దారుణం….

సోషల్ మీడియా నిబంధనల్లో సంస్కరణలు  తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆంధ్ర ప్రేదేశ్ రాష్ట్ర మహిళ కమిషన్ అధ్యక్షురాలు వాసిరెడ్డి పద్మ అన్నారు. సచివాలయంలో ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ మహిళలపై పైశాచికత్వానికి పరాకాష్టగా సోషల్ మీడియాలో పోస్టింగులు ట్రోల్ చేయడం దురదృష్టకరమన్నారు. ప్రధానంగా సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, వారి కుటుంబ సభ్యులకు చెందిన మహిళలపై  అసభ్యకరమైన పదజాలంతో పాటు అశ్లీల చిత్రాలు, అక్రమ సంబంధాల వంటి కట్టు కథల పోస్టింగులు సోషల్ మీడియాలో ట్రోల్ అవ్వడం ఎంతో జుగుప్సాకరమైన…

Read Full News

“బర్డ్” సేవలు…

 ప్రపంచ   స్థాయి వసతులతో అభివృద్ధి చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని బాలాజీ వికలాంగుల శాస్త్ర చికిత్స పునరావాస కేంద్రం (బర్డ్) అనేక క్లిష్టమైన సర్జరీలకు రెఫరల్ ఆసుపత్రిగా మారుతోందని టీటీడీ ఈవో  ఎ వి ధర్మారెడ్డి వెల్లడించారు. “బర్డ్“ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మూడు రోజుల జాతీయ స్థాయి ఆర్థో ప్లాస్టీ సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ సమ్మిట్‌లో 10 నుంచి 12 దాకా మాత్రమే లైవ్ సర్జరీలు చేస్తుండగా బర్డ్ ఆధ్వర్యంలో తొలిసారి…

Read Full News
Logo site 9

ఆ ముగ్గురు ఎక్కడ…

గాజువాకలోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో 12వ తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులు (జూన్ 24 శనివారం) నాలుగు రోజుల నుంచి కనిపించకుండా పోయారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వారు కాలేజీ నుంచి అదృశ్యమైనట్లు తెలుస్తోంది. వీరిలో పిల్లా దిలీప్, యు. దంతేశ్వర్ (బాబీ), గండ్రెడ్డి ఉమేష్ పవన్ ఉన్నట్టు సమాచారం. ఈ ముగ్గురు యువకులు చదువుపై శ్రద్ధ చూపించక పోవడంతో తల్లిదండ్రులు మందలించారని, ఈ క్రమంలో వారితో వాగ్వాదం జరిగినట్టు తెలుస్తోంది.పోలీసులు తెలిపిన…

Read Full News
tdp

“నాలుగేళ్ల నరకం”

‘ “నాలుగేళ్ల నరకం” అనే పేరుతో తెలుగుదేశం పార్టీ కొత్త ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ మేర పార్టీ అధినేత చంద్రబాబు ట్విటర్ వేదికగా వీడియో రిలీజ్ చేశారు. రానున్న రోజుల్లో గల్లీ నుండి పట్టణాల వరకు ప్రజలకు జరిగిన అన్యాయాన్ని, వైసీపీ నాయకుల అక్రమాలను ఎత్తి చూపే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. గత నాలుగేళ్లుగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను తెలియచేయడం ఈ “నాలుగేళ్ల నరకం”…

Read Full News
Screenshot 2023 06 25 231516

వర్మ “వ్యూహం”…

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీవితం ఆధారంగా డైరెక్టర్ రాం గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న “వ్యూహం”  సినిమాకు సంబంధించిన  టీజర్ ను విడుదల చేశారు.

Read Full News

అక్కడ అసలేం జరుగుతోంది….

అమరావతిలోని వి.ఐ.టి. యూనివర్సిటీలో అసలు ఏం జరుగుతోందో బయటి ప్రపంచానికి తెలియడంలేదు. క్యాంపస్ లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయనే బలమైన ఆరోపణలు వస్తున్నా పట్టించుకునే దిక్కులేకుండా పోయింది. విద్యార్ధుల సమస్యలు పట్టించుకోకుండా అటు యునివర్సిటీ యాజమాన్యం, మరోవైపు పోలీసులు సైతం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. దీనికి క్యాంపస్ లో తాజాగా జరిగిన గొడవలే ఉదాహరణగా కనిపిస్తున్నాయి. పోలీసులకుగానీ, ప్రసార సాధనాలకు గానీ  సమాచారం చేరవేయలుకునే వారిని యాజమాన్యం బెదిరింపులకు పాల్పడుతున్నట్టు కొందరు విద్యర్ధుల ద్వారానే తెలుస్తోంది….

Read Full News

మన్యం వీరుని …

మన్యం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ముగింపు వేడుకలలో భాగంగా హైదరాబాదులో నిర్వహించిన కర్టెన్ రైజర్ కార్యక్రమంలో  కేంద్ర పర్యాటక , సాంస్కృతిక మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక , సాంస్కృతిక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ గౌడ్ ముఖ్య అతిథిలు గా పాల్గొన్నారు. ఈ కార్యమానికి   మాజీ పార్లమెంట్ సభ్యులు, సినిమా నటులు మురళీమోహన్, తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల క్షత్రియ సేవా సమితి సభ్యులు,…

Read Full News

బాలుడిపై చిరుత దాడి…..

తిరుమల నడక మార్గం ఏడోవ మైలు వద్ద చిన్నారి పై చిరుత దాడి చేసింది. ఐదు సంవత్సరాల బాలుడిని పైకి ఒక్కసారిగా విరుసుకుపడిన చిరుత అందరు చూస్తుండగానే ఎత్తుకుపోయింది. అక్కడే విధులో ఉన్న పోలిసులు కేకలు వేయడంతో చిరుత బాలుడిని వదిలేసి వెళ్ళింది. గాయ్యాల పాలైన బాలుడిని ఆసుపత్రికి తరలించారు. బాలుడిని శ్రీ పద్మావతి చిన్న పిల్లల హృదయాలయం చేర్పించారు. టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్యక్షులు వై.వి.సుబ్బారెడ్డి, పలువురు టి.టి.డి అధికారులు ప‌రామ‌ర్శించారు. మెరుగైన వైద్యసేవలు అందించాలని…

Read Full News

న్యాయమూర్తితో జగన్….

సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్, అయన సతీమణి వైఎస్‌ భారతి.

Read Full News

చదువులకు వెనుకాడం…

పిల్లల చదువు కోసం ఎంత ఖర్చుకైనా వెనుకాడబోమని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. విద్యార్థులకు టెక్నాలజీని అందించే ప్రయత్నం చేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. “జగనన్న ఆణిముత్యాలు” కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ప్రభుత్వ స్కూళ్లలో మెరుగైన సౌకర్యాలు అందిస్తున్నామని,. విదేశాల్లో సీటు తెచ్చుకున్న విద్యార్థులకు అండగా ఉంటామని, మట్టి నుంచి గట్టిగా ఎదిగిన ఈ మొక్కలు రేపు మహావృక్షాలై ప్రపంచానికి ఫలాలు అందించేల ఉండాలని అయన ఆకాంక్షించారు. ప్రతి ఒక్క విద్యార్థిలో ఆత్మ…

Read Full News

బయట పెడతా పవన్….

తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తే తాను కూడా  పవన్ కళ్యాణ్  పెళ్లిళ్ల గురించి ప్రస్తావించాల్సి వస్తుందని ఎమ్మెల్యే ద్వారంపూడి హెచ్చరించారు. వ్యక్తిగత విమర్శలు చేసుకుంటూ గోదావ‌రి జిల్లాలో బస్సు యాత్ర చేస్తున్న జ‌న‌సేన అధినేత పవన్ కళ్యాణ్ పై విరుచుకు పడ్డారు. పవన్ కళ్యాణ్ వై.సి.పి నాయకుల పై విమర్శలు, ఆరోపణలు చేస్తే సాహిన్చేదే లేదన్నారు. ఆయన ఇలాగే ప్రవర్తిస్తే హీరోయిన్లతో   ఉన్న‌ రిలేషన్స్ గురించి మాట్లాడాల్సి వస్తుందంటూ వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ ఎప్పటికీ ఎమ్మెల్యే కాలేరని…..

Read Full News
pawan kkd

ఒక్క సీటు దక్కొద్దు…హా…

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక భూమిక పోషించే ఉభయ గోదావరి జిల్లాల్లోని 34 అసెంబ్లీ స్థానాల్లో వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఒక్క స్థానం కూడా దక్కకూడదు. దానికోసం వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున బలమైన వ్యూహం ఉండాలి. దానికి జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీర మహిళలు పూర్తిస్థాయి ప్రణాళికతో సంసిద్ధమవ్వాలని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. కాకినాడలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పార్టీ నాయకుల సమావేశంలో ఆయన పాల్గొని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు….

Read Full News

టెక్నాలజీ ఫలితాలు ఆమోగం..

టెక్నాలజీ సమర్థంగా వినియోగించుకుంటే ఎవరైనా మంచి ఫలితాలు సాధిస్తారని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గ్లోబల్ ఫోరమ్ ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ అధ్వర్యంలో డీప్ టెక్నాలజీస్ అనే అంశంపై జరిగిన సదస్సులో అయన  పాల్గొన్నారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు టెక్నాలజీ పై  దృష్టి సారించాడ వల్లే హైటెక్ సిటీ అందుబాటులోకి వచ్చిందన్నారు. అప్పటి  ప్రధాని వాజ్ పేయితో మాట్లాడి డీ రెగ్యులేషన్ ఇన్ టెలికమ్యూనికేషన్ విధానాన్ని తీసుకువచ్చినట్టు చెప్పారు….

Read Full News
Screenshot 2023 06 17 140328

ఎర్ర చందనం స్మగ్లింగ్ కథేంటి…

రాష్ట్రంలో ఎర్ర చందనం, ఇతర అటవీ ఉత్పత్తుల స్మగ్లింగ్ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్  హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది.  ఎప్పుడో దశాబ్దాల క్రితం నమోదైన కేసుల్లో ఇప్పటి వరకు  చార్జిషీట్ దాఖలు చేయకపోవడంపై  తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.  అటవీ సంపద అక్రమాలపై సమగ్ర దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటుచేయాలని కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖకు ఆదేశాలు  జారీ చేసింది.  సివిల్ కోర్టుకు ఉండే అన్ని అధికారాలు సిట్‍కు ఉంటాయని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ…

Read Full News

బందరు పోర్ట్ ఎం.డి. ఎవరంటే….

ఆంధ్రప్రదేశ్ మాజీ హోం మంత్రి సుచరిత భర్త, మాజీ ఐఆర్ఎస్ అధికారి దయాసాగర్ మచిలీపట్నం పోర్ట్ అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గా నియమించారు. ఆయన రెండేళ్ళ పాటు ఈ స్థానంలో కొనసాగుతారు.

Read Full News