brs meka c

తగ్గని”ఒంటెద్దు”దూకుడు…

తెలంగాణలో అధికారాన్ని కోల్పోయి ప్రతిపక్షంగా మారిన బి.అర్.ఎస్.పార్టీ నేతలు కొద్ది రోజులుగా  వ్యవహారిస్తున్న తీరు ఆశ్చర్యంగా ఉంది. పదేళ్ల పాటు అధికారాన్ని చెలాయించిన భారత రాష్ట్ర సమితి (బి.అర్.ఎస్.) నేతలు గత నెల రోజులుగా కొత్త ప్రభుత్వంపై మూకుమ్మడిగా చేసున్న పొంతన లేని వ్యాఖ్యలు అంతుపట్టకుండా ఉన్నాయి. తమ ప్రభుత్వ “ఒంటెత్తు” పోకడలు మూలంగానే  గత ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చిందనే వాస్తవం తెలిసి కూడా తమ “ఓటమికి ప్రజలే కారణం” అనే రీతిలో బి.అర్.ఎస్….

Read Full News
jagan kcr

మాజీ సి.ఎం.తో జగన్…

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఆంధ్రప్రదేశ్ సి.ఎం. వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. హైదరాబాద్ నందినగర్ లోని కేసీఆర్ నివాసానికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మాజీ మంత్రి కేటిఅర్ ఆయనకు స్వాగతం పలికారు.

Read Full News
brs C

గేరు మార్చిన“సారు”–దారి తప్పిన“కారు”!

తెలంగాణలో మళ్ళీ అధికారం చేపట్టడం ఖాయం.., ఆ తర్వాత ఏకంగా దేశాన్నే ఏల వచ్చు అనే  గంపెడు ఆశలతో మొన్న జరిగిన ఎన్నికల ముందు “ఒంటెత్తు” వ్యూహా రచనలు చేసిన భారత రాష్ట్ర సమితి (బి.ఆర్.ఎస్.) పరిస్థితి ఇప్పుడు గందరగోళంగా మారింది. తెలంగాణలో దశాబ్ద కాలంగా తిరుగులేని అధికారం చెలాయించిన బి.అర్.ఎస్. పార్టీ గత ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూడడంతో నేతల ఆలోచనలన్నీ కుడితిలో పడ్డ ఎలుకలా మారాయి. ఆరేడు నెలల కిందటి పరిస్థితులు తమకు అనుకూలంగా…

Read Full News
funds copy

గడి దాటని“దొర”-గల్లంతైన“నిధులు”!

తెలంగాణలో మొన్నటి వరకు ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వానికి కేంద్రంతో కొన్నేళ్ళుగా తెగిపోయిన సంబంధాల వల్ల వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్రంతో సన్నిహితంగా ఉండాల్సిన “ఒంటెద్దు” ప్రభుత్వంలో తానే అన్నీ అన్నట్టు వ్యవహరించి చివరకు రాష్ట్రపతి, ప్రధాని వంటి వారిని సైతం లెక్క చేయకపోవడంతో రాష్ట్రానికి రావలసిన నిధులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. రాజకీయంగా విభేదాలు ఉన్నా పరిపాలన పరంగా చేయాల్సిన పనులను కూడా వ్యక్తిగతంగా…

Read Full News
landcruser

“కారు”కలలు…!

గత పదేళ్లుగా కుటుంబం పోగేసుకున్న ఆస్తులను చూస్తూ మొన్న జరిగిన శాసన సభ ఎన్నికల్లోనూ ప్రజలు ముడోసారి కూడా తమనే గద్దెనెక్కిస్తారనే అత్యాశ బిఆర్ఎస్ అధినేతల్లో గట్టిగా ఉన్నట్టు తేలిపోయింది. దశాబ్ద కాలం పాటు అధికారం చెలాయిస్తూ, సమర్ధవంతులైన అధికారగణం చుట్టూ ఉన్నా ఎన్నికల పలితాల తీరు తెన్నులను ముందుగానే అంచనా వేయలేక పోవడం “ఒంటెద్దు” ప్రభుత్వ ఓటమికి కారణంగా కనిపిస్తోంది. ఎన్నికల సమయంలోనైనా కనీసం ఇంటలిజెన్స్ అధికారుల మాటలు వింటే బాగుండేదనే వాదనలు ఆ పార్టీ…

Read Full News
dme dh c

తొలగిన “వైరస్”…!

ప్రభుత్వంలో అత్యంత కీలకమైన విభాగాల్లో ఆరోగ్య శాఖ ఒకటి. అంతటి ప్రాధాన్యం ఉన్న శాఖకు దశాబ్ద కాలంగా పట్టిన “వైరస్”వదిలిందని వైద్య రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆ శాఖలో ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించాల్సిన ఒక అధికారి గత అధికార పార్టీ జెండాను భుజాన వేసుకోవలనే ఆత్రుతతో “దొర” కాళ్ళు పట్టి మరీ తిరగడం,  వైద్య కళాశాలల్లో  విద్యా బుద్ధులు చెప్పే వారికి దిశానిర్దేశం చేయాల్సిన మరో అధికారి “ఒంటెద్దు” ప్రభుత్వం తనదే అన్నట్టు వ్యవహరించడంతో  వైద్య రంగం,…

Read Full News
images 32

అమ్మో “మమతా”…!

గత పదేళ్లుగా “ఒంటెద్దు సర్కార్”కి భజన బృందంతో వంత పాడింది. ఎవరో ఒక నేతని కొంగున కట్టుకొని కూర్చున్న చోటే రాజ్యం ఏలింది. నమ్ముకున్న నాయకురాలిగా ఉద్యోగుల సమస్యలపై పోరాడాలనే నైతిక నాయకత్వ బాధ్యతను నీ బాంచెన్ అంటూ “ఒంటెద్దు సర్కార్” కాళ్ళ ముందు తాకట్టు పెట్టింది. ఉద్యోగులకు అసలు పోరాడే వీలు లేకుండా అడ్డం పడింది. తన “పలుకు”బడితో భర్త వెంకటేశ్వర్లుని వివిధ హోదాల్లో నియమించుకునే స్థాయికి ఎత్తులు వేసింది. సొంగకర్చే నేత బలంతో పదవీ…

Read Full News
allam

బెల్లం కొట్టిన రాయి“అల్లం”…!

పాత్రికేయ రంగంలో విలువలను పెంపొందించాలనే సదుద్దేశ్యంతో ఏర్పాటైన తెలంగాణ  ప్రెస్ అకాడమీ (ప్రస్తుత మీడియా అకాడమీ) గత పదేళ్లుగా పాలకుల మడుగులోత్తే అడ్డాగా మారిందనే విమర్శలు వస్తున్నాయి. జర్నలిజాన్ని, పాత్రికేయులను ప్రోత్సహిస్తూ కమ్యూనికేషన్, మీడియా ద్వారా సమాజానికి సహాయపడే విధంగా పనిచేయాల్సిన అకాడమీ దశాబ్ద కాలంగా నిమ్మకు నిరేత్తినట్టు వ్యవహరించిందనే బలమైన వాదనలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నత విలువలతో పని చేసిన ప్రెస్ అకాడమీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తన ప్రాభవం…

Read Full News
IMG 20231210 WA0015

“ఆర్ఆర్” పరామర్శ..

చింతమడక లోని వ్యవసాయ క్షేత్రంలో జారిపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి పరామర్శించారు. హైదరాబాద్‌ సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి వెళ్లిన రేవంత్‌ కేసీఆర్‌ను కలిశారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. రేవంత్‌ రెడ్డి వెంట మంత్రి సీతక్క, షబ్బీర్‌ అలీ ఉన్నారు. గురువారం అర్ధరాత్రి ఎర్రవల్లి నివాసంలోని బాత్‌రూంలో కేసీఆర్‌ జారిపడటంతో ఎడమ తుంటికి తీవ్ర గాయమైన సంగతి తెలిసిందే. యశోద ఆసుపత్రి వైద్యులు ఆయనకు…

Read Full News
IMG 20231208 WA0031

ఇదీ ప్రజా భవన్….!

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అధికారిక నివాసంగా ఉన్న హైదరాబాద్ లోని ప్రగతి భవన్ ఎలా ఉంటుందో సామాన్య ప్రజలకు ఇప్పటి వరకు తెలియదు. మాజీ ఆరోగ్య శాఖ మంత్రి స్వర్గీయ కోడెల శివ ప్రసాద్ రావు, జననేత వైఎస్ రాజశేఖరరెడ్డి క్యాంప్ ఆఫీసుగా ఉన్న బేగం పేట లోని భవనాన్ని కూలగొట్టి రాజ సౌదం మాదిరిగా కేసీఅర్ మార్చారు. కానీ, మొన్నటి వరకు అందులోకి ప్రవేశించడానికి ఆయన అనుయాయులు, భద్రత సిబ్బందికి మాత్రమే అనుమతి…

Read Full News
kcr

జారిపడ్డ కేసీఆర్…!

మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు రాత్రి బాత్రూంలో జారి కింద పడడంతో గాయాలైనట్టు సమచారం అందుతోంది. అర్ధరాత్రి రెండున్నర గంటలకు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం లో ఈ సంఘటన జరగగా వెంటనే ఆయన్ని హైదరాబాద్ తరలించారు. సికింద్రాబాద్ యశోద హాస్పటల్ తరలించి, చికిత్స అందిసున్నారు.కేసీఅర్ కి తుంటి ఎముక‌ విరిగినట్లు వైద్యుల ప్రకతించారు.మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది

Read Full News
brs stratgy

ప్రభుత్వంపై“భారాస”కుతంత్రం..?

పదేళ్లుగా ఒంటెద్దు పోకడల ప్రభుత్వంలో పదవుల రుచి చూసిన భారత రాష్ట్ర సమితి నేతలు ఓడిపోయినా ఇంకా మేకపోతు గాభీర్యం ప్రదర్శించడం విమర్శలకు దారి తీస్తోంది. తెలంగాణలో మొన్న జరిగిన ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ సొంతం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న తరుణంలో భారాస నేతలు ఆ ప్రభుత్వాన్ని కూలదోస్తామనే ధోరణిలో ఆలోచనలు చేయడాన్ని రాజకీయ పరిశీలకులే కాదు సామాన్య ప్రజలు సైతం ఖండిస్తున్నారు. రాజకీయాల్లో అనుభవం ఉన్న భారాస నేత కడియం శ్రీహరి…

Read Full News
hatric

“ఒక్కఛాన్స్”పై ఓడిన”ఒంటెద్దు”…!

తెలంగాణ శాసన సభ ఎన్నికల్లో అనుకున్నదే జరిగింది. ఎవరికైనా, ఏ పార్టీకి అయినా సరే ముడోసారి అధికారం కట్టబెట్టేదే లేదని ఓటర్లు తేల్చి వేశారు. “ఒక్క ఛాన్స్” కోరికకు పట్టం కట్టి, “హ్యాట్రిక్” కలలను కలగానే ఉంచారు. ఒంటెద్దు పోకడల పాలకులను వ్యవసాయ క్షేత్రాలకే పరిమితమయ్యేలా చేశారు. గత నెల ౩౦న జరిగిన ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఉద్యమ పార్టీగా చెప్పుకుంటున్న భారత రాష్ట్ర సమితిని ఇంటికి పంపి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరధం పట్టారు….

Read Full News
kcr hand c

వెళ్ళిన తీరు..”దుర్యోధన” రీతి..!

తెలంగాణ ప్రజల బలం మూటగట్టుకొని పదేళ్ళ పాటు అధికారాన్ని అనుభవించిన మాజీ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చివరికి కృతజ్ఞత లేని వ్యక్తిగా విమర్శలు ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తెలంగాణలో పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకొని రెండుసార్లు గద్దెనెక్కి కుటుంబం మొత్తం పదవులు అనుభవించిన కెసిఆర్ ఎన్నికల్లో పరాజయం పొందగానే ముడో కంటికి తెలియకుండా ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ కి పలాయనం చిత్తగించిన తీరును ప్రతీ ఒక్కరు తప్పుపడుతున్నారు. ఎన్నికల్లో…

Read Full News