muslam c

“ముసలం” మొదలైందా..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో అంతర్గత ముసలం మొదలయిందా? ఎన్డీఏ కూటమిలోని పార్టీల మధ్య విభేదాల బీజం నాటుకుంటోందా? నేతల మధ్య బయటకు పొక్కని కుమ్ములాటలకు తెర లేచిందా? దక్షిణాదిలో ఆధిపత్యం కోసం ఆంధ్రా నేతలే పావులుగా బిజెపి చదరంగం సిద్ధం చేసిందా? జనసేన అధినేత వ్యవహార శైలిలో ఎందుకు మార్పు వచ్చింది? కీలకమైన మంత్రిత్వ శాఖను చేతిలో పెట్టుకున్న ఆయన రెండు మంత్రివర్గ సమావేశాలకు ఎందుకు హాజరు కాలేదు? అనారోగ్యంతో ఉన్న ఆయన్ని ముఖ్యమంత్రి పలకరించే ప్రయత్నం…

Read More
pawan pan c

కదులుతున్న బిజెపి “పావు”..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ “సనాతన ధర్మ పరిరక్షణ” పర్యటనకు ముహూర్తం ఖరారైంది. ఆయన ఈ నెల 12వ తేది నుంచి కేరళ, తమిళనాడులో సనాతన ధర్మ బాట పట్టనున్నారు. ఆ రెండు రాష్ట్రాల్లో నాలుగు రోజులు పాటు వివిధ దేవాలయాలను సందర్శిస్తారు. మొదట కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయానికి వెళ్తారు. అక్కడి నుంచి తమిళనాడు లోని మధుర మీనాక్షి, శ్రీపరుశరామస్వామి, అగస్థ్య జీవ సమాధి, కుంభేశ్వర దేవాలయం, స్వామిమలైయ్, తిరుత్తై…

Read More
CHIRU C

“అందరివాడు” క్లైమాక్స్ ఏమిటి..!

నటునిగా ఆయనకు తిరుగు లేదు. 70 ఏళ్ల వయస్సు మీద పడుతున్నా, పాత తరానికే కాదు, నేటి యువతరానికి కూడా ఆయన తెరపై కనిపిస్తే ఆ మజానే వేరు. సినిమా హిట్టు, ప్లాప్ లతో సంబంధం లేదు. ఆయన బొమ్మ, స్టెప్పులు మాత్రమే చాలు అంతే అదే లెక్క. . అయితే, తనకున్న అశేష ప్రేక్షక ఆదరణతో ఏదో ఆశించి, ఎంతో ఊహించి”చిరు”వేచిన తప్పటడుగు రాజకీయ తెరపై మాత్రం కోలుకోలేని “ప్లాప్” ని ఇచ్చింది. ఉదయించే సూర్యుడు…

Read More
IMG 20240818 WA0005

ఇక జాతీయ స్థాయి పోరు

జై స్వరాజ్ పార్టీ, జై హింద్ నేషనల్ పార్టీలు జాతీయ స్థాయిలో కలిసి పని చేయాలని నిర్ణయించాయి. జై స్వరాజ్ పార్టీ జాతీయ అధ్యక్షుడు కాసాని శ్రీనివాసరావు గౌడ, జై హింద్ నేషనల్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు డాక్టర్ రాజీవ్ మిశ్రా హైదరాబాద్ లోని హైటెక్స్ లో సమావేశమై దేశ సమకాలీన సమస్యలు, పేదరికం, అభివృద్ధి, ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీల ఆలోచన విధానం తదితర అంశాలపై చర్చించారు. సమావేశ అనంతరం జై స్వరాజ్ పార్టీ అధినేత…

Read More
images 17

పార్టీలు పెంచిన “ప్రశాంత్”.!

ప్రశాంత్ కిషోర్… ఈ పేరు సామాన్య జనానికి అంతగా తెలియదేమో, కానీ, ఎన్నికల సంగ్రామంలో జరిగే రాజకీయ చదరంగంలో ఆయన ఒక వ్యూహకర్తగా పార్టీలకు, నాయకులకు సుపరిచితుడు. దశాబ్ద కాలం కిందట కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం చేపట్టడంలో కిషోర్ వ్యూహం కూడా కారణం అనే ప్రచారం ఉంది. అంతే కాదు,2012వ సంవత్సరంలో గుజరాత్ రాష్ట్రంలో మోడీ మూడోసారి అధికారంలోకి రావడానికి కూడా ఆయనే ప్రధాన కారణం అనే విశ్లేషణలు ఉన్నాయి. దీంతో ఆయన దేశంలోని…

Read More
IMG 20240728 WA0002

కొత్త గవర్నర్ “వర్మ”

తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా జిష్ణుదేవ్‌ వర్మ నియమితులయ్యారు.త్రిపుర మాజీ ఉప ముఖ్యమంత్రి అయిన ఆయన ప్రస్తుత ఇంచార్జి గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ స్థానంలో రానున్నారు. రాజ కుటుంబానికి చెందిన జిష్ణుదేవ్‌ 1957 ఆగస్టు 15న జన్మించారు.ఈయనకు భార్య, ఇద్దరు కుమారులున్నారు.1990ల ప్రారంభంలో బీజేపీలో చేరారు.అయోధ్య రామ జన్మభూమి ఉద్యమంలో పాల్గొన్నారు.2018-23 మధ్య ఉప ముఖ్యమంత్రిగా, త్రిపుర బ్యాడ్మింటన్‌ సంఘం అధ్యక్షుడిగానూ బాధ్యతలు నిర్వర్తించారు.కాగా తెలంగాణతో పాటు దేశంలోని ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి భవన్‌…

Read More
IMG 20240625 WA0007

మళ్ళీ”బిర్లా” ..

కేంద్రంలోని అధికార బీజేపీ నేతృత్వం లోని ఎన్డీయే, ప్రతిపక్షాల మధ్య స్పీకర్ ఎన్నికపై ఏకాభిప్రాయం కుదిరింది. దీంతో, మరోసారి ఆయన లోక్‌సభ స్పీకర్‌ పదవి చేపట్టనున్నారు. లోక్‌సభ స్పీకర్ పదవికి తమ అభ్యర్థిని నిలబెట్ట కూడదని విపక్షాలు నిర్ణయించుకున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాతో బిర్లా మంగళవారం ఉదయం భేటీ అయ్యారు. కాసేపటిలో ఆయన స్పీకర్ పదవికి నామినేషన్ సమర్పించే అవకాశం ఉంది. అయితే, డిప్యూటీ స్పీకర్ పదవి ప్రతిపక్షాల అభ్యర్థికి ఇవ్వాలని సభ్యులు రాహుల్…

Read More
amit suprim c

“సుప్రీమ్”ని ప్రశ్నించే ధైర్యమా…

ఎనిమిది, తొమ్మిదేళ్ళ కిందటి వరకు దేశ ప్రజలకు ఎవరో కూడా తెలియని వ్యక్తి ఈ రోజు న్యాయ వ్యవస్థను తప్పుపట్టే స్థాయికి చేరారు. ప్రజా స్వామ్య దేశం అందులోనూ పదేళ్లుగా తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నామన్న ఒకే ఒక ధైర్యంతో అధికారం,  పార్టీ బలం చూసుకొని షా  అదుపు లేకుండా మాట్లాడడం విస్మయానికి గురి చేస్తోంది. కేంద్రంలో బాధ్యత గల పదవిలో అంటూ దేశ ప్రధానికి కుడి భుజంగా పేరున్న అమిత్ షా ఏకంగా సుప్రీం కోర్టు ఆదేశాలు,…

Read More
Trayam c

తెలంగాణాలో”విడి”- ఆంధ్రాలో”కలివిడి”..

తెలంగాణలో జరిగే లోక్ సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన పార్టీల వైఖరి అంతుపట్ట కుండా ఉంది. అంధ్రప్రదేశ్ లో చేతులు కలిపిన ఆ మూడు పార్టీలు తెలంగాణాలో మాత్రం విడి పోయినట్టు కనిపిస్తోంది. తెలంగాణా శాసనసభ ఎన్నికల్లో నానా హంగామా చేసిన జనసేన పార్టీ ఈ లోక్ సభ ఎన్నికల్లో పతా లేకుండా పోయింది. అప్పట్లో తెలుగుదేశంతో సన్నిహితంగా ఉంటూనే చంద్రబాబు నాయుడుకి మాట మాత్రం చెప్పకుండా ఏకపక్ష నిర్ణయంతో జనసేన ఎన్నికల…

Read More
IMG 20240317 WA0086

మాకే మీ ఓటు…!

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కావాలని, దేశంలో ఈసారి 400 సీట్లు దాటాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఆంధ్ర్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా బొప్పూడిలో టీడీపీ, బీజేపీ, జనసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రజాగళం సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. “నా ఆంధ్ర కుటుంబసభ్యులు అందరికీ నమస్కారం” అంటూ తెలుగులో తన ప్రసంగాన్ని మోదీ ప్రారంభించారు. దేశంలో ఈసారి ఎన్డీఏకు 400 సీట్లు దాటాలని, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కావాలని మోదీ అన్నారు. అభివృద్ధి చెందిన…

Read More
IMG 20240311 WA0001

భాజపా లోకి…

తెలంగాణలో భారాసకు మరో ఎదురు దెబ్బ తగిలింది. సార్వత్రిక ఎన్నికల సమయంలో పలువురు సీనియర్‌ నేతలు భాజపా గూటికి చేరారు. మహబూబాబాద్‌, ఆదిలాబాద్‌ మాజీ ఎంపీలు సీతారాం నాయక్‌, గోడం నగేశ్‌, హుజూర్‌ నగర్‌, కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యేలు శానంపూడి సైది రెడ్డి, జలగం వెంకట్రావు ఢిల్లీలో తరుణ్‌ చుగ్‌ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నేతలు లక్ష్మణ్‌, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, పొంగులేటి సుధాకర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read More
chanakyam c

అంతుపట్టని”బాబు”చాణక్యం..!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అసలు ఏం జరుగుతోంది? ఒకప్పుడు జాతీయ రాజకీయాలను శాసించిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చాణక్యం ఎక్కడ దాచుకుంది? నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న”బాబు” కేవలం దశాబ్ద కాలంగా రాజకీయ తెరపై కనిపిస్తున్న అమిత్ షా కోసం ఎందుకు పడిగాపులు కాశారు? బాబు ఎన్.డి.ఏ. కన్వీనర్ గా  ఉన్నప్పుడు అసలు ఏం జరిగింది? ఆ పర్యవసానమే ప్రస్తుత ఫలితమా?  ఇలాంటి అనేక ప్రశ్నలకు ఆంధ్రా రాష్ట్రంలోనే కాదు, జాతీయ స్థాయి రాజకీయ…

Read More
sanjy on brs

“పొత్తు”అంటే చెప్పుతో కొట్టండి…

బీజేపీ కార్యకర్తలారా, ఇకపై ఎవరైనా బీఆర్ఎస్ తో బీజేపీ పొత్తు ఉంటుందని చెప్పే వాళ్లను చెప్పుతో కొట్టండి అంటూ బీజేపీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. తాండూరులో కేంద్రమంత్రితో కలిసి విజయ సంకల్ప యాత్రను ప్రారంభించిన సంజయ్ పొత్తుపై మీడియాకు పదే పదే లీకులిచ్చే ఫాల్తు రాజకీయ నాయకులను సైతం చెప్పులతో కొట్టాలని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య లోపాయికారీ ఒప్పందం నడుస్తోందన్నారు. అందులో భాగంగానే కేసీఆర్ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని…

Read More
parlament

మళ్ళీ”హస్త”గతమే…

తెలంగాణలో అసెంబ్లీలో అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్‌ లోక్‌సభ ఎన్నికల్లో కూడా మెజారిటీ సీట్లు గెలుచుకుంటుందని ఇండియా టుడే “మూడ్‌ ఆఫ్‌ ద నేషన్‌” అభిప్రాయ సేకరణలో తేలింది. తెలంగాణ లోని 17 లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్‌ 10 సీట్లు గెలుచుకుంటుందని ఇండి యా టుడే తెలిపింది. కేసీఆర్‌ నేతృత్వం లోని బీఆర్‌ఎస్‌ కేవలం మూడు సీట్లే దక్కుతాయని, తెలంగాణలో ఎక్కువ సీట్లపై ఆశలు పెట్టుకున్న బీజేపీకీ 3 సీట్లే వస్తాయని, మజ్లి్‌స్ కు యథా ప్రకారం ఒక్క…

Read More
adwani

“రథ”యాత్రికునికి”రత్నం”…

భారతీయ జనతా పార్టీ కురు వృద్ధులు లాల్ కిషన్ అద్వాని దేశ అత్యున్నత పురస్కారమైన “భారత రత్న” వరించింది. దేశంలో బిజెపి మూలాలు విస్తరించడానికి ఆయన సేవలు ఇతోధికంగా తోడ్పడ్డాయి. 1990 దశకంలో అయోధ్య రామ మందిర వివాదం పై అద్వాని జరిపిన “రథ యాత్ర” బిజెపి, సంఘ్ పరివార్ లు ఎప్పటికీ మర్చిపోలేనిది. ఉక్కు మనిషిగా పేరు తెచ్చుకున్న ఆయనను “రత్న”తో పురస్కరించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

Read More