cs shanti 1

ఇక “కోడ్” స్క్రీనింగ్…

తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి రాగా, నిబంధనలను సమర్థంగా అమలు చేసేందుకు స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చే ప్రతిపాదనలను ఈ కమిటీ పరిశీలించనుంది. కేంద్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేయగా, ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఈ కమిటీకి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు.

Read More
3.5 crore

ఎన్నికల పొగతో “కట్టల’ పాములు….!

తెలంగాణాలో ఎన్నికల పొగ రాజుకోవడంతో “కట్టల” పాములు బయటకు వస్తున్నాయి. భాగ్యనగరం నలు చెరగులా బస్తాల కొద్ది నల్లదనం, అటుపట్టని హవాల సొమ్ము నాట్యం చేస్తోంది. ఎన్నికల నియమావళి వచ్చిందో లేదో ఒక చోటు నుంచి మరో చోటుకు తరలుతున్న డబ్బు మూటలు పోలీసులకు తనిఖిల్లో చిక్కుతున్నాయి. రంగా రెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో భారత్ గార్డెన్స్ వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా కారులో 6.55లక్షల రూపాయలు తీసుకెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఇక బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 3లో…

Read More
lokes cid 1

గూగుల్‌లో వెతికితే సరిపోయేది…

సిఐడి అధికారులు ఆరున్నర గంటల పాటు ఇన్నర్ రింగ్ రోడ్డుతో సంబంధం లేని 50 ప్రశ్నలు అడిగార‌ని, ఇందులో 49 ప్ర‌శ్న‌లు గూగుల్‌లో వెతికితే వ‌చ్చేవి ఉన్నాయ‌ని టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ చెప్పారు. సీఐడీ విచార‌ణ అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ మీరు ఏం చేస్తుంటారు? హెరిటేజ్‌లో పని చేసినప్పుడు మీ హోదా ఏంటి? ప్రభుత్వంలో మీరు ఏ బాధ్యతలు నిర్వహించారు? ఇటువంటి గూగుల్ లో దొరికేవ‌న్నీ త‌న‌ని విచార‌ణాధికారులు అడిగార‌ని తెలుపారు….

Read More
evm

అతిక్రమిస్తే ఉక్కు పాదం…!

వచ్చే ఎన్నికల్లో ఓటర్ల సౌలభ్యం కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఈవీఎంలలో స్వల్ప మార్పు చేసింది. ఈవీఎంపై గతంలో పార్టీ గుర్తు, అభ్యర్థి పేరు మాత్రమే  ఉండేవి. కానీ ఈ సారి ఎన్నికల్లో వీటితో పాటు అభ్యర్థి ఫొటో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇదే విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ వెల్లడించారు. పోస్టల్‌ బ్యాలెట్‌పైనా అభ్యర్థుల ఫొటోలు ఉంటాయి. ఈ నెల 31 వరకు ఓటు హక్కు నమోదుకు దరఖాస్తు చేసుకోవచ్చు. చిరునామా…

Read More
srinivas goud

గండం తప్పింది…

తెలంగాణా మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై ఎన్నికల అఫిడవిట్ కేసును హైకోర్టు కొట్టి వేసింది. మహబూబ్ నగర్ కు చెందిన చలవుగాలి రాఘవేంద్ర రాజు అనే వ్యక్తి శ్రీనివాస్ గౌడ్ గత ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారని ఆరోపిస్తూ, గౌడ్ ఎన్నిక చెల్లదంటూ హైకోర్టులో కేసు వేసిన విషయం తెలిసిందే. అయితే, సుదీర్ఘ విచారణ అనంతరం వివిధ అంశాలను పరిశీలించిన కోర్టు తుది తీర్పు వెల్లడించింది. రాఘవేంద్ర రాజు వేసిన ఎన్నికల కేసు చెల్లదంటూ తీర్పు…

Read More
cec c

ఐదు రాష్ట్రాలకు మోగింది…!

దేశం లోని ఐదు రాష్ట్రాలలో జరగనున్న ఎన్నికలకు సంబంధించిన తేదీల వివరాలను ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్ అనూప్ చంద్ర పాండే, అరుణ్ గోయల్ వివరించారు. తెలంగాణా సహా ఛత్తీస్ ఘర్,  మధ్యప్రదేశ్, రాజస్తాన్, మిజోరం రాష్ట్రాల్లో నవంబర్, డిసెంబర్ నెలల్లో ఎన్నికలు జరగనున్నట్టు తెలిపారు. తెలంగాణాలో నవంబర్ ౩౦వ తేదీన ఒకేవిదతలో పోలింగ్ జరుగుతుంది. డిసెంబర్ ౩న ఫలితాలు ప్రకటిస్తారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ని నవంబర్ ౩న విడుదల చేస్తారు….

Read More
Telangana map

వచ్చే నెల ౩౦న ఎన్నికలు…..

దేశం లోని ఐదు రాష్ట్రాలలో జరగనున్న ఎన్నికలకు సంబంధించిన తేదీల వివరాలను ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్ అనూప్ చంద్ర పాండే, అరుణ్ గోయల్ వివరించారు. తెలంగాణాలో నవంబర్ ౩౦వ తేదీన ఒకేవిదతలో పోలింగ్ జరుగుతుంది. డిసెంబర్ ౩న ఫలితాలు ప్రకటిస్తారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ని నవంబర్ ౩న విడుదల చేస్తారు. నామినేషన్లను 10వ తేదీ నాటికీ దాఖలు చేయాలి. 13 వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 15 వ…

Read More
babu 1

“బాబు”కు దెబ్బ…

అంధ్రప్రదేశ్ హైకోర్టులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఎదురు దెబ్బ తగిలింది. ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో ఆయన దాఖలు చేసిన పిటిషన్లను న్యాయస్థానం కొట్టి వేసింది.చిత్తూరు జిల్లా అంగళ్లు ఘటన, ఫైబర్ నెట్, ఇన్నర్ రింగ్ రోడ్ కేసుల్లో బాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను కోర్టు డిస్మిస్ చేసింది.

Read More
IMG 20231008 WA0012

స్విమ్మింగ్ “విక్టరీ”యా….

సెర్బియా దేశ రాజధాని బెల్ గ్రేడ్ లో జరిగిన ఒపెన్ వాటర్ ఫిన్ స్విమ్మింగ్ వరల్డ్ మాస్టర్స్ ఛాంపియన్ షిప్ – 2023 పోటీలలో తెలంగాణ స్విమ్మర్  క్వీనీ విక్టోరియా గంధం సత్తా చాటింది. 3 కిలోమీటర్ల మోనో ఫిన్ విభాగంలో బంగారు పతకం,1 కిలోమీటర్ మోనో ఫిన్ విభాగంలో రజిత పతకాలను సొంతం చేసుకుంది.సెప్టెంబర్ 28వ తేదీ నుంచి అక్టోబర్ 1వ తేదీ ఈ పోటీలు జరిగాయి. మన దేశం నుంచి  ఓపెన్ వాటర్ ఫిన్…

Read More
IMG 20231009 WA0002

ఐఐటి ఈతగాళ్లు…

దేశంలోని వివిధ ప్రాంతాల్లోని ఐఐటి విద్యార్థుల మధ్య గుజరాత్ రాష్ట్రంలోని గాంధీనగర్ ఐ.ఐ.టి.లో నిర్వహించిన 37వ ఈత (ఆక్వాటిక్స్) పోటీల్లో ఐఐటి హైదరాబాద్ అభ్యర్థులు సత్తా చాటారు.దేశంలోని వివిధ ప్రాంతాల్లోని ఐఐటి విద్యార్థుల మధ్య గుజరాత్ రాష్ట్రంలోని గాంధీనగర్ ఐ.ఐ.టి.లో నిర్వహించిన ఈత (ఆక్వాటిక్స్) పోటీల్లో ఐఐటి హైదరాబాద్ అభ్యర్థులు సత్తా చాటారు. ఈ పోటీల్లో సెకండ్ రన్నర్అప్ ని సొంతం చేసుకోవడంతో పాటు 8 పతకాలు గెలుసుకున్నారు. మొత్తం 16 ఐఐటిలు ఈ పోటీల్లో తలపడ్డాయి….

Read More
india 23

అదిరే బోణీ…

వన్డే ప్రపంచకప్‌లో టీమ్‌ ఇండియాకు అదిరే ఆరంభం లభించింది. ఆసీస్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో రోహిత్‌ సేన 6 వికెట్ల తేడాతో సూపర్‌ విక్టరీ సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ 199 పరుగులకు ఆలౌటైంది. జడేజా 3, కుల్‌దీప్‌ 2, బుమ్రా 2, అశ్విన్‌, సిరాజ్‌, హార్దిక్‌ ఒక్కో వికెట్‌ తీశారు. ఆ తర్వాత 200 లక్ష్య ఛేదనలో టీమ్‌ఇండియాకు వరుస షాక్‌లు తగిలాయి. ఇషాన్‌ కిషన్ (0), రోహిత్ శర్మ (0), శ్రేయస్ అయ్యర్…

Read More
kavit 2 c

సంస్కరణలు రావాలి…!

తెలంగాణా అన్ని రంగాల్లో రాష్ట్రం అగ్రగామిగా నిలబడిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. లండన్ పర్యటనలో ఉన్న ఆమె నేషనల్ ఇండియన్ స్టూడెంట్స్ అండ్ అలుమినీ -‌ యూకే (ఎన్ఐఎస్ఏయూ) సభ్యులతో సంభాషించారు. విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. మహిళా రిజర్వేషన్లు, తెలంగాణ అభివృద్ధి, తన రాజకీయ జీవితం వంటి అంశాలపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. తెలంగాణ ఏర్పడిన వెంటనే సకల జనుల సర్వే నిర్వహించామని, దాని వల్ల రాష్ట్రంలోని ప్రజల సామాజిక…

Read More
IMG 20231008 WA0015

భారీ నష్టం….

పశ్చిమ ఆఫ్ఘనిస్తాన్‌ను వణికించిన భూకంపాల వల్ల మృతుల సంఖ్య భారీగా పెరిగినట్లు తాలిబన్‌ ప్రతినిధి ప్రకటించారు. మృతుల సంఖ్య రెండు వేలకు చేరుకుందని అన్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లో శనివారం 6.3 తీవ్రతతో సంభవించిన భూకంపం, అనంతరం బలమైన ప్రకంపనలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో సుమారు 320 మంది మరణించారని, వేలాది మంది గాయపడ్డారని జాతీయ విపత్తు సంస్థ తెలిపింది. హెరాత్‌ ప్రావిన్స్‌ జెండా జాన్‌ జిల్లాలోని నాలుగు గ్రామాలు భూంకంపం దాటికి ప్రభావితమయ్యాయని విపత్తు అధికార…

Read More
IMG 20231007 WA0049

ప్రమిదల వెలుగులో…

అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ టీడీపీ తెలుగు రాష్ట్రాల్లో ‘‘కాంతితో క్రాంతి’’ కార్యక్రమాన్ని చేపట్టింది. వివిధ జిల్లాల్లో పలువురు సంఘీభావం తెలిపారు. రాజమండ్రి లో నిర్వహించిన కార్యక్రమంలో నారా భువనేశ్వరి ప్రమిదలు వెలిగించి నిరసన లో పాల్గొన్నారు. ఆమెతో పాటు స్థానిక మహిళలు కార్యక్రమంలో పాల్గొన్నారు. మేము సైతం బాబు కోసం, బాబుతో మేము అంటూ మహిళలు నినాదాలు చేశారు. తెలంగాణలో టిడిపి శ్రేణులు, సినీ దర్శకులు రాఘవేంద్ర రావు, నందమూరి రామకృష్ణ…

Read More
israil cf

మళ్లీ మొదలైంది…

కొంత కాలంగా స్తబ్దంగా ఉన్న ఇజ్రాయెల్‌ దేశంలో మళ్లీ ఉగ్ర మంటలు చెలరేగాయి. పాలస్తీనాకు చెందిన ఇస్లామిస్ట్ గ్రూపు హమాజ్‌ దక్షిణ ఇజ్రాయిల్‌లోకి చొరబడి ఇష్టానుసారంగా పౌరులపైకి  రాకెట్లను ప్రయోగించింది. దీంతో ఇజ్రాయిల్‌, పాలస్తీనాల మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి.  గాజా స్ట్రిప్‌ ప్రాంతం నుంచి ఇజ్రాయెల్‌ వైపునకు పెద్ద ఎత్తున మిస్సైల్స్‌ దాడులు జరిగాయి. దీంతో అప్రమత్తమైన ఇజ్రాయెల్‌ సైన్యం గాజా సరిహద్దులో ఎమర్జెన్సీ ప్రకటించింది. గాజా, గ్రేటర్‌ టెల్‌ అవీవ్‌ ప్రాంతం నుంచి పెద్ద…

Read More