jnj sup2 c copy

అంతిమ తీర్పు – అయోమయం..!

భారత రాజ్యాంగం…బ్రిటిష్ పాలకుల మూలాలు ఉన్న దీన్ని, అందులోని అధికరణలను ప్రతీ భారతీయుడు నేటికీ విధిగా అనుసరించాల్సి ఉంది. ప్రతీఒక్క నిబంధనల్ని గౌరవించాలి. ఇది ప్రజాస్వామ్యంలో తప్పదు.దేశ పౌరుల గౌరవాన్ని, తప్పు, చెడులను పర్యవేక్షిస్తూ గాడిన పెట్టే బాధ్యత దేశంలో న్యాయ వ్యవస్థది. దానికి అందరూ తలవంచక తప్పదు. విశాలమైన న్యాయ శాస్త్రంలో తలపండిన మూర్తులు చెప్పిందే శిరోధార్యం. అందులో ఎలాంటి సందేహం లేదు. ఇదే రాజ్యంగం దేశ పౌరులు తమ స్వేచ్ఛకు భంగం వాటిల్లినప్పుడు ప్రశ్నించే…

Read Full News
jnj

ఎన్నుకోలేదు..దిగిపోండి..!

హైదరాబాద్ లోని జర్నలిస్టుల ఇళ్ళ స్థలాల కేటాయింపులో జరుగుతున్న జాప్యం వల్ల జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీ సభ్యులు మళ్లీ పోరుబాట పట్టే సూచనలు కనిపిస్తున్నాయి. అంతేకాక, ప్రస్తుతం సొసైటీకి బాధ్యత వహిస్తున్న మేనేజింగ్ కమిటీ పై కూడా మెజారిటీ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి ఎన్నికలు లేకుండా కొనసాగుతున్న కమిటీలోని వారు వెంటనే తప్పుకోవాలనే బలమైన డిమాండ్ వినిపిస్తోంది. ఇప్పటికె కొందరు రాజీనామా చేసినట్టు సమాచారం అందుతున్నప్పటికీ మేనేజింగ్ కమిటీ మొత్తం…

Read Full News
suprime

ఇదెక్కడి న్యాయం…!

హైదరాబాద్ లో జర్నలిస్టులకు కేటాయించిన భూమి వ్యవహారం గందరగోళంగా మారుతోంది. పేట్ బషీరాబాద్ లో  గత ప్రభుత్వం కేటాయించిన 38 ఎకరాల భూమిని జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీకి బదలాయించడంలో జరుగుతున్న తీవ్ర జాప్యం సభ్యులను తీవ్ర ఆవేదనకు గురి చేస్తోంది. అంతేకాక్, ఈ నెల 6 తేదిన సుప్రీంకోర్టులో చోటుచేసుకున్న పరిణామం అంతుపట్టకుండా ఉందని సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జస్టిస్ ఎన్.వి. రమణ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పుడు ఆయన నేతృత్వంలోని…

Read Full News
Screenshot 2023 08 09 082232

“సుప్రీం”కు సొసైటీ…

జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టు హౌసింగ్ సొసైటీకి పేట్ బషీరా బాద్ లో ప్రభుత్వం కేటాయించిన 38 ఎకరాల స్థలాన్ని వెంటనే సొసైటీకి బదలాయించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన అమలు చేయడంలో ఇంతకాలం జరిగిన ఆలస్యం పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆ సొసైటీకి చెందిన సభ్యుల బృందం సుప్రీం కోర్టులో కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేసింది. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది మరో 10 రోజుల్లో ఏడాది కావస్తున్నందున ఆ తీర్పును, తమ స్థలాన్ని కాపాడుకునే ప్రయత్నంలో…

Read Full News
pet land 1

ఈ అంశం కీలకం…!

జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీకి చెందిన పేట్ బషీరాబాద్ లోని 38 ఎకరాల భుమిని దక్కించుకోవడానికి సొసైటీ సభ్యుల్లో కొందరు కోర్టుధిక్కార పిటిషన్ దాఖలు చేయడానికి డిల్లీ వెళ్ళడంతో కొత్త అంశాలు తెరపైకి వస్తున్నాయి. ప్రభుత్వం ఒకవైపు సుప్రీం కోర్టు తీర్పునకు అనుకూలంగా ఉన్నట్టు పురపాలక శాఖ మంత్రి కేటిఅర్ చెబుతున్నప్పటికీ, ప్రభుత్వం ఆలస్యం చేస్తోందనే ఆందోళనతో కొందరు సభ్యులు పిటిషన్ వేయడానికి డిల్లీ వెళ్ళిన విషయం తెలిసిందే. అయితే, పిటిషన్ దాఖలు చేయడంలో…

Read Full News
Screenshot 2023 08 09 082232

డిల్లీలో ముమ్మరంగా…

జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టుల హౌసింగ్  సొసైటీకి 2007 వ సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం  పేట్ బషీరా బాద్ లో కేటాయించిన స్థలాన్ని కాపాడుకోవడానే కార్యక్రమంలో భాగంగా కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేయడానికి డిల్లీ వెళ్ళిన  కొందరు సొసైటీకి సభ్యులు అక్కడ రెండు రోజులుగా న్యాయ నిపుణులతో పాటు పలువురు ప్రముఖులను సంప్రదిస్తున్నారు. ఇప్పటికీ ఆ స్థలాన్ని సొసైటీకి అప్పజెప్పే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి సానుకూలత కనిపించక పోవడంతో డిల్లీ లోని నిపుణుల అభిప్రాయాలు…

Read Full News
suprime

“మణిపూర్”పై రంగంలోకి….

అడ్డూ అదుపు లేకుండా అత్యంత అమానుషంగా, పాశవికంగా హింసలు చెలరేకుతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్ సుప్రీంకోర్టు రంగంలోకి దిగింది. మణిపూర్‍లో అల్లర్ల కేసు దర్యాప్తును పర్యవేక్షించడానికి, వివరాలను తిరిగి సుప్రీంకోర్టుకు నివేదించడానికి మాజీ ముంబై కమిషనర్, మహారాష్ట్ర డీజీపీ దత్తాత్రయ్ పసల్గికర్ ను నియమించింది. అదేవిధంగా ముగ్గురు విశ్రాంత హై కోర్టు జడ్జిలతో కమిటిని ఏర్పాటు చేయాలనీ, ఈ కమిటీ మణిపూర్ అల్లర్లు, హింసపై విచారణ జరుపుతుందని పేర్కొంది. హింసకు సంబంధించిన కేసులు దర్యాప్తు చేయడానికిమని మణిపూర్…

Read Full News
rahul

మళ్ళీ సభలోకి…

మోడీ అనే ఇంటి పేరు పై వివాద వ్యాఖ్యలు చేశారంటూ సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పుతో లోక్ సభ సభ్యత్వం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ, సుప్రీం కోర్టు ఇచ్చిన స్టేతో తిరిగి పార్లమెంట్ లో అడుగుపెడుతున్నారు. అంతేకాదు, మంగళ వారం 26 ప్రతిపక్ష పార్టీల కూటమి లోక్ సభలో ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మాన చర్చలో రాహుల్ గాంధీ పాల్గొంటారు.

Read Full News