Screenshot 20250130 094650 WhatsApp

“పడుకో” పెడతావా..!

రాజకీయాల్లో మీరు ఏ గొడుగు కింద పెరిగారో కానీ మిమ్మల్ని పెంచి పోషించిన నేత సరైన శిక్షణ ఇవ్వలేదు. ఒకవేళ ఇచ్చినా మీకున్న అజ్ఞానం వల్ల ఆ రాజకీయ సూక్తులు, అందులోని మెళకువలు మీ ఒంట పట్టలేదనేది అర్థం అవుతోంది. మీకున్న “బెదిరింపు కళ”కు నియోజక వర్గంలో గుండా గిరి దుకాణం పెట్టుకుంటే బాగుండేది. పొరపాటున టిక్కెట్ రావడం, దారి తప్పి గెలవడం ప్రజల దురదృష్టం అనుకుంటా. 2001వ సంవత్సరంలో ఎంపీటీసీగా ఓడిపోయిన మీరు అసెంబ్లీలో అడుగు…

Read Full News
suprim jnj cf copy

“సుప్రీమ్” కూల్చిన ఇంటి కల..!

భారత న్యాయ వ్యవస్థ నిజంగా అత్యంత గౌరవ ప్రదమైనది. అందుకే దాని పని తీరును ప్రశ్నిస్తే నేరం, తెలివితక్కువ తనం. అది ఒక రాజ్యాంగ ఉల్లంఘన.. తెలిసి చేసినా, తెలియక చేసినా సుమోటో కింద విచక్షణ అధికారంతో కేసులు.. మరి అదే కోర్టు ఇచ్చిన తీర్పుకు విరుద్ధంగా కొత్త తీర్పులు వెలువడితే..ఎవర్ని ప్రశ్నించాలి? దిక్కు ఎవరు? న్యాయ శాఖ మంత్రిని కలవాలా? రాజ్యాంగ నిబంధనల అమలు కర్త రాష్ట్రపతిని ఆశ్రయాయించాలా? ఒకవేళ ఆ సాహసం చేస్తే అదీ…

Read Full News
Screenshot 20240920 062325 WhatsApp

విషం చిమ్మితే ఊరుకోం..

జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టు హౌసింగ్ సొసైటీ సభ్యులు తమ కష్టార్జితంతో కొనుగోలు చేసిన స్థలాలపై “నల్లబాలు – తెల్లబాలు” వంటి తాసుపాములు బుస కొట్టే ప్రయత్నం చేసినా, భూములను అడ్డుకునే కుట్రలు పన్నినా ఊరుకునేది లేదని తెలంగాణ జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు కప్పర ప్రసాద్ హెచ్చరించారు.

Read Full News
IMG 20240912 WA0044

ఢిల్లీలో సంతోషం..

దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న తెలుగు జర్నలిస్టులు న్యూ ఢిల్లీలో పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంతర్ రెడ్డి ని కలిశారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలకు ఢిల్లీ జర్నలిస్టుల బృందం ఈ సందర్భంగా రేవంతరెడ్డికి కృతజ్ఞతలు తెలిపింది. ముఖ్యమంత్రి తో జరిగిన ఆత్మీయ సమావేశంలో పాత్రికేయుల ఇళ్లు, హెల్త్ కార్డ్స్, అక్రిడేషన్ల గురించి చర్చించారు. ముఖ్యంగా మీడియా అకాడమీకి రూ. పది కోట్ల రూపాయలు ప్రకటించినందుకు జర్నలిస్టుల ప్రతినిధి బృందం…

Read Full News
IMG 20240824 WA0049

“విధ్వంసం”దిశగా..!

గత ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన భారత రాష్ట్ర సమితి కాంగ్రెస్ ప్రభుత్వంపై పగ పట్టినట్టు కనిపిస్తోంది. ప్రతిపక్షంగా వ్యవహరి చేయాల్సిన బారాస నేతలు రాష్ట్రంలో ఉద్యమ వ్యూహాలను అమలు చేసే ప్రయత్నాల్లో ఉన్నట్టు సమాచారం అందుతోంది. ప్రభుత్వం చేపట్టే ప్రతీ కార్యక్రమాన్ని అడ్డుకోవడమే ప్రధాన ఎజెండాగా ఎంచుకోవడం, వీలున్న ప్రతీ అంశం పై చర్చలకు బదులు రచ్చ చేయడమే గులాబీ దళం లక్ష్యంగా ఎంచుకున్నట్టు కనిపిస్తోంది. మొన్నటి అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి భారాస…

Read Full News
hariprsad mlc

సంక్షేమం కోసం కృషి చేస్తా

రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని శాసన మండలి సభ్యులు పి. హరిప్రసాద్ స్పష్టం చేశారు. ఎన్డీయే కూటమిలో భాగంగా జనసేన తరఫున నామినేషన్ దాఖలు చేసిన హరిప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం అసెంబ్లీలో రిటర్నింగ్ అధికారి నుంచి ధ్రువీకరణ పత్రాన్ని స్వీకరించారు. అనంతరం పి. హరిప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ “ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం సంతోషంగా ఉంది. శాసన మండలి సభ్యత్వాన్ని బాధ్యతా యుతమైన పదవిగా భావిస్తున్నాను. నా మీద నమ్మకంతో…

Read Full News
IMG 20240625 WA0015

కేశవ్ తో పాత్రికేయులు…

ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ని పాత్రికేయ సంఘాల నేతలు మర్యాదపూర్వకంగా కలసి అభినందనలు తెలిపారు. తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్, ఇండియన్ జర్నలిస్టు యూనియన్ జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ కార్యవర్గ సభ్యులు ఆలపాటి సురేష్, ఎపిడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవి సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర అధ్యక్షుడు యేచూరి శివ, అనంతపురం జిల్లా అధ్యక్షుడు పయ్యావుల ప్రవీణ్, కార్యదర్శి ఆయుఫ్ బాషా…

Read Full News
pongu ksr

ఇళ్ల స్థలాలకు కొత్త పాలసీ

రాష్ట్రంలో పని చేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు త్వరలోనే కొత్త పాలసీ తీసుకు వస్తామని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల, రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ఖమ్మంలో జరుగుతున్న టీయూడబ్ల్యూజే (ఐజేయు) రాష్ట్ర తృతీయ మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల కీలక పాత్రను పోషించారని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ పడికట్టు…

Read Full News
IMG 20240312 WA0051

సన్మానం…

తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన కె.శ్రీనివాస్ రెడ్డి ని తెలంగాణాలోని 31జిల్లాల యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు ఘనంగా సత్కరించారు. హైదారాబాద్ బషీర్ బాగ్ లోని యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే)రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఈ సన్మానం జరిగింది.

Read Full News
IMG 20240201 WA0050

జర్నలిస్టు డైరీ…

తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక 2024 సంవత్సరం డైరీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో ఆవి ష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి ఫలాలు ప్రజలకు చేరేందుకు జర్నలిస్టులు తమ వంతు కృషి చేయాలని సీఎం కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక అధ్యక్షుడు బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి, జనరల్ సెక్రటరీ మహ్మద్ సాదిక్ పాష, వైస్ ప్రెసిడెంట్లు…

Read Full News
jnj

ఎన్నుకోలేదు..దిగిపోండి..!

హైదరాబాద్ లోని జర్నలిస్టుల ఇళ్ళ స్థలాల కేటాయింపులో జరుగుతున్న జాప్యం వల్ల జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీ సభ్యులు మళ్లీ పోరుబాట పట్టే సూచనలు కనిపిస్తున్నాయి. అంతేకాక, ప్రస్తుతం సొసైటీకి బాధ్యత వహిస్తున్న మేనేజింగ్ కమిటీ పై కూడా మెజారిటీ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి ఎన్నికలు లేకుండా కొనసాగుతున్న కమిటీలోని వారు వెంటనే తప్పుకోవాలనే బలమైన డిమాండ్ వినిపిస్తోంది. ఇప్పటికె కొందరు రాజీనామా చేసినట్టు సమాచారం అందుతున్నప్పటికీ మేనేజింగ్ కమిటీ మొత్తం…

Read Full News
journ sridher

మేనిఫెస్టోలో”కలం”వీరులు..!

దశాబ్దాలుగా అపరీష్కృతంగా ఉన్న తమ సమస్యలను పరిష్కరించడానికి వీలుగా రాబోయే ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ రూపొందించే మేనిఫెస్టో లో వాటిని చేర్చాలని తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక కోరింది. ఈ మేరకు తెలంగాణా కాంగ్రెస్ మ్యానిఫెస్టో ఛైర్మెన్ దుద్దిళ్ళ శ్రీధర్ బాబుని వేదిక ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం కలిసింది. తెలంగాణ జర్నలిస్టుల సమస్యలు, సంక్షేమానికి సంబంధించి 9 ప్రధాన అంశాలతో కూడిన వినతిపత్రం అందజేశారు. తమ దీర్ఘకాలిక సమస్యలను కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచి వాటి…

Read Full News
jornlist harish

ఇస్తాం..ఇస్తాం..తప్పక ఇస్తాం..

హైదరబాద్ జర్నలిస్టుల ఇళ్ల స్థలాల అంశం త్వరలోనే పరిష్కరిస్తామని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. కొత్తగా ఏర్పాటైన “ది తెలంగాణా జర్నలిస్ట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ” ప్రతినిధులతో ఆయన ప్రగతి భవన్ లో భేటీ అయ్యారు. సొసైటీ సభ్యత్వ వివరాలు అడిగి తెలుసుకున్నారు. మూడోసారి కూడా తామే అధికారంలోకి వస్తామన్న మంత్రి హరీష్ రావు జర్నలిస్టుల హౌసింగ్ సమస్యని కూడా తప్పక పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మంత్రి కేటీఆర్ కలిసి ఇదే అంశంపై…

Read Full News
ipr

ఆలోచిస్తున్నాం…

రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ లో పనిచేస్తున్న విలేకర్ల ఇళ్ళ స్థలాల సమస్యని విలైనంత త్వరలో పరిష్కరించేందుకు ప్రయత్నించనున్నట్టు రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి హామీ ఇచ్చారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర నాయకులు కలసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సమస్యను పరిష్కరించే దిశలో ప్రభుత్వం చర్చలు జరుపుతోందన్నారు. ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. బసవపున్నయ్య, కార్యదర్శి ఎస్ కే…

Read Full News