green c

“గులాబీ”లోనూ “పచ్చ”రక్తం …!

తెలంగాణ శాసన సభకు ఇటీవల జరిగిన ఎన్నికలలో ఘోర పరాజయం పాలైన భారత రాష్ట్ర సమితి (భారాస) నేతల్లో అసహనం పరాకాష్టకు చేరుతున్నట్టు కనిపిస్తోంది. ఆవేశంలో యువ నేతలు గత చరిత్రను  మరచిపోతున్నట్టు స్పష్టం అవుతోంది. ప్రజల కోసమో లేక అధికారం లేదనే కోపమో తెలియదు గానీ కొద్ది రోజులుగా కెటిఆర్, కవిత, సుమన్, శ్రీహరి వంటి భారాస నేతలు కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల వ్యవహరిస్తున్న తీరు అంతుపట్టకుండా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భారాస…

Read More
green pro

“పచ్చ”రక్తం….

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లో “పచ్చ”రక్తం ప్రవహిస్తోందా?.. మరి “గులాబీ” నేతల్లో ఆ రక్తం లేదా?… ఎం.ఎల్.సి. కవిత కామెంట్స్ పై “ఈగల్ న్యూస్” ప్రత్యేక కథనం మీకోసం…

Read More
IMG 20240209 WA0038

వ్యూహం ఏంటో…

ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో ఆంధ్ర్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. అనేక పెండింగ్ పనులు, రాబోయే ఎన్నికలకు సంబంధించి కీలక విషయాలను చర్చించుకున్నట్టు సమచారం.

Read More
pv

“Bharat Ratna” PV..

As a distinguished scholar and statesman, Narasimha Rao served India extensively in various capacities. He is equally remembered for the work he did as Chief Minister of Andhra Pradesh, Union Minister, and as a Member of Parliament and Legislative Assembly for many years. His visionary leadership was instrumental in making India economically advanced, laying a…

Read More
parlament

మళ్ళీ”హస్త”గతమే…

తెలంగాణలో అసెంబ్లీలో అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్‌ లోక్‌సభ ఎన్నికల్లో కూడా మెజారిటీ సీట్లు గెలుచుకుంటుందని ఇండియా టుడే “మూడ్‌ ఆఫ్‌ ద నేషన్‌” అభిప్రాయ సేకరణలో తేలింది. తెలంగాణ లోని 17 లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్‌ 10 సీట్లు గెలుచుకుంటుందని ఇండి యా టుడే తెలిపింది. కేసీఆర్‌ నేతృత్వం లోని బీఆర్‌ఎస్‌ కేవలం మూడు సీట్లే దక్కుతాయని, తెలంగాణలో ఎక్కువ సీట్లపై ఆశలు పెట్టుకున్న బీజేపీకీ 3 సీట్లే వస్తాయని, మజ్లి్‌స్ కు యథా ప్రకారం ఒక్క…

Read More
summer

నెల ముందే…

తెలుగు రాష్ట్రాలలో అప్పుడే భానుడి ప్రతాపం చుర్రు మంటోంది. ఫిబ్రవరి మొదటి వారంలోనే 36 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఒక్కసారిగా మారిన వాతావరణంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ సారి ఎండలు ముందే రానున్నాయి అని, గత ఏడాది కంటే కూడా ఎండల ఎక్కువగా ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అంతేకాదు, వాతావరణ శాఖ ముందస్తుగా తగిన ఏర్పాట్లు చేసుకోమంటూ కొన్ని హెచ్చరికలను జారీ చేసింది. ఈ ఏడాది ఎండలు “బాబోయ్”…

Read More
isro 30

ఇక ప్రయోగాల రచ్చ..

రోదసి రంగంలో వరుస ప్రయోగాలతో సత్తా చాటేందుకు భారత్‌ సిద్ధమవుతోంది. రానున్న 14 నెలల్లో మన దేశం దాదాపు 30 అంతరిక్ష ప్రయోగాలు చేపట్టనున్నట్లు ‘ఇండియన్‌ నేషనల్‌ స్పేస్‌ ప్రమోషన్‌ అండ్‌ ఆర్గ నైజేషన్‌ సెంటర్‌ (ఇన్‌-స్పేస్‌) వెల్లడించింది. ఈ మేరకు తాజాగా సమీకృత ప్రయోగ మేనిఫెస్టోను ప్రకటించింది. వచ్చే 14 నెలల్లో చేపట్టనున్న ప్రయోగాల్లో ప్రతిష్ఠాత్మక గగన్‌యాన్‌ ప్రాజెక్టుకు సంబంధించినవి ఏడు ఉన్నాయని అందులో తెలిపింది. స్కైరూట్‌, అగ్నికుల్‌ వంటి ప్రైవేటు అంతరిక్ష అంకుర సంస్థల…

Read More
medaram

సాంప్రదాయాలు ఉట్టిపడేలా…

గిరిజన సాంప్రదాయాల ప్రకారం మేడారం మహా జాతరను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. మేడారంలోని హరిత హోటల్ సమావేశ మందిరం లో మీడియా ప్రతినిధులతో “మీడియా ఇంటరాక్షన్ ” కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జాతర లో గిరిజన సాంప్రదాయాలు ఉట్టిపడేలా రద్దీ ప్రాంతాలలో గిరిజన ప్రత్యేక పెయింటింగ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. జాతరలో నిరంతరం పారిశుధ్య పనులు జరిగిన నాలుగువేల మంది పారిశుధ్య…

Read More
pasiyuddin

కాంగ్రెస్ లోకి…

తెలంగాణ రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మొదటి డిప్యూటీ మేయర్ బాధ్యతలు నిర్వర్తించిన భారత రాష్ట్ర సమితి నాయకులు బాబా ఫసియుద్దీన్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్ఎల్ఎ మాగంటి గోపీనాధ్ వేదింపుల వల్లే పార్టీని వీడుతున్నట్టు బాబా కెసిఆర్ కి లేఖ రాశారు. భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు తెలిపారు.

Read More
soren c

సోరెన్ కు “చాట్” ఉచ్చు..

భూ కుంభకోణం కేసులో జుడీషియల్ రిమాండ్‌లో ఉన్న జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ కు ఉచ్చు బిగుస్తోంది. తాజాగా ఈ.డీ. అధికారులు ఆయన ధ్వంసం చేసిన మొబైళ్లలో వాట్సప్ చాట్ రికవర్ చేశారు. 539 పేజీలతో ఉన్న ఈ చాట్‌లో మరికొన్ని అక్రమాలు వెలుగు చూశాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం సోరెన్ తన సన్నిహితులతో కలిసి ప్రభుత్వ భూములను లాక్కోవడమే కాకుండా లంచాలు తీసుకుంటూ అధికారులను వారు కోరిన చోటకి బదిలీ చేసినట్లు తేలింది….

Read More
patnam

మరో ఇద్దరు…

“నన్నూ, నా పార్టీని టచ్ చేసి చూడండి” అంటూ బిఆర్ఎస్ అగ్రనేత కెసిఆర్ కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తున్నా అందుకు భిన్నంగా సొంత పార్టీ నుంచే ఎదురు దెబ్భ తగులుతోంది. మొన్న బిఆర్ఎస్ ఎంపి వెంకటేష్ నేత కాంగ్రెస్ కండువా కప్పుకోగా మరి కొందరు తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధ పడుతున్నారు. బిఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి,  వికారాబాద్ జెడ్పీ చైర్ పర్సన్ సునీత మహేందర్ రెడ్డి తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం విశేషం. రెండు,మూడు రోజుల్లో…

Read More
isro robo

స్పేస్ రోబో “వ్యోమ‌మిత్ర‌”..

ఈ సంవ‌త్స‌రం అక్టోబర్‌లో గగన్‌యాన్‌ మిషన్‌ను అంతరిక్షం లోకి పంపేందుకు సిద్ధమైంది. గగన్‌యాన్ ప్రోగ్రాంలో భాగంగా చేప‌ట్టిన మాన‌వ ర‌హిత అంత‌రిక్ష ప్ర‌యోగంలో ఇది ఒక భాగ‌మ‌ని కేంద్ర సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాఖ మంత్రి జితేందర్‌ సింగ్ అన్నారు. అక్టోబర్‌ మొదటి, రెండో వారంలో గగన్‌యాన్‌ తొలి ట్రయల్‌ రన్‌ను ఇస్రో చేపట్టనుందని తెలిపారు. రెండో ప్రయోగంలో మహిళా రోబో వ్యోమమిత్రను అంతరిక్షం లోకి పంపనున్నారు. మనిషి మాదిరిగానే అన్ని పనులు నిర్వహించగలిగే ఈ రోబోను…

Read More
drone cm c

హైదరాబాద్ లో “డ్రోన్ పోర్ట్”

ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ)తో తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ డ్రోన్ పైలెట్లకు అధునాతన శిక్షణపై అవగాహన ఒప్పందం చేసుకుంది. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ సమక్షంలో తెలంగాణ ఏవియేషన్ అకాడమీ సీఈవో ఎస్.ఎన్.రెడ్డి, ఎన్.ఆర్.ఎస్సీ డైరెక్టర్ ప్రకాష్ చౌహన్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఆర్ అండ్ బీ ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజుతో పాటు ఎన్.ఆర్.ఎస్.సీ…

Read More
vnktsh neta

కాంగ్రెస్ లోకి బిఆర్ఎస్ ఎం.పి..

తెలంగాణాలో ఘోర పరాజయంతో సతమవుతున్న భారత రాష్ట్ర సమితికి మరో గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన పెద్దపల్లి నియోజక వర్గ పార్లమెంటు సభ్యులు వెంకటేష్ నేత కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. టీటీడీ బోర్డ్ మాజీ సభ్యుడు మన్నె జీవన్ కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.

Read More