4 mlas

అటు చూడు..”క్యూ” షురూ…!

తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కొత్తగా అధికారంలో చేపట్టిన రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొద్ది రోజుల్లో కూలిపోతుందని భారత రాష్ట్ర సమితి (బి.అర్.ఎస్.) సీనియర్ నేతలు కొద్ది రోజులుగా ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, మంగళ వారం బి.అర్.ఎస్. అగ్ర నాయకత్వం విస్తుపోయే సన్నివేశం ఆవిష్కృతం అయ్యింది. ఆ పార్టీకి చెందిన నలుగురు శాసన సభ్యులు రేవంత్ రెడ్డిని కలవడం సంచలనంగా మారింది. బి.అర్.ఎస్. కి చెందిన ఎం.ఎల్….

Read Full News
iit dhrmndr

ఆత్మహత్యలు బాధాకరం…!

ఐఐటీ ల్లో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరమని, సమాజంలో ఎవరు ఆత్మహత్య చేసుకున్న అది కచ్చితంగా తప్పే అని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ అన్నారు. ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇవ్వడానికి విద్యా సంస్థల్లో కమిటీలు వేసినట్టు చెప్పారు. ఐఐటి  హైదరాబాద్ లో నిర్వహింహిస్తున్న “ఆర్ అండ్ డి ఇన్నొవేటివ్ ఫైర్ ఇన్వెంటివ్”  రెండవ ఎడిషన్‌ను ప్రాదాన్ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో వెయ్యి కోట్లతో సమ్మక సారక్క గిరిజన…

Read Full News
revnth davos 1

“సర్జికల్” యూనిట్…

బ్రిటన్ కు చెందిన ప్రముఖ వైద్య పరికరాల తయారీ సంస్థ సర్జికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ గ్రూప్ హోల్డింగ్స్ (ఎస్.ఐ.జి.హెచ్.) హైదరాబాద్ లో తమ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ నెలకొల్పేందుకు ముందుకొచ్చింది. ఇప్పటివరకు దేశంలో తయారు చేయని పలు సర్జికల్ పరికరాలను ఇక్కడ తయారు చేస్తారు. రాబోయే రెండు, మూడు ఏళ్ల లో అందుకు అవసరమయ్యే రూ.231.5 కోట్ల పెట్టుబడులు పెడుతామని ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా విస్తరించే ప్రణాళికలో భాగంగా ఈ కంపెనీ భారతీయ మార్కెట్‌లోకి అడుగుపెడుతోంది. ఈ ఫెసిలిటీ ఏర్పాటుతో…

Read Full News
aina

“మల్లన్న”జాతర షురూ…

హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన మల్లికార్జున స్వామి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. భోగి పర్వదినంతో పాటు ఆదివారం కావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తితో మొక్కులు చెల్లించుకున్నారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో స్వామివారికి మొక్కులు చెల్లించుకునేందుకు ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు ఆలయానికి లక్షలాది మంది తరలివస్తున్నారు. ఉత్సవాల నేపథ్యంలో స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఉదయం నుండే పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి. ఆలయాన్ని…

Read Full News
shrmil babu

“నాన్న, బాబు” జీపులో…

తన కుమారుడు రాజా రెడ్డి పెళ్లికి అనేక  మంది రాజకీయ నాయకులను ఆహ్వానిస్తున్నామని,ఇందులో భాగంగానే చంద్రబాబు కుటుంబాన్నికూడా పెళ్లికి వచ్చి వధూవరులను ఆశీర్వదించాలని కోరినట్టు షర్మిల చెప్పారు. తెలుగుదేశం పార్టీ  అధినేత చంద్రబాబు నాయుడుని కాంగ్రెస్ పార్టీ నేత వై.ఎస్. షర్మిల కలిశారు. తన కుమారుడి వివాహ ఆహ్వానాన్ని అందజేసి కుటుంబ సమేతంగా  తప్పనిసరిగా రావాలని ఆహ్వానించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుతో కొద్దిసేపు చర్చలు జరిపినట్టు అందులో  అధిక సమయం…

Read Full News
ficci c

మార్పు మా బాధ్యత…

పరిశ్రమలకు మళ్లీ నూతనోత్తేజాన్ని తీసుకొస్తామని, ప్రజలు మార్పు కోరుకున్నారని ఆ మేరకు మార్పు తీసుకొచ్చి చూపిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. త్వరలో కొత్త పారిశ్రామిక పాలసీని తీసుకొస్తామని వెల్లడించారు. అందరి సలహాలు సూచనలు స్వీకరిస్తామని ప్రకటించారు. ఎఫ్టీసీసీఐ, ఫిక్కి, సీఏఏ, ఎఫ్టీఎస్ఏసీ, డిక్కి సంస్థల ప్రతినిధులు, ఇతర ప్రముఖ వ్యక్తలతో శ్రీధర్ బాబు ముఖాముఖిగా మాట్లాడారు. ప్రజలు మార్పు కోరారని, మార్పు తీసుకొచ్చి చూపిస్తామని,…

Read Full News
mlrdy goa

గోవాలో అలా…

ఎన్నికల హడావిడి లేదు… మంత్రి హోదాలో బాధ్యతలు లేఫు..మల్కాజిగిరి నుంచి మొన్న బిఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్నికైన చామకూర మల్లారెడ్డి సేద తీర్చుకోవడానికి గోవా వెళ్ళారు.

Read Full News
godrej

గోద్రెజ్ అగ్రోవెట్..

ప్రఖ్యాత పారిశ్రామిక సంస్థ గోద్రెజ్ అగ్రోవెట్ కంపెనీ ప్రతినిధి బృందం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయింది. తెలంగాణలో ఇప్పటికే ఈ కంపెనీ పలు వ్యాపారాలు నిర్వహిస్తోంది. వంట నూనెలు, డెయిరీ, అగ్రో, వెటర్నరీ సర్వీసెస్, అగ్రో కెమికల్స్, పశువుల దాణా, వెటర్నరీ సర్వీసెస్ రంగాల్లో బిజినెస్ కొనసాగిస్తోంది. మలేషియాకు చెందిన సిమ్ డార్బీ కంపెనీతో కలిసి ఖమ్మం జిల్లాలో ఇంటిగ్రేటేడ్ ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ కాంప్లెక్స్ ను ఈ కంపెనీ ఏర్పాటు చేస్తోంది. గోద్రెజ్…

Read Full News
sai sharmila

పెళ్ళికి ఆహ్వానం…

తన కుమారుని వివాహానికి హాజరు కావలసిందిగా వైఎస్ షర్మిలా రెడ్డి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ని ఆహ్వానించారు. రాజ్ భవన్ లో గవర్నర్ ని కలిసిన షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహానికి కుటుంబ సమేతంగా రావాలని వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు.

Read Full News
IMG 20240108 WA0045

జాతర…జాగ్రత్త…

మేడారం జాతరలో వైద్య, ఆరోగ్య పరంగా పూర్తిస్థాయిలో జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. మేడారం జాతర ఏర్పాట్లు, ఆరోగ్య పరిరక్షణ పై తెలంగాణ సచివాలయంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య, ఆయుష్, ఫుడ్ సేఫ్టీ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నెల నుండే భక్తులు లక్షలాదిగా రానున్నట్టు మంత్రి తెలిపారు. ఇప్పటి నుండే ప్రధాన ప్రాంతాలలో మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేయాలని సూచించారు. మందులు, పరీక్ష పరికరాలు,…

Read Full News
IMG 20240108 WA0044

కొత్త సీటులో “స్మితా”…

గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలక బాధ్యలను నిర్వహించిన స్మితా సబర్వాల్ బదిలీలో భాగంగా రాష్త్ర ఫైనాన్స్ కార్పొరేషన్ మెంబర్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టారు.

Read Full News
IMG 20240104 WA0055

జాతీయ హోదా కావాలి..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి దిల్లీ పర్యటనలో పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా తో భేటీ అయిన సీఎం రాష్ట్రానికి ఐపీఎస్‌ అధికారుల కేటాయింపును పెంచాలని విజ్ఞప్తి చేశారు. అంతకు ముందు కేంద్ర జల్‌ శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ ను సీఎంతో పాటు, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, సీ.ఎస్‌. శాంతి…

Read Full News
jagan kcr

మాజీ సి.ఎం.తో జగన్…

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఆంధ్రప్రదేశ్ సి.ఎం. వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. హైదరాబాద్ నందినగర్ లోని కేసీఆర్ నివాసానికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మాజీ మంత్రి కేటిఅర్ ఆయనకు స్వాగతం పలికారు.

Read Full News
batti pwr

విద్యుత్ కు “అప్పుల” షాక్…

గత ప్రభుత్వం చెల్లించాల్సిన అప్పులు, బకాయిలతో విద్యుత్ రంగం పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిందనిరాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, విద్యుత్ శాఖల మంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిబద్దతో ప్రణాళికా బద్ధంగా ముందు చూపుతో అడుగులు వేయాల్సిన అవసరం ఉందన్నారు. మణుగూరు బిటిపిఎస్ విద్యుత్ ప్లాంటును సందర్శించిన అనంతరం విద్యుత్ శాఖ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో భట్టి మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ప్రాజెక్టులు పరిశీలిస్తూ వాస్తవ పరిస్థితులను ప్రజలకు తెలియచేస్తున్నామని చెప్పారు….

Read Full News