mega dsc

మెగా”డీఎస్సీ”…

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త అందించింది. వివిధ ప్రభుత్వ శాఖలలో ఖాళీలను గుర్తించి దశల వారీగా భర్తీ చేస్తామని చెబుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారు. విద్యా శాఖలో ఖాళీగా ఉన్న 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా నోటిఫికేషన్ జారీ చేశారు.

Read Full News
IMG 20240228 WA0144

“టోల్”టెండర్ల పై విచారణ…

హైదరాబాద్ చుట్టూ నిర్మించిన అవుటర్ రింగ్ రోడ్డు టోల్ టెండర్లలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వానికి రావాల్సిన భారీ ఆదాయానికి గండి పడేలా తక్కువ రేటుకు టెండర్లు కట్టబెట్టిన తీరుపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస రేట్ నిర్ణయించకుండా టెండర్లు ఎలా పిలిచారని హెచ్ఎండీఏ అధికారులను ప్రశ్నించారు. అందులో ఎవరెవరి ప్రమేయముంది. ఏయే సంస్థలున్నాయి, ఎవరెవరు బాధ్యులెవరో అన్ని కోణాల్లో దర్యాప్తు జరపాలని ముఖ్యమంత్రి…

Read Full News
tamil telug

తెలంగాణ భాష మహా మాధుర్యం..

“తెలంగాణ భాష అంటేనే క్లాసిక్ భాష” అని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. తెలంగాణ భాష మాట్లాడు తున్నప్పుడు చాలా ఆనందాన్ని కలిగిస్తుందన్నారు. తెలుగు భాష, సంస్కృతి అంతటా వ్యాప్తి చెందాలని ఆకాంక్షించారు. రవీంద్ర భారతిలో జ‌రిగిన పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 16వ స్నాతకోత్సవంలో గవర్నర్‌ పాల్గొన్నారు. పలు కోర్సుల్లో పీహెచ్‌డీ పూర్తి చేసిన వారికి పట్టాలు అంద జేశారు. అనంత‌రం ఆమె మాట్లాడుతూ, తెలుగు భాషను ఇతర భాషలు మాట్లాడే ప్రజలందరికీ నేర్పించాలని…

Read Full News
IMG 20240228 WA0007

“ఆరు”అమలు ఖాయం…

ప్రభుత్వాన్నికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా సరే ఇచ్చిన ఆరు గ్యారంటీలను కచ్చితంగా అమలు చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. పేద ప్రజలకు మహాలక్ష్మి పథకం ద్వారా రూ.500లకే గ్యాస్‌ సిలిండర్‌, గృహ జ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ పథకాలను రాష్ట్ర సచివాలయంలో ఆయన ప్రారంభించారు. ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ వల్ల పథకాల ప్రారంభ వేదికను చేవేళ్ల నుంచి సచివాలయానికి మార్చినట్లు చెప్పారు. ‘‘కట్టెల పొయ్యి నుంచి మహిళలకు విముక్తి…

Read Full News
IMG 20240225 WA0007

ఛైర్మన్…

తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్ గా సీనియర్ పాత్రికేయులు కె. శ్రీనివాస్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. రెండు సంవత్సరాల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. గతంలో భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు పదవిలో అల్లం నారాయణ కొనసాగారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారం చేపట్టడంతో ఆయన రాజీనామ చేశారు. తాజాగా ప్రభుత్వ నిర్ణయంతో ఈ పదవిలో శ్రీనివాస్ రెడ్డి బాధ్యతలు చేపట్టనున్నారు.

Read Full News
IMG 20240223 WA0085 1

జాగిలాలది నిస్వార్థ ప్రేమ..

ఏ రకమైన షరతులు లేని నిస్వార్థ ప్రేమకు జాగిలాలు చక్కని నిదర్శనమని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రవి గుప్తా అన్నారు. మొయినాబాద్ లోని ఇంటిగ్రేటెడ్ ఇంటలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీ(ఐఐటిఏ)లో 23 వ పోలీసు జాగిలాల పాసింగ్ ఔట్ పరేడ్ జరిగింది. ఈ కార్యక్రమంలో డిజిపి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాగిలాలు ఆప్యాయతకు, ప్రేమకు ప్రతీకలుగా అభివర్ణించారు. పోలీసులు దర్యాప్తు చేసి ఛేదించిన కేసులలో జాగిలాల పాత్ర కీలకమని అన్నారు….

Read Full News
Screenshot 20240223 173858 WhatsApp

27న మరో “రెండు”…

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో భాగంగా రూ.500కే గ్యాస్ సిలెండ‌ర్, తెల్ల‌ రేష‌న్ కార్డు ఉన్న ప్ర‌తి పేద‌వానికి 200 యూనిట్ల వ‌ర‌కు ఉచిత విద్యుత్ ఇచ్చే కార్య‌క్ర‌మాన్ని ఈ నెల 27వ తేదీన ప్రారంభించ‌నున్న‌ట్లు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ కార్య‌క్ర‌మానికి ఏఐసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంక గాంధీ ముఖ్య అతిథిగా హాజ‌రవుతార‌ని ముఖ్య‌మంత్రి వెల్ల‌డించారు. రాష్ట్రంలో ఉన్న చిక్కుముడులు విప్పుతూ, ప్ర‌జా స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రిస్తున్నామ‌ని, ఇప్ప‌టికే మ‌హిళ‌ల‌కు ఉచిత…

Read Full News
IMG 20240217 WA0009

“కట్” చేస్తే..సస్పెండ్..

విద్యుత్ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే కుట్రలను సహించేది లేదని, రాష్ట్రంలో ఎక్కడైనా అకారణంగా విద్యుత్ స‌ర‌ఫ‌రాకు అంతరాయం కలిగితే బాధ్యులైన అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని రేవంత్ హెచ్చరించారు. ఇప్పుడున్న అవసరాలకు సరిపడేంత విద్యుత్తును ప్రభుత్వం సరఫరా చేస్తోందని, ప్రభుత్వం తరఫున ఎక్కడా విద్యుత్తు కోతలను విధించటం లేదని సీఎం స్పష్టం చేశారు. గతంతో పోలిస్తే రాష్ట్రంలో విద్యుత్తు సరఫరా…

Read Full News
IMG 20240221 WA0056

రాహుల్ తో ఎన్నారైలు…

వరంగల్ లోక్ సభ టికెట్ ఆశిస్తున్న అమెరికన్ ఎన్నారై చింత ప్రవీణ్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలిసి యాత్రకు సంఘీభావం తెలిపారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని రాయబరేలీలో భారత్ జోడో న్యాయ యాత్రలో రాహుల్ ని కలిశారు. ‘నేను “ద్వేషం” యొక్క మార్కెట్‌లో “ప్రేమ” దుకాణాన్ని తెరుస్తున్నాను’, హక్కుల కోసం పోరాటం చెయ్ అని ప్రవీణ్ ను ఈ సందర్భంగా రాహుల్ ప్రోత్సహించారు. అమెరికా, యూకే, కెనడా, జర్మనీ, సింగపూర్ నుంచి వచ్చిన ఇండియన్ ఓవర్సీస్…

Read Full News
sanjy on brs

“పొత్తు”అంటే చెప్పుతో కొట్టండి…

బీజేపీ కార్యకర్తలారా, ఇకపై ఎవరైనా బీఆర్ఎస్ తో బీజేపీ పొత్తు ఉంటుందని చెప్పే వాళ్లను చెప్పుతో కొట్టండి అంటూ బీజేపీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. తాండూరులో కేంద్రమంత్రితో కలిసి విజయ సంకల్ప యాత్రను ప్రారంభించిన సంజయ్ పొత్తుపై మీడియాకు పదే పదే లీకులిచ్చే ఫాల్తు రాజకీయ నాయకులను సైతం చెప్పులతో కొట్టాలని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య లోపాయికారీ ఒప్పందం నడుస్తోందన్నారు. అందులో భాగంగానే కేసీఆర్ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని…

Read Full News
revant nitin

గడ్గరీ తో….

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ,ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క,రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధిల్లీలో భేటి అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారులు అభివృద్ధి, రాష్ట్రీయ రహదారులను జాతీయ రహదారులుగా గుర్తింపు సహా పలు కీలక అంశాలపై చర్చించారు. తెలంగాణ లోని 15 రాష్ట్రీయ రహదారులను జాతీయ రహదారులుగా అప్ గ్రేడ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా హైదరాబాద్ శ్రీశైలం ఫోర్ లైన్ ఎలివేటెడ్ కారిడార్, హైదరాబాదు…

Read Full News
medarm hli

“గద్దెల” వద్దకు హెలీకాప్టర్..

మేడారం జాతర…ఇది తెలంగాణ “కుంభమేళా” గా ప్రత్యేక గుర్తింపు ఉంది. వన దేవతలను గద్దెల దగ్గకు తీసుకొచ్చి ప్రతిష్టించడం నుంచి మొదలుకొని మళ్ళీ వన ప్రవేశం చేయించడం వరకు అన్నీ ఆదివాసీ ఆచార సాంప్రదాయాల ప్రకారమే జరుగుతుంది. ఒకప్పుడు ఎడ్ల బండ్లతో జరిగిన జాతర ఇప్పుడు హెలీకాప్టర్ స్థాయికి చేరుకుంది. ఈసారి కూడా మేడారం భక్తులకు హెలీకాప్టర్ సేవలు అందుబాటు లోకి వచ్చాయి.ఈ నెల 21 నుంచి 25 వరకు హనుమకొండ నుంచి హెలికాప్టర్ సేవలు ఏర్పాటు…

Read Full News
revnth amrapl

త్వరగా చేయండి….

మూసీ అభివృద్ధి ప్రక్రియ వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు కసరత్తు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  అధికారులను ఆదేశించారు. మూసీ నదీ పరివాహక అభివృద్ధిపై నానక్ రామ్ గూడ లోని హెచ్ఎండీఏ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ, వీలైనంత తొందరగా మూసీ నది శుద్ధి ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. నగరంలోని చారిత్రక కట్టడాలను కలుపుతూ ఉండేలా మూసీ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. అధికారులకు పని విభజన చేసి, సరైన…

Read Full News
rajiv revnth

రాజీవ్ విగ్రహం…

బి.ఆర్.అంబేద్కర్ సచివాలయం ఎదురుగా ఉన్న స్థలంలో భారతరత్న, మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన  చేశారు. ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి సోనియా గాంధీని ఆహ్వానిచానున్నట్టు రేవంత్ తెలిపారు.

Read Full News