IMG 20240625 WA00091

పైకప్పు లీకేజీ..

అయోధ్యలో రామాలయం ప్రారంభమై 6 నెలలు గడవక ముందే పైకప్పు లీకైంది. ఇటీవల కురిసిన వర్షాలకు పైకప్పు లీక్ కావడంతో ఆలయంలో, చుట్టుపక్కల కాంప్లెక్స్‌ లోకి నీరు వచ్చి చేరిందని ఆలయ ప్రధాన పూజారి చెప్పారు. రానున్న రోజుల్లో వర్షాలు తీవ్ర రూపు దాలిస్తే ఆయోధ్య రామాలయంలో నీటి లీకేజీ కారణంగా భక్తులు పూజలు చేయడం కూడా కష్టతరంగా మారే అవకాశముందని తెలిపారు. దీని పై స్పందించిన ఆలయ కమిటీ, అధికారులు హుటాహుటిన మరమ్మత్తు పనులు చేపట్టారు.

Read More
sea food

ఆహా.. ఏమి రుచి…!

భారత దేశం నుంచి సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు 2023-24 సంవత్సరంలో భారీ పెరుగుదల కనిపించింది. సముద్ర చేపలు, రొయ్యల ఎగుమతుల్లో ఆల్ టైమ్ రికార్డు నమోదు చేశాయని సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ (ఎంపెడా) ఛైర్మన్ డి.వి. స్వామి తెలిపారు. 2022-23లో రూ. 63,969.14 కోట్ల విలువైన 17,35,286 టన్నుల సముద్రపు ఉత్పత్తుల ఆహారం ఎగుమతి కాగా, 2023-24లో రూ. 60,523.89 కోట్ల విలువైన 17,81,602 టన్నుల ఉత్పత్తులు దేశం నుంచి ఎగుమతి అయ్యాయని వివరించారు. భారత్…

Read More
IMG 20240625 WA0007

మళ్ళీ”బిర్లా” ..

కేంద్రంలోని అధికార బీజేపీ నేతృత్వం లోని ఎన్డీయే, ప్రతిపక్షాల మధ్య స్పీకర్ ఎన్నికపై ఏకాభిప్రాయం కుదిరింది. దీంతో, మరోసారి ఆయన లోక్‌సభ స్పీకర్‌ పదవి చేపట్టనున్నారు. లోక్‌సభ స్పీకర్ పదవికి తమ అభ్యర్థిని నిలబెట్ట కూడదని విపక్షాలు నిర్ణయించుకున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాతో బిర్లా మంగళవారం ఉదయం భేటీ అయ్యారు. కాసేపటిలో ఆయన స్పీకర్ పదవికి నామినేషన్ సమర్పించే అవకాశం ఉంది. అయితే, డిప్యూటీ స్పీకర్ పదవి ప్రతిపక్షాల అభ్యర్థికి ఇవ్వాలని సభ్యులు రాహుల్…

Read More
IMG 20240624 WA0057

“లక్ష” ప్రయోజనాలు..

తిరుమల తిరుపతి దేవస్థానానికి లక్ష రూపాయల విరాళం చెల్లించడం వల్ల భక్తులకు అనేక రకాల ప్రయోజనాలు చేకూరుతాయని టిటిడి అధికారులు తెలిపారు. ఎప్పటి నుంచో ఈ వెసులు బాటు ఉన్నప్పటికీ ఆ ప్రయోజనాలను మరోసారి వివరించారు. దేవస్థానానికి విరాళంగా లక్ష రూపాయలు చెల్లించే దాత, అతని,ఆమె కుటుంబ సభ్యులకు సంవత్సరంలో ఒక రోజుకు అద్దె చెల్లింపు ప్రాతిపదికన సంవత్సరంలో ఒక రోజుకు అద్దె చెల్లింపు ప్రాతిపదికన (5 గురు సభ్యుల వరకు) రూ.100 గది కేటాయించబడుతుంది. కుటుంబ…

Read More
IMG 20240623 WA0017

శబరి ఎంపిక..

పార్ల‌మెంటులో తెలుగుదేశం పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్‌గా బైరెడ్డి శ‌బ‌రి ఎంపిక అయ్యారు. నంద్యాల ఎంపీ శ‌బ‌రిని ఎంపిక‌ చేస్తున్నట్టు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. శ‌బ‌రికి ఈ అవ‌కాశం ఇవ్వ‌ డంపై ఆమె చంద్ర‌బాబుకు కృత‌జ్ఞ‌తలు తెలిపారు. తాజా ఎన్నిక‌ల్లో వైసీపీ ఎంపీ అభ్య‌ర్థి పోచా బ్ర‌హ్మా నంద రెడ్డిపై శ‌బ‌రి విజ‌యం సాధించారు.

Read More
parliament 4

3.0 తొలిసారి…

కేంద్రంలో మూడో సారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వ తొలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 24 వ తేదీన లోక్ సభ కొలువు దీరనుంది . వచ్చే నెల 3వ తేదీ వరకు ఈ సమావేశాలు జరగనున్నాయి. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి రిజిజు ఈ విషయాన్ని వెల్లడించారు. కొత్త ఎంపీలతో ఈ నెల 24, 25 తేదీల్లో ప్రమాణ స్వీకారం చేయించనున్నట్లు వివరించారు. 26న స్పీకర్ ఎన్నిక జరగనుంది. ఇక 27న రాష్ట్ర పతి…

Read More
rahul prinka5

తోటి యాత్రికుడు…

రాహుల్.. నా స్నేహితుడు, తోటి యాత్రికుడని ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. రాహుల్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిన్న మాటను అన్నకు బహుమతిగా ఇచ్చారు ప్రియాంక…

Read More
modi swarnin 24

Farmers “First”…

After being sworn in as Prime Minister for the 3rd time, PM Modi Narendra Modi’s signs his first file authorizing release of 17th instalment of PM Kisan Nidhi. This will benefits 9.3 crore farmers and distribute around Rs. 20,000 crores. After signing the file, PM Modi said “Ours is a Government fully committed to Kisan…

Read More
IMG 20240530 WA0030

మోడీ విద్వేషం…

ప్రధాని నరేంద్ర మోదీపై మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల ప్రచారంలో విపక్షాలను లేదా ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని విద్వేషపూరిత, అనుచిత ప్రసంగాలతో ప్రధాని కార్యాలయం హుందాతనాన్ని తగ్గించారని ధ్వజమెత్తారు. లోక్‌సభ తుది దశ ఎన్నికల పోలింగ్‌ నేపథ్యంలో పంజాబ్‌ ఓటర్లకు ఓ లేఖ రాసిన మాజీ మన్మోహన్ మోడీ విభజన వాదాన్ని ప్రోత్సహించే ప్రసంగాలు చేశారని మండిపడ్డారు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ఇచ్చిన హామీని తుంగలో…

Read More
IMG 20240530 WA0014

“చల్లని” కబురు…

దేశ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు వినిపించింది. దేశ వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థకు జీవనాడి అయిన నైరుతి రుతుపవనాలు (Southwest monsoon) దేశ ప్రధాన భూభాగంలోకి ప్రవేశించినట్లు తెలిపింది. ఇవి గురువారం ఉదయం కేరళ (Kerala)ను తాకాయని ఐఎండీ (IMD) అధికారికంగా వెల్లడించింది. లక్షద్వీప్, కేరళలోని కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఇప్పటికే వాతావరణ శాఖ అంచనా వేసింది. రాబోయే మూడు లేదా నాలుగు రోజుల్లో రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించే…

Read More
IMG 20240527 WA0026

బెదిరింపు…

దేశంలో ఇటీవల బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. తాజాగా, ముంబై లోని తాజ్ హోటల్, ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీంతో, అప్రమత్తమైన పోలీసులు ఆయా ప్రాంతాల్లో సోదాలు నిర్వహించగా అనుమానాస్పదంగా ఏమీ కనిపించక పోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఆ కాల్ ఉత్తర ప్రదేశ్ నుంచి వచ్చినట్టు గుర్తించారు. ఆ నిందుతుడి కోసం గాలిస్తున్నట్లు పోలిసులు తెలిపారు.

Read More
IMG 20240326 WA0024

జై…”తీహార్” …

ఢిల్లీ మద్యం విక్రయ లావాదేవీల కుంభకోణంలో చిక్కుకున్న తెలంగాణా ముద్దు బిడ్డ కల్వకుంట్ల కవిత చివరి వరకు ఎన్ని సాకులు చెప్పినా తిహర్ జైలు ఊసల వెనక్కి వెళ్ళక తప్పలేదు. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరెట్ అధికారుల కస్టడీ అనంతరం ఆమె చేసిన అర్థరహింత విజ్ఞప్తిని కోర్టు త్రోసిపుచ్చింది. తన కుమారుని పరీక్షలు ఉన్నాయంటూ ఆమె చేసిన విజ్ఞప్తిని కోర్టు సాకుగా పరిగణించింది. అందుకే, కవితకు వచ్చే నెల 9 వ తేదీ వరకు జ్యూడిషియల్ కస్టడీ…

Read More
kejri jail

వర్క్ ఫ్రమ్ “జైల్”…

మద్యం కుంభకోణంలో కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నిర్బంధం నుంచే ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఈ మేరకు ఢిల్లీ ప్రభుత్వానికి సంబంధించి తన మొదటి ఉత్తర్వును జల వనరుల శాఖకు జారీ చేశారు.ఈ రోజు సమావేశం నిర్వహించనున్న ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు అతిషి అరవింద్ ఆదేశాల గురించి సమాచారం ఇవ్వనున్నారు. కేజ్రీవాల్‌ అరెస్టుతో ఢిల్లీ ప్రభుత్వం ఎలా నడుస్తుందనేది అతి పెద్ద ప్రశ్నగా మారింది. కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారా? అనే…

Read More
IMG 20240320 WA0015

రా “గురూ”…

కోర్టు ధిక్కరణ కేసులో న్యాయస్థానం ఎదుట వ్యక్తిగతంగా హాజరు కావాలని యోగా గురు రాందేవ్‌ బాబాను, ఆయన యాజమాన్యం లోని పతంజలి ఆయుర్వేద్‌ సంస్థ ఎండీ ఆచార్య బాలకృష్ణను సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశించింది.ఆరోగ్య రక్షణకు సంబంధించి పత్రికలలో ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు ఇస్తున్నారంటూ వీరిద్దరిపై కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలైన విషయం తెలిసిందే. ప్రజలను తప్పు దోవ పట్టిస్తూ మోసపూరిత ప్రకటనలు ఇస్తున్నారంటూ పతంజలిపై గతంలో ఫిర్యాదులు వచ్చాయి.వీటిపై సుప్రీంకోర్టులో జరిగిన వాదనల సందర్భంగా ఇకపై…

Read More