mla cong

కాంగ్రెస్ లోకి అబ్రహం…

అలంపూర్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అబ్రహం కాంగ్రెస్ పార్టీ లో చేరారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీ లోకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, మల్లు రవి తదితరులు పాల్గొన్నారు.

Read Full News
high court

డి.ఎం.ఇ. పోస్టు సంగతేంటి…!

తెలంగాణ వైద్య విద్యా శాఖకు రెగ్యులర్ డైరెక్టర్  (సంచాలకులు) పోస్టును ఏర్పాటు చేయకపోవడంపై హై కోర్టు ప్రభుత్వానికి నోటిసులు జారీ చేసింది. రాష్ట్ర విభజన జరిగి తొమ్మిది ఏళ్లు గడిచినా ఈ పోస్టును ఏర్పాటు చేయకపోవడం పై అసంతృప్తి వ్యక్తం చేసింది.డి.ఎం.ఇ. పోస్టు నియామకం పై ప్రభుత్వ విధానాన్ని సవాలు చేస్తూ వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రి సుపరింటెన్ డెంట్ నరేంద్ర పిటిషన్ దాఖలు చేశారు. విభజన సమయంలో డి.ఎం.ఇ. పోస్టు ఆంధ్రప్రదేశ్ కి చెందుతుందనే విషయాన్ని 2014…

Read Full News
sanjay

‘‘యూజ్ లెస్ ఫెలో”….

‘‘యూజ్ లెస్ ఫెలో… ఉద్యోగాలు ఎందుకివ్వడం లేదని నిరుద్యోగులు నిరసన తెలిపితే సముదాయిం చాాల్సింది పోయి తిడతావా? దవడ పళ్లు రాలకొడితే సరి… కండకావరమెక్కి మాట్లాడుతున్నవ్. ఒక్కసారి మడతల చొక్కా.. అరిగిన రబ్బర్ చెప్పులేసుకున్న నీ గతాన్ని గుర్తు చేసుకో’’ అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో కేటీఆర్ పై ధ్వజమెత్తారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చొప్పదండి నియోజకవర్గం గంగాధరలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాటాడుతూ బిఆర్ఎస్, కాంగ్రెస్…

Read Full News
mayawati

బడుగుల కలలు సాకారం కావాలి…

అంబేడ్కర్‌, కాన్షీరామ్‌ కలలను మనం సాకారం చేయాలని బీఎస్పీ అధినేత్రి మాయావతి పిలుపునిచ్చారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఎస్పీ అభ్యర్థులకు మద్దతుగా సూర్యాపేటలో నిర్వహించిన ప్రచార సభలో మాయావతి పాల్గొని ప్రసంగించారు. యూపీ తరహాలో తెలంగాణలోనూ బీఎస్పీని ఆదరించాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కొన్ని పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలు ప్రకటించినా వాటిని అమలు చేయట్లేదన్నారు. బీఎస్పీని గెలిపిస్తే ఆర్‌ఎస్‌ ప్రవీణ్ కుమార్‌ ముఖ్యమంత్రి అవుతారని తెలిపారు….

Read Full News
revnth gjvl c

“డ్రంక్ & డ్రైవ్ టెస్ట్”కి సిద్ధమా..!

కేసీఆర్ ను గజ్వేల్ లో ఓడించి, పొలిమేరలకు తరమాలని గజ్వేల్ సభలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మీరు పాతాళానికి తోక్కుతారని తెలిసే కెసిఆర్ కామారెడ్డికి పారిపోయిండని, కామారెడ్డికే కాదు కన్యాకుమారికి పారిపోయిన ప్రజలు కేసీఆర్ ను ఓడించి తీరతారన్నారు. గజ్వేల్ లో జరిగిన ఎన్నికల సభలో రేవంత్ మాట్లాడుతూ రైతుల మేలుకంటే కేసీఆర్ తన ఫామ్ హౌస్ కు నీళ్లు తీసుకపోయేందుకే ప్రాధాన్యతనిచ్చాడని విమర్శించారు. రైతుల వడ్లు కొనని కేసీఆర్ ఆయన ఫామ్ హౌస్ లో పండిన…

Read Full News
nzb revanth c

80 సీట్లు మావే…!

తెలంగాణలో త్వరలో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 80 సీట్లకు ఒక్క సీటు తగ్గినా ఏ శిక్షకైనా సిద్ధం అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నిజామాబాద్ రూరల్, నారాయణఖేడ్, నియోజక వర్గంలలో జరిగిన విజయభేరి జనసభలలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. కేసీఆర్ కు పదవి పోతుందన్న భయంపట్టుకుందని, అందుకే మతి తప్పి మాట్లాడుతుండో, మందేసి మాట్లాడుతుండో తెలియదు కాని, కాంగ్రెస్ కు 20 సీట్లు కూడా రావని కేసీఆర్ మాట్లాడడం ఆశ్చర్యంగా…

Read Full News
25meet

25న ధూం..ధాం…సభ…

భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఈ నెల 25 వ తేదీన పరేడ్ గ్రౌండ్ లో ఎన్నికల భారీ బహిరంగ సభ ను నిర్వహిస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సోమవారం పరేడ్ గ్రౌండ్ లో సభ నిర్వహణ ఏర్పాట్లపై పర్యవేక్షణ జరిపారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ బహిరంగ సభ కు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ముఖ్య అతిధిగా హాజరవుతారని చెప్పారు. నగరంలోని అన్ని నియోజకవర్గాల కు చెందిన ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ…

Read Full News
priyanka speec

రెండు లక్షల ఉద్యోగాలు గ్యారంటీ..

కెసిఆర్ ప్రభుత్వ హయంలో  నిరుద్యోగుల హత్మహత్యలు  పెరిగాయని, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపడితే వెంటనే యువతకు రెండు లక్షల ఉద్యోగాలు తప్పనిసరి ఇస్తామని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీ హామీ ఇచ్చారు. పదేళ్ళ పాలనలో తెలంగాణ కెసిఆర్ చేతిలో నిలువుదోపిడికి గురైందని, భారత రాష్ట్ర సమితి అవినీతిలో కూరుకుపోయిందని దుయ్యబట్టారు. కెసిఆర్ ప్రభుత్వంలో నిరుద్యోగుల సమస్యలు తీరలేదన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్, కుమురం భీమ్ జిల్లా ఆసిఫాబాద్ ఎన్నికల సభల్లో ప్రియాంక పాల్గొన్నారు. తెలంగాణలో…

Read Full News
amitsha

గద్వాల్ లో “షా”…

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా వివిధ సభల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ చేరుకున్న కేంద్ర హోమ్ శాఖమంత్రి అమిత్ షా హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎన్నికల ఇంచార్జ్ జవడేకర్ పలువురు నేతల స్వాగతం పలికారు. గద్వాల్ లో జరిగే సకల జనుల విజయ సంకల్ప సభలోఅమిత్ షా పాల్గొంటారు.

Read Full News
3 party

కాంగ్రెస్ కి 74 సీట్లు : లోక్ పోల్

తెలంగాణ ఎన్నికలపై ప్రముఖ సర్వే సంస్థ లోక్‌పోల్‌ నిర్వహించిన సర్వేలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రానుంది. 74 సీట్లతో కాంగ్రెస్‌ తిరుగులేని విజయం సొంతం చేసుకోబోతోందని, లోక్‌పోల్‌ సర్వే సంస్థ వెల్లడించింది. సీఎం కేసీఆర్‌ కామారెడ్డి- గజ్వేల్‌లో రెండు చోట్లా విజయం సాధించనుండగా, బీఆర్‌ఎస్‌కు మొత్తంగా కేవలం 29 స్థానాలు మాత్రమే దక్కనున్నట్లు పేర్కొంది. ఇక బీజేపీకి 9, మజ్లిస్‌కు 6 స్థానాలు వస్తాయని వెల్లడించింది.  ప్రధానంగా నల్లగొండ, ఖమ్మం  జిల్లాల్లో కాంగ్రెస్‌ దాదాపు అన్ని సీట్లలో…

Read Full News
uttam

తండ్రీ, కొడుకుల అబద్ధాలు….

ఎన్నికల ప్రచారంలో కేసీఆర్,కేటీఆర్ ,హరిష్ రావు లు ఓటమి భయం తో అబద్దాలు మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. రైతు బంధు ఆపాలని నేను గానీ, కాంగ్రెస్ నేతలు కూడా ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేశారు. గత నెలలో రైతు బంధు ,దళిత బంధు ,బీసీ బంధు ,రుణమాఫీ లు నామినేషన్ ప్రక్రియ కంటే ముందే విడుదల చేయాలని డిమాండ్ చేసినట్టు గుర్తు చేశారు.రైతుబంధు ఆపాలని కాదని, దాన్ని మరింతగా పెంచాలని డిమాండ్…

Read Full News
balakishn

భారాసలోకి బాల కిషన్ …

కొడంగల్ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసి అనంతరం ఉపసంహరించుకున్న బాలకిషన్ యాదవ్ పట్నం మహేందర్ రెడ్డి అధ్వర్యంలో కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు.కేటీఆర్ బాలకిషన్ యాదవ్ కు గులాబి కందువ కప్పి స్వాగతం పలికారు. దుద్యాల మండలం పోలేపల్లి గ్రామానికి చెందిన బాలకిషన్ యాదవ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ తాను కొడంగల్ ప్రజలకు సేవ చేసేందుకు తాను రాజకీయాల్లోకి వచ్చానని, అయితే సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రంలో సాగుతున్న అభివృద్ధి కొడంగల్ లో ప్రజల…

Read Full News
vijsnti karge

ఈ సారి కాంగ్రెస్…

సినీ నటి, మాజీ ఎం.పి. విజయ శాంతి ఈ సారి కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. తగిన ప్రాధాన్యత దక్కడంలేదని భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసిన ఆమె కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే సమక్షంలో ఆ పార్టీలో చేరారు.

Read Full News
rahul wgl

భరోసా మాది…ఒక్క చాన్స్ ఇవ్వండి…

తెలంగాణలో కాంగ్రెస్‌కు అధికారమిస్తే ఆరు గ్యారంటీలను కచ్చితంగా అమలు చేస్తామని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ స్పష్టం చేశారు. వరంగల్‌ రుద్రమదేవి కూడలిలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. ‘‘ఎక్కడ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటైనా ఆ రాష్ట్రంలో ప్రతి పైసా పేదలకే వెళ్తుందన్నారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా వారి బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేస్తామని, భారాస, బీజేపీ నేతలు కొంత మందికి మాత్రమే లబ్ధి చేకూరుస్తారని వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోడీ తన మిత్రుడు…

Read Full News
rahul vja

“పినపాక” కు రాహుల్..

తెలంగాణ శాసన సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ ఖమ్మం జిల్లా పినపాకకు చేరుకున్నారు. జైపూర్ నుండి ప్రత్యేక విమానం లో ఆంధ్రప్రదేశ్ గన్నవరం విమానాశ్రయం చేరుకున్న రాహుల్ గాంధీకి అక్కడి కాంగ్రెస్ నేతలు స్వాగతం పలికారు. అనంతరం రాహుల్ హెలికాప్టర్ లో గన్నవరం నుండి ఖమ్మం జిల్లా మణుగూరు సమీపంలోని పినపాక బయలుదేరి వెళ్ళారు.

Read Full News