maradon

“నేవీ”మారథాన్‌…

విశాఖ సాగర తీరాన “నేవీ మారథాన్‌” ఉత్సాహంగా సాగింది. నగరంలోని ఆర్కే బీచ్‌ పార్క్‌ కూడలి వద్ద నిర్వహించిన ఈ మారథాన్‌లో పెద్ద సంఖ్యలో యువతీ,యువకులు, నేవీ ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ కూడలి నుంచి భీమిలి వరకు ఈ రన్‌ నిర్వహించారు. 42.2 కి.మీ ఫుల్‌ మారథాన్‌, 21.1 కి.మీ హాఫ్‌ మారథాన్‌, 10కే, 5కే, కిలోమీటర్ల విభాగాల్లో ఈ మారథాన్‌ కొనసాగింది. ఫుల్‌ మారథాన్‌ను ఈఎన్‌సీ చీఫ్‌ వైస్‌ అడ్మిరల్‌ రాజేశ్‌, హాఫ్‌ మారథాన్‌ను వైస్‌…

Read More
pawan kishan manohar

మళ్ళీ“మోడీ”రావాలి…!

దేశానికి నరేంద్ర మోడీ ఇంకోసారి ప్రధానమంత్రి కావలసిన ఆవశ్యకత ఉందని, ముచ్చటగా మూడోసారి మోడీ ప్రధాని కావాలని ఆకాంక్షిస్తున్నట్టు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడించారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడారు. ఈ నెల 7వ తేదీన హైదరాబాద్ లో బీజేపీ నిర్వహించే బహిరంగ సభలో పాల్గొనాలని ఆహ్వానం అందినట్టు తెలిపారు. కిషన్ రెడ్డి మాట్లాడుతూ “ఎన్డీయే భాగస్వామ్య పక్షంగా ఉన్న జనసేన పార్టీ జీహెచ్ఏంసీ…

Read More
indrasena tpt 1

తిరుమలలో త్రిపుర గవర్నర్ …

త్రిపుర రాష్ట్ర  గవర్నర్  ఇంద్రసేనా రెడ్డి తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్నారు. ఆయనకు టీటీడీ  చైర్మన్  శ్రీ  భూమన కరుణాకర రెడ్డి, ఎ.వి. ధర్మారెడ్డి స్వాగతం పలికారు.

Read More
sharmila c1

“చెయ్యి”ఎత్తిన షర్మిలా…!

కేసీఆర్ మీద ప్రజలకు తారా స్థాయిలో వ్యతిరేకత ఉందని, కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేక ఓటును చీల్చొద్దనే ఒకే ఒక్క ఆలోచనతో వైయస్ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తోందని ఆ పార్టీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిలా రెడ్డి చెప్పారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోయే అవకాశం ఉందని, మళ్లీ కేసీఆర్ కు అవకాశం ఇవ్వద్దని కాంగ్రెస్ పార్టీ నాయకులు విజ్ఞప్తి చేసినట్టు ఆమె తెలిపారు. ఈ విషయంలో లోతుగా పరిశీలించిన తర్వాతే రాబోయే ఎన్నికల్లో…

Read More
barrage c

మేడిగడ్డ… రాజకీయ అడ్డా…!

అధికారుల అవినీతి, ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం. ఎన్నికల వేడిలో అధికార,విపక్ష పార్టీల విమర్శలు,వాదనలు ఎలా ఉన్నా పిల్లర్లు కుంగిపోవడం అధికారుల పర్యవేక్షణ వైఫల్యానికి, గుత్తేదారు నిర్లిప్తతకు ప్రత్యక్ష సాక్ష్యం. కుంగి పోవడానికి దారి తీసిన లోపాలను, కారణాలను ఇంజనీరింగ్ అధికారులే కాదు ప్రభుత్వం కూడా బాధ్యతగా అంగీకరించాలి. వేల కోట్ల ప్రజాధనం ధారగా పోసి ఎన్నో కలలు, ఆశలతో నిర్మించిన సౌధం మూన్నాళ్ళ ముచ్చటగా మారుతుంటే రాజకీయ నాయకుల్లో మాత్రమే కాదు,…

Read More
remand

సాక్ష్యం చూపరు…బెయిల్ ఇవ్వరు…!

అనుమానితులు, నిందితులను పట్టుకున్న 14 రోజుల్లో నేర పరిశోధన పూర్తి చేసి ఆధారాలను కోర్టు ముందు ఉంచాల్సిన పోలీసు యంత్రాంగం నిర్లిప్తత వల్ల అనేక మంది రిమాండ్ ఖైదీలుగా జైళ్లలో మగ్గుతున్నారు. ఆధారాల సేకరణలో నిర్లక్ష్యం, అధికారులు, రాజకీయ నేతల తెరచాటు జోక్యం, వాళ్ల ఒత్తిళ్లు ఖైదీలకు శాపంగా మారుతోంది. చట్టల్లోని లొసుగులు కూడా కేసుల సాగదీతకు కారణం అవుతున్నాయి. ఫలితంగా రిమాండ్ ఖైదీల పరిస్థితి దయనీయంగా మారుతోంది. దోపిడి, దొంగతనాల కేసుల్లో దొరికిన నిందితుల విషయాన్ని పక్కన…

Read More
IMG 20231029 WA0024 1

ఇంగ్లాండ్ చిత్తు…

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నో లో జరిగిన ప్రపంచ కప్పు మ్యాచ్ లో ఇంగ్లాండ్ పై భారత జట్టు 100 పరుగుల తేడా తో ఘన విజయం సాధించింది. 230 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు భారత్ బౌలర్లు విజృంభించడంతో 129 పరుగులకే ఆలౌటైంది. ఇంగ్లండ్ ప్లేయర్లలో లివింగ్ స్టోన్ (27) చేసిన పరుగులే అత్యధికం. భారత బౌలర్లలో షమీ 4, బుమ్రా 3, కుల్దీప్ 2, జడేజా ఒక వికెట్ తీశారు. ఈ విజయంతో…

Read More
IMG 20231029 WA0016

కేరళలో కుట్ర…

కేరళలోని ఓ కన్వెన్షన్ సెంటర్లో భారీ పేలుడు సంభవించి ఒకరు మరణించారు. ఆదివారం ఉదయం జరిగిన ఈ ఘటనలో 36 మంది గాయపడ్డారు. వీరిలో పది మంది తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎర్నాకులంలోని కాళామస్సేరీలో ఉన్న జమ్రా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. రెండు వేల మందికిపైగా పాల్గొన్న ఓ మతపరమైన కార్యక్రమం జరుగుతున్న సమయంలో పేలుడు సంభవించిందని పోలీసులు తెలిపారు. ఇందుకు ఐఈడీ ఉపయోగించారని వెల్లడించారు.పేలుడుకు సంబంధించి ఆదివారం…

Read More
tdp logo 1

“దేశం”పయనం ఎటు…!

నలభై ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న తెలుగదేశం పార్టీ ఎవరూ ఊహించని రీతిలో తొలిసారి ఎన్నికల బరికి దూరమైంది. వచ్చే నెలలో జరగనున్న తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పోటీకి మొహం చాటేయడంతో రాజకీయ పరిశీలకులు సహా సామాన్య జనం ఒక్కసారిగా విస్తుపోయారు. తెలంగాణలోని అనేక జిల్లాల్లో అంకితభావంతో పనిచేస్తున్న క్యాడర్,  కొన్నినియోజక వర్గాల్లో ఇప్పటికీ పట్టు సడలని ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ తెలుగుదేశం పోటీకి దూరం కావడం ఆ పార్టీ మనుగడను మరింత దెబ్బతీసే అవకాశం…

Read More
IMG 20231028 WA0008

పోరాడి ఓడిన “కివీస్”

వరల్డ్ కప్ క్రికెట్ మరో ఉత్కంఠభరిత మ్యాచ్లో న్యూజిలాండ్ ఓటమిపాలైంది. ఆస్ట్రేలియా తమ ముందు ఉంచిన 389 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో న్యూజిలాండ్ చివరి వరకు పోరాడినా ఓటమి తప్పలేదు. 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 383 రన్స్ చేసి, 5 పరుగుల తేడాతో ఓడిపోయింది. రన్ (116) సెంచరీతో అదరగొట్టగా.. మిచెల్ (54) ఫర్వాలేదనిపించారు.

Read More
IMG 20231028 WA0007 1

విశాఖలో వి.పి.,…

ఆంధ్రా మెడికల్ కాలేజీ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఉప రాష్ట్రపతి జగ్ దిప్ ధన్ కర్ విశాఖపట్నం చేరుకున్నారు. ఐ.ఎన్.ఎస్. డేగా ఎయిర్ బేస్ కి చేరుకున్న ఆయనకు అంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ స్వాగతం పలికారు.

Read More
IMG 20231028 WA0006

“నేరం-బేరం” రెడీ…

ప్రముఖ పాత్రికేయులు, రచయిత సతీష్ చందర్ “నేరం-బేరం” శీర్షికతో తాజాగా రచించిన రాజకీయ వ్యంగ్య నవల పుస్తకాన్ని ఈ ఆదివారం ఆవిష్కరిస్తారు. హైదరాబాద్ బాగ్ లింగంపల్లి లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణా రాష్త్ర సాహిత్య అకాడమీ ఛైర్మన్ జూలూరి గౌరీశంకర్ అధ్యక్షతన ఏర్పాటు చేసే కార్యక్రమంలో దక్కన్ లాండ్ సంపాదకులు వేదకుమార్ తొలి ప్రతిని విడుదల చేస్తారు. మీడియా అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొంటారు.

Read More
IMG 20231028 WA0005

తప్పక రావాలి…

వచ్చే ఏడాది అయోధ్యలో చేపట్టే శ్రీ రాముని విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరు కావాలని శ్రీ రామ జన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఆహ్వానం ఇచ్చింది. జనవరి నెలలో జరిగే ప్రతిష్టకు రావలసిందిగా ట్రస్ట్ సభ్యులు ప్రధానిని కలిసి మొదటి ఆహ్వాన పత్రిక అందజేశారు.

Read More
IMG 20231027 WA00081

సొంత గూటికి….

మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి సొంత గూటికి చేరారు. గతంలో జరిగిన మునుగోడు ఉప ఎన్నికల సమయంలో బిజెపిలో చేరిన రెడ్డి తాజాగా తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఢిల్లీ లోని ఎ.ఐ.సి.సి. కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు మాణిక్ రావు ఠాక్రే రాజ గోపాల్ కి కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నేతలు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి తదతరులు పాల్గొన్నారు.

Read More
IMG 20231027 WA0010

కేసీఆర్ కారకుడు…

బిఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పూర్తీ బాధ్యత వహించాలని మావోయిస్టులు డిమాండ్ చేశారు.ఈ మేరకు మావోయిస్టు జేఎమ్‌‌డబ్ల్యూపీ డివిజన్ కమిటీ కార్యదర్శి వెంకటేష్ పేరుతో లేఖ విడుదలైంది. మేడిగడ్డ లక్ష్మీబ్యారేజీ అంతరాష్ట్ర వంతెన పిల్లర్లు కుంగి పోవడానికి కారణం నాణ్యత లోపమే అన్నారు. వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన బ్యారేజీ కేవలం మూడు సంవత్సరాలకే కుంగి పోవడం అధికారుల వైఫల్యానికి నిదర్శనం అన్నారు. దీన్ని 2016 మే 2వ న నిర్మాణం…

Read More