IMG 20231027 WA0010

కేసీఆర్ కారకుడు…

బిఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పూర్తీ బాధ్యత వహించాలని మావోయిస్టులు డిమాండ్ చేశారు.ఈ మేరకు మావోయిస్టు జేఎమ్‌‌డబ్ల్యూపీ డివిజన్ కమిటీ కార్యదర్శి వెంకటేష్ పేరుతో లేఖ విడుదలైంది. మేడిగడ్డ లక్ష్మీబ్యారేజీ అంతరాష్ట్ర వంతెన పిల్లర్లు కుంగి పోవడానికి కారణం నాణ్యత లోపమే అన్నారు. వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన బ్యారేజీ కేవలం మూడు సంవత్సరాలకే కుంగి పోవడం అధికారుల వైఫల్యానికి నిదర్శనం అన్నారు. దీన్ని 2016 మే 2వ న నిర్మాణం…

Read Full News
revant 768x512 1

“మేడి”పాపం కేసీఅర్ దే…

కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజ్ ప్రమాదానికి కేసీఆర్ కుటుంబమే కారణమని, కాళేశ్వరం అవినీతిలో మొదటి దోషి కేసీఆర్ కుటుంబమే అని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగడం పై సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ తో దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. ఈ బ్యారేజి ద్వారా లక్ష కోట్లను కేసీఆర్, కాంట్రాక్టర్లు దోచుకున్నారన్నారు. నాణ్యత లోపం వల్ల మెడిగడ్డ ప్రమాదం జరిగిందనీ, కేంద్ర హోంమంత్రి, గవర్నర్ ,ఎన్నికల కమిషన్ మేడిగడ్డ పై విచారణకి ఆదేశించాలనీ డిమాండ్…

Read Full News
journ sridher

మేనిఫెస్టోలో”కలం”వీరులు..!

దశాబ్దాలుగా అపరీష్కృతంగా ఉన్న తమ సమస్యలను పరిష్కరించడానికి వీలుగా రాబోయే ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ రూపొందించే మేనిఫెస్టో లో వాటిని చేర్చాలని తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక కోరింది. ఈ మేరకు తెలంగాణా కాంగ్రెస్ మ్యానిఫెస్టో ఛైర్మెన్ దుద్దిళ్ళ శ్రీధర్ బాబుని వేదిక ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం కలిసింది. తెలంగాణ జర్నలిస్టుల సమస్యలు, సంక్షేమానికి సంబంధించి 9 ప్రధాన అంశాలతో కూడిన వినతిపత్రం అందజేశారు. తమ దీర్ఘకాలిక సమస్యలను కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచి వాటి…

Read Full News
rahul tea c

“దొర”ల పాలన వద్దు.…

తెలంగాణలో ప్రజల రాజ్యం నడవాలని పదేళ్ళ కిందట  సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని, కానీ అది ఈనాడు దొరల చేతుల్లోకి వెళ్లిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ కోరుకుందీ, ఆశించింది దొరల తెలంగాణ కాదు, ప్రజల తెలంగాణ అని పేర్కొన్నారు. “దొరల తెలంగాణ కు, ప్రజల తెలంగాణకు” మధ్య కొద్దిరోజుల్లో ఎన్నికలు జరగనున్నాయని అన్నారు. ఆర్మూరులో జరిగిన విజయభేరీ తొలి విడత బస్ యాత్ర ముగింపు సభలో రాహుల్ గాంధీ…

Read Full News
jornlist harish

ఇస్తాం..ఇస్తాం..తప్పక ఇస్తాం..

హైదరబాద్ జర్నలిస్టుల ఇళ్ల స్థలాల అంశం త్వరలోనే పరిష్కరిస్తామని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. కొత్తగా ఏర్పాటైన “ది తెలంగాణా జర్నలిస్ట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ” ప్రతినిధులతో ఆయన ప్రగతి భవన్ లో భేటీ అయ్యారు. సొసైటీ సభ్యత్వ వివరాలు అడిగి తెలుసుకున్నారు. మూడోసారి కూడా తామే అధికారంలోకి వస్తామన్న మంత్రి హరీష్ రావు జర్నలిస్టుల హౌసింగ్ సమస్యని కూడా తప్పక పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మంత్రి కేటీఆర్ కలిసి ఇదే అంశంపై…

Read Full News
wgl rahul

కాంగ్రెస్ గెలుపు ఖాయం…

రాష్ట్రంలో అధికారం ఒక కుటుంబానికే పరిమితమైందని,  దొరల తెలంగాణ-ప్రజల తెలంగాణకు మధ్య ఎన్నికలు జరగబోతున్నాయని  కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ అన్నారు. వరంగల్ బస్సు యాత్రలో ఆయన మాట్లాడుతూ  తెలంగాణ ప్రజలు రాజ్యాధికారం చేపట్టాలని ఆశించాం, కానీ,  రాష్ట్రంలో కేసీఆర్ ప్రజలకు దూరమవుతూ వస్తున్నారని పేర్కొన్నారు. మీ ఉత్సాహం చూస్తుంటే కొద్ది రోజుల్లో జరిగే ఎన్నికలలో బిఆర్ఎస్, కేసీఆర్ ఓటమి ఖాయమనిపిస్తోందని వ్యాఖ్యానించారు. దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వం తెలంగాణలోనే ఉందనీ, బీఆర్‍ఎస్ అవినీతితో ప్రజలు…

Read Full News
rahul priyanka 1

రామప్పలో రాహుల్…

తెలంగాణా ఎన్నికల ప్రచారానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు వరంగల్ జిల్లా లోని రామప్ప ఆలయంలో పూజలు చేశారు. దేవాలయంలో పూజల అనంతరం వారిద్దరూ ములుగులో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. రాహుల్, ప్రియాంక వెంట తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, పలువురు నేతలు ఉన్నారు.

Read Full News
iflu c

“ఇఫ్లూ”లో వేడి…

హైదరాబాద్ తార్నాక లోని ఇంగ్లిష్, విదేశీ భాషల విశ్వవిద్యాలయం(ఇఫ్లూ)లో లైగిక వేధింపులను నిరోధించడానికి  ఏర్పాటు చేసిన “సెన్సిటైజేషన్,ప్రివెన్షన్ మరియూ రిడ్రేసల్ అఫ్ సెక్స్ వల్ హెరాస్మెంట్”(స్పర్శ్)ని వెంటనే పునరుద్దరించాలని డిమాండ్ చేస్తూ ఇఫ్లూ విద్యార్ధులు నిరసన మొదలు పెట్టారు. లైంగిక వేధింపులను అదుపు చేయడానికీ, సమస్యలను పరిష్కరించడానికి ఏర్పాటు చేసిన స్పర్శ్ ని  గత జూన్ నెల నుంచి ఎవరూ పట్టించుకోవడం లేదని విద్యార్ధులు తెలిపారు. ఇదే విషయాన్ని స్పర్శ్ చైర్ పర్సన్ గా ఉన్న రేవతి…

Read Full News
4 Pictures BVR SCIENT Foundation Week

పరిజ్ఞానం పెంచుకోవాలి..

యువత అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలంటే అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తీ స్థాయిలో వినియోగించుకోవాలని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిలిసై సూచించారు.బివిఅర్ మోహన్ రెడ్డి స్కూల్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ ప్రెన్యుర్ షిప్ ప్రారంభోత్సవం సందర్భంగా సంగారెడ్డి జిల్లా కంది లోని ఐఐటి హైదరాబాద్ లో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రానున్న కాలంలో యువత ఉన్నత స్థాయికి ఎదగాలంటే సాంకేతిక పరిజ్ఞానంలో రానించడం అవసరం అన్నారు. ఐఐటి హైదరాబాద్…

Read Full News
IMG 20231015 WA0034

మేనిఫెస్టోలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు..

జర్నలిస్టుల ఇంటి స్థలాల అంశాన్ని తమ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టే అంశాన్ని పరిశీలిస్తామని, ఈ విషయాన్ని శ్రీధర్‌బాబు నేతృత్వంలోని మేనిఫెస్టో కమిటీకి నివేదిస్తామని తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఈ మేరకు డెక్కన్‌ జర్నలిస్ట్స్‌ హౌసింగ్‌ సొసైటీ (డీజేహెచ్‌ఎస్‌) అధ్యక్షులు బొల్లోజు రవి, ఉపాధ్యక్షులు మరిపాల శ్రీనివాస్, కోశాధికారి చిలుకూరి అయ్యప్ప, డైరెక్టర్లు జి.ప్రతాప్‌రెడ్డి, దండ రామకృష్ణ, సభ్యులు క్రాంతి తదితరులు ఆదివారం రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. ఎన్నికల మేనిఫెస్టోలో జర్నలిస్టుల…

Read Full News
IMG 20231015 WA0030

“న్యాయానికి సంకెళ్లు”…

అంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్టు “న్యాయానికి సంకెళ్లు” అంటూ నారా లోకేష్, బ్రాహ్మణి నినదించారు. హైదరాబాద్లోని తమ నివాసంలో చేతులకు తాళ్లు కట్టుకుని చంద్రబాబు అక్రమ అరెస్టుని నిరసించారు. ఏ ఆధారాలు లేకపోయినా, రాజకీయ కక్షతో, ప్రజల నుంచి చంద్రబాబుని దూరం చేసేందుకు అక్రమంగా అరెస్టు చేశారని మండిపడ్డారు. వ్యవస్థలను చేతుల్లోకి తీసుకొని చంద్రబాబుని జ్యుడీషియల్ రిమాండ్ లో ఉంచి ప్రాణహాని తలపెట్టాలని కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. జైలులో ఆరోగ్యం…

Read Full News
IMG 20231015 WA0014

నామినేషన్ వేయండి….

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ తరఫున బరిలోకి దిగుతున్న అభ్య‌ర్థుల‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ బీ-ఫారాలు అందించారు. తెలంగాణ భ‌వ‌న్‌లో 51 మంది ఎమ్మెల్యే అభ్య‌ర్థుల‌కు బీ-ఫారాలు ఇచ్చారు. ఒక్కో అభ్య‌ర్థికి రెండు బీ-ఫారాలు అందిస్తున్న‌ట్లు కేసీఆర్ తెలిపారు. మిత‌గా వారికి రేపు అందిస్తామ‌న్నారు. కేసీఆర్ త‌ర‌పున గంప గోవ‌ర్ధ‌న్, మంత్రి ప్ర‌శాంత్ రెడ్డి త‌ర‌పున ఎమ్మెల్సీ క‌విత బీ-ఫార‌మ్ అందుకున్నారు. ఉమ్మ‌డి మెద‌క్, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్, ఖ‌మ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల‌కు చెందిన బీఆర్ఎస్ అభ్య‌ర్థుల‌కు బీ-ఫారాలు అంద‌జేశారు….

Read Full News
Screenshot 20231014 161826 WhatsApp

సిగ్గుండాలి….

నలభై ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో పనిచేసి, పదవులు, అధికారం అనుభవించి నేడు అదే పార్టీని వీడి పోవడం సిగ్గుచేటు వ్యవహారమని పి.సి.సి. అధ్యక్షులు రేవంత్ రెడ్డి పొన్నాల లక్ష్మయ్య పై విరుసుకు పడ్డారు.

Read Full News
batti c

ప్రజల”చేయి”వదలని “విక్రమార్క”…

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నాయకులకే కాదు, సామాన్య ప్రజలకు సైతం అందరికి తెలిసిన నేత మల్లు భట్టి విక్రమార్క. ఉద్యమాల ఖిల్లా ఖమ్మం జిల్లాకు చెందిన ఆయన రాజకీయ నేపద్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చి రాష్ట్ర స్థాయి నేతగా ప్రజలకు చేరువయ్యారు. కాంగ్రెస్ నేతలు, లోక్ సభ మాజీ సభ్యులు స్వర్గీయ మల్లు అనంత రాములు, మరో పార్లమెంటు సభ్యుడు మాజీ శాసన సభ మాజీ సభ్యులు మల్లు రవి సొంత తమ్ముడు విక్రమర్క. 1990వ దశకంలో…

Read Full News