IMG 20230920 WA0017

జగన్ కి జ్వరం…

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి జ్వరం వచ్చింది. ఆయనకు వైరల్ ఫీవర్ సోకడంతో బలహీనంగా ఉన్నారు. కేబినెట్ భేటీ తర్వాత అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.తర్వాత కొద్ది సేపు విశ్రాంతి తీసుకున్నారు. అయితే, మధ్యాహ్నం తర్వాత సీఎం జగన్ ను కలిసేందుకు ఇచ్చిన అన్ని అపాయింట్లను రద్దు చేశారు. జలుబు, దగ్గు కూడా ఉండటంతో వైరల్ ఫీవర్ గా గుర్తించారు. 22 నుంచి జరగబోయే శాసనసభ సమావేశాలు ప్రభుత్వానికి అత్యంత కీలకం.

Read Full News
exclusive

మళ్లీ మొదలవుతోందా….!

రాజకీయ, సామజిక  ఉద్యమాలకు పురుటి గడ్డగా ఉన్న ఆంధ్రప్రదేశ్ లో కుల రాజకీయాలు మళ్లీ జడలు విప్పుతున్నాయా? కమ్మ, కాపు, రెడ్డి అంటూ ఆధిపత్య పోరుకు ఆయా వర్గాలు కోరలు చాస్తున్నాయా? ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆంధ్రలో  సర్దుమణిగాయనుకున్న కులాల కక్షలు తిరిగి పెట్రేగుతున్నాయా? మూడు, నలుగు దశాబ్దాల నాటి మాదిరిగా పగలు, ప్రతీకారాలు కారాలు, మిర్యాలు దంచుతున్నాయా? ఇలాంటి అనేక ప్రశ్నలు ఆంధ్రప్రదేశ్ లోని ప్రతీ సామాన్యుని మదిని  తొలుస్తున్నాయి. గత పక్షం రోజులుగా ఆంధ్ర…

Read Full News
3 party

“మార్పు” ముంచొచ్చు..!

వచ్చే ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలులోకి వస్తే తెలంగాణా రాష్ట్రంలో రాజకీయ పార్టీలు భారీ కసరత్తు చేయాల్సిన పరిస్ధితులు కనిపిస్తున్నాయి. దాదాపు 35 స్థానాలకు పైగా మహిళల చేతుల్లోకి వెళ్ళాక తప్పదు. మహిళా జనాభా ఆధారంగా చేసుకొని నియోజక వర్గాల కేటాయింపులు జరిగే అవకశాలున్నాయనే సమచారం అందుతోంది. ఒకవేళ ఇదే జరిగితే ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన భారత రాష్ట్ర సమితి (బి. అర్.ఎస్.) మళ్ళీ కొత్త జాబితాను తయారు చేయాలి, సరైన మహిళా అభ్యర్ధులను…

Read Full News
IMG 20230918 WA0058

ఘనంగా పూజలు…

ప్రగతి భవన్ లో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అయన సతీమణి శోభమ్మ బొజ్జ గణపయ్యకు ప్రత్యేక పూజలు చేశారు. ప్ర‌జ‌ల‌కు సుఖ‌శాంతుల‌ను అందించాల‌ని, ప్రజలందరినీ చల్లగా చూడాలని, రాష్ట్ర ప్ర‌గ‌తి ప్ర‌స్థానానికి విఘ్నాలు రాకుండా చూడాల‌ని విఘ్నేశ్వరుడిని ఈ సంద‌ర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రార్ధించారు. గణపతి పూజా కార్య‌క్ర‌మంలో మంత్రి కేటీఆర్ అయన సతీమణి శైలిమ, కూతురు అలేఖ్య, పాల్గొన్నారు. ప్రత్యేక పూజా కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీలు…

Read Full News
babu pawan c

గెలిస్తే ముఖ్యమంత్రి ఎవరో…!

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టుతో రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య మార్పులు, ఆసక్తికర కొత్త కొత్త విషయాలు తెరపైకి వస్తున్నాయి. మొన్నటి వరకు భారతీయ జనతా పార్టీతో అంటకాగిన జనసేన చంద్రబాబు జైలులో ఉండగానే తెలుగుదేశంతో పొత్తు ఖరార చేసుకుంది. ఇదే సందర్భంలో బిజెపితోనూ సఖ్యతగా మెలుగుతామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పడం రాజకీయ పరిశీలకులను ఆలోచనల్లో పడేసింది. దీంతో తెలుగుదేశం, జనసేన కలసి ఎన్నికల బరిలోకి దిగితే…

Read Full News
IMG 20230915 WA0064

బెంగుళూరులో “సెగ”..

ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని అక్రమంగా అరెస్టు చేశారని బెంగుళూరు లో ఐ. టి. ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. బాబుకు సంఘభావంగా బెంగళూరు ఫ్రీడమ్ పార్క్ దగ్గర ప్రదర్శన నిర్వహించారు.

Read Full News
Screenshot 20230915 203304 WhatsApp

ఎంత కష్టం…

పురిటి నొప్పులతో బాధపడుతున్న నిండు గర్భిణి వాగు దాటడానికి నానా తంటాలు పడింది. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం ఎలిసెట్టి పెల్లి గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. దబ్బగట్ల సునీతకు పురిటి నొప్పులు రావడంతో పొంగిపొర్లుతున్న జంపన్న వాగు దాటలేక అవస్థలు పడింది. దీంతో స్థానికులు ఆమెను ఎలాగైన వాగు దాటించాలని నిర్ణయం తీసుకున్నారు.గజ ఈత గాళ్ళ సాయంతో ఆమెను ట్రాక్టర్ టైరు పై కూర్చోబెట్టి జగ్రత్తగా వాగు దాటించారు.ఇక్కడ బ్రిడ్జి లేకపోవడం వల్ల…

Read Full News
IMG 20230915 WA0031

భేటీ…

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కాంగ్రెస్ ముఖ్యనేతలు భేటీ అయ్యారు. ఏఐసీసీ తెలంగాణా ఇంచార్జ్ మానిక్ రావ్ ఠాక్రే, పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సిఎల్పీ నేత భట్టి విక్రమార్క, ప్రచార కమిటీ కో.చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ తదితరులు హైటెక్ సిటీ మాదాపూర్ లోని తుమ్మల నివాసానికి వెళ్లారు. రాబోయే ఎన్నికలు, తాజా రాజకీయ పరిస్థతులపై చర్చించారు.

Read Full News
IMG 20230915 WA0019 1

“స్మార్ట్” పోలీస్…

తెలంగాణ పోలీసులకు ఫిక్కి స్మార్ట్ పోలీసింగ్ అవార్డు  దక్కింది. ప్రకాష్ సింగ్, జాతీయ భద్రతా సంస్థ మాజీ డిప్యూటీ  అరవింద్ గుప్తా, మంజీరి జరుహార్  చేతుల మీదుగా సిఐడి చీఫ్, రాచకొండ మాజీ సీపీ మహేశ్ భగవత్ అవార్డు అందుకున్నారు. పిల్లల భద్రత విభాగంలో వర్క్‌సైట్ స్కూల్ కార్యక్రమానికి ఈ అవార్డు లభించింది. 2017 – 2022 మధ్య ఇటుక బట్టీల్లో పనిచేస్తున్నవారి ఒడియా, మరాఠీ భాషల్లో వర్క్‌సైట్ స్కూళ్ల ఏర్పాటుచేసి, సుమరు 6,555 మంది వలస…

Read Full News
IMG 20230915 WA0011

తెల్ల కణం లాంటి కోటు…

వైద్యాన్ని పేదలకు అతి చేరువలోకి తెస్తూ, తెలంగాణ రాష్ట్రం ప్రతియేటా పది వేల మంది వైద్యులను తయారు చేసే స్థాయికి చేరిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. రాష్ట్ర వైద్య రంగం దేశ వైద్య రంగ చరిత్రలోనే విప్లవాన్ని సృష్టిస్తూ, దేశానికే ఆదర్శంగా పురోగమించడం తెలంగాణకు గర్వకారణమని అన్నారు. ప్రగతి భవన్ నుండి వర్చువల్ పద్దతిలో 9 వైద్య కళాశాలలను కేసీఅర్ ప్రారంభించారు. కరీంనగర్, కామారెడ్డి, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, కుమరంభీం ఆసిఫాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల,…

Read Full News
IMG 20230822 WA0000

మళ్ళీ పిలుపు…

ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. రేపు విచారణ హాజరు కావాలని గురువారం జారీ చేసిన నోటీసుల్లో పేర్కొన్నారు. అరుణ్ పిళ్లై అప్రూవర్‌గా మారిన తర్వాత కవితను విచారణకు పిలవడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఈడీ ఇప్పటికే పలువురిని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తోంది. ఈ క్రమంలో ఈ కేసులో…

Read Full News
babu pavan

జైలు సాక్షిగా పొత్తు….

ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సమీకరణలు వేగం పుంజుకుంటున్నాయి. అక్కడి జనసేన పార్టీ  బిజెపి తో కలిసి వైసిపితో పోటీకి దిగుతుందని వచ్చిన ఉహాగానాలకు పవన్ కళ్యాణ్ తెర దించారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కలిసి రంగంలోకి దిగనున్నాటు జనసేన అధినేత స్పష్టం చేశారు. రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఉన్న టిడిపి అధినేత చంద్రబాబు నాయుడితో ములాఖత్ అయిన తర్వాత పవన్ విలేకర్లతో మాట్లతుతూ పొత్తు విషయాన్నీ చంద్రబాబుతో చర్చించినట్టు, వచ్చే ఎన్నికల్లో…

Read Full News
IMG 20230910 WA0000

“బాబు”నేరం చేశారా..

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు సంబంధించి కొందరు ప్రముఖులు, రాజకీయ నేతలు స్పందించక పోవడం విస్మయం కలిగిస్తోంది. జాతీయ స్థాయిలో కొందరు నాయకులు ఆయనను ఏదో రూపంలో పరామర్శిస్తుంటే అయన దగ్గర పనిచేసిన అనేక మంది స్పందించక పోవడం చర్చనీయాంశంగా మారింది. మమత బెనర్జీ, అఖిలేష్, రజినీ కాంత్ వంటి వారు తమ సానుభూతి తెలిపారు. కానీ, ఆయనతో అంటకాగిన తెలుగు రాష్ట్రాల నేతలు మాత్రం ఎలాంటి ప్రకటన చేయక…

Read Full News
achanta sunita

జగన్”సైకో” – సునీతా …

కక్షసాధింపు చర్యల్లో భాగంగానే విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడుని ప్రిజనరీ,  సైకో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి  జైలు పాలు చేశాడని టీడీపీ అంగన్ వాడీ, డ్వాక్రా సాధికార సమితి రాష్ట్ర అధ్యక్షురాలు  ఆచంట సునీత వ్యాఖ్యానించారు.చంద్రబాబుని జైలుకు పంపారన్నజైలుకి పంపాలన్న ఏకైక లక్ష్యం తొ చేయని తప్పుకి ఆయన్ని అరెస్టు చేశారని ఆరోపించారు. సీబీఐ, ఈడీ సహా 38 కేసుల్లో ముద్దాయిగా ఉన్న జగన్ రెడ్డే నాలుగేళ్లుగా కోర్టులకు హాజుకాకుండా తప్పించుకుంటున్నాడన్నారు. బాబాయ్ హత్యకేసు, కోడికత్తి…

Read Full News
protest tdp

ఇదో రకం….

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ ను ప్రపంచపటంలో పెట్టిన మహా నాయకుడని, నేడు ఆయన అరెస్టు అక్రమమని కొందరు అభిమానులు హైదరాబాద్ లోని హైటెక్ సిటి సమీపంలో వినూత్న రీతిలో నిరసన తెలిపారు. బాబు అరెస్టును ఖండిస్తూ ఎవరూ గుర్తు పట్టకుండా మాస్క్ వేసుకుని నిరసన వ్యక్తం చేశారు.

Read Full News