ఇలాగే ఉంటది…
పదేళ్ల అధికారం చివరికి కరడు గట్టిన నేరస్థుల నిలయమైన తిహార్ జైలుకు పంపినందుకు… థాంక్యూ తెలంగాణా…జై..తీహార్…
పదేళ్ల అధికారం చివరికి కరడు గట్టిన నేరస్థుల నిలయమైన తిహార్ జైలుకు పంపినందుకు… థాంక్యూ తెలంగాణా…జై..తీహార్…
ఢిల్లీ మద్యం విక్రయ లావాదేవీల కుంభకోణంలో చిక్కుకున్న తెలంగాణా ముద్దు బిడ్డ కల్వకుంట్ల కవిత చివరి వరకు ఎన్ని సాకులు చెప్పినా తిహర్ జైలు ఊసల వెనక్కి వెళ్ళక తప్పలేదు. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరెట్ అధికారుల కస్టడీ అనంతరం ఆమె చేసిన అర్థరహింత విజ్ఞప్తిని కోర్టు త్రోసిపుచ్చింది. తన కుమారుని పరీక్షలు ఉన్నాయంటూ ఆమె చేసిన విజ్ఞప్తిని కోర్టు సాకుగా పరిగణించింది. అందుకే, కవితకు వచ్చే నెల 9 వ తేదీ వరకు జ్యూడిషియల్ కస్టడీ…
వచ్చే లోక్సభ ఎన్నికల్లో కల్వకుంట్ల, తన్నీరు కుటుంబాల నుంచి ఏ ఒక్కరూ పోటీ చేయడం లేదు. రెండు దశాబ్దాల పార్టీ చరిత్రలో ఇలాంటి పరిస్థితి ఎదురు కావడం ఇదే తొలిసారి. గత శాసనసభ ఎన్నికల్లో పార్టీ ఓడి పోవడంతో భారాస నేతలు, కార్యకర్తల్లో తీవ్ర నిరాశ నెలకొంది. కనీసం పోటీ చేయడానికి సిట్టింగ్ ఎంపీలు కూడా ముందుకు రావడం లేరు. అయితే, ఉద్యమ పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపడానికి ఆ కుటుంబం నుంచి ఎవరైనా బరిలోకి దిగితే …
రాజకీయంగా దారులు మూసుకుపోతున్నాయి, మొన్నటి వరకు తమ వారే అనుకున్న ఒకరొ క్కరు జారుకుంటున్నారు, తండ్రి బయటకు రాలేని వింత పరిణామం, సొంత చెల్లెలు జైలు పాలుకాబోతున్నా ఏమీ చేయలేని నిస్సహాయత, మీడియా కార్యాలయాలనే కంట్రోల్ రూమ్ లుగా మార్చుకున్న గుట్టు రట్టవుతున్న తరుణం, నమ్ముకున్న అనేక మందిని కేసులు వెంటాడే దుస్థితి నెలకొంది, తమకు నచ్చని మీడియా, పత్రికలపై ఏమీ చేయలేని దయనీయ స్థితి అందుకే చివరికి సోషల్ మీడియా పై అక్కసు. తెలంగాణా రాష్ట్రానికి…
ఇంకా కష్టమే “సార్”… ఇంజన్ బాగా “బోర్” కొచ్చి నడిచేలా లేదు.. కొన్ని “పార్టులు” కూడా కనిపించడం లేదు…
తెలంగాణా శాసనసభ ఎన్నికలకు ముందు కళ్ళాలు లేని గుర్రంలా పరుగులు తీసిన భారత రాష్ట్ర సమితి ఆ ఎన్నికల ఫలితాల అనంతరం సావడికే పరిమితమైంది. అధికారంలో ఉన్నప్పుడు అంతులేని ఆలోచనలతో రంకెలేసిన భారాస అధినేత, ఆయన అనుచరగణం ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత దిక్కుతోచని స్థితిలో పడ్డారు. పదేళ్ళ తిరుగులేని పాలనలో జరిగిన అవినీతి,అక్రమ వ్యవహారాలు ఒక్కసారిగా గుప్పుమనడం భారాస మనుగడకు తలనిప్పిగా మారడం ఒక సమస్య అయితే, ఏకంగా పార్టీ అధినేత కేసీఆర్ కుమార్తె కవిత…
భారత రాష్ట్ర సమితి జాతీయ ఎజెండా ఏమైంది? ఓటమి తర్వాత బిగుస్తున్న ఉచ్చులు పార్టీ మనుగడపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయి? ఇలాంటి అనేక అంశాల పై “ఈగల్ న్యూస్” ప్రత్యేక కథనం.. మీ కోసం…త్వరలో…
ఆయా రాజకీయ పార్టీలు ఎన్నికల్లో సత్తా చూపేందుకు ఎన్ని హామీలైనా గుప్పించవచ్చు. ప్రత్యర్థి పార్టీ పై రాజకీయ విమర్శలూ చేయొచ్చు. కొన్నేళ్ల కిందట వరకు ఎన్నికల తెరపై ఇదే తంతు కనిపించేది. రానురానూ అది కాస్తా వ్యక్తిగత వ్యవహారాల్లోకి వెళ్ళింది. దశాబ్ద కాలంగా ఎక్కడ ఎన్నికలు జరిగినా ప్రజా సమస్యల ముచ్చట పక్కనపెట్టి ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం సర్వ సాధారణమైంది. ఎన్నికల్లో గెలిచిన పార్టీనీ, దాని నాయకులను ఓడిన నేతలు శత్రువులుగా చూడడం పరిపాటైంది. అధికార…
ప్రజాస్వామ్యంలో సామన్యులైనా, బాధ్యత గల స్థానంలో ఉన్న వారెవరైనా సరే కోర్టులు, విచారణ సంస్థల ఆదేశాలకు తల వంచాల్సిందే. ఆరోపణల పై అధికారుల సందేహాలను నివృత్తి చేయాల్సిందే. చట్ట బద్ధంగా వ్యవహరించే అధికార యంత్రాంగానికి సహకరించాలి. సహకరించి తీరాలి. అంతేగానీ, అక్రమ అరెస్టు అనీ, వేధింపులు అంటూ రచ్చ చేయాలని ప్రయత్నించడం సబబు కాదు. లిక్కర్ స్కాంలో కవిత ప్రమేయం ఉందంటూ తలా,నోరు బాదుకొని చివరికి కట్టుదిట్టమైన ఆధారాలతో కవితను అరెస్టు చేసిన వాస్తవం తెలిసి కూడా…
తెలంగాణ ఉద్యమ అంతిమ దశలో నాయకురాలిగా తెరపైకి తెచ్చిన కల్వకుంట్ల కవిత వాస్తవానికి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడే వరకు ఎవరికీ తెలియదు. ఇది భారత రాష్ట్ర సమితి నేతలు అవునన్నా,కాదన్నా బహిరంగ రహస్యం. అలాంటి కవిత దశాబ్ద కాలంలో ఓడినా గెలిచే పదవులు, ఆలోచనలకు అందని ఆస్తులకు అధిపతి కావడం నిజంగా ఆశ్చర్యమే. ఆమె ప్రపంచ ప్రతిష్టకమైన దుబాయిలోని “బుర్జు కలిఫా”లో ఫ్లాట్ కొన్నప్పుడే తెలంగాణ ప్రజలకు ఆమె స్థాయి తెలిసి పోయింది. ఆ గృహ…
బిఅర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు.
తెలంగాణలో భారాసకు మరో ఎదురు దెబ్బ తగిలింది. సార్వత్రిక ఎన్నికల సమయంలో పలువురు సీనియర్ నేతలు భాజపా గూటికి చేరారు. మహబూబాబాద్, ఆదిలాబాద్ మాజీ ఎంపీలు సీతారాం నాయక్, గోడం నగేశ్, హుజూర్ నగర్, కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యేలు శానంపూడి సైది రెడ్డి, జలగం వెంకట్రావు ఢిల్లీలో తరుణ్ చుగ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నేతలు లక్ష్మణ్, ఏలేటి మహేశ్వర్రెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
భారత రాష్ట్ర సమితి (భారాస) నేతలు ఇంకా ప్రత్యేక తెలంగాణ వాదాన్ని మరచిపోయినట్టు లేరు. తెలంగాణా ఏర్పడి పదేళ్ళయినా, అప్పటి నుంచి మొన్నటి వరకు అధికారం చెలాయించిన విషయాన్ని విస్మరించి ఇంకా ఉద్యమ సమయంలోని ఆలోచనలతో ప్రవర్తించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. దశబ్ధం కిందటే ప్రత్యేక తెలంగాణా ఏర్పడిందని, ఆ రాష్ట్రంలో ఉంటున్నామనే విషయం తెలిసి కూడా అప్పట్లో రాజశేర్ రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాల హయాంలో తెలంగాణా కోసం వ్యవహరించినట్టు ఇప్పటి బి.అర్.ఎస్. నేతలు…
తెలంగాణా రాష్ట్రంలో అధికార పక్షం పై కొద్ది రోజులుగా విపక్షం చేస్తున్న దాడి వెనుక వాస్తవాలు ఏమిటి? “ఈగల్ న్యూస్” ప్రత్యేక విశ్లేషణాత్మక కథనం… మీ కోసం..త్వరలో…