Thumb

అహంకారపు “అడ్డా”..!

ఏంటి “నాయుడు”…! గత ఎన్నికల్లో కుల పిచ్చి, ప్రాంతీయ అహంకారంతో తెలుగుదేశం పార్టీ, దాని అధినేత చంద్రబాబు నాయుడికి ఊడిగం చేసినందుకు పట్టుపట్టి మరీ ఏకంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ పదవి దక్కించుకొని తిరుమలేశుని దాసుడిగా వేషం వేసుకున్నావు. బుర్రలో అక్షర జ్ఞానం లేకపోయినా, నువ్వెవరో తెలుగు జనానికి ఏ మాత్రం అవగాహన లేక పోయినా “నాయుడు” అనే ఒకేఒక్క “ట్యాగ్ లైన్”  (గాలం) తో వెంటబడి  చంద్రబాబుని వలలో వేసుకున్నావు. సరే, నీవు, నీ చుట్టూ ఉండే…

Read Full News
ips c

“మర్లకుంట”లో రక్షణ.. “జత్వానీ”తో జైలు..!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమర్థవంతుడైన పోలీసు అధికారిగా ప్రశంశలు అందుకున్న ఐపిఎస్ అధికారి పెండ్యాల సీతా రామాంజనేయులు ఎక్కడ తప్పటడుగు వేశారు? ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ఇతర నేతలకు సన్నిహితంగా ఉన్న ఆయన శత్రువుగా ఎలా మారారు? టిడిపి నేతలకు దగ్గర అని తెలిసి కూడా జగన్ మోహన్ రెడ్డి పీ.ఎస్.ఆర్. ని ఏరికోరి ఎందుకు దగ్గరకు తీశారు? చేసిన తప్పిదాల కంటే సామాజిక వర్గ వేటకు చిక్కుకున్నారా?  ఇవీ పీ.ఎస్.ఆర్. అరెస్టుతో…

Read Full News
posani c

“రాజా”, దర్శకుడు ఎవరు?..!

“రాజా” పోసాని, రాజకీయాలు అంటే వెండితెరపై నటన అనుకున్నారా, కానే కాదు, సినిమాల్లో దర్శకుడు చెప్పినట్టు చేస్తే “నటన” పండుతుంది, కళామతల్లి కరుణిస్తుంది, నలుగురి మెప్పు దక్కుతుంది. కానీ, రాజకీయాల్లో నటిస్తే “పాపం” పండుతుంది. అధికార పక్షం ఆడుకుంటుంది. అందుకే రాజకీయాల్లో మాత్రం సొంత తెలివి అవసరం. ఏమి చేయాలో ఆలోచించాలి, రాసుకోవాలి, అమలు చేయాలి ఇవీ రాజకీయ నాయకుల లక్షణాలు. ఇతరుల స్క్రిప్ట్ ని అనుసరిస్తూ, “రాజకీయ దర్శకుల” సూచనలు పాటిస్తూ నటిస్తే ఇలాగే జైలు…

Read Full News
mic c

మైకుల విలువ తెలియదా..!

దేశంలో ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు వేదిక అవసరం. అందుకే  ఢిల్లీలో పార్లమెంట్, రాష్ట్రాల్లో శాసన సభలు పని చేస్తోంది. రాజ్యాంగంలోని నియమ, నిబంధనలకు లోబడి పని చేస్తున్న ఈ చట్ట సభలను గౌరవించడం ప్రతీ పౌరుడి నైతిక బాధ్యత. ప్రజల సంక్షేమం కోసం కొలువుదీరినవే ఈ సభలు. ఐదేళ్లకు ఒకసారి జరిగే ఎన్నికల్లో గంపెడు ఆశలతో, కొండంత నమ్మకంతో నేతలను తమ ప్రతినిధిలుగా ఎన్నుకొని చట్టసభలకు పంపుతారు. ప్రజా సమస్యలను, వారి సంక్షేమానికి అవసరమైన పనులు, పధకాలపై…

Read Full News
CHIRU C

“అందరివాడు” క్లైమాక్స్ ఏమిటి..!

నటునిగా ఆయనకు తిరుగు లేదు. 70 ఏళ్ల వయస్సు మీద పడుతున్నా, పాత తరానికే కాదు, నేటి యువతరానికి కూడా ఆయన తెరపై కనిపిస్తే ఆ మజానే వేరు. సినిమా హిట్టు, ప్లాప్ లతో సంబంధం లేదు. ఆయన బొమ్మ, స్టెప్పులు మాత్రమే చాలు అంతే అదే లెక్క. . అయితే, తనకున్న అశేష ప్రేక్షక ఆదరణతో ఏదో ఆశించి, ఎంతో ఊహించి”చిరు”వేచిన తప్పటడుగు రాజకీయ తెరపై మాత్రం కోలుకోలేని “ప్లాప్” ని ఇచ్చింది. ఉదయించే సూర్యుడు…

Read Full News
IMG 20240815 WA0020

“అర్ధ నగ్న” స్వాతంత్రం..

ఆంధ్రప్రదేశ్ లోని ఓ మారుమూల గ్రామ ప్రజలు స్వాతంత్ర్య దినోత్సవాన్ని వినూత్నంగా జరిపారు. అదీ సంతోషంతో కాదు. పాలకులకు నిరసన సూచకంగా..78 ఏళ్ల స్వాతంత్ర్య మురిపెం, దాని ఫలాలు తమకు అందలేదని ఆదివాసీలు అసంతృప్తిగా ఉన్నారు. వి.మాడుగుల,మండలంలో తాటిపర్తి పంచాయతీ చివారు రాజయ్ పురంలో గ్రామంలో గిరిజనులు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అర్ధనగ్నంగా ఆకులు చుట్టుకోని నెత్తిన అడ్డ ఆకుల టోపీలు పెట్టుకోని 78 ఎళ్ళు స్వతంత్ర ఫలాలు అందలేదని నిరసన తెలిపారు. గ్రామానికి రోడ్డు, త్రాగునీరు,…

Read Full News
IMG 20240721 WA0011

“అనిత” అక్కసు…

గతంలో చంద్రబాబుకు ఇచ్చిన కారును ఇప్పుడు జగన్ కు ఇచ్చామని ఆంద్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. ఇప్పుడు జగన్ పులివెందుల ఎమ్మెల్యే మాత్రమేనని, ఆ మహానటుడు జనాలకు కనిపించడం లేదని వేరే కారు ఎక్కావంటూ జగన్ పై విరుసుకుపడ్డారు. చంద్రబాబుకు పదేళ్ల పాటు వాడిన వాహనాన్ని కనీసం మరమ్మతులు కూడా చేయించకుండా జగన్ కు కేటాయించారని, వైసీపీ చేసిన ఆరోపణలపై అనిత స్పందించారు. “బాబూ పులివెందుల ఎమ్మెల్యే, నువ్వు ఇంతకుముందు ఓసారి ఏం చేశావో గుర్తుకు…

Read Full News
babu mark c

ఎవరి “మార్కు” పాలన..!

ఆంద్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కొత్త ప్రభుత్వ పాలన అందరినీ ఆకర్షిస్తోంది. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. చంద్రబాబు  పరిపాలన ఆలోచనలు, రూపొందించే వ్యూహాలు ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేస్తాయనేది తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలిసిన విషయమే. నెల రోజుల పాలనలో రాష్ట్ర అభివృద్ది కోసం ఆయన పడుతున్న ఆరాటం ప్రతీ ఒక్కరూ చూస్తూనే ఉన్నారు. అమరావతి అభివృద్ది, విశాఖ ఉక్కు కర్మాగారం వ్యవహారం, భోగాపురం విమానాశ్రయ నిర్మాణం, రైతు సమస్యల పై…

Read Full News
zero c

పార్టీ మూత  – ఫలితాలు సున్నా…

దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పార్టీని మరింత పటిష్టపరిచే వ్యూహాలతో  కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముందుకు వెళ్తుంటే దక్షిణాదిన ఆంధ్రప్రదేశ్ లో అంతర్గత కుమ్ములాటలు తలనొప్పిగా మారాయి. మొన్నటి సార్వత్రిక ఎన్నికలకు ముందు మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె షర్మిలను అనూహ్యంగా తెరపైకి తీసుకువచ్చిన అధిష్టానానికి  ప్రస్తుతం ఆమె వ్యవహార శైలి ఇరకటంలోకి లాగింది. మూడేళ్ల కిందట తెలంగాణ నా “మెట్టినిల్లు”, ఇక్కడే చదివా, ఇక్కడే పెళ్లి చేసుకున్నా, పిల్లాలను కన్నా, చివరి వరకు ఇక్కడే ఉంటా…

Read Full News
dhoni cut

“వంద అడుగుల” అభిమానం…

టీమిండియా మాజీ కెప్టెన్‌ ధోనికి ప్రపంచ వ్యాప్తంగా కోట్ల కొద్ది అభిమానులున్నారు. అందులో తెలుగు వాళ్ల సంఖ్య కూడా ఎక్కువే. అయితే,  తాజాగా తెలుగు వాళ్లు ధోనిపై తమ వంద అడుగుల అభిమానం చాటారు. ధోని పుట్టిన రోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో వంద అడుగుల భారీ కటౌట్‌ ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ లోని నందిగామలో తెలుగు ధోని ఫ్యాన్స్‌ ఆధ్వర్యంలో ఈ భారీ కటౌట్ ఏర్పాటు చేశారు. ధోని పుట్టిన రోజు నాడు  ఈ కటౌట్‌ను ఫ్యాన్స్…

Read Full News
hand fan c

చెల్లిని తీసేయండి – నేను చూసుకుంటా ?

ఆంధ్రప్రదేశ్ లో గత నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాభవం చవి చూసిన జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది.  ప్రజలు ఇచ్చిన “ఒక్క ఛాన్స్”ని ఐదేళ్ళ పాటు ఒంటెద్దు పోకడలతో చేజార్చుకున్న వైసీపీ ప్రభుత్వానికి ఈ ఎన్నికల్లో తిరుగులేని ఆధిపత్యాన్ని సాధించి అధికార పగ్గాలు సొంతం చేసుకున్న  తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ శ్రేణులతో జనంలోకి వెళ్ళలేని దుస్థితి నెలకొంది. అడ్డూ అదుపు లేని మాటలతో  వైసీపీని…

Read Full News
Screenshot 20240623 191751 WhatsApp

“Target” Demolision…

In a significant development in TDP’s vendetta politics in Andhra Pradesh, the under construction YSRCP party’s central office in Tadepalli was demolished despite High Court order. This unprecedented action, the first instance of a party office being demolished in the state’s history, commenced around 5:30 am using excavators and bulldozers.The demolition proceeded even though the…

Read Full News
IMG 20240621 WA0019

షర్మిల “క్విడ్ ప్రో కో”..!

తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీ, లోక్ సభ అభ్యర్థుల ఎన్నిక పారదర్శకంగా జరుగలేదని, ఆంద్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిలరెడ్డి, ఆమె అనుచరగణం అభ్యర్థుల ఎంపికలో “క్విడ్ ప్రో కో” (నీకు అది – నాకు ఇది) తరహా పద్ధతి అవలంభించారని ఆ రాష్ట్ర కాంగ్రెస్ కార్యనిర్వహక అధ్యక్షులు సుంకర పద్మశ్రీ, రాకేష్ రెడ్డి ఆరోపించారు. షర్మిల కోటరీ వైఖరి వల్ల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీపై తీవ్ర ప్రభావం పడిందన్నారు. అభ్యర్థులకు కాంగ్రెస్ అధిష్టానం అందించిన…

Read Full News
IMG 20240602 WA0050

ముందే తాకిన “నైరుతి”..

రెండు రోజుల కిందట కేరళ రాష్ట్రాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు ఆంద్రప్రదేశ్ రాయలసీమ ప్రాంతం లోకి ప్రవేశించాయి. నైరుతి సీమలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించినట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇవి విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా కూడా ఉన్నట్లు వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడనున్నాయి. తొలుత జూన్ 4-5 తేదీల్లో రుతుపవనాలు ఆంధ్రాణి తాకుతాయని భావించగా ముందుగానే రుతుపవనాలు ఆంధ్ర ప్రదేశ్ లోకి…

Read Full News
IMG 20240414 WA0007

ఏం జరుగుతోంది..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన రాయి దాడి పై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. భద్రతా వైఫల్యంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మొన్న ప్రధాని సభ, నిన్న సీఎం సభలో జరిగిన వరస ఘటనలపై విచారం వ్యక్తం చేసింది. తాజా ఘటనపై పూర్తి వివరాలతో కూడిన నివేదికను అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈసీ ఆదేశాలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఘటన జరిగిన ప్రాంతాన్ని విజయవాడ పోలీసులు జల్లెడ పడుతున్నారు. సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. కేసు…

Read Full News