IMG 20230920 WA0017

జగన్ కి జ్వరం…

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి జ్వరం వచ్చింది. ఆయనకు వైరల్ ఫీవర్ సోకడంతో బలహీనంగా ఉన్నారు. కేబినెట్ భేటీ తర్వాత అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.తర్వాత కొద్ది సేపు విశ్రాంతి తీసుకున్నారు. అయితే, మధ్యాహ్నం తర్వాత సీఎం జగన్ ను కలిసేందుకు ఇచ్చిన అన్ని అపాయింట్లను రద్దు చేశారు. జలుబు, దగ్గు కూడా ఉండటంతో వైరల్ ఫీవర్ గా గుర్తించారు. 22 నుంచి జరగబోయే శాసనసభ సమావేశాలు ప్రభుత్వానికి అత్యంత కీలకం.

Read Full News
babu pavan

జైలు సాక్షిగా పొత్తు….

ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సమీకరణలు వేగం పుంజుకుంటున్నాయి. అక్కడి జనసేన పార్టీ  బిజెపి తో కలిసి వైసిపితో పోటీకి దిగుతుందని వచ్చిన ఉహాగానాలకు పవన్ కళ్యాణ్ తెర దించారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కలిసి రంగంలోకి దిగనున్నాటు జనసేన అధినేత స్పష్టం చేశారు. రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఉన్న టిడిపి అధినేత చంద్రబాబు నాయుడితో ములాఖత్ అయిన తర్వాత పవన్ విలేకర్లతో మాట్లతుతూ పొత్తు విషయాన్నీ చంద్రబాబుతో చర్చించినట్టు, వచ్చే ఎన్నికల్లో…

Read Full News
achanta sunita

జగన్”సైకో” – సునీతా …

కక్షసాధింపు చర్యల్లో భాగంగానే విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడుని ప్రిజనరీ,  సైకో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి  జైలు పాలు చేశాడని టీడీపీ అంగన్ వాడీ, డ్వాక్రా సాధికార సమితి రాష్ట్ర అధ్యక్షురాలు  ఆచంట సునీత వ్యాఖ్యానించారు.చంద్రబాబుని జైలుకు పంపారన్నజైలుకి పంపాలన్న ఏకైక లక్ష్యం తొ చేయని తప్పుకి ఆయన్ని అరెస్టు చేశారని ఆరోపించారు. సీబీఐ, ఈడీ సహా 38 కేసుల్లో ముద్దాయిగా ఉన్న జగన్ రెడ్డే నాలుగేళ్లుగా కోర్టులకు హాజుకాకుండా తప్పించుకుంటున్నాడన్నారు. బాబాయ్ హత్యకేసు, కోడికత్తి…

Read Full News
roja

ఆయనకు”మెంటల్”- రోజా..

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టు అనంతరం ఆ రాష్ట్ర మంత్రి, నటి రోజా చేస్తున్న ప్రకటనలు, వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఆమె చంద్రబాబు అరెస్టు కావడం వల్లే దేవాలయానికి వెళ్లినట్టు చెప్పడం ఒకటైతే, బాలకృష్ణ పై రకరకాల వ్యాఖ్యలు చేయడం అధికార పార్టీ శ్రేణుల్లో ఎలా ఉన్నా గానీ తెలుగుదేశం పార్టీ వర్గాలకు మాత్రం మింగుడు పడడంలేదు. బాలకృష్ణ టీడీపీ ఆఫీసుకెళ్లి చంద్రబాబు కుర్చీలో కూర్చొని మాట్లాడటంపై ప్రజల్లో ఒక చర్చ జరిగిందని,…

Read Full News
babu

కొంత ఊరట…

ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కి ఏపి హై కోర్టులో కొంత ఉరట కనిపించింది.చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలంటూ విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపింది. ఆయన్ని ఈ నెల 18 వ తేదీ వరకు కస్టడీకి తీసుకోవద్దని సీఐడీని ఆదేశిందింది. అదేవిధంగా చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై విచారణ కూడా ఈనెల 19కి వాయిదా వేసింది. తనపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను…

Read Full News
IMG 20230912 WA0008

ములాఖాత్…

రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఉన్న నారా చంద్రబాబు నాయుడు ములాఖాత్ అనంతరం బయటకు వచ్చిన ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకష్, కోడలు బ్రాహ్మణి.

Read Full News
IMG 20230910 WA0089

నిరసన సెగలు…

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ ను ఖండిస్తూ టిడిపి శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, నిరాహార దీక్షలు చేపట్టాయి. నల్లబ్యాడ్జీలు ధరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అవినీతిని నిలదీయడంతో పాటు రాక్షస పాలనకు వ్యతిరేకంగా ప్రజాక్షేత్రంలో ఎండగట్టడాన్ని జగన్ రెడ్డి జీర్ణించుకోలేక కక్షసాధింపు చర్యలకు దిగారని దుయ్యబట్టారు. తన అవినీతి మరకను ఇతరులకు అంటించేందుకు పన్నిన కుట్రలో భాగమే చంద్రబాబు అక్రమ అరెస్ట్ అని నిరసించారు. తండ్రి…

Read Full News
babu 2

నన్ను అరెస్టు చేయొచ్చు..

తనను ఒకటి, రెండు రోజుల్లో అరెస్ట్ చేయవచ్చని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి,  తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. నిప్పులా బతికిన తనపైనే తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. ఐటీ నోటీసులపై అయన పరోక్షంగా స్పందించారు. ఉమ్మడి అనంతపురం జిల్లా రాయదుర్గంలో వివిధ వర్గాల ప్రజలతో నిర్వహించిన ప్రజా వేదిక చర్చా కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో విధ్వంస పాలన సాగిస్తోందని మండిపడ్డారు. జగన్…

Read Full News
sajjal

పోలవరం”బాబు”ఏ.టీ.ఎం…

పోలవరం ప్రాజెక్టును మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏటీఎం మాదిరి వాడుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు.అప్పట్లో ప్రధాని మోడీ అన్నట్లుగానే చంద్రబాబు ప్రతి పనిలోనూ అడ్డగోలుగా ముడుపులు మింగారని ఆరోపించారు. బాబు సహా అయన ముఠా మొత్తానికి ఈ కుంభకోణంలో ఉందన్నారు. సచివాలయం భవనాలు, టిడ్కో ఇళ్ళు ఇలా ప్రతి పనిలోనూ చంద్రబాబు అనుచరులు లబ్ధి పొందారన్నారు. ప్రభుత్వ పనులకు సంబంధించి ఎల్ అండ్ టి, షాపూర్ జి సంస్థలకు కాంట్రాక్టులు ఇచ్చి…

Read Full News
ys c

జ్ఞాపకాలు..

దివంగత నేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్రెడ్డి 14వ వర్ధంతి సందర్భంగా కడప జిల్లా ఇడుపులపాయలోని ఆయన స్మారకం వద్ద పలువురు నివాళులు అర్పించారు. ఆయన సతీమణి విజయమ్మ, కూతురు షర్మిల స్మారకం వద్ద ప్రార్ధనలు జరిపారు.

Read Full News
tenneti vanitha

అంతా మీ కోసమే…

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే మహిళల  సాధికారతకు పెద్ద పీట వేయడం జరిగిందని, 90 శాతం పైగా పథకాలను మహిళల పేరుతోనే అందించినట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం, ప్రకృతి విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు. మహిళలు  సంక్షేమం పథకాలను తెలుసుకొని సామాజికంగా, ఆర్థికంగా లబ్ది పొందాలని ఆకాంక్షించారు. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కొవ్వూరు పట్టణంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి పాల్తోన్నారు. ప్రతి ఇంటికి  ప్రభుత్వం నుంచి అందుతున్న సంక్షేమాన్ని…

Read Full News
cheetha

ఐదో చిరుత…

అలిపిరి కాలినడక మార్గంలో మరో చిరుత సంచరిస్తోంది. ఈ విషయం గుప్పుమనడం శ్రీవారి భక్తులు భయందోలనకు గురిచేస్తోంది. కాలిబాటలోని లక్ష్మీనరసింహ ఆలయం వద్ద చిరుత తిరుగుతున్న దృశ్యాలు ట్రాప్‌ కెమెరాల్లో నమోదయ్యాయి. ఇటీవల చిరుత దాడికి గురై మరణించిన చిన్నారి లక్షిత(6) మృతదేహం లభ్యమైన ప్రాంతంలోనే చిరుత సంచరించినట్లు అధికారులు తెలిపారు. ఇప్ప‌టికే నాలుగు చిరుత‌ల‌ను ప‌ట్టుకున్న అట‌వీ శాఖ ఐదో దానిపై దృష్టి పెట్టింది. దాన్ని పట్టుకోవడానికి వివిధ ప్రాంతాల‌లో బోనులు ఏర్పాట్లు చేశారు. మెట్ల…

Read Full News
ayyanna

అయ్యన్న అరెస్టు…

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ పాలిటి బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుని శుక్రవారం విశాఖ పట్నం విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు. నారా లోకేష్ యువగళం పాదయాత్ర సందర్భంగా గన్నవరంలో నిర్వహించిన సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇతర మంత్రులపై అయ్యన్న చేసిన వ్యాఖ్యలపై కృష్ణా జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన్ని విశాఖలో అరెస్ట్ చేశారు.

Read Full News
buggana c

హ్యాట్రిక్ ఎలా …

రాబోయే ఎన్నికల్లో ఉమ్మడి కర్నూలు జిల్లాలోని డోన్ నియోజక వర్గంలో పరిస్థితులు మారబోతున్నాయా? అధికార పార్టీ నేత ఆశిస్తున్న హ్యాట్రిక్ విజయం ఆయన్ని వరిస్తుందా? ఎన్నికలు సమిస్తున్నందున డోన్ లో ఇలాంటి సవ్వా లక్ష ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నియోజకవర్గాన్ని ఎలాగైనా కైవసం చేసుకొవలని తెలుగుదేశం పార్టీ గట్టి ప్రయత్నం చేస్తోంది. వైసిపి నేత, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేందర్ రెడ్డి కూడా అదే స్థాయిలో ముందుకు వెళ్తున్నారు. ఈ సీటును వరుసగా రెండుసార్లు కైవసం…

Read Full News
ttd

పోస్టర్…

తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం ఎదుట శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల పోస్టర్లును టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి విడుదల చేశారు. రాబోయే స్వామివారి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించడానికి టిటిడి సన్నాహాలు చేస్తోంది.

Read Full News