IMG 20231112 WA0000

“వర్గీకరణ” కమిటీ..

ఎస్సీ వర్గీకరణకు త్వరలో కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు ప్రధానినరేంద్ర మోడీ ప్రకటించారు. సికింద్రాబాద్ పరేడ్ మైదనంలో జరిగిన ‘మాదిగల విశ్వరూప మహాసభ’లో మోడీ మాట్లాడారు. బాబా సాహెబ్ అంబేడ్కర్ స్వప్నాన్ని తాము నెరవేర్చుతామని హామీ ఇచ్చారు. వర్గీకరణకు సంబంధించిన న్యాయపరమైన ప్రక్రియ సుప్రీంకోర్టులో ఉందని, దానికి తాము మద్దతిస్తున్నామని పేర్కొన్నారు. మాదిగల ఉద్యమాన్ని గుర్తించానని, గౌరవిస్తున్నానని హామీ ఇచ్చారు. దళిత వర్గాలకు క్షమాపణ చెప్పడానికే మాదిగల సభకు వచ్చానని ప్రధాని మోడీ తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత…

Read More
modi advani

మీ ఆశీర్వాదం…

రాజకీయ కురువృద్ధులు, భారతీయ జనతా పార్టీ అగ్ర నేత, మాజీ కేంద్ర మంత్రి లాల్ కిషన్ అద్వాని 96 వ జన్మదినం సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, హోమ్ మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాద్ సింగ్ తదితరులు అద్వాని నివాసానికి వెళ్ళారు. పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

Read More
samaria

సమాచార కమిషనర్”సమారియా”…

సీనియర్ ఐఏఎస్ అధికారి హీరాలాల్ సమారియా భారత సమాచార ముఖ్య కమిషనర్ గా నియమితులైయ్యారు. ఆయన సోమవారం బాధ్యతలు చేపట్టారు. సమారియా సింగరేణి డైరెక్టర్ గా పనిచేశారు. విద్యుత్ రంగంలో ప్రస్తుత సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ చైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరించారు. కేంద్ర ప్రభుత్వంలో కార్మిక శాఖ విభాగంలో పని చేసి అనేక విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. రాజస్థాన్ రాష్ట్రం భారత్ పూర్ కి చెందినా హీరాలాల్ సమారియా ఉమ్మడి రాష్ట్రం లోని…

Read More
pawan kishan manohar

మళ్ళీ“మోడీ”రావాలి…!

దేశానికి నరేంద్ర మోడీ ఇంకోసారి ప్రధానమంత్రి కావలసిన ఆవశ్యకత ఉందని, ముచ్చటగా మూడోసారి మోడీ ప్రధాని కావాలని ఆకాంక్షిస్తున్నట్టు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడించారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడారు. ఈ నెల 7వ తేదీన హైదరాబాద్ లో బీజేపీ నిర్వహించే బహిరంగ సభలో పాల్గొనాలని ఆహ్వానం అందినట్టు తెలిపారు. కిషన్ రెడ్డి మాట్లాడుతూ “ఎన్డీయే భాగస్వామ్య పక్షంగా ఉన్న జనసేన పార్టీ జీహెచ్ఏంసీ…

Read More
IMG 20231028 WA0005

తప్పక రావాలి…

వచ్చే ఏడాది అయోధ్యలో చేపట్టే శ్రీ రాముని విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరు కావాలని శ్రీ రామ జన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఆహ్వానం ఇచ్చింది. జనవరి నెలలో జరిగే ప్రతిష్టకు రావలసిందిగా ట్రస్ట్ సభ్యులు ప్రధానిని కలిసి మొదటి ఆహ్వాన పత్రిక అందజేశారు.

Read More
Screenshot 20231002 004606 WhatsApp

వరాల “మోడీ”…

ములుగు జిల్లాలో 9 వందల కోట్ల రూపాయల వ్యయంతో కేంద్రీయ గిరిజన విశ్వ విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చెప్పారు. మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో భాగంగా తెలంగాణలోసుమారు 13,500 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టే వివిధ రకాల అభివృద్ధి పనులకు అయన శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మోడీ మాట్లాడారు. సమ్మక్క- సరక్క ల పేరుతో గిరిజన యూనివర్సిటీ ప్రారంభించనున్నట్టు వివరించారు. అదేవిధంగా రాష్ట్రంలో పసుపు…

Read More
IMG 20230908 WA0020

అతిధులతో మోదీ…

రెండు రోజుల పాటు జరిగే జి -20 సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన వివిధ దేశాల అధ్యక్షులు, ప్రధానులు, అతిధులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన నివాసంలో సాదర స్వాగతం పలికారు. అనంతరం వారు బస చేసే హోటళ్లకు వెళ్లారు.

Read More
india c

అటు”వన్ ఎలక్షన్”.. ఇటు”ఇండియా”…

అటు మోడీ ప్రభుత్వం “వన్ ఇండియా.. వన్ ఎలక్షన్” వైపు పావులు కదుపుతుంటే మరోవైపు విపక్షాల కూటమి “ఇండియా” ముంబైలో సమావేశమై వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహ రచనలు చేస్తోంది.

Read More
parlamant

రద్దు కానుందా…

గతంలో ఎన్నడు లేని విధంగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు ప్రత్యేక సమావేశాల ప్రకటన చేయడం రాజకీయ వర్గాల్లో వేడి పుట్టిస్తోంది. గత నెలలోనే వర్షా కాల వేశాలు ముగించుకున్న మోడీ ప్రభుత్వం ఒక్కసారిగా తిరిగి సమావేశాలకు సిద్ధపడడం పలు రకాల ఉహాగానాకు తెర లేపుతోంది. కొందరు కాశ్మీర్ లో ఎన్నికల నిర్వహణ కోసమని, మరికొందరు జమిలీ ఎన్నికల కోసమని అభిప్రాయ పడుతున్నారు. ఈ రెండు అంశాలు కాకా పార్లమెంటును అంత అత్యవసరంగా సమావేశ పరచాల్సిన అవరసరం ఏముందని…

Read More
IMG 20230822 WA0000

నాన్న దగ్గర ఏమైందో…

దేశంలో మహిళలకు అన్ని రంగాల్లో33 శాతం రిజర్వేషన్  కావాలని ప్రధాని మోడీని డిమాండ్ చేసే కల్వకుంట్ల కవిత అదే విషయాన్ని అసెంబ్లీ అభ్యర్ధుల ఎంపికలో వాళ్ళ నాన్న కేసీఆర్ కి ఎందుకు చెప్పలేక పోయిందని మాజీ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబతా లో బి.ఆర్.ఎస్. మహిళలకు స్థానం కల్పించక పోవడం పై కవిత తెలంగాణ మహిళలకు  క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 119 స్థానాల్లో  7మంది మహిళలకు టికెట్…

Read More
rahul 10

అగ్రనేతకు ఊరట..

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ప్రధాన మంత్రి మోడీ ఇంటి పేరుపై చేసిన వ్యాఖ్యలకు సరైన ఆధారాలు లేవని సుప్రీం కోర్టు తేల్చింది. పరువు నష్టం కేసు పై విచారణ జరిపిన న్యాయస్థానం రాహుల్ గాంధీకి గరిష్ఠ శిక్ష విధింపులో ట్రయల్‌ కోర్టు సరైన కారణం చూపించి ఉండాల్సిందని అభిప్రాయపడింది. దీంతో రాహుల్‌ గాంధీకి ఊరట లభించినట్టయింది. దిగువ కోర్టులు అభియోగ పత్రాల సంఖ్య చూశాయే గానీ సరైన కారణాలు చూపలేదని వ్యాఖ్యానించింది. రాహుల్ గాంధీ తరఫున వాదనలు…

Read More
parlamant

ప్రారంభం..

ప్రారంభం..పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాజ్యసభ లో ఛైర్మన్‌, ఉప రాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా సభా సభ్యుల నుద్దేశించి ప్రసంగించారు. ఇటీవల మృతి చెందిన సిట్టింగ్‌ సభ్యులు, మాజీ ఎంపీ లకు ఉభయ సభలు సంతాపం ప్రకటించారు. ఆ వెంటనే లోక్‌సభ ను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేస్తూ స్పీకర్‌ ఓం బిర్లా ప్రకటించారు.  అనంతరం రాజ్యసభ కూడా మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. ఆగస్టు 11…

Read More
prp logo

“జనసేన” తడబాటు…

పి.ఆర్.పి గుర్తుండే ఉంటుంది..అదే ప్రజారాజ్యం పార్టీ ..మెగాస్టార్ కలల సాకారం.. రాష్ట్ర ప్రజలకు ఏదో చేయాలనే సంకల్పం. ఆనాడు ప్రజల్లో ఎన్నో ఆశలు రేపింది. అధికార పక్షానికి తానే పోటీ అని చాటింది. ప్రతీ  మీటింగ్ లో అశేష జనవాహినిని చూసి తబ్బిబ్బయింది. గెలుపు ఖాయమని అంచనా వేసింది. కొన్ని సందర్భాల్లో అధికారం మాదే అన్న నిర్ణయానికీ వచ్చింది. కానీ, అది మెగాస్టార్ పై అభిమానమే తప్ప ప్రజలు ఏలికను కోరుకోవడంలేదని ఎన్నికలు జవాబు చెప్పాయి. 2008…

Read More