jnj dharna ramchn

ధర్నా షురూ…

ఎన్నో ప్రజా సమస్యలకు పరిష్కారం చూపిన పోరాట స్థలి “ధర్నాచౌక్”. ప్రభుత్వాలతో విసిగి వేసారిన అనేక ఉద్యోగ, ప్రజా సంఘాలు నిరసనలకు నీడనిచ్చిన మహా స్థలం “ధర్నాచౌక్”. ఇక్కడ జరిగిన వేలది కార్యక్రమాలను ప్రజలకు చూపాలనే తపనతో పగలనక ,రేయనక పనిచేశారు కలం వీరులైన విలేకరులు. ఇప్పుడు వారికే సమస్య వచ్చింది. ఆ సమస్య సాధన కోసం చేపట్టిన పోరాటానికి వేదికగా “ధర్నాచౌక్”నే ఎన్నుకున్నారు. అదీ ఈ రోజే.. అంటే జులై 18. న్యాయం కోసం ధర్నాకు…

Read More
IMG 20230717 WA0009

అన్నీ రెడీ..

దశాబ్ధలుగా వేల సమస్యలపై వివిధ వర్గాలు చేపట్టిన పోరులో భాగంగా సాగిన ధర్నాలను వార్తలుగా మలిచి సమాజానికి అందించిన విలేకరులే అదే “ధర్నాచౌక్” లో నేడు న్యాయం కోసం ధర్నాకు దిగుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, నిర్లిప్తత, అహంకార ధోరణికి వ్యతిరేకంగా కలం వీరుల మహా నిరసన రేపే జరగనుంది. సుప్రీం కోర్టు తీర్పును సైతం నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వ వైఖరికి నిరసనగా హైదరాబాద్ లోని జర్నలిస్టులు తమ పోరాటాన్ని మరింత ముమ్మరం చేస్తున్నారు. జవహర్ లాల్ నెహ్రు…

Read More
Screenshot 2023 07 17 123148

“చిరు” లీక్ చేశారు…

వచ్చే నేలలో విడుదల కాబోతున్న తన తాజా చిత్రం “భోళా శంకర్”పై ఓ లీక్ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. ఆ సినిమాలో తమ్ముడి మ్యానరిజాన్ని “చిరు” అనుసరించారట. వినండి.. పవన్ పాటకు చిరు ఎలా స్టెప్పులు వేశారో చుడండి..

Read More
vande c

తప్పిన ప్రమాదం..

వందే భారత్‌ రైలుకు పెను ప్రమాదం తప్పింది. భోపాల్‌ నుంచి ఢిల్లీకి వెళుతున్న వందే భారత్‌ రైలులో మంటలు చెలరేగాయి. రాణి కమలా పాటి స్టేషన్‌ నుంచి ప్రయాణం మొదలైన తర్వాత కుర్వాయి స్టేషన్‌ వద్ద సీ-14 కోచ్‌ నుంచి మంటలు వ్యాపించాయి. వీటిని గుర్తించిన రైల్వే సిబ్బంది వెంటనే లోకో పైలట్‌ కు సమాచారం అందించారు. దీంతో రైలును వెంటనే ఆపేశారు. రైలులో మంటలు చెలరేగడంతో ప్రయాణీకులు భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు. అగ్నిమాపక…

Read More
jnj17

రండి..కదలండి..

దశాబ్ధలుగా వేల సమస్యలపై వివిధ వర్గాలు చేపట్టిన పోరులో భాగంగా సాగిన ధర్నాలను వార్తలుగా మలిచి సమాజానికి అందించిన విలేకరులే అదే “ధర్నాచౌక్” లో నేడు న్యాయం కోసం ధర్నాకు దిగుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, నిర్లిప్తత, అహంకార ధోరణికి వ్యతిరేకంగా కలం వీరుల మహా నిరసన రేపే జరగనుంది. సుప్రీం కోర్టు తీర్పును సైతం నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వ వైఖరికి నిరసనగా హైదరాబాద్ లోని జర్నలిస్టులు తమ పోరాటాన్ని మరింత ముమ్మరం చేస్తున్నారు. జవహర్ లాల్ నెహ్రు…

Read More
kishan usa c

డైరెక్ట్ ఫ్లైట్ ప్లీజ్…

భారత్ -అమెరికాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, పర్యాటకం కోసం ప్రపంచ గమ్యస్థానంగా హైదరాబాద్ ఆకర్షణను మరింత పెంచేందుకు హైద‌రాబాద్ నుంచి నేరుగా అమెరికాకు విమాన సర్వీసులు ఏర్పాటు చేయాలని యూఎస్ఎ ఎన్నారైలు అబిప్రాయపడ్డారు. ఈ మేరకు అమెరికాలో ప‌ర్య‌టిస్తున్న కిష‌న్ రెడ్డికి తెలుగు ఎన్నారైలు క‌లిసి త‌మ విజ్ఞ‌ప్తిని లేఖ రూపంలో అందించారు. ఢిల్లీ, ముంబై వంటి అనేక నగరాలు ఇప్పటికే అమెరికాలోని ప్రధాన నగరాలకు నేరుగా విమాన సర్వీసులను కలిగి ఉన్నాయ‌ని, అమెరికా నుండి హైదరాబాద్‌కు…

Read More
Screenshot 2023 07 16 181442

శంఖు..

తిరుమల శ్రీవారికి ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి దంపతులు బంగారు శఖు, కుర్మాన్ని సమర్పించారు. మూర్తి అతని భార్య సుధా మూర్తి నేడు తిరుమల వెంకటేశ్వరరునికి ప్రార్థనలు చేసి స్వామికి వారికి 2 కిలోల బంగారు శంకు , కూర్మాన్ని అందజేశారు.

Read More
Screenshot 2023 07 16 173809

చిరుత పులా..ఐతే..

పిల్లిని చూస్తేనే భయపడతారు కొందరు…అదే చిరుత అంటే ఆమడ దూరం పరుగెడతారు. అలాంటిది ఓ యువకుడు ఏకంగా చిరుత పులిపై విరుసుకు పడ్డాడు. దాన్ని కొట్టి పట్టుకుపోయి అధికారులకు అప్పజెప్పాడు. నిజమే.. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రం హాసన్ జిల్లా పరిధిలోని అరసీకెరె తాలూకా గండాసి హోబ్లీ బాగివాలు అనే గ్రామంలో జరిగింది. వేణుగోపాల్ అలియాస్ ముత్తు అనే యువకుడు పొలానికి వెళ్తుండగా చిరుతపులి దాడి చేసింది. ఆ యువకుడు ధైర్యం చేసి దానిపై ఎదురు దాడి…

Read More
Screenshot 2023 07 16 143737

నేనదే..మరి నువ్వూ…

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రి రోజాకు బాలివుడ్ భామ  సన్నీ లియోన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ని విమర్శించేటప్పుడు తనను మధ్యలో ఎందుకు లాగావ్ అంటూ ఫైర్ అయింది. నేను పోర్న్ స్టార్ నే కానీ, నా గతం గురించి అస్సలు నేను బాధపడటం లేదు. మీలా కాకుండా నేను చేయాలనుకున్నది బహిరంగంగానే చేశానని చెప్పేసింది. నీకు నాకు తేడా ఒక్కటే  నేను ఇండస్ట్రీని వదిలేశాను, నువ్వు కాదు అంటూ చురకలు పెట్టింది. ఎవరు ఎలా అర్ధం…

Read More
Screenshot 2023 07 16 132757

ఇవ్వాల్సిందే…

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్ సొసైటీకి కేటాయించిన స్థలాలను వెంటనే ఆ సొసైటీకి అప్పజెప్పాలని కాంగ్రెస్ పార్టీ శాసన సభ పక్ష నేత మల్లు బట్టి విక్రమార్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో జర్నలిస్టులకు స్థలాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాలకే ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సమస్యను పరిష్కరించడమే కాక ఇంకా అవసరమైతే అధిక స్థలాన్ని కేటాయిస్తామని బట్టి హామీ ఇచ్చారు.

Read More
Screenshot 2023 07 16 104621

పాత బస్తీ బోనం…

హైదరాబాద్ పాతబస్తీ చార్మినార్ వద్ద గల భాగ్యలక్ష్మి అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పట్టువస్త్రాలు సమర్పించారు. దేవాలయం వద్ద ఆలయ పండితులు పూర్ణ కుంభంతో మంత్రికి స్వాగతం పలికారు. అదే విధంగా లాల్ దర్వాజ సింహ వాహిని అమ్మవారికి, అక్కన్న మాదన్న ఆలయంలో మంత్రి పట్టు వస్త్రాలు సమర్పించారు.

Read More
jnj c 1

తీర్పును లెక్క చేయరా..

సుప్రీం కోర్టు తీర్పును సైతం నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వ వైఖరికి నిరసనగా హైదరాబాద్ లోని జర్నలిస్టులు తమ పోరాటాన్ని మరింత ముమ్మరం చేసే దిశగా వ్యుహరచన చేస్తున్నారు. జవహర్ లాల్ నెహ్రు జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీకి  పేట్ బషీరాబాద్ లో కేటాయించిన 38 ఎకరాల భూమిని సుప్రీం కోర్టు ఆదేశించినా సొసైటీకి స్వాధీనం చేయడంలో అధికారులు, ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య ధోరణికి నిరసనగా ఈ నెల 18 వ తేదిన ఇందిరా పార్క్ చౌక్ వద్ద “మహాధర్నా”…

Read More
logo c

“కలం”జోలికి వెళ్తే…..

దేశంలోని వర్కింగ్ జర్నలిస్టులు, పాత్రికేయులను బెదిరించినా, వాళ్ళను తిట్టినా లేదా కొట్టినా 50 వేల జరిమానా కాదంటే ఐదేళ్లు కఠిన కారాగార శిక్ష తప్పవని అత్యున్నత న్యాయస్థానం తీర్పు నిచ్చింది. ఓ కేసు విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఈ తీర్పుతో పలువురు జర్నలిస్టులు తమ వృత్తి పరంగా ఎలాంటి భయాందోళన లకు గురి కాకుండా నిర్భయంగా ప్రజలకు వాస్తవ సమాచారం అందించే అవకాశం ఉంటుందని పలు జర్నలిస్టు సంఘాల నేతలు,…

Read More
tomto lory in1

అసలే కరువు..

ఆదిలాబాద్ జిల్లా మావల శివారు ప్రాంతాంలో 44వ జాతీయ రహదారి పై టమాట లారీ బోల్తా పడింది. రోడ్డుపై ద్విచక్రవాహనాన్ని తప్పించబోయి లారీ ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో లారీలో  ఉన్న టమాటలన్ని రోడ్డుపై పడ్డాయి. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి  చేరుకున్నారు. టమాట ధర ఢిల్లీలో రూ. 300 పలుకుతుండగా ఆదిలాబాద్‌లో రూ. 150 నుంచి రూ. 180 వరకు పలుకుతుంది. విలువైనా టమాటలు ఎత్తుకెళ్లడానికి ఒక్కసారిగా జనం…

Read More
pawan nadela

ఢిల్లీకి “సేన”..

ఢిల్లీలో ఈ నెల 18న జరగనున్న ఎన్డీఏ సమావేంలో పాల్గొనవలసినదిగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి ఆహ్వానం అందింది. ఎన్డీఏలో భాగస్వాములైన రాజకీయ పక్షాల అగ్రనేతలు హాజరవుతున్న ఈ సమావేశంలో పాల్గొనడానికి పవన్ కళ్యాణ్ , పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఈ నెల 17 సాయంత్రానికి ఢిల్లీ వెళ్తారు.

Read More