మరో విజయం…

ప్రపంచ కప్పు క్రికెట్ లో వరుస విజయాలతో భారత్ దూసుకు పోతోంది. ధర్మశాలలో జరిగిన ఆటలో న్యూజిలాండ్ పై భారత్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. 274 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన భారత్ 48 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. విరాట్ కోహ్లి 95 పరుగులతో ఈ విజయంలో కీలక పాత్ర పోషించారు. కానీ, తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయారు. అటు రోహిత్ 46, జడేజా 39*, శ్రేయస్ 33, రాహుల్ 27 రన్స్…

Read Full News
revant 768x512 1

“మేడి”పాపం కేసీఅర్ దే…

కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజ్ ప్రమాదానికి కేసీఆర్ కుటుంబమే కారణమని, కాళేశ్వరం అవినీతిలో మొదటి దోషి కేసీఆర్ కుటుంబమే అని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగడం పై సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ తో దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. ఈ బ్యారేజి ద్వారా లక్ష కోట్లను కేసీఆర్, కాంట్రాక్టర్లు దోచుకున్నారన్నారు. నాణ్యత లోపం వల్ల మెడిగడ్డ ప్రమాదం జరిగిందనీ, కేంద్ర హోంమంత్రి, గవర్నర్ ,ఎన్నికల కమిషన్ మేడిగడ్డ పై విచారణకి ఆదేశించాలనీ డిమాండ్…

Read Full News
IMG 20231022 WA0009

భారీ ర్యాలీ…

హైదరాబాద్ జిల్లా సనత్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ కోట నీలిమ తన ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సికింద్రాబాద్ మొండా మార్కెట్ నుండి సనత్ నగర్ బస్ స్టాప్ వరకు కార్లు, మోటారు సైకిళ్ళతో ఆమె ప్రచారాన్ని ప్రారంభించారు. దాదాపు వెయ్యి కి పైగా వాహనాలు, బైకులతో సుమారు రెండు వేలమంది ఈ ప్రచారంలో పాల్గొనడం గమనార్హం. ఈ మధ్య కాలంలో నగరంలో ఇంతటి భారీ ర్యాలీ జరపడం…

Read Full News
journ sridher

మేనిఫెస్టోలో”కలం”వీరులు..!

దశాబ్దాలుగా అపరీష్కృతంగా ఉన్న తమ సమస్యలను పరిష్కరించడానికి వీలుగా రాబోయే ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ రూపొందించే మేనిఫెస్టో లో వాటిని చేర్చాలని తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక కోరింది. ఈ మేరకు తెలంగాణా కాంగ్రెస్ మ్యానిఫెస్టో ఛైర్మెన్ దుద్దిళ్ళ శ్రీధర్ బాబుని వేదిక ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం కలిసింది. తెలంగాణ జర్నలిస్టుల సమస్యలు, సంక్షేమానికి సంబంధించి 9 ప్రధాన అంశాలతో కూడిన వినతిపత్రం అందజేశారు. తమ దీర్ఘకాలిక సమస్యలను కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచి వాటి…

Read Full News
jagana police c

“ఖాకీ” అంటే త్యాగనిరతి…

పోలీసులు వేసుకునే ఖాకీ డ్రెస్ అంటేనే త్యాగనిరతికి నిలువెత్తు సాక్ష్యం అనీ, పోలీస్‌ అంటే అధికారం మాత్రమే కాదనీ, సమాజంలో అతను ఒక బాధ్యత గల వ్యక్తీ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్.జగన్మోహన్ రెడ్డి అన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో అయన పాల్గొన్నారు. నేరం వేగంగా తన రూపాన్ని మార్చుకుంటున్న ఈ యుగంలో అంతకుమించిన వేగాన్ని అందుకుంటేనే పోలీసింగ్‌కు మరింత విలువ పెరుగుతుందన్నారు. జన రక్షణ…

Read Full News
Gaganyaans test

“క్రూ” సేవ్ టెస్ట్ సక్సెస్…

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) గగన్‌యాన్ మిషన్‌ డెమో ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. 44 టన్నుల బరువైన ఫ్లైట్ టెస్ట్ వెహికిల్ అబార్ట్ మిషన్-1 టి.వి.- డి1 రాకెట్ షార్ లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి ఉదయం 10 గంటలకు నింగిలోకి దూసుకెళ్లింది. ఈ రాకెట్ లో  క్రూ మాడ్యూల్, ఎస్కేప్ మాడ్యూల్‌ని నింగిలోకి పంపారు.ఈ ప్రయోగంలో రాకెట్ తనలో ఉన్న క్రూ మాడ్యూల్, క్రూ ఎస్కేప్ సిస్టమ్‌ను భూమి నుంచి 17 కిలోమీటర్ల…

Read Full News
Gaganyaans test

గగన్ యాన్ “డెమో”ప్రయోగం..

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి కౌంట్ డౌన్ మొదలు పెట్టింది. 21వ తేది ఉదయం 8 గంటలకు “గగన్ యాన్” మిషన్ కి సంబంధించిన డెమో వెహికల్-1ని నింగిలోకి పంపనున్నారు. గగన్ యాన్ ప్రయోగంలో ఏవైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే అందులోని సిబ్బంది ఎలా తప్పించుకోవచ్చు అనే విషయాలను ఈ ప్రయోగం ద్వారా తెలుసుకోవచ్చునని ఇస్రో తెలిపింది.

Read Full News
aus win

“పాక్” ఓటమి…

ప్రపంచ కప్ క్రికెట్ పోటీలో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 368 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాకిస్తాన్ తడబడింది. పాక్ ఓపెనర్లు అబ్దుల్లా (64), ఇమాముల్(70), రిజ్వాన్(46) మాత్రమే రాణించారు. పాక్ 45.3 ఓవర్లలో 305 రన్స్ చేసి ఆలౌట్ అయ్యింది.దీంతో ఈ వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియాకు వరుసగా రెండో విజయం దక్కింది. మరోవైపు పాకిస్తాన్‌ వరుసగా 2వ ఓటమి చవిచూసింది.

Read Full News
poce commo

“ధీరుల”కు నివాళి రోజు…

పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్నిపురస్కరించుకొని శనివారం హైదారాబాద్ గోషామహల్ స్టేడియం లో పోలీస్ ఫ్లాగ్ డే జరుగుతుంది. ఉదయం 8 .45 గంటలకు ప్రారంభమయ్యే ఈ ఫ్లాగ్ డే కార్యక్రమంలో డీజీపీ అంజనీ కుమార్ పాల్గొంటారు. ఉంటుంది. ఈ సంవత్సరం దేశ వ్యాప్తంగా విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన అమర పోలీసులకు నివాళులు అర్పిస్తారు. సీనియర్ పోలీస్ అధికారులు, పదవీ విరమణ పొందిన పోలీసాధికారులు, పోలీసు అమరుల కుటుంబాలుఈ కార్యక్రంలో పాల్గొంటాయి.

Read Full News
rahul tea c

“దొర”ల పాలన వద్దు.…

తెలంగాణలో ప్రజల రాజ్యం నడవాలని పదేళ్ళ కిందట  సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని, కానీ అది ఈనాడు దొరల చేతుల్లోకి వెళ్లిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ కోరుకుందీ, ఆశించింది దొరల తెలంగాణ కాదు, ప్రజల తెలంగాణ అని పేర్కొన్నారు. “దొరల తెలంగాణ కు, ప్రజల తెలంగాణకు” మధ్య కొద్దిరోజుల్లో ఎన్నికలు జరగనున్నాయని అన్నారు. ఆర్మూరులో జరిగిన విజయభేరీ తొలి విడత బస్ యాత్ర ముగింపు సభలో రాహుల్ గాంధీ…

Read Full News
dgp batukamma

పోలీసుల బతుకమ్మ…

తెలంగాణ డీజీపీ కార్యాలయంలో బతుకమ్మ ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించారు. కార్యాలయ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ బతుకమ్మ పండగకు డీజీపీ అంజనీ కుమార్,అడిషనల్ డీజీ సౌమ్య మిశ్రా, అభిలాష బిస్ట్, సంజయ్ కుమార్ జైన్, ఐ.జి రమేష్ రెడ్డి, ముఖ్య పరిపాలనాధికారి నవానీత తోసహా పలువురు పోలీస్ ఉన్నతాధికారులు హాజరయ్యారు. తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలను ఒక చోట చేర్చి ఉద్యోగులు, వారి పిల్లలు, చిన్నారులతో ఆటపాటలతో సంబరాలు చేసారు. దాండియా, బతుకమ్మ ఆటపాటల…

Read Full News
samantha1

ఊ…అంటావా..మావా…

వెండి తెరపై ప్రత్యేకంగా తెలుగు సినిమాలో ఏ క్యారెక్టర్ లోనైనా ఇట్టే ఒదిగిపోయే నటి సమంతా అందడంలో సందేహం లేదు. ఆమె సినిమాల్లో హీరో స్థాయిలో ఎవరున్నరనేది కాదు ముఖ్యం, కెమెరా ముందు ఎలా నటిస్తున్నన్నదే ప్రధానం. అందుకే ఆమె అమాయకంగా “ఏదో ఏదో ఉల్కా నేరుగా భూమి పై”,..అన్నా, రొమాంటిక్ గా “ఊ..అంటావా,… అంటూ సందడికి దిగినా ప్రేక్షకులు ఎగబడి చూస్తారు..

Read Full News
jornlist harish

ఇస్తాం..ఇస్తాం..తప్పక ఇస్తాం..

హైదరబాద్ జర్నలిస్టుల ఇళ్ల స్థలాల అంశం త్వరలోనే పరిష్కరిస్తామని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. కొత్తగా ఏర్పాటైన “ది తెలంగాణా జర్నలిస్ట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ” ప్రతినిధులతో ఆయన ప్రగతి భవన్ లో భేటీ అయ్యారు. సొసైటీ సభ్యత్వ వివరాలు అడిగి తెలుసుకున్నారు. మూడోసారి కూడా తామే అధికారంలోకి వస్తామన్న మంత్రి హరీష్ రావు జర్నలిస్టుల హౌసింగ్ సమస్యని కూడా తప్పక పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మంత్రి కేటీఆర్ కలిసి ఇదే అంశంపై…

Read Full News
betting raja

బెట్టింగ్ రాజా సస్పెండ్…..

డ్రీమ్ 11 బెట్టింగ్ లో 1.5 కోట్ల రూపాయలు గెలుచుకున్న మహారాష్ట్రలోని పుణేకు చెందిన ఎస్సై సోమనాథ్ సస్పెండ్ అయ్యారు. ఆన్ లైన్ లో బెట్టింగ్ చేసిన ఎస్.ఐ. ఇంత పెద్ద మొత్తం గెలిచారనే వార్త బయటకు గుప్పుమనడంతో ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ఈ క్రమంలో అనుమతి లేకుండా బెట్టింగ్ కు పాల్పడడం, మీడియా ఎదుట పోలీస్ యూనిఫామ్ లో మాట్లాడటం వంటివి నిబంధనలకు విరుద్ధమని విచారణాధికారి పేర్కొన్నారు. దీంతో సోమనాథ్ పై చర్యలు తీసుకున్నట్లు పుణే…

Read Full News
rapid train

ర్యాపిడ్ “ఎక్స్”…

దేశంలో మొట్టమొదటి “ర్యాపిడ్ ఎక్స్” ప్రాంతీయ రైలును ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 20వ తేదీన ప్రారంభిస్తారు. డిల్లీ, ఘజియాబాద్,మీరట్ ల మధ్య మొదట ఈ రైలు నడుపుతారు. పూర్తీ ఎయిర్ కండిషన్ బోగిలతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన ఈ రైలు గంటకు 16౦ కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు.ప్రయాణికులు కూర్చోవడానికి,నిలబదదానికీ విశాలంగా ఉంటుంది. అంతేకాక,ప్రతీ బోగిలో సి.సి. కెమెరా అమర్చారు. లాప్ టాప్, మొబైల్ ఫోన్ లను చార్జింగ్ చేసుకునే సదుపాయం ఉంది.

Read Full News