rahul selfi

ప్రచారంలో “రేవంత్” దూకుడు..!

ఈ నెల 30న జరగనున్న తెలంగాణ శాసన సభ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటనలతో ప్రచారం నిర్వహించారు. నోటిఫికేషన్ నుంచి ప్రచారం ముగిసే వరకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ దాదాపు 63 నియోజకవర్గాల్లో ప్రచార సభల్లో పాల్గొన్నారు. అక్టోబర్ 16న వికారాబాద్ లో నిర్వహించిన సభ నుంచి నవంబర్ 28న మాల్కాజిగిరి రోడ్ షో వరకు దాదాపు 87 సభలో పాల్లొన్నారు. వికారాబాద్, తాండూరు, పరిగి, చేవేళ్ల, ములుగు,…

Read More
band

మూగవోయిన ప్రచారం…

తెలంగాణలో ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. నెల రోజుల పాటు హోరాహోరీగా సాగిన  ప్రచారంలో మారుమోగిన మైకు శబ్దాలు ముగాబోయాయి. ౩౦వ తేదిన జరిగే పోలింగ్ ప్రక్రియకు ఎన్నికల సంఘం అన్ని  ఏర్పాట్లు పూర్తీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 119 శాసన సభ నియోజక వర్గాల్లో 2,290 మంది  అభ్యర్ధులు బరిలో నిలిచారు. మొత్తం 35,655 పోలింగు కేంద్రాలను ఏర్పాటు చేశారు. 45 వేల మంది పోలీసులు భద్రతా చర్యల్లో పాల్గొంటారు.ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు…

Read More
money c

రోడ్డుపై”లక్ష్మీ”కళ…!

మేడ్చల్ నియోజక వర్గం పరిధిలోని పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఓటర్లకు డబ్బులు పంచుతున్న కొందరిని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పట్టుకున్న వైనం వెలుగులోకి వచ్చింది. పోటీలో ఉన్న ఓ అభ్యర్ధికి చెందిన కళాశాల సిబ్బంది, కొందరు విద్యార్థులు ఈ కాబ్బు పంపకాల్లో ఉన్నట్టు తెలుస్తోంది. వారి వద్ద ఉన్న లిస్టును బట్టి విచారిస్తే మరిన్ని వివరాలు బయటికి వచ్చే అవకాశం ఉందని కాంగెస్ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.

Read More
laknw

లక్నో కాదు ..”లక్ష్మణ పురి”…!

ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నో పేరు మారింది. ఇప్పటి నుంచి దాన్ని “లక్ష్మణ పురి”గా వ్యవహరిస్తారని అధిత్యానాద్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

Read More
IMG 20231127 WA0027

“మౌని”వత్వం..!

మానవత్వం అంటూ మాట్లాడడం వేరు, దాన్ని చాటుకోవడం వేరు. మాట్లాడే వారు చాలా మంది ఉంటారు, కానీ మానవతావాదులు కొందరే ఉంటారు. అలాంటి ఔదార్యం శ్రీకాకుళం జిల్లాలో కనిపించింది. ఈ ఎచ్చెర్ల మండలానికి చెందిన రైతు గోవిందరావు, ఉమాదేవి దంపతుల కుమార్తె మౌనిక (23) వీఆర్వోగా పనిచేస్తున్నారు. ఈ నెల 23వ తేదీన ఆమె ద్విచక్ర వాహనంపై వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురై తీవ్ర గాయపడింది. వైద్యులు బ్రెయిన్ డెడ్ అని ప్రకటించడంతో గుండె, కిడ్నీలు, కళ్లు…

Read More
isha c

Happy B”Devil”

Esha Gupta well known Bollywood actress. Gupta came from national capital Delhi. She has completed Mass Communication course from Manipal Institute of Communications, Karnataka. Esha is a winner of Miss Photogenic title and she was snapped in a stunning swimsuit for the 2010 Kingfisher calendar. Esha wants to acting and modeling.

Read More
babu delhi c 1

డిల్లీలో “బాబు”…..!

సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రా కుమారుడి వివాహ రిసెప్షన్ కు హాజరయ్యేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లారు. ఆయనకు డిల్లీ విమానాశ్రయంలో టిడిపి నేతలు కనకమేడల రవీంద్రకుమార్,కేశినేని నాని,రఘురామ కృష్ణంరాజు, రామ్మోహన్ నాయుడు స్వాగతం పలికారు. అనంతరం చంద్రబాబు లూథ్రా కుమారుడి వివాహ రిసెప్షన్ కు వెళ్ళారు.

Read More
ktr gobak

కేటిఆర్ వద్దు..!

గత రెండు ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా అధికార పార్టీకి నిరసనల సెగ తగులుతోంది. బిఆర్ఎస్ బలంగా ఉందనుకున్న జగిత్యాల జిల్లా వెల్గటూర్ లో మంత్రి కేటీఆర్ రోడ్ షో ముగించుకుని తిరిగి వెళుతుండగా పలువురు రైతులు నిరసనకు దిగారు. పాశిగామలో కొందరు రైతులు ప్లకార్డులతో రోడ్డు ఎక్కారు. కేటిఅర్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. కాలేశ్వరం ప్రాజెక్టు వల్ల ఎవరికి లాభం, ప్రభుత్వానికా, మంత్రికా, మీ ఫామ్ హౌస్కా, కొప్పుల ఈశ్వర్ కా, కటింగ్…

Read More
selfi c

జుట్టు కెక్కిన సెల్ఫీ”పిచ్చి”…!

ఆదివారం సాయంత్రం సరదాగా పార్కులో గడపడానికి వచ్చిన అమ్మాయిల మధ్య చోటుచేసుకున్న ఓ చిన్న వివాదం జుట్లు పట్టుకొని కొట్టుకునే స్థాయికి వెళ్లింది. గుంటూరులో ఇటీవలే కొత్తగా ప్రారంభించిన గాంధీ పార్కులో ఈ ఘటన జరిగింది. అక్కడ ఓ లొకేషన్ వద్ద సెల్ఫీలు, రీల్స్ తీసుకునేందుకు యువతులు పోటీ పడ్డారు. ఈ క్రమంలో చెలరేగిన వివాదం చివరకు కొట్లాటకు దారి తీసింది. కొంతమంది యువతులు జుట్లు పట్టుకుని కొట్టుకున్నారు. పలువురు అడ్డుకునే ప్రయత్నం చేసినా పట్టించుకోక పోవడం విశేషం….

Read More
revnth gjvl c 1

మేలు మరచిన మామ,అల్లుడు…!

రైతుబందుతో ఓట్లు దండుకోవాలన్న దురాశ, ఆత్రుత, అహంకారం తప్ప, నిజంగా రైతులకు మేలు జరగాలన్న ఉద్ధేశం మామా, అల్లుళ్లకు లేదని,హరీష్ రావు వ్యాఖ్యల కారణంగానే రైతుబంధుకు ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంటున్నట్టు ఈసీ ఆదేశాలు ఇవ్వడం దీనికి నిదర్శనమని, ఈ ద్రోహులను ఇంటికి పంపితే తప్ప రైతులకు న్యాయం జరగడని తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రైతులు ఆందోళన చెందవద్దని, పది రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, ఆ వెంటనే 15 వేల…

Read More
electn com 1

రైతు”బంద్”…!

తెలంగాణలో రైతుబందు పధకం అమలుకు మూడు రోజుల కిందట అనుమతి ఇచ్చిన ఎన్నికల సంఘం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. వాస్తవానికి మంగళ వారం నుంచి రైతుల ఖాతాల్లో డబ్బు జమకావలసి ఉంది.అయితే, ఈ నెల 28న రైతుబంధు పంపిణీ చేస్తారని బిఆర్ఎస్ నేత హరీష్ రావు చేసిన పత్రికా ప్రకటనలను ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. ఎన్నికల నిబంధనలను ఉల్లఘిన్చినందుకు రైతుబందుకు ఇచ్చిన అనుమతిని ఉపసంహరించినట్టు ఎన్నికల సంఘం పేర్కొంది.

Read More
rahul priya

కెసిఆర్ చదివిన స్కూలు మేము కట్టిందే…!

తెలంగాణను ప్రతేక రాష్ట్రంగా చేసి, ఇక్కడి ప్రజల ఆకాంక్షను నెరవేర్చింది కాంగ్రెస్ పార్టీయే అని ఆ పార్టీ అధినేత రాహుల్ గాంధీ చెప్పారు. కెసిఆర్ చదువుకున్న స్కూలుని కట్టించిది కుడా కాంగ్రెస్ పార్టీనే అని తెలిపారు. తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ ఏమి చేసిందంటూ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పదేపదే అడుగుతున్న ప్రశ్నకు ఇదే నా సమాధానం అన్నారు.  తెలంగాణ ముసుగులో బిఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లుగా ప్రజలను నిలువు దోపిడీ చేసిందని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం పేరుతో లక్ష కోట్లు…

Read More
chadalavd 1

మరో 11 పాలిటెక్నిక్ కాలేజీలు…

ఆంధ్రప్రదేశ్ లో రానున్న రెండు నెలల్లో మరో 11 పాలిటెక్నిక్ లకు ఎన్‌బీఏ లభించే అవకాశం ఉందని, ఇందుకు సంబంధించిన పనులు వేగంగా సాగుతున్నాయని సాంకేతిక విద్యా శాఖ కమీషనర్ చదలవాడ నాగరాణి తెలిపారు. నేషనల్ బోర్డు ఆప్ అక్రిడిటేషన్ గుర్తింపు సాధనలో భాగంగా చేస్తున్న కార్యక్రమాలు ప్రభుత్వ పాలిటెక్నిక్ లకు నూతనత్వాన్ని ఆపాదిస్తున్నాయన్నారు. విద్యార్ధులకు ఉపాధి ఏ మేరకు లభిస్తుందన్న దానిని కూడా ఎన్‌బీఏ పరిగణనలోకి తీసుకుంటుదని, ఆక్రమంలో వారికి తక్షణం ఉద్యోగాలు లభించేలా చర్యలు…

Read More
IMG 20231126 WA0021

తిరుపతిలో మోడీ…

తిరుపతి ప్రధాని నరేంద్ర మోదీ ఆంద్రప్రదేశ్ పర్యటనలో భాగంగా తిరుపతి వచ్చారు. రేణిగుంట విమానాశ్రయంలో ఆయనకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వాగతం పలికారు.

Read More