ఎవరి డబ్బు….
నల్గొండ జిల్లా వాడపల్లి అంతరాష్ట్ర చెక్ పోస్టు వద్ద పోలీసుల 3.04 కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.అయితే ఈ మొత్తం ఎవరికి చెందిందనేది తెలియాల్సి ఉంది.
నల్గొండ జిల్లా వాడపల్లి అంతరాష్ట్ర చెక్ పోస్టు వద్ద పోలీసుల 3.04 కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.అయితే ఈ మొత్తం ఎవరికి చెందిందనేది తెలియాల్సి ఉంది.
జర్నలిస్టుల ఇంటి స్థలాల అంశాన్ని తమ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టే అంశాన్ని పరిశీలిస్తామని, ఈ విషయాన్ని శ్రీధర్బాబు నేతృత్వంలోని మేనిఫెస్టో కమిటీకి నివేదిస్తామని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు. ఈ మేరకు డెక్కన్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీ (డీజేహెచ్ఎస్) అధ్యక్షులు బొల్లోజు రవి, ఉపాధ్యక్షులు మరిపాల శ్రీనివాస్, కోశాధికారి చిలుకూరి అయ్యప్ప, డైరెక్టర్లు జి.ప్రతాప్రెడ్డి, దండ రామకృష్ణ, సభ్యులు క్రాంతి తదితరులు ఆదివారం రేవంత్రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. ఎన్నికల మేనిఫెస్టోలో జర్నలిస్టుల…
అంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్టు “న్యాయానికి సంకెళ్లు” అంటూ నారా లోకేష్, బ్రాహ్మణి నినదించారు. హైదరాబాద్లోని తమ నివాసంలో చేతులకు తాళ్లు కట్టుకుని చంద్రబాబు అక్రమ అరెస్టుని నిరసించారు. ఏ ఆధారాలు లేకపోయినా, రాజకీయ కక్షతో, ప్రజల నుంచి చంద్రబాబుని దూరం చేసేందుకు అక్రమంగా అరెస్టు చేశారని మండిపడ్డారు. వ్యవస్థలను చేతుల్లోకి తీసుకొని చంద్రబాబుని జ్యుడీషియల్ రిమాండ్ లో ఉంచి ప్రాణహాని తలపెట్టాలని కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. జైలులో ఆరోగ్యం…
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున బరిలోకి దిగుతున్న అభ్యర్థులకు ముఖ్యమంత్రి కేసీఆర్ బీ-ఫారాలు అందించారు. తెలంగాణ భవన్లో 51 మంది ఎమ్మెల్యే అభ్యర్థులకు బీ-ఫారాలు ఇచ్చారు. ఒక్కో అభ్యర్థికి రెండు బీ-ఫారాలు అందిస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు. మితగా వారికి రేపు అందిస్తామన్నారు. కేసీఆర్ తరపున గంప గోవర్ధన్, మంత్రి ప్రశాంత్ రెడ్డి తరపున ఎమ్మెల్సీ కవిత బీ-ఫారమ్ అందుకున్నారు. ఉమ్మడి మెదక్, మహబూబ్నగర్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన బీఆర్ఎస్ అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేశారు….
రాజమండ్రి కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న అంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు అరోగ్య సమస్యలకు సంబంధించి వైద్యులు అందజేసిన కీలక నివేదిక అయన కుటుంబ సభ్యులను, పార్టీ శ్రేణులను ఆందోళనకు గురి చేస్తున్నాయి.బాబు ఆరోగ్య సమస్యలు తీవ్రంగా ఉన్నట్టు రాజమండ్రి ప్రభుత్వ వైద్యుల జైలు అధికారులకు అందజేసిన మెడికల్ రిపోర్ట్ బయటకు పొక్కడం పలురకాల వదంతులకు దారి తీసింది. చంద్రబాబుకి చర్మ సంబంధ సమస్యలు ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నట్టు తెలుస్తోంది.చేతులు,…
అహ్మదాబాద్ లో జరిగిన ప్రపంచ కప్ వన్డే లో పాకిస్తాన్ పై భారత్ సునాయాస విజయన్ని సొంతం చేసుకుంది. టాస్ గెలచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 42.5 ఓవర్లకే 10 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. భారత్ జట్టు 30.3 ఓవర్లలో 192 పరుగులు చేసి గెలుపొందింది. దీంతో ప్రపంచ కప్ 2023 పట్టికలో భారత్ మొదటి స్థానానికి చేరుకుంది.
ఒకప్పుడు తాగునీటికి అవస్థలు పడిన మహబూబ్ నగర్ నేడు విదేశీ పర్యాటకులను సైతం విశేషంగా ఆకర్షిస్తున్నదని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక, పురావస్తు శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ సహకారంతో మహబూబ్ నగర్ ను అద్భుతంగా తీర్చిదిద్దడం వల్లే ఇది సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు. ఫ్రెంచ్ మోటార్ సైక్లిస్ట్ అలిసన్ గ్రున్ ఆధ్వర్యంలోని ఫ్రీ డబ్ల్యూ అనే వేదిక ద్వారా తెలంగాణలో ఫ్రాన్స్,…
నలభై ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో పనిచేసి, పదవులు, అధికారం అనుభవించి నేడు అదే పార్టీని వీడి పోవడం సిగ్గుచేటు వ్యవహారమని పి.సి.సి. అధ్యక్షులు రేవంత్ రెడ్డి పొన్నాల లక్ష్మయ్య పై విరుసుకు పడ్డారు.
తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నాయకులకే కాదు, సామాన్య ప్రజలకు సైతం అందరికి తెలిసిన నేత మల్లు భట్టి విక్రమార్క. ఉద్యమాల ఖిల్లా ఖమ్మం జిల్లాకు చెందిన ఆయన రాజకీయ నేపద్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చి రాష్ట్ర స్థాయి నేతగా ప్రజలకు చేరువయ్యారు. కాంగ్రెస్ నేతలు, లోక్ సభ మాజీ సభ్యులు స్వర్గీయ మల్లు అనంత రాములు, మరో పార్లమెంటు సభ్యుడు మాజీ శాసన సభ మాజీ సభ్యులు మల్లు రవి సొంత తమ్ముడు విక్రమర్క. 1990వ దశకంలో…
ప్రతిష్టాత్మకమైన అదేవిధంగా వివాదాస్పదమైన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) ఎన్నికల్లో అధ్యక్షుడిగా పోటీ చేసేందుకు అర్శనపల్లి జగన్మోహన్ రావు, అతడి ప్యానెల్ సభ్యులు నామినేషన్లు దాఖలు చేశారు. ఉప్పల్ స్టేడియంలో నామినేషన్లు సమర్పించిన అనంతరం జగన్మోహన్ రావు తమ ప్యానెల్ పేరును ప్రకటించారు. యూనైటెడ్ మెంబర్స్ ఆఫ్ హెచ్సీఏ ప్యానెల్ నుంచి అధ్యక్షుడిగా జగన్మోహన్ రావు, ఉపాధ్యక్షుడిగా పి.శ్రీధర్, ప్రధాన కార్యదర్శిగా ఆర్. హరినారాయణ, సహాయ కార్యదర్శిగా నోయల్ డేవిడ్ (మాజీ క్రికెటర్), కోశాధికారిగా సి.జె శ్రీనివాస్,…
ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణాలోని పలు జిల్లాల్లో ఐపిఎస్ అధికారులతో పాటు కొందరు ఐఏఎస్ అధికారులను కూడా బదిలీ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు, సూచనల మేరకు హైదరాబాద్ నగర కమిషనర్ గా సందీప్ శాండిల్యా, వరంగల్ కమిషనర్ గా అంబర్ కిషోర్ ఝా బాధ్యతలు చేపట్టారు. నిజామాబాద్ సీపీగా కమలేశ్వర్ , సంగారెడ్డి జిల్లా ఎస్పీగా రూపేష్, కామారెడ్డి ఎస్పీగా సిందు శర్మ, నాగర్ కర్నూల్ ఎస్పీగా వైభవ్ గైక్వాడ్, సూర్యాపేట ఎస్పీగా రాహుల్…
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.అయన రాజీనామ లేఖను ఎ.ఐ.సి.సి. అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే కు పంపినట్టు సమచారం అందింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. అయితే, ప్రస్తుతానికి అందుతున్న సమాచారం మేరకు అయన గులాబీ కండువాతో “కారు” ఎక్కే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది.
దేశంలోని ఐదు రాష్ట్రాల్లో జరగనున్న కీలక ఎన్నికల్లో కోట్లాది రూపాయలు వరదలా ప్రవహించే సూచనలుకనిపిస్తున్నాయి. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించగానే బా వచ్చిన “కట్టల” పాములు రోజు రోజుకూ అధికమవుతున్నాయి. ఆయా పార్టీలు పొరుగు రాష్ట్రాల నుంచి డబ్బు మూటలను తరలించే ప్రక్రియకు తెరలేపాయి. తాజాగా కర్ణాటకలోని బెంగళూరులో ఆదాయపు పన్ను శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్న 42 కోట్ల నగదు వ్యవహారమే ఇందుకు ఉదాహరణ. ఈ డబ్బు ఎక్కడికి, ఎందుకు తరలించే ప్రయత్నం జరిగిందనే విషయంలో ఇప్పటి…
రాజమండ్రి కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న అంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చర్మ దురద (అలర్జి) సమస్యతో బాధపడుతున్నట్టు సమాచారం అందుతోంది. ఇదే విషయాన్ని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు నిర్ధారించారు.
అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కక్షసాధింపు చర్యలను కట్టడి చేయాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు. చంద్రబాబును అరెస్ట్, విచారణ పేరుతో వేధిస్తున్న తీరును అమిత్ షా దృష్టి కి తీసుకు వెళ్లారు.చివరికి తన తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణి ని కూడా ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని వివరించారు. .