tdp logo 1

“దేశం”పయనం ఎటు…!

నలభై ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న తెలుగదేశం పార్టీ ఎవరూ ఊహించని రీతిలో తొలిసారి ఎన్నికల బరికి దూరమైంది. వచ్చే నెలలో జరగనున్న తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పోటీకి మొహం చాటేయడంతో రాజకీయ పరిశీలకులు సహా సామాన్య జనం ఒక్కసారిగా విస్తుపోయారు. తెలంగాణలోని అనేక జిల్లాల్లో అంకితభావంతో పనిచేస్తున్న క్యాడర్,  కొన్నినియోజక వర్గాల్లో ఇప్పటికీ పట్టు సడలని ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ తెలుగుదేశం పోటీకి దూరం కావడం ఆ పార్టీ మనుగడను మరింత దెబ్బతీసే అవకాశం…

Read Full News
IMG 20231028 WA0008

పోరాడి ఓడిన “కివీస్”

వరల్డ్ కప్ క్రికెట్ మరో ఉత్కంఠభరిత మ్యాచ్లో న్యూజిలాండ్ ఓటమిపాలైంది. ఆస్ట్రేలియా తమ ముందు ఉంచిన 389 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో న్యూజిలాండ్ చివరి వరకు పోరాడినా ఓటమి తప్పలేదు. 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 383 రన్స్ చేసి, 5 పరుగుల తేడాతో ఓడిపోయింది. రన్ (116) సెంచరీతో అదరగొట్టగా.. మిచెల్ (54) ఫర్వాలేదనిపించారు.

Read Full News
IMG 20231028 WA0007 1

విశాఖలో వి.పి.,…

ఆంధ్రా మెడికల్ కాలేజీ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఉప రాష్ట్రపతి జగ్ దిప్ ధన్ కర్ విశాఖపట్నం చేరుకున్నారు. ఐ.ఎన్.ఎస్. డేగా ఎయిర్ బేస్ కి చేరుకున్న ఆయనకు అంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ స్వాగతం పలికారు.

Read Full News
IMG 20231028 WA0006

“నేరం-బేరం” రెడీ…

ప్రముఖ పాత్రికేయులు, రచయిత సతీష్ చందర్ “నేరం-బేరం” శీర్షికతో తాజాగా రచించిన రాజకీయ వ్యంగ్య నవల పుస్తకాన్ని ఈ ఆదివారం ఆవిష్కరిస్తారు. హైదరాబాద్ బాగ్ లింగంపల్లి లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణా రాష్త్ర సాహిత్య అకాడమీ ఛైర్మన్ జూలూరి గౌరీశంకర్ అధ్యక్షతన ఏర్పాటు చేసే కార్యక్రమంలో దక్కన్ లాండ్ సంపాదకులు వేదకుమార్ తొలి ప్రతిని విడుదల చేస్తారు. మీడియా అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొంటారు.

Read Full News
IMG 20231028 WA0005

తప్పక రావాలి…

వచ్చే ఏడాది అయోధ్యలో చేపట్టే శ్రీ రాముని విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరు కావాలని శ్రీ రామ జన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఆహ్వానం ఇచ్చింది. జనవరి నెలలో జరిగే ప్రతిష్టకు రావలసిందిగా ట్రస్ట్ సభ్యులు ప్రధానిని కలిసి మొదటి ఆహ్వాన పత్రిక అందజేశారు.

Read Full News
IMG 20231027 WA00081

సొంత గూటికి….

మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి సొంత గూటికి చేరారు. గతంలో జరిగిన మునుగోడు ఉప ఎన్నికల సమయంలో బిజెపిలో చేరిన రెడ్డి తాజాగా తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఢిల్లీ లోని ఎ.ఐ.సి.సి. కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు మాణిక్ రావు ఠాక్రే రాజ గోపాల్ కి కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నేతలు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి తదతరులు పాల్గొన్నారు.

Read Full News
IMG 20231027 WA0010

కేసీఆర్ కారకుడు…

బిఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పూర్తీ బాధ్యత వహించాలని మావోయిస్టులు డిమాండ్ చేశారు.ఈ మేరకు మావోయిస్టు జేఎమ్‌‌డబ్ల్యూపీ డివిజన్ కమిటీ కార్యదర్శి వెంకటేష్ పేరుతో లేఖ విడుదలైంది. మేడిగడ్డ లక్ష్మీబ్యారేజీ అంతరాష్ట్ర వంతెన పిల్లర్లు కుంగి పోవడానికి కారణం నాణ్యత లోపమే అన్నారు. వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన బ్యారేజీ కేవలం మూడు సంవత్సరాలకే కుంగి పోవడం అధికారుల వైఫల్యానికి నిదర్శనం అన్నారు. దీన్ని 2016 మే 2వ న నిర్మాణం…

Read Full News
20231025 155541

“రోమియో” టీచ్చర్స్…!

ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. నాణ్యమైన విద్య కోసం కొండంత ఆశతో దేశం నలుమూలల నుంచే కాకా, విదేశ విద్యార్దులు సైతం పెద్ద సంఖ్యలో ఈ క్యాంపస్ లో చేరుతుంటారు. అందుకే హైదరాబాద్ లోని ఇంగ్లిష్, విదేశీ భాషల విశ్వవిద్యాలయం(ఇఫ్లూ). 2007వ సంవత్సరం వరకు కూడా దీన్నే “సిఫెల్”గా పిలిచే వారు. ఇది భిన్న సంస్కృతులకు కేంద్రమని చెప్పవచ్చు. ఈ యూనివర్సిటిలో రకరకాల భాషలకు సంబంధించిన కోర్సులు నేర్చుకునే విద్యార్ధులు చదువుతో పాటు విభిన్న సంస్కృతీ,…

Read Full News
IMG 20231024 WA0060

పిల్లర్లు కుంగడమా…!

అధికారులకే అంతుపట్టని కారణంతో ఆశ్చర్యంగా కుంగిపోయిన మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీని కేంద్ర బృందం పరిశీలించింది. రెండు రోజుల కిందట కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ బ్యారేజీ 20వ పిల్లర్ వద్ద కుంగిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ కోసం కేంద్ర ప్రభుత్వం ఆరుగురు సభ్యులతో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ చైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలోని ఈ కమిటీ బ్యారేజీని పరిశీలించింది.19, 20, 21వ పిల్లర్ల వద్ద పగుళ్లకు గల కారణాలను అన్వేషించింది….

Read Full News
dowal kangana

పిక్చర్ పర్ఫెక్ట్…

కేంద్ర ప్రభుత్వ జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ ప్రయాణిస్తున్న విమానంలో బాలీవుడ్ భామ కంగనా రనౌట్ కూడా జర్నీ చేశారు. ఆ విమానంలో దోవల్ తో కలిసి దిగిన సెల్ఫీని కంగనా సోషల్ మీడియాలో పంచుకుంది.

Read Full News
dalailama newzlnd

దలైలామాతో “కివీస్”…

ప్రపంచ కప్ ఆటల్లో ఉన్న న్యూజిలాండ్ ఆటగాళ్ళు భౌద్ధ మత ప్రముఖులు దలైలామాను ధర్మశాల లోని ఆయన నివాసంలో కలిశారు. టీమ్ సభ్యులు తమ కుటుంబ సభయులతో లామా ఆశిస్సులు తీసుకున్నారు.

Read Full News
IMG 20231023 WA0006 1

“దేశం- సేన” భేటీ…

జనసేన, తెలుగుదేశం పార్టీల సమన్వయ కమిటీ తొలి సమావేశంలో పాల్గొనేందుకు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ రాజమండ్రి చేరుకున్నారు. రాజమండ్రి విమానాశ్రయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్, పీఏసీ సభ్యులు పితాని బాలకృష్ణ, జిల్లా నాయకులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్, అత్తి సత్యనారాయణ, వై. శ్రీను, బత్తుల బలరామకృష్ణ, తుమ్మల బాబుపొలసపల్లి సరోజ, ప్రియా సౌజన్య తదితరులు పవన్ కళ్యాణ్ కి స్వాగతం…

Read Full News

మరో విజయం…

ప్రపంచ కప్పు క్రికెట్ లో వరుస విజయాలతో భారత్ దూసుకు పోతోంది. ధర్మశాలలో జరిగిన ఆటలో న్యూజిలాండ్ పై భారత్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. 274 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన భారత్ 48 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. విరాట్ కోహ్లి 95 పరుగులతో ఈ విజయంలో కీలక పాత్ర పోషించారు. కానీ, తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయారు. అటు రోహిత్ 46, జడేజా 39*, శ్రేయస్ 33, రాహుల్ 27 రన్స్…

Read Full News
revant 768x512 1

“మేడి”పాపం కేసీఅర్ దే…

కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజ్ ప్రమాదానికి కేసీఆర్ కుటుంబమే కారణమని, కాళేశ్వరం అవినీతిలో మొదటి దోషి కేసీఆర్ కుటుంబమే అని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగడం పై సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ తో దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. ఈ బ్యారేజి ద్వారా లక్ష కోట్లను కేసీఆర్, కాంట్రాక్టర్లు దోచుకున్నారన్నారు. నాణ్యత లోపం వల్ల మెడిగడ్డ ప్రమాదం జరిగిందనీ, కేంద్ర హోంమంత్రి, గవర్నర్ ,ఎన్నికల కమిషన్ మేడిగడ్డ పై విచారణకి ఆదేశించాలనీ డిమాండ్…

Read Full News
IMG 20231022 WA0009

భారీ ర్యాలీ…

హైదరాబాద్ జిల్లా సనత్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ కోట నీలిమ తన ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సికింద్రాబాద్ మొండా మార్కెట్ నుండి సనత్ నగర్ బస్ స్టాప్ వరకు కార్లు, మోటారు సైకిళ్ళతో ఆమె ప్రచారాన్ని ప్రారంభించారు. దాదాపు వెయ్యి కి పైగా వాహనాలు, బైకులతో సుమారు రెండు వేలమంది ఈ ప్రచారంలో పాల్గొనడం గమనార్హం. ఈ మధ్య కాలంలో నగరంలో ఇంతటి భారీ ర్యాలీ జరపడం…

Read Full News