కత్తులతో “రాక్” డాన్స్…
బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 14 లోని రాక్ క్లబ్ స్కైలాంజిలో కొందరు యువకులు డాన్సింగ్ ఫ్లోర్ పై కత్తులు తిప్పుతూ నృత్యాలు చేశారు. పార్టీ కి వచ్చినవారు భయంతో వణికిపోయారు.
బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 14 లోని రాక్ క్లబ్ స్కైలాంజిలో కొందరు యువకులు డాన్సింగ్ ఫ్లోర్ పై కత్తులు తిప్పుతూ నృత్యాలు చేశారు. పార్టీ కి వచ్చినవారు భయంతో వణికిపోయారు.
కాంగ్రెస్ పార్టీ తెలుగు రాష్ట్రాల్లో దూకుడు పెంచింది. కర్ణాటక ఎన్నికల తర్వాత అటు ఏపీ, ఇటు తెలంగాణలో ముమ్మరంగా కార్యక్రమాలు చేపడుతోంది. కొన్ని రోజులు క్రితం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయగా, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా పాదయాత్ర చేపట్టారు. పీపుల్స్ మార్చ్ పేరుతో దాదాపు 109 రోజులు పాటు ఆయన ప్రజల్లో తిరిగారు. ప్రస్తుతం భట్టి చేపట్టిన పాదయాత్ర ఆదివారంతో ముగియనుంది. ఈ సందర్భంగా ఖమ్మంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు…
పారిస్ నగరం రావణ కాష్టంలా అట్టుడుకుతోంది. అంతకంతకు చెలరేగుతున్న అల్లర్లతో పౌర జీవనం అతలాకుతలం అవుతోంది. కొన్ని ప్రాంతాల్లో నెలకొన్న బితావాహ పరిస్థితులు ఆందోళనకు గురి చేస్తున్నాయి. పోలీసు కాల్పుల్లో 17 ఏళ్ల యువకుడు మృతి చెందడంతో ఒక్కసారిగా భగ్గుమన్న నిరసన జ్వాలలు వివిధ ప్రాంతాలకు విస్తరించాయి. ఆరు కోజులుగా ఆందోళనకారులు దేశవ్యాప్తంగా నిరసనలకు దిగారు. . ముఖ్యంగా పారిస్ నగరంలోని స్కూళ్లు, టౌన్హాళ్లు, పోలీస్ స్టేషన్లు వంటి పలు ప్రభుత్వ భవంతులు, వాహనాలు, ఇతర ఆస్తులకు…
హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దే ప్రయత్నం లో భాగంగా మూసీ నదిపైన ఎక్స్ప్రెస్వే నిర్మాణాన్ని చేపడతామని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. హైదరాబాద్ ఔటర్రింగ్ రోడ్డుపై నార్సింగి వద్ద 29.50 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఇంటర్ ఛేంజ్ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ మురుగు నీటిని పునర్వినియోగించే పాలసీని తీసుకురానున్నట్టు, సెప్టెంబర్ నాటికి హైదరాబాద్లో మురుగునీరు శుద్ధీకరణ పూర్తవుతుందని తెలిపారు. ఔటర్ చుట్టూ పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా సర్వీస్ రోడ్లను విస్తరించాలనే సీఎం…
ముంబాయి లోని ఒక రైల్వే స్టేషన్ లో ఓ యువకుడు పట్టాల పక్కనే ప్లాట్ ఫారం అంచులో చేయి కడిగే ప్రయత్నం చేయగా అటుగా వచ్చిన రైలు డీ కొట్టడం తో గాయాలపాలై ప్రాణాలు విడిచాడు.
తిరుపతి లోని శ్రీ వెంకటేశ్వర ఇనిస్టిటూట్ అఫ్ మెడికల్ సైన్సెస్ (స్విమ్స్) డైరెక్టర్ గా శ్రీమతి సదా భార్గవి నియమితులయ్యారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆమె బాధ్యతలు చేపట్టారు.
దేశంలో వస్తు, సేవల పన్ను వసూళ్లు భారీగా నమోదయ్యాయి. జూన్ నెలకు 1,61,497 కోట్ల రూపాయలు వసూలై నట్టు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సీజీఎస్టీ రూపంలో రూ.31,013 కోట్లు, ఎస్జీఎస్టీ కింద రూ.38,292 కోట్లు, ఐజీఎస్టీ కింద రూ.80,292 కోట్లు చొప్పున వసూలైనట్లు వివరించారు. గత ఏడాది జూన్లో రూ.1.44 లక్షల కోట్లు వసూళ్లు కాగా, ఈ ఏడాది 12 శాతం మేర పెరిగాయి. అదేవిధంగా జీఎస్టీ వసూళ్లు రూ.1.60 లక్షల కోట్లు మార్కు…
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రేపు ఖమ్మంలో జరగనున్న భారీ బహిరంగ సభకు హాజరవుతున్నారు. ఆయన రేపు సాయంత్రం ప్రత్యేక విమానంలో విజయవాడలోని గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ లో ఖమ్మంకు బయల్దేరుతారు. సీనియర్ నేత మల్లు భట్టివిక్రమార్క పాదయాత్ర ముగింపును సందర్భంగా కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభను నిర్వహిస్తోంది. ఈ సభలో భట్టిని రాహుల్ గాంధీ సత్కరించనున్నారు. ఇదే సభలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన అనుచరులతో కలిసి కాంగ్రెస్…
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దంపట్టే బోనాల పండుగను వైభవంగా నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు బోనాల ఏర్పాట్లు, నిర్వహణపై దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులతో డా.బీఆర్. అంబేడ్కర్ సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. బోనాలు ఉత్సవాల నిర్వహణపై అధికారులకు దిశా నిర్దేశనం చేశారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ తెలంగాణ అస్తిత్వానికి, సంస్కృతి…
ప్రధాని మోడీ శుభవార్తతో తెలంగాణకు రావాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ నెల 8 న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రానికి వస్తున్నా సందర్భంగా కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. తొమ్మిది ఏళ్లుగా తెలంగాణను కేంద్రం నానా రకాలుగా సతాయిస్తోన్నదని, హైదరాబాద్ లో లింక్ రోడ్లు, స్కైవేల కోసం ఆర్మీ భూములు ఇచ్చేలా మోడీ ఆదేశాలు ఇవ్వాలివ్వాలని డిమాండ్ చేశారు. రాజకీయాలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయని, ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజాక్షేత్రంలో ఆ సంగతి తేల్చుకోవచ్చు…
మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. బుల్దానాలోని ఎక్స్ప్రెస్ వే పై వెళ్తున్న ఓ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 26 మంది ప్రయాణికులు సజీవదహనమయ్యారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 32 మంది ప్రయాణికులతో యావత్మాల్ నుంచి పుణెకు వెళ్తుండగా శనివారం వేకువజామున 2 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. మంటలు వ్యాప్తికి బస్సు పూర్తిగా కాలి బూడిదైంది. క్షతగాత్రులను బుల్దానా…
పారిస్ నగరం అల్లర్లతో అట్టుడుకుతోంది. పోలీసు కాల్పుల్లో 17 ఏళ్ల యువకుడు మృతి చెందడంతో నాలుగు రోజుల కిందట ఫ్రాన్స్ లో ఒక్కసారిగా నిరసన జ్వాలలు భగ్గుమన్నాయి. పారిస్ శివారులోని నాంటెర్రెలోని ట్రాఫిక్ స్టాప్ వద్ద నహెల్ అనే యువకుడిని పోలీసులు కాల్చి చంపారు. ఈ ఘటనతో రెండు రోజులుగా హింసాత్మక ఘటనలు కొనసాగుతున్నాయి. ఆందోళనకారులు దేశవ్యాప్తంగా నిరసనలకు దిగారు. ముఖ్యంగా పారిస్ నగరంలోని స్కూళ్లు, టౌన్హాళ్లు, పోలీస్ స్టేషన్లు వంటి పలు ప్రభుత్వ భవంతులు, వాహనాలు,…
సోషల్ మీడియా నిబంధనల్లో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆంధ్ర ప్రేదేశ్ రాష్ట్ర మహిళ కమిషన్ అధ్యక్షురాలు వాసిరెడ్డి పద్మ అన్నారు. సచివాలయంలో ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ మహిళలపై పైశాచికత్వానికి పరాకాష్టగా సోషల్ మీడియాలో పోస్టింగులు ట్రోల్ చేయడం దురదృష్టకరమన్నారు. ప్రధానంగా సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, వారి కుటుంబ సభ్యులకు చెందిన మహిళలపై అసభ్యకరమైన పదజాలంతో పాటు అశ్లీల చిత్రాలు, అక్రమ సంబంధాల వంటి కట్టు కథల పోస్టింగులు సోషల్ మీడియాలో ట్రోల్ అవ్వడం ఎంతో జుగుప్సాకరమైన…
ప్రపంచ స్థాయి వసతులతో అభివృద్ధి చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని బాలాజీ వికలాంగుల శాస్త్ర చికిత్స పునరావాస కేంద్రం (బర్డ్) అనేక క్లిష్టమైన సర్జరీలకు రెఫరల్ ఆసుపత్రిగా మారుతోందని టీటీడీ ఈవో ఎ వి ధర్మారెడ్డి వెల్లడించారు. “బర్డ్“ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మూడు రోజుల జాతీయ స్థాయి ఆర్థో ప్లాస్టీ సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ సమ్మిట్లో 10 నుంచి 12 దాకా మాత్రమే లైవ్ సర్జరీలు చేస్తుండగా బర్డ్ ఆధ్వర్యంలో తొలిసారి…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మెట్రో రైలులో ప్రయాణించారు. పలువురు విద్యార్ధులతో మాట్లాడారు.