pawan 16

పవన్ ఎక్కడ…

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడ? చంద్రబాబు అరెస్టు అనంతరం రాజమండ్రి జైలులో  ఆయన్ని కలిసి తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నట్టు ప్రకటించిన పవన్ ఎక్కడ ఉన్నారు? పార్టీ శ్రేణులతో బిజీగా ఉన్నారా? లేక సినిమా షూటింగుల్లో మునిగి పోయారా ? ఏ విషయం తెలియక “సేన” సైన్యం సందిగ్ధంలో ఉంది. వచ్చే నెలలో అయన వారాహి యాత్ర ప్రారంభించనున్న నేపథ్యంలో తెలుగదేశం పార్టీ పొత్తుకు సంబంధించి ఏం చెప్పాలనుకుంటున్నారు అనే విషయం చర్చనీయాంశంగా మారింది. టిడిపితో పొత్తు…

Read Full News
JAGAN

జగన్ మరో “యాత్ర”…

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి కొత్త కార్యక్రమానికి రంగం సిద్దం చేస్తున్నారు. గత ఎన్నికలకు ముందు ఓదార్పు, ప్రజా సంకల్ప యాత్రల పేరుతో జనంలోకి వెళ్ళిన అయన ఈ 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. అయితే , ఈ సారి రాబోయే ఎన్నికల్లో జనంలోకి వెళ్లేందుకు అయన కొత్త పందాని అవలంభిచనున్నారు. వైసిపి అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు గడిచిన నేపథ్యంలో ప్రభుత్వ కార్యక్రమాలను చూపుతూ ప్రజా…

Read Full News
IMG 20230927 WA0007

“బైజూస్” బేఖార్…

విద్యారంగంలో ఆన్ లైన్ ద్వారా శిక్షణ పొందాలనుకునే అభ్యర్ధుల పేరుతో మార్కెట్లోకి వచ్చిన బైజూస్ అనే సంస్థ వివిధ రకాల అక్రమాలకు పాల్పడినట్టు సమాచారం అందుంతోంది. ప్రాథమిక, డిగ్రీ వంటి విద్యార్థులకు ఆన్ లైన్ పాఠాలు బోధించే నెపంతో ప్రారంభమైన ఈ సంస్థ కొంత కాలంగా తాహతకు మించి సివిల్స్ కు హాజరయ్యే వారికి సైతం ఆన్ లైన్ లో  శిక్షణ ఇవ్వడానికి పూనుకుంది. సరైన శిక్షణ సిబ్బంది లేనున్నా, యూపిఎస్ కి చెందిన బోధనా సామగ్రి…

Read Full News
babu pawan c

ఆ పొత్తు నిజమేనా…!

ఆంధ్రప్రదేశ్ లో తెలుగదేశం, జనసేన మధ్య పొడపొచ్చలు వచ్చినట్టు కనిపిస్తోంది. చంద్రబాబు నాయుడు రిమాండ్ తో రాజమండ్రి కేంద్ర కారాగారానికి వెళ్ళగానే హుటహుటీన బాబుని జైలులో కలిసి వచ్చే ఎన్నికలలో టిడిపితో పొత్తు పెట్టుకుంటున్నట్టు ప్రకటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆలోచన సరళి మారిందా అనే సందేహం తలెత్తుతోంది. సుమారు 15 రోజులుగా చంద్రబాబుకు సంబంధించి పవన్ నుంచి ఒక్క ప్రకటన కూడా వెలుగు చూడక పోవడంతో ఆయా పార్టీ శ్రేణులు సందిగ్ధంలో పడ్డాయి.ఇటు బాబు…

Read Full News
IMG 20230925 WA0053

ఆగేదే లే…

భాగ్య నగరానికి మధ్యలో ఉన్న మూసి నది, ఈసా నదులపై ఐదు వంతెనల నిర్మాణ పనులకు పురపాలక శాఖ మంత్రి కెటి రామారావు ఉప్పల్ భగాయత్ శిల్పారామం సమీపంలోని మూసి పరివాహక ప్రాంతంలో భూమి పూజ చేశారు. 168 కోట్ల రూపాయల వ్యయంతో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) ఐదు బ్రిడ్జిలను నిర్మించనున్నది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)లోపల పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా ప్రజా రవాణా వ్యవస్థను మరింతగా మెరుగుపరచాలన్న లక్ష్యంతో రాష్ట్ర…

Read Full News
Screenshot 20230925 174401 WhatsApp

సందడే…

బొజ్జ గణపయ్య నవరాత్రి ఉత్సవాలు ముగింపు దశకు దగ్గరవడంతో ఆయా పందిళ్ళ వద్ద సందడి ఊపందు కుంటోంది. హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల్లో పోటాపోటీగా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఓ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన గణపతి విగ్రహ నిమజ్జనం సందర్భంగా విద్యార్థినులు అత, పాటలతో కోలాహలం చేయడం పలువురిని ఆకట్టకుంది.

Read Full News
Screenshot 20230925 164239 WhatsApp

హైదరాబాద్ సే కరో…

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఎం.ఐ.ఎం. నేత అసదుద్దీన్ ఓవైసీ సవాల్ విసిరారు. హైదరాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో రాహుల్ గాంధీకి దమ్ముంటే వాయనాడ్ నియోజకవర్గం నుంచి కాకుండా హైదరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలని వ్యాఖ్యానించారు.

Read Full News
IMG 20230924 WA0004

అరాచకం, విద్వేషం….

ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న విద్వేష పూరిత రాజకీయాల గతంలో ఎప్పుడూ లేవని బ్రాహ్మణి ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన జనసేన నాయకులు, పలు నియోజవర్గాల ఇంచార్జ్ లు నారా బ్రాహ్మణిని కలిసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా నారా బ్రాహ్మణి మాట్లాడుతూ రాష్ట్రంలో పరిస్థితులు రోజురోజుకూదిగజారుతున్నాయని, రాక్షస పాలనపై ఉమ్మడం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు ఎన్నడూ, ఎవరూ చూడలేదని అన్నారు. చంద్రబాబుపై కేసు విషయంలో అన్ని డాక్యుమెంట్లు,…

Read Full News
IMG 20230924 WA0003

శ్రీవారి బస్సు చోరీ…

చిన్నా, చితక సామాన్లు ఎత్తుకుపోతే ఏం లాభం అనుకున్నారేమో అందుకే తిరుపతిలో దొంగలు ఏకంగా బస్సునే దొంగిలించారు. అదీ ఏడుకొండల స్వామి దర్శనానికి భక్తులను తీసుకువెళ్ళే తిరుమల శ్రీవారి ఉచిత ఎలక్ట్రికల్ బస్సు కావడం గమనార్హం. తెల్లవారు జామున 4 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు ఈ బస్సును చోరీ చేశారు. ఈ ఎలక్ట్రికల్ బస్సు ఖరీదు సుమారు 2 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. చోరీ విషయాన్ని గుర్తించిన వెంటనే జిపిఎస్…

Read Full News
rashmika c

చెయ్యి ఎక్కడుంది…

ఏ పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోయి కుర్రకారు మనసు దోచుకునే నటి రష్మిక మదన్న. ఆమె అందాలు చూసేది మొదట కెమెరానే. అది ఫ్యాషన్ షో ర్యాంప్ అయినా, సినిమా షూటింగ్  సెట్ అయినా సరే రష్మిక అడుగుపెట్టిందంటే చాలు కెమెరామెన్ కి చేతినిండా పనే. “పుష్ప” సినిమాలోని రష్మికకు, ఫోకస్ లైట్ల ముందు చూపే ఆమె నటనకు ఎంత తేడా ఉందో ఒకసారి చూద్దాం.

Read Full News
trisha c

“వస్తానంటే వద్దంటామా”…

నటనే నా సొంతం అన్నట్టు ఏ క్యారెక్టర్ నైనా పోషించే నటి త్రిష అనడంలో అతిశయోక్తి లేదు. “బుజ్జిగాడు”తో “వర్షం”కురిపించి ”సైనికుడు”తో “తీన్మార్” వేయించి “ఆడవాళ్ళ మాటలకే అర్ధాలే వేరులే” అని తెలుగు ప్రేక్షకులకు “బంగారం” లోకం చూపిన అందాల తార త్రిష. ఆమె కొత్త సినిమా కోసం వెండి తెర వేచిచూస్తోంది. త్రిష “నువ్వొస్తానంటే మేం వద్దంటామా” అని ఇప్పటి యువత సైతం స్వాగతిస్తోంది.

Read Full News
balayya c

ఖబడ్దార్…దమ్ముంటే రా…

ఆంధ్రప్రదేశ్ శాసన సభ మొదటి రోజు సమావేశాలు రసాభాసగా మారాయి. సభ ప్రారంభం కాగానే తెలుగుదేశం సభ్యులు చంద్రబాబు అరెస్టుపై వాయిదా తీర్మానం ప్రవేశపెట్టాలని టీడీపీ  సభ్యులు స్పీకర్ పోడియం చుట్టుముట్టారు. ఇదే సందర్భంలో అధికార పార్టీ సభ్యులు సైతం పోడియం వద్దకు చేరడంతో ఒక్కసారిగా గందరగోళ పరిస్థితి నెలకొంది. అధికార పార్టీ ఎం.ఎల్.ఎ. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కూడా తెలుగుదేశం సభ్యులతో జతగట్టడం విశేషం. ఇదే సందర్భంల్లో ఎం.ఎల్.ఎ. నందమూరి బాలకృష్ణ మీసం మేలవేయడం చర్చనీయాంశంగా…

Read Full News
Screenshot 20230921 112504 Instagram

దేనికైనా రెడీ…

కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ కూలీగా మారారు. కార్మికుల సమస్యలు తెలుసుకునే క్రమంలో ఎర్ర రంగు చొక్కా ధరించారు. దేశ రాజధాని ఢిల్లీలోని ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్ లో ఈ కార్యక్రమం జరిగింది. రాహుల్ లగేజ్ మోస్తూ సందడి చేశారు.

Read Full News

దసరా నుంచి అక్కడే…

ఆంధ్ర ప్రదేశ్ పరిపాలన వ్యవస్థ ను వచ్చే దసరా నుంచే విశాఖకు మార్చాలని నిర్ణయించినట్లు మంత్రి చెల్లబోయిన వేణు గోపాలకృష్ణ తెలిపారు. విశాఖకు కార్యాలయాల తరలింపునకు కేబినేట్ ఆమోదం తెలిపిందని, కార్యాలయాల ఎంపికపై కమిటీని నియమించాలని సీఎం జగన్ ఆదేశించినట్లు వివరించారు. సీఎం జగన్ అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో బుధవారం నాడు కేబినేట్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక బిల్లులకు కేబినేట్ ఆమోద ముద్ర వేసింది. కేబినేట్ నిర్ణయాలను సచివాలయ పబ్లిసిటీ సెల్ లో…

Read Full News