స్టీల్ బ్రిడ్జి…
హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్ మీదుగా విఎస్టీ వరకు నిర్మించిన ఇనుప దిమ్మెల బ్రిడ్జిని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ ప్రారంభించారు.13 వేల టన్నుల ఇనుముతో సుమారు రెండున్నర కిలోమీటర్ల దూరం వరకు నిర్మించారు.
హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్ మీదుగా విఎస్టీ వరకు నిర్మించిన ఇనుప దిమ్మెల బ్రిడ్జిని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ ప్రారంభించారు.13 వేల టన్నుల ఇనుముతో సుమారు రెండున్నర కిలోమీటర్ల దూరం వరకు నిర్మించారు.
ఉస్మానియ యూనివర్సిటీ భూములను శాసన సభ డిప్యూటీ స్పీకర్ పద్మారావు కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ ఎబివిపి ఆధ్వర్యంలో దిష్టి బొమ్మ దగ్దం చేశారు. ఈ సందర్భగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని మాణీకేశ్వర్ నగర్ లో ఉన్న సుమారు 2 ఏకరాల స్థలంలో పద్మారావు ఆస్పత్రి నిర్మిస్తామని ప్రకటించడాన్ని ఖండించారు. పద్మారావు నిజంగా బస్తీ వాసులకు హాస్పిటల్ నిర్మించాలంటే అక్కడున్న వేరే భూముల్లో కట్టివ్వాలని సూచించారు. యూనివర్సిటీ భూముల్లో ఆసుపత్రి ఏర్పాటు చేస్తామని…
జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టు హౌసింగ్ సొసైటీకి పేట్ బషీరా బాద్ లో ప్రభుత్వం కేటాయించిన 38 ఎకరాల స్థలాన్ని వెంటనే సొసైటీకి బదలాయించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన అమలు చేయడంలో ఇంతకాలం జరిగిన ఆలస్యం పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆ సొసైటీకి చెందిన సభ్యుల బృందం సుప్రీం కోర్టులో కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేసింది. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది మరో 10 రోజుల్లో ఏడాది కావస్తున్నందున ఆ తీర్పును, తమ స్థలాన్ని కాపాడుకునే ప్రయత్నంలో…
జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీకి చెందిన పేట్ బషీరాబాద్ లోని 38 ఎకరాల భూమి పై ప్రభుత్వంలో కదలిక వచ్చినట్టు తెలుస్తోంది. ఆ స్థలంపై ఉన్న న్యాయపరమైన చిక్కులపై చర్చించడానికి సొసైటీ నేతలతో రాష్ట్ర రెవిన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, ప్రభుత్వ న్యాయవాది (రెవిన్యూ)లతో సోమవారం సమావేశం ఉన్నట్టు సొసైటీ కార్యదర్శి వంశీ తెలిపారు. ఇదిలా ఉంటే, సుప్రీం కోర్టు ఆదేశించినా ప్రభుత్వం సొసైటీకి అప్పజెప్పక పోవడతో ఈ నెల 10వ తేదిన నగరంలోని హెచ్ఎండిఎ…
ఈ నెల 15న చారిత్రక గోల్కొండ కోటలో నిర్వహించనునున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను డిజిపి అంజనీకుమార్ వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ 15న ఉదయం సికింద్రాబాద్ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించిన అనంతరం, ఉదయం11 గంటలకు గోల్కొండ కోటలో జాతీయ పతాకావిష్కరణ చేస్తారని డీజీపీ తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎలాంటి అవాంతరాలు జరగకుండా చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు సూచనలు చేశారు. ఈ సమావేశానికి నగర పోలీస్ కమీషనర్ సీవీ ఆనంద్, అడిషనల్…
జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీకి చెందిన పేట్ బషీరాబాద్ లోని 38 ఎకరాల భుమిని దక్కించుకోవడానికి సొసైటీ సభ్యుల్లో కొందరు కోర్టుధిక్కార పిటిషన్ దాఖలు చేయడానికి డిల్లీ వెళ్ళడంతో కొత్త అంశాలు తెరపైకి వస్తున్నాయి. ప్రభుత్వం ఒకవైపు సుప్రీం కోర్టు తీర్పునకు అనుకూలంగా ఉన్నట్టు పురపాలక శాఖ మంత్రి కేటిఅర్ చెబుతున్నప్పటికీ, ప్రభుత్వం ఆలస్యం చేస్తోందనే ఆందోళనతో కొందరు సభ్యులు పిటిషన్ వేయడానికి డిల్లీ వెళ్ళిన విషయం తెలిసిందే. అయితే, పిటిషన్ దాఖలు చేయడంలో…
జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీకి 2007 వ సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం పేట్ బషీరా బాద్ లో కేటాయించిన స్థలాన్ని కాపాడుకోవడానే కార్యక్రమంలో భాగంగా కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేయడానికి డిల్లీ వెళ్ళిన కొందరు సొసైటీకి సభ్యులు అక్కడ రెండు రోజులుగా న్యాయ నిపుణులతో పాటు పలువురు ప్రముఖులను సంప్రదిస్తున్నారు. ఇప్పటికీ ఆ స్థలాన్ని సొసైటీకి అప్పజెప్పే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి సానుకూలత కనిపించక పోవడంతో డిల్లీ లోని నిపుణుల అభిప్రాయాలు…
నగరంలోని ఉప్పల్-నారపల్లి మధ్య ఎలివేటేడ్ క్యారిడార్ లో భాగంగా నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ పనుల జాప్యం వల్ల అధ్వాన్నంగా మారిన రోడ్ల బాగుచేయడానికి ఎట్టకేలకు మోక్షం కలిగింది. స్థానిక ప్రజా ప్రతినిధులు ఇటీవల ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావుని కలిసి వాహనదారులు, పాదచారులు ఎదుర్కొంటున్న సమస్యలు, కొంత కాలంగా ఈ రహదారిపై జరుగుతున్న ప్రమాదాల గురించి వివరించారు. జాతీయ రహదారి కావడం , రోజు రోజుకీ వాహనాల రద్దీ పెరగడంతో వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి తక్షణమే రోడ్ల…
ప్రజా గాయకులు గద్దర్కు సీఎం కేసీఆర్ ఘన నివాళి అర్పించారు. గద్దర్ పార్ధివదేహాన్ని అల్వాల్ లోని ఆయన నివాసంలో దర్శించి సంతాపం తెలిపారు. ముఖ్యమంత్రి గద్దర్ కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మొబైల్ ఫోన్ ఒక వైద్య విద్యార్ది ప్రాణం తీసింది. అదీ సరిగ్గా స్నేహితుల దినోత్సవం రోజే ఈ విషాద ఘటన చోసుచేసుకుంది. ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన ఏ ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆదివారం స్నేహితుల దినోత్సవం కావడంతో రిమ్స్ ఆసుపత్రిలో చదువుతున్న ముగ్గురు పిజి విద్యార్ధులు ఆదిలాబాద్ రూరల్ మండలం శివఘాట్ వద్ద ఉన్న వాగుకు విహారం కోసం వెళ్ళారు. వాగులో ముగ్గురు కలిసి స్నానాలు చేశారు. అయితే, వీళ్ళకు చెందిన ఒక…
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల పెంపునకు సంబంధించి కొద్ది రోజుల్లో రెండో వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు చెప్పారు. వేతన సవరణపై అసెంబ్లీలో మాట్లాడుతూ వేతన సవరణ కమిటీని ఏర్పాటు చేయడమే కాక, మధ్యంతర భ్రుతి కూడా ప్రకటిస్తామని తెలిపారు.
ఆ గళం మూగబోయింది. కాలి గజ్జెల సవ్వడి మాయమైంది. ఎర్ర గుడ్డతో ఎగిరే విప్లవ కర్ర ఒరిగి పోయింది. దశాబ్దాలుగా ప్రజలతో మమేకమైన ప్రజా గాయకులు గద్దర్ ఇక లేరు. అపోలో ఆస్పత్రిలో చికత్స పొందుతూ అయన కన్నమూశారు. ఉపిరి తిత్తులు, ముత్ర కోశ సమస్యలతో గద్దర్ తుది శ్వాస విడిచినట్టు వైద్యులు తెలిపారు. 77 ఏళ్ల ఈ ప్రజా మనిషి దాదాపు నాలుగు దశాబ్దాలుగా “గద్దర్” పేరుతో తెలుగు జన హృదయాల్లో నిలిచి పోయారు. ప్రజా…