shrada ranbir

“బెట్టింగ్” సమన్లు…

మహా దేవ బెట్టింగ్ యాప్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నటి శ్రద్దా కపూర్ కు  ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్  సమన్లు జారీ చేసింది. ఈ యాప్ కేసులో నటుడు రణ్ బీర్ కపూర్ , హాస్య నటుడు కపిల్ శర్మ, నటీమణులు హ్యుమా ఖురేషి, హీనా ఖాన్ కూ ఈడి నుండీ సమన్లు జారీ అయ్యాయి.  హవాలా కార్యకలాపాలకు పాల్పడుతున్న  మహ దేవ్ యాప్ ప్రమోటర్లు సౌరబ్ చంద్ర శేఖర్, రవి ఉప్పల్ పై ఈడి కేసు నమోదు చేసిన…

Read More
100medals

వంద పతకాల భారత్…

చైనాలో జరుగుతున్న ఏషియన్ గేమ్స్ లో నిర్వహిస్తున్న వివిధ విభాగాల్లో భారత్ చరిత్ర సృష్టించింది. ఏషియన్ గేమ్స్ లో వంద పతకాలను సాధించి తొలిసారి రికార్డు నెలకొల్పింది. శనివారం మహిళల కబడ్డీ విభాగంలో చైనీస్ తైపీపై భారత్ ఘన విజయం సాధించడంతో ఇండియా పతకాల్లో సెంచరీ జాబితాలో చేరింది. ఇప్పటి వరకు 25 బంగారు, 35 రజతం, 40 కాంస్య పతకాలు సాధించింది. అన్నివిభాగాల్లో కలిపి 100 పతకాలు సాధించిన భారత్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగవ…

Read More
IMG 20231007 WA0022 1

ఇక మంచి రోజులే…

భారత దేశంలో మహిళా రిజర్వేషన్ల చట్టం వల్ల భవిష్యత్తులో మహిళలకు మంచి రోజులు వస్తాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. చట్టసభల్లోకి మరింత మంది మహిళలు ప్రవేశించడానికి మార్గం చూపే విప్లవాత్మక బిల్లును భారత్ ఆమోదించిందని చెప్పారు. ప్రస్తుతం భారత పార్లమెంటులో 78 మంది మహిళా ఎంపీలుగా ఉన్నారని, మహిళా రిజర్వేషన్లతో ఆ సంఖ్య 181కు చేరుతుందన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటుకు తీసుకు రావడంలో 1996లో దేవే గౌడ ప్రభుత్వం, 2010లో సోనియా గాంధీ,…

Read More
Screenshot 20231006 225206 WhatsApp

ప్రమాదం…

హైదరాబాద్ లోని కెపిహెచ్‌బి మెట్రో స్టేషన్ సమీపంలో అగ్నిప్రమాదం సభవించింది. ఓ ఫర్నీచర్ షాపులో దట్టమైన పొగలతో మంటలు చెలరేగాయి. సమచారం అందుకున్న. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మంటలు అర్పుతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Read More
vote from home

“ఓటు” ఫ్రమ్ హోమ్….!

దేశంలోనే తొలిసారిగా ఇంటి నుంచే ఓటు వేసే సౌకర్యం ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణలో జరగనున్న శాసన సభ ఎన్నికల నుంచి ఈ వెసులు బాటు అందుబాటులోకి వస్తుంది. అయితే, వయో వృద్ధులు, 40శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులకు ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్య అధికారి రాజీవ్ కుమార్ తెలిపారు. పోలింగ్ కేంద్రాలకి రాలేని సీనియర్ సిటిజన్లు పోలింగ్ కేంద్రంలోనే ఓటు వేయడానికి ఇష్టపడితే అటువంటి వారి…

Read More
babu pavan

టిడిపి-“సేన”లో పొత్తు చిచ్చు..!

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వివిధ రాజకీయ పార్టీల పొత్తుల వ్యవహారం గందరగోళంగా మారుతోంది. పెద్ద పార్టీలతో చేతులు కలుపుతున్న పార్టీల వ్యూహాలు సామాన్యులకు అంతు పట్టడం లేదు. గత ఎన్నికలలో అంటకాగిన పార్టీలు ఈ సారి ఎడమొహం పెడమొహంగా ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే రాజకీయ శత్రువులుగా మారాయి. తెలంగాణ, అంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఆంధ్రాలో బిజెపితో కలిసి తిరిగిన జనసేన ఈ సారి రూటు మార్చింది. మొన్నటి వరకు…

Read More
Screenshot 20231004 214801 WhatsApp

సినిమా కాదు పవన్…

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు కృష్ణా జిల్లా పోలీసులు నోటీసులు ఇచ్చారు. వారాహి యాత్రపై రాళ్ల దాడికి ప్లాన్‌ చేశారంటూ పవన్‌ కల్యాణ్‌ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.  ఆ ఆరోపణలకు సాక్ష్యాలు ఏవైనా ఉన్నాయా అని నోటీసులు ఇచ్చినట్లు జిల్లా ఎస్పీ జాషువా వెల్లడించారు. పవన్‌ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. అందుకే నోటీసులు ఇచ్చామని, దాడులు జరగుతాయనే సమాచారం మీకు ఎక్కడి నుంచి వచ్చిందనేది మాకు తెలియజేయలని కోరినట్టు,  నోటీసులకు పవన్‌ నుంచి తిరుగు…

Read More
Screenshot 20231004 114252 Gallery 1

రైల్వే స్టేషన్ లో రచ్చ….

సిద్దిపేట – సికింద్రాబాద్ రైలు ప్రారంభోత్సవ కార్యక్రమం రచ్చ బండగా మారింది. ఈ రైలుని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నిజామాబాద్ నుంచి వర్చువల్ గా ప్రారంభిస్తే, సిద్దిపేట రైల్వే స్టేషన్ లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఅర్ ఫోటోలు, ఫ్లెక్సీలు లేకపోవడం వివాదంగా మారింది. మంత్రి హరీశ్ రావు, బా.రా.స. ఎం.పి.కొత్త ప్రభాకర్ రెడ్డిలు సైతం ఆవేశానికి గురవడంతో పరిస్థితి అదుపుతప్పి ఆందోళనకు దారితీసింది.ఒక సందర్భంలో హరీశ్ రావు ప్రధాని ప్రసంగం ప్రసారం అవుతున్న ఎల్.ఇ.డి….

Read More
Screenshot 20231003 235348 WhatsApp

బిఆర్ఎస్ తిన్నదంతా కక్కిస్తా…

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిజామాబాద్ పర్యటనలో తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పై విరుసుకు పడ్డారు. ఎన్డీఏ లో చేరతానని  కేసీఆర్‌ వెంటపడ్డారనీ, ఆ ప్రతిపాదనను తాను ఒప్పుకోలేదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్  జిల్లాలో ఏర్పాటు చేసిన “జనగర్జన” సభలో మోదీ మాట్లాడుతూ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల తర్వాత కేసీఆర్‌ ఢిల్లీ వచ్చి,తెలంగాణ పాలన పగ్గాలు మంత్రి కేటీఆర్‌కు ఇస్తానని చెప్పినట్టు మోడీ వెల్లడించారు. కేటీఆర్‌ను ఆశీర్వదించాలని కోరినప్పుడు, ఇది రాజరికం…

Read More
pawan55

పవన్ కి వెన్నునొప్పి…

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రమైన వెన్ను నొప్పికి గురయ్యారు.కృష్ణా జిల్లాలో నిర్వహించిన జనవాణిలో పవన్ తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడ్డారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తూ ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో నొప్పిని తట్టుకోలేక ఆయన జనవాణి కార్యక్రమం నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోయారు.

Read More
IMG 20231003 WA0049

షెడ్యూల్ కోసం…

తెలంగాణలో శాసనసభ ఎన్నికల నిర్వహణను అధ్యయనం చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘానికి చెందిన అధికారుల బృందం హైదరాబాద్‌కు చేరుకుంది. చీఫ్ ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, అరుణ్ గోయల్, అనూప్ చంద్రపాండేతో పాటు మరికొంత మంది సభ్యులు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకోగా రాష్ట్ర అధికారులు స్వాగతం పలికారు. కాసేపట్లో ఈ బృందం రాజకీయ పార్టీలతో సమావేశం కానుంది. మూడు రోజుల పాటు ఈ బృందం రాష్ట్రంలో పర్యటించి, అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతపై అధికారులతో సమీక్ష సమావేశం…

Read More
IMG 20231002 WA0045 2

తెలంగాణలో సై…

తెలంగాణలో రానున్న ఎన్నికల బరిలోకి దిగడానికి జనసేన సిద్ధమైంది. వివిధ జిల్లాల్లో మొత్తం 32 నియోజక వర్గాలలో తమ అభ్యర్ధులు పోటీ చేస్తారని జనసేన ప్రకటించింది. ఉమ్మడి హైదరాబాద్, రంగరెడ్డి జిల్లాలోని కూకట్‌పల్లి, ఎల్‌బి నగర్, కుతుబుల్లాపూర్, శేరిలింగంపల్లి, సనత్‌నగర్, ఉప్పల్, పటాన్‌చెరువు, మల్కాజిగిరి, మేడ్చల్ వంటి 9 నియోజక వర్గాలు సహా ఖమ్మం జిల్లాలోని 7 నియోజక వర్గాల్లో జనసేన పార్టీ అభ్యర్థులు ఎన్నికలలో పోటీ చేస్తారు.

Read More
jagan babu pawan

“కురుక్షేత్రం”లో ద్రౌపది ఎవరో…

అంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వింత పోకడలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఒక పార్టీ పై మరో పార్టీ అడ్డూఅదుపూ లేని ఆరోపణలకు దిగుతున్నాయి. కొన్ని సందర్భాల్లో రాయలసీమ శైలిలో, మరికొన్ని సార్లు బెజవాడ తరహాలో ప్రసంగాలు సాగుతుంటే, ఇంకొన్ని సభల్లో ఏకంగా సినిమా డైలాగులను మరిపించే విధంగా మాటల తూటాలు పేలుతున్నాయి. తెలుగుదేశం నేతలపై మంత్రి రోజా చేస్తున్న ఘాటైన విమర్శలకు అదే స్థాయిలో  రోజాపై టిడిపి మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో…

Read More
iit swach

ఒకటి,ఒకటి,ఒకటి…

మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఐ.ఐ.టి. హైదరాబాద్ లో “ఒకటో తారిఖు, ఒక గంట, అందరం ఒకటి” అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా చేపట్టిన స్వచ్చ కార్యక్రమంలో క్యాంపస్ పరిసరాలను శుభ్రం చేశారు. ఎం.ఎస్.ఎస్. కార్యకర్తలు, కళాశాల అధికారులు సిబ్భంది స్వచ్చత పరుగు చేపట్టారు. వ్వ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ చంద్రశేఖర్, సంస్థ డైరెక్టర్ మూర్తి, ప్రొఫెసర్ కె. వెంకట సుబ్భయ్య పాల్గొన్నారు. అంతకు ముందు మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి చిత్ర…

Read More
IMG 20231002 WA0029

ఎవరితో…ఎక్కడ…

ప్రపంచ కప్ క్రికెట్ దగ్గర పడింది. ఈ నెల 5వ తేదీ నుంచి నవంబర్ 19 వరకు క్రికెట్ పండగే. దేశంలోని వివిధ నగరాల్లో జరిగే ఈ ఆట కోసం ప్రపంచ వ్యాప్తంగా ప్రతీ ఒక్కరూ వేచి చూస్తున్నారు. ఏ దేశపు జట్టు ఎక్కడ ఎవరితో తలబడుతుందో తెలిపే టేబుల్ ఇది.

Read More