chegu cf

“చె గువేరా”ని చేరిపేస్తున్న”పవని”జం..

“చె గువేరా” ఆలోచనలు అంటూ జనసేనకి హైదరాబాద్ లో పురిటి నొప్పులు పోసిన పవన్ కళ్యాణ్ తన పోరాట మార్గాన్ని మార్చుకున్నారా? సంపాదన అక్కర లేదంటూ రాజకీయాల్లోకి అడుగు పెట్టిన “తమ్ముడు” ఆలోచనా సరళి ఎందుకు మారింది. “చెగువేరా” ఎక్కడ.. సనాతన ధర్మం ఎక్కడ? పొంతన లేని అంశాలను పవన్ ఎందుకు ఎంచుకున్నారు? భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీకి దగ్గర కావడానికా? లేక తెలుగు దేశాన్ని కాదనే సొంత ఎజెండా ఎదైనా ఉందా? లేక మొన్నటి ఎన్నికల్లో…

Read More
IMG 20240624 WA0075

అక్కడ మంత్రి – ఇక్కడ నిర్మాత…

కాలం చక్రం గమ్మత్తుగా ఉంటుంది. పవన్ కళ్యాణ్, సుప్రియాల మొదటి చిత్రం “అక్కడ అమ్మాయి – ఇక్కడ అబ్బాయి”. అందరికీ తెలిసిన సంగతే. ఆ తర్వాత సుప్రియ తెర వెనక్కి వెళ్ళారు. పవన్ మాత్రం “పవార్ స్టార్”గా ఎదిగారు. ఇదీ తెలిసిన విషయమే. రెండు దశాబ్దాల తర్వాత ఇద్దరూ కెమెరా ముందు కనిపించారు. కానీ నటులుగా మాత్రం కాదు..పవన్ ఉప ముఖ్యమంత్రి హోదాలో, సుప్రియ నిర్మాతగా కలుసుకున్నారు.

Read More
nda babu

సదా మీ సేవలో…

విజయవాడలో ఏ కనెక్షన్ లో కూటమి ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ అధినేతను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని శాసన సభ పక్ష నాయకునిగా ఎన్నుకున్నారు. చంద్రబాబు నాయుడు పేరును పవన్ కళ్యాణ్ గారు ప్రతిపాదించగా పురంధరేశ్వరి, అచ్చెన్నాయుడు బలపరిచారు.అదేవిధంగా కూటమి ఎమ్మెల్యేలు దీనికి ఆమోదం తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ , బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి, కూటమికి చెందిన ఎమ్మెల్యేలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Read More
Trayam c

తెలంగాణాలో”విడి”- ఆంధ్రాలో”కలివిడి”..

తెలంగాణలో జరిగే లోక్ సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన పార్టీల వైఖరి అంతుపట్ట కుండా ఉంది. అంధ్రప్రదేశ్ లో చేతులు కలిపిన ఆ మూడు పార్టీలు తెలంగాణాలో మాత్రం విడి పోయినట్టు కనిపిస్తోంది. తెలంగాణా శాసనసభ ఎన్నికల్లో నానా హంగామా చేసిన జనసేన పార్టీ ఈ లోక్ సభ ఎన్నికల్లో పతా లేకుండా పోయింది. అప్పట్లో తెలుగుదేశంతో సన్నిహితంగా ఉంటూనే చంద్రబాబు నాయుడుకి మాట మాత్రం చెప్పకుండా ఏకపక్ష నిర్ణయంతో జనసేన ఎన్నికల…

Read More
IMG 20240317 WA0086

మాకే మీ ఓటు…!

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కావాలని, దేశంలో ఈసారి 400 సీట్లు దాటాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఆంధ్ర్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా బొప్పూడిలో టీడీపీ, బీజేపీ, జనసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రజాగళం సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. “నా ఆంధ్ర కుటుంబసభ్యులు అందరికీ నమస్కారం” అంటూ తెలుగులో తన ప్రసంగాన్ని మోదీ ప్రారంభించారు. దేశంలో ఈసారి ఎన్డీఏకు 400 సీట్లు దాటాలని, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కావాలని మోదీ అన్నారు. అభివృద్ధి చెందిన…

Read More
chanakyam c

అంతుపట్టని”బాబు”చాణక్యం..!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అసలు ఏం జరుగుతోంది? ఒకప్పుడు జాతీయ రాజకీయాలను శాసించిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చాణక్యం ఎక్కడ దాచుకుంది? నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న”బాబు” కేవలం దశాబ్ద కాలంగా రాజకీయ తెరపై కనిపిస్తున్న అమిత్ షా కోసం ఎందుకు పడిగాపులు కాశారు? బాబు ఎన్.డి.ఏ. కన్వీనర్ గా  ఉన్నప్పుడు అసలు ఏం జరిగింది? ఆ పర్యవసానమే ప్రస్తుత ఫలితమా?  ఇలాంటి అనేక ప్రశ్నలకు ఆంధ్రా రాష్ట్రంలోనే కాదు, జాతీయ స్థాయి రాజకీయ…

Read More
4th cf

నా నాలుగో పెళ్ళాం “జగన్”…

ప్రజా సమస్యల పై పోరాడాల్సిన రాజకీయ పార్టీ నేతలు వ్యక్తిగత వ్యవహారాలను తెరపైకి తీసుకురావడం వింతగా కనిపిస్తోంది. అదీ ఏదో చిన్నా చితకా సరదా వ్యాఖ్యలు కాదు.. ఏకంగా పెళ్ళిళ్ళు, పెళ్ళాల వరకు వెళ్ళడం రాజకీయ పరిపక్వత లోపాన్ని ఎత్తిచూపుతున్నాయి. సరిగ్గా ఇదే తంతు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. అక్కడ వైఎస్ జగన్ సారధ్యంలోని అధికార పార్టీ వైసీపీకి, పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనెలా ఉంది. ముఖ్యమంత్రి జగన్…

Read More
banana c

రాజకీయాల్లో”అరటి పండ్లు”…!

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో “అరటి పండు”పార్టీల ఎత్తుగడలు అంతుపట్టకుండా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ నడిపిస్తున్న జనసేన, వై.ఎస్.షర్మిల ఆధ్వర్యం లోని వై.ఎస్.ఆర్.తెలంగాణ (వైఎస్ఆర్ టి) పార్టీలు ఎన్నికల సమయంలో వ్యవహరిస్తున్న తీరు రాజకీయ పరిశీలకులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావిడి మొదలవ్వగానే తమ బలం ఎంత ఉన్నదనే కనీస విషయాన్ని అంచనా వేసుకోకుండా బరిలోకి దిగడం వెనుక అసలు రహస్యం ఏమిటనే  కోణంలో చర్చలకు తెర లేస్తోంది. తెలంగాణ శాసనసభకు గత నెలలో జరిగిన…

Read More
ana

చిన్నారులతో “అనా”…

జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గా సతీమణి అనా కొణిదెల ప్రీ క్రిస్మస్ వేడుకలను అనాథ హైదరాబాద్ లోని ఒక శరణాలయంలో నిర్వహించారు. బాలాజీ స్వర్ణపురి కాలనీలో ఉన్న జీవోదయ హోమ్ ఫర్ ద చిల్డ్రన్ లోని చిన్నారులతో ముచ్చటించి వారి విద్యాబుద్ధుల గురించి తెలుసుకున్నారు. ఆనంతరం క్రిస్మస్ కేక్ కట్ చేశారు. నిత్యావసర సరుకులను అందచేశారు. అనాను హోమ్ నిర్వాహకులు సత్కరించారు.

Read More
babu pavan

నగరంలో వ్యూహం…

ఆంద్రప్రదేశ్ రాజకీయల చర్చలు హైదారాబాద్ కేంద్రంగా మొదలయ్యాయి. తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు నగరంలోని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లారు. ఇద్దరూ తాజా రాజకీయ పరిస్థితులు, రెండు పార్టీల పొత్తుల వ్యవహారం పై చర్చించారు. వైఎస్సార్​సీపీ విముక్త ఆంధ్రప్రదేశే ప్రధాన అజెండాగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్​ ఆదివారం రాత్రి కీలక చర్చలు జరిపారు. ఇరువురి నేతల మధ్య జరిగిన అంతర్గత భేటీలో 4 ప్రధాన…

Read More
glass copy

“గ్లాసు” ముట్టని ఓటరు…!

తెలంగాణ ప్రాంతంలో  మేకపోతు గాంభీర్యం చూపించిన జనసేన పార్టీని ప్రజలు ఖాతరు చేయలేదు. తెలంగాణ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటున్నట్టు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించడంతో ఆ పార్టీ క్యాడర్ ఒక్కసారిగా న్యూట్రల్ మోడ్ లోకి వెళ్ళింది. కనీసం ఆంధ్రాలో మాదిరిగా ఇక్కడ కూడా జనసేనతో బరిలోకి దిగుతుందేమో అని అంచనా వేశారు. కానీ, తెలుగుదేశంతో సంబంధం లేకుండా తెలంగాణలో జనసేన ఒంటరిగానే రంగంలోకి దూకే ప్రయత్నం చేసింది. అందుకే 32 స్థానాల్లో పోటీ చేస్తుందని…

Read More
yuvac

మళ్లీ జన”గళం’….!

ఆంధ్రప్రదేశ్ లో  ప్రజల ఆశలు, ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ జనగళమే “యువగళం”గా యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 79రోజుల సుదీర్ఘ విరామానంతరం మళ్లీ ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టబోతోంది. జగన్మోహన్ రెడ్డి అరాచకపాలన, అవినీతి బాగోతాన్ని ఎండగడుతున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు నైపుణ్య అభివృద్ధి కేసులో  జైలుకు  వెళ్ళడంతో అనివార్య పరిస్థితుల్లో సెప్టెంబర్ 9వ తేదీన కోనసీమలోని రాజోలు నియోజకవర్గం పొదలాడ వద్ద యువనేత లోకేష్ పాదయాత్రకు తాత్కాలిక విరామం ప్రకటించారు. తర్వాత దేశ రాజధాని డిల్లీలో జగన్మోహన్…

Read More
pawan kishan manohar

మళ్ళీ“మోడీ”రావాలి…!

దేశానికి నరేంద్ర మోడీ ఇంకోసారి ప్రధానమంత్రి కావలసిన ఆవశ్యకత ఉందని, ముచ్చటగా మూడోసారి మోడీ ప్రధాని కావాలని ఆకాంక్షిస్తున్నట్టు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడించారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడారు. ఈ నెల 7వ తేదీన హైదరాబాద్ లో బీజేపీ నిర్వహించే బహిరంగ సభలో పాల్గొనాలని ఆహ్వానం అందినట్టు తెలిపారు. కిషన్ రెడ్డి మాట్లాడుతూ “ఎన్డీయే భాగస్వామ్య పక్షంగా ఉన్న జనసేన పార్టీ జీహెచ్ఏంసీ…

Read More
tdp logo 1

“దేశం”పయనం ఎటు…!

నలభై ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న తెలుగదేశం పార్టీ ఎవరూ ఊహించని రీతిలో తొలిసారి ఎన్నికల బరికి దూరమైంది. వచ్చే నెలలో జరగనున్న తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పోటీకి మొహం చాటేయడంతో రాజకీయ పరిశీలకులు సహా సామాన్య జనం ఒక్కసారిగా విస్తుపోయారు. తెలంగాణలోని అనేక జిల్లాల్లో అంకితభావంతో పనిచేస్తున్న క్యాడర్,  కొన్నినియోజక వర్గాల్లో ఇప్పటికీ పట్టు సడలని ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ తెలుగుదేశం పోటీకి దూరం కావడం ఆ పార్టీ మనుగడను మరింత దెబ్బతీసే అవకాశం…

Read More
IMG 20231023 WA0006 1

“దేశం- సేన” భేటీ…

జనసేన, తెలుగుదేశం పార్టీల సమన్వయ కమిటీ తొలి సమావేశంలో పాల్గొనేందుకు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ రాజమండ్రి చేరుకున్నారు. రాజమండ్రి విమానాశ్రయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్, పీఏసీ సభ్యులు పితాని బాలకృష్ణ, జిల్లా నాయకులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్, అత్తి సత్యనారాయణ, వై. శ్రీను, బత్తుల బలరామకృష్ణ, తుమ్మల బాబుపొలసపల్లి సరోజ, ప్రియా సౌజన్య తదితరులు పవన్ కళ్యాణ్ కి స్వాగతం…

Read More