారు.

Read Full News