ka paul

ఎందుకిలా…కెసిఆర్ ..

ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్లలో, చెవుల్లో, చేతుల్లో, మనసులో అవినీతి ఉందని, ఆయన అవినీతి ఆకాశాన్ని అంటిందని ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏపాల్ విమర్శించారు. అయన చేస్తున్న అవినీతిని అక్రమాలను కవర్ చేయడానికే మానవ హక్కుల కమిషన్‌ను ఏర్పాటు చేయడంలేదన్నారు. టీఎస్ హెచ్ఆర్సీ, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు చైర్మన్‌ను నియమించలేదని, వారం రోజుల్లో కమిషన్ చైర్మన్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సదాశివపేట పోలీసులపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అక్కడి సీఐ,…

Read Full News

ఐనా దొరికారు…

హైదరాబాద్ శంషాబాద్  విమానాశ్రయంలో  కస్టమ్స్, ఎయిర్ ఇంటలిజెన్స్ అధికారుల తనిఖీలు నిర్వహించారు. ఒక ప్రయాణికుని కోటి 37లక్షలు రూపాయల  విలువైన 2.279 కిలోలు బంగారం స్వాధీనం చేసుకున్నారు. నిక్కర్ లో పట్టిలో దాచిన బంగారాన్ని అధికారులు చాకచక్యంగా పట్టుకున్నారు.  అదే విధంగా లక్ష రూపాయలకు  పైగా విలువ చేసే  విదేశీ సిగిరెట్లు స్వాధీనం చేసుకున్నారు.

Read Full News
jnj 2

అక్కడ సరే..మరి ఇక్కడ…

వరంగల్ లో పని చేస్తున్న విలేకరులలో   ఏకశిలా, కాకతీయ హౌసింగ్ సొసైటీల్లో సభ్యులుగా లేని వారి నుండి జులై, 5, 6వ తేదీల్లో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో దరఖాస్తులు తీసుకోవాలని లో వర్కింగ్ జర్నలిస్టుల  స్థలాల కోసం ఏర్పడ్డ సిక్స్ మెన్ కమిటీ తెలిపింది.  వర్కింగ్ జర్నలిస్టులకు ఇంటి స్థలాల కోసం ఏర్పడిన  ఆరుగురు సభ్యుల కమిటీ  కాకతీయ, ఏకశిలా ఈరెండు సొసైటీల…

Read Full News
jagan modi

ఒకసారి చూడండి…

ఆంధ్ర ప్రదేశ్ లో  విభజన హామీలు నెరవేర్చాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి   వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి  ప్రధాన మంత్రి  నరేంద్ర మోదీని కోరారు. ఒకరోజు పర్యతనాకు ధిల్లి వచ్చిన జగన్ ప్రధాని, ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్, హోం మంత్రి అమిత్‌ షా తో  భేటీ అయ్యారు.  ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన పలు అంశాలపై చర్చ సుదీర్ఘ చర్చలు జరిపారు. రాష్ట్ర విభజన హామీలు సహా అపరిష్కృత అంశాలపై  వెంటనే  దృష్టి పెట్టాలనీ ప్రధాని నరేంద్ర…

Read Full News

100 కోట్లు ఎక్కడివి సంజయ్….

గత ఎన్నికల్లో పుస్తెలు అమ్మి పోటీ చేసిన బండి సంజయ్‌కి  టివిలు, పత్రికల్లో ప్రకటనలు ఇవ్వడానికి 100 కోట్ల రూపాయలు  ఎక్కడి నుంచి వచ్చాయని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర, జాతీయ అధ్యక్షులపై ఆ పార్టీ ఎమ్మెల్యే రఘునందన్ రావు చేసిన కీలక వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో దుమారం రేపుతున్నాయి.   పుస్తెలు అమ్మి పోటీ చేసిన బండి సంజయ్‌కి ప్రకటనలు ఇవ్వడానికి రూ.100 కోట్లు ఎక్కడివని ప్రశ్నించారు. పార్టీ…

Read Full News
akhil

చర్చలు…

ముఖ్య‌మంత్రి కేసీఆర్‌తో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాద‌వ్ ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో భేటీ అయ్యారు. ప్ర‌స్తుతం నెల‌కొన్న రాజ‌కీయ ప‌రిస్థితుల‌పై ఇద్ద‌రు చర్చించారు. బేగంపేట ఎయిర్‌పోర్టుకు ప్ర‌త్యేక విమానంలో చేరుకున్న అఖిలేష్ యాద‌వ్‌కు మంత్రులు త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్, ప్ర‌శాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. అక్కడి నుంచి నేరుగా ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు చేరుకున్నారు.

Read Full News
modi paspor

ప్రధాని ఇంటిపై డ్రోన్…

న్యూ దిల్లీలో నో ఫ్లై జోన్ పరిధిలో ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నివాసం పై డ్రోన్ కలకలం రేపింది. దీని పై ఎస్ పి జి అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోంది.

Read Full News
rahul kmm

మోడీ చేతిలో కేసిఆర్…

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ రిమోట్ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేతిలో ఉందని కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. బిఆర్ఎస్ అంటే బిజెపి బంధు పార్టీ అని ఎద్దేవా చేశారు. సిఎల్పి నేత భట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపు సందర్భంగా ఖమ్మంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాహుల్ పాల్గొన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ కనుసన్నలలోనే ఇక్కడి  బిఆర్ఎస్ ప్రభుత్వం పనిచేతోందని దుయ్యబట్టారు. పార్లమెంటులో మోడీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రైతాంగ వ్యతిరేక బిల్లుకు…

Read Full News
jnj c

మీరే యజమానులు…  

సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం నిజాంపేట్‌, పేట్‌ బషీరాబాద్‌ లోని 70 ఎకరాల స్థలం జేఎన్‌జే సొసైటీకే చెందుతుందని, ఈ భూమి కోసం సభ్యులందరూ డబ్బులు చెల్లించినందున ఆ భూమికి జేఎన్‌జే సొసైటీ సభ్యులే యజమానులని హైకోర్టు రిటైర్డ్‌ జస్టిస్‌ చంద్రకుమార్‌​ స్పష్టం చేశారు. టీమ్‌ జేఎన్‌జే ఆధ్వర్యంలో జరిగిన  జవహర్‌ లాల్‌ నెహ్రూ జర్నలిస్టుల మ్యూచువల్‌ ఎయిడెడ్‌ కోఆపరేటివ్‌ హౌసింగ్‌ సొసైటీ సభ్యుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.  సుప్రీంకోర్టు తీర్పు ‍ప్రకారం జేఎన్‌జే…

Read Full News

కత్తులతో “రాక్” డాన్స్…

బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 14 లోని రాక్ క్లబ్  స్కైలాంజిలో కొందరు యువకులు డాన్సింగ్ ఫ్లోర్ పై  కత్తులు తిప్పుతూ నృత్యాలు చేశారు. పార్టీ కి వచ్చినవారు  భయంతో వణికిపోయారు.

Read Full News
revanth pongu

దూకుడే….

కాంగ్రెస్ పార్టీ తెలుగు రాష్ట్రాల్లో దూకుడు పెంచింది. కర్ణాటక ఎన్నికల తర్వాత అటు ఏపీ, ఇటు తెలంగాణలో ముమ్మరంగా  కార్యక్రమాలు చేపడుతోంది. కొన్ని రోజులు క్రితం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయగా, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా పాదయాత్ర చేపట్టారు. పీపుల్స్ మార్చ్ పేరుతో దాదాపు 109 రోజులు పాటు ఆయన ప్రజల్లో తిరిగారు. ప్రస్తుతం భట్టి చేపట్టిన పాదయాత్ర ఆదివారంతో ముగియనుంది. ఈ సందర్భంగా ఖమ్మంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు…

Read Full News

మంటల వేడి….

పారిస్‌  నగరం రావణ కాష్టంలా అట్టుడుకుతోంది. అంతకంతకు  చెలరేగుతున్న  అల్లర్లతో పౌర జీవనం అతలాకుతలం అవుతోంది. కొన్ని ప్రాంతాల్లో నెలకొన్న బితావాహ పరిస్థితులు ఆందోళనకు గురి చేస్తున్నాయి.  పోలీసు కాల్పుల్లో 17 ఏళ్ల యువకుడు మృతి చెందడంతో ఒక్కసారిగా భగ్గుమన్న నిరసన జ్వాలలు వివిధ ప్రాంతాలకు విస్తరించాయి. ఆరు కోజులుగా ఆందోళనకారులు దేశవ్యాప్తంగా నిరసనలకు దిగారు. . ముఖ్యంగా పారిస్‌ నగరంలోని స్కూళ్లు, టౌన్‌హాళ్లు, పోలీస్‌ స్టేషన్లు వంటి పలు ప్రభుత్వ భవంతులు, వాహనాలు, ఇతర ఆస్తులకు…

Read Full News
inter

మూసీపై ఎక్స్‌ప్రెస్‌వే…

హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దే ప్రయత్నం లో భాగంగా  మూసీ నదిపైన ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణాన్ని చేపడతామని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌   చెప్పారు. హైదరాబాద్‌ ఔటర్‌రింగ్‌ రోడ్డుపై నార్సింగి వద్ద 29.50 కోట్ల రూపాయల  వ్యయంతో నిర్మించిన ఇంటర్‌ ఛేంజ్‌ను మంత్రి  ప్రారంభించారు.     ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ  మురుగు నీటిని పునర్వినియోగించే పాలసీని తీసుకురానున్నట్టు,  సెప్టెంబర్‌ నాటికి హైదరాబాద్‌లో మురుగునీరు శుద్ధీకరణ పూర్తవుతుందని తెలిపారు. ఔటర్ చుట్టూ పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా  సర్వీస్‌ రోడ్లను విస్తరించాలనే  సీఎం…

Read Full News