Siraj met Nirmala…
Indian cricketer Mohammed Siraj met Union Finance Minister Nirmala Sitharaman at Hyderabad’s Rajiv Gandhi International Airport. Minister appreciated his performance in the World Cup.
Indian cricketer Mohammed Siraj met Union Finance Minister Nirmala Sitharaman at Hyderabad’s Rajiv Gandhi International Airport. Minister appreciated his performance in the World Cup.
తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా వివిధ సభల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ చేరుకున్న కేంద్ర హోమ్ శాఖమంత్రి అమిత్ షా హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎన్నికల ఇంచార్జ్ జవడేకర్ పలువురు నేతల స్వాగతం పలికారు. గద్వాల్ లో జరిగే సకల జనుల విజయ సంకల్ప సభలోఅమిత్ షా పాల్గొంటారు.
హైదరాబాద్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. నాంపల్లిలోని బజార్ఘాట్లోని కెమికల్ గోడౌన్లో సోమవారం ఉదయం భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో చిక్కుకొని తొమ్మిది మంది కార్మికులు దుర్మరణం చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. నాలుగు అంతస్తుల వరకు మంటలు వ్యాపించాయి. స్థానికులు ఇచ్చిన సమాచారంతో విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మూడు ఫైరింజన్లతో మంటలను అదుపుచేసేందుకు యత్నిస్తున్నారు. మరికొంతమంది కార్మికులు మంటల్లో చిక్కుకున్నట్లు సమాచారం. కార్మికులను రక్షించేందుకు సహాయక చర్యలు…
ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. నాణ్యమైన విద్య కోసం కొండంత ఆశతో దేశం నలుమూలల నుంచే కాకా, విదేశ విద్యార్దులు సైతం పెద్ద సంఖ్యలో ఈ క్యాంపస్ లో చేరుతుంటారు. అందుకే హైదరాబాద్ లోని ఇంగ్లిష్, విదేశీ భాషల విశ్వవిద్యాలయం(ఇఫ్లూ). 2007వ సంవత్సరం వరకు కూడా దీన్నే “సిఫెల్”గా పిలిచే వారు. ఇది భిన్న సంస్కృతులకు కేంద్రమని చెప్పవచ్చు. ఈ యూనివర్సిటిలో రకరకాల భాషలకు సంబంధించిన కోర్సులు నేర్చుకునే విద్యార్ధులు చదువుతో పాటు విభిన్న సంస్కృతీ,…
హైదరబాద్ జర్నలిస్టుల ఇళ్ల స్థలాల అంశం త్వరలోనే పరిష్కరిస్తామని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. కొత్తగా ఏర్పాటైన “ది తెలంగాణా జర్నలిస్ట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ” ప్రతినిధులతో ఆయన ప్రగతి భవన్ లో భేటీ అయ్యారు. సొసైటీ సభ్యత్వ వివరాలు అడిగి తెలుసుకున్నారు. మూడోసారి కూడా తామే అధికారంలోకి వస్తామన్న మంత్రి హరీష్ రావు జర్నలిస్టుల హౌసింగ్ సమస్యని కూడా తప్పక పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మంత్రి కేటీఆర్ కలిసి ఇదే అంశంపై…
హైదరాబాద్ తార్నాక లోని ఇంగ్లిష్, విదేశీ భాషల విశ్వవిద్యాలయం(ఇఫ్లూ)లో లైగిక వేధింపులను నిరోధించడానికి ఏర్పాటు చేసిన “సెన్సిటైజేషన్,ప్రివెన్షన్ మరియూ రిడ్రేసల్ అఫ్ సెక్స్ వల్ హెరాస్మెంట్”(స్పర్శ్)ని వెంటనే పునరుద్దరించాలని డిమాండ్ చేస్తూ ఇఫ్లూ విద్యార్ధులు నిరసన మొదలు పెట్టారు. లైంగిక వేధింపులను అదుపు చేయడానికీ, సమస్యలను పరిష్కరించడానికి ఏర్పాటు చేసిన స్పర్శ్ ని గత జూన్ నెల నుంచి ఎవరూ పట్టించుకోవడం లేదని విద్యార్ధులు తెలిపారు. ఇదే విషయాన్ని స్పర్శ్ చైర్ పర్సన్ గా ఉన్న రేవతి…
దేశంలోని వివిధ ప్రాంతాల్లోని ఐఐటి విద్యార్థుల మధ్య గుజరాత్ రాష్ట్రంలోని గాంధీనగర్ ఐ.ఐ.టి.లో నిర్వహించిన 37వ ఈత (ఆక్వాటిక్స్) పోటీల్లో ఐఐటి హైదరాబాద్ అభ్యర్థులు సత్తా చాటారు.దేశంలోని వివిధ ప్రాంతాల్లోని ఐఐటి విద్యార్థుల మధ్య గుజరాత్ రాష్ట్రంలోని గాంధీనగర్ ఐ.ఐ.టి.లో నిర్వహించిన ఈత (ఆక్వాటిక్స్) పోటీల్లో ఐఐటి హైదరాబాద్ అభ్యర్థులు సత్తా చాటారు. ఈ పోటీల్లో సెకండ్ రన్నర్అప్ ని సొంతం చేసుకోవడంతో పాటు 8 పతకాలు గెలుసుకున్నారు. మొత్తం 16 ఐఐటిలు ఈ పోటీల్లో తలపడ్డాయి….
తెలంగాణలో శాసనసభ ఎన్నికల నిర్వహణను అధ్యయనం చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘానికి చెందిన అధికారుల బృందం హైదరాబాద్కు చేరుకుంది. చీఫ్ ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, అరుణ్ గోయల్, అనూప్ చంద్రపాండేతో పాటు మరికొంత మంది సభ్యులు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకోగా రాష్ట్ర అధికారులు స్వాగతం పలికారు. కాసేపట్లో ఈ బృందం రాజకీయ పార్టీలతో సమావేశం కానుంది. మూడు రోజుల పాటు ఈ బృందం రాష్ట్రంలో పర్యటించి, అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతపై అధికారులతో సమీక్ష సమావేశం…
మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఐ.ఐ.టి. హైదరాబాద్ లో “ఒకటో తారిఖు, ఒక గంట, అందరం ఒకటి” అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా చేపట్టిన స్వచ్చ కార్యక్రమంలో క్యాంపస్ పరిసరాలను శుభ్రం చేశారు. ఎం.ఎస్.ఎస్. కార్యకర్తలు, కళాశాల అధికారులు సిబ్భంది స్వచ్చత పరుగు చేపట్టారు. వ్వ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ చంద్రశేఖర్, సంస్థ డైరెక్టర్ మూర్తి, ప్రొఫెసర్ కె. వెంకట సుబ్భయ్య పాల్గొన్నారు. అంతకు ముందు మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి చిత్ర…
విద్యారంగంలో ఆన్ లైన్ ద్వారా శిక్షణ పొందాలనుకునే అభ్యర్ధుల పేరుతో మార్కెట్లోకి వచ్చిన బైజూస్ అనే సంస్థ వివిధ రకాల అక్రమాలకు పాల్పడినట్టు సమాచారం అందుంతోంది. ప్రాథమిక, డిగ్రీ వంటి విద్యార్థులకు ఆన్ లైన్ పాఠాలు బోధించే నెపంతో ప్రారంభమైన ఈ సంస్థ కొంత కాలంగా తాహతకు మించి సివిల్స్ కు హాజరయ్యే వారికి సైతం ఆన్ లైన్ లో శిక్షణ ఇవ్వడానికి పూనుకుంది. సరైన శిక్షణ సిబ్బంది లేనున్నా, యూపిఎస్ కి చెందిన బోధనా సామగ్రి…
బొజ్జ గణపయ్య నవరాత్రి ఉత్సవాలు ముగింపు దశకు దగ్గరవడంతో ఆయా పందిళ్ళ వద్ద సందడి ఊపందు కుంటోంది. హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల్లో పోటాపోటీగా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఓ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన గణపతి విగ్రహ నిమజ్జనం సందర్భంగా విద్యార్థినులు అత, పాటలతో కోలాహలం చేయడం పలువురిని ఆకట్టకుంది.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఎం.ఐ.ఎం. నేత అసదుద్దీన్ ఓవైసీ సవాల్ విసిరారు. హైదరాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో రాహుల్ గాంధీకి దమ్ముంటే వాయనాడ్ నియోజకవర్గం నుంచి కాకుండా హైదరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలని వ్యాఖ్యానించారు.
నటనకి, నిజ జీవితానికి ఎంత తేడా ఉంటుందో ఈ చిత్రాన్ని చుస్తేనే అర్ధం అవుతుంది. ఆమె సహాయకుడు సాయి వివాహానికి హైదరాబాద్ వచ్చిన రాష్మిక నిండైన దుస్తులతో చూపరులను ఆకట్టుకుంది. ఆమెను చూసిన వారు ఒక్కసారిగా కెమెరా ముందు ఆమె నటనను ఉహించుకున్నారు.
హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్ మీదుగా విఎస్టీ వరకు నిర్మించిన ఇనుప దిమ్మెల బ్రిడ్జిని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ ప్రారంభించారు.13 వేల టన్నుల ఇనుముతో సుమారు రెండున్నర కిలోమీటర్ల దూరం వరకు నిర్మించారు.