IMG 20230820 WA0008

జవాన్ కు నివాళి…

జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం లద్ధక్ సమీపంలోని బేరి ప్రాంతం వద్ద ఆర్మీ జవాన్లు ప్రయాణిస్తున్న వ్యాన్ లోయలో పడి 8 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనతో రంగారెడ్డి జిల్లా తంగళ్ళ పల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుల్లో ఒక జవాను రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ మండలం పరిధిలోని తంగెళ్లపల్లి గ్రామ పంచాయతీ లోని తిర్మాన్ దేవునిపల్లి గ్రామనికి చెందిన చంద్ర శేఖర్(30) కూడా ఉన్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన మల్లయ్య ,శివమ్మకు ముగ్గురు సంతానం. వారిలో…

Read More
20230703 135508

ఇది నిజమైతే…శుభవార్తే…!

హైదరాబాద్ జర్నలిస్టుల చిరకాల ఆశ నెరవేరే సూచనలు కనిపిస్తున్నాయి. వారికి ఇళ్ల స్థలాలు మంజూరు చేయడానికి ప్రభుత్వం సన్నద్ధం అవుతున్నట్టు సమాచారం అందుతోంది. సుమారు మూడు దశాబ్దాలుగా  హైదరాబాద్ లో పనిచేస్తున్న విలేకరులు ఇళ్ల స్థలాల కోసం ఎదురు చూస్తున్నారు. వీళ్లలో జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టు హౌసింగ్ సొసైటీకి లో సభ్యులకు 2007వ సంవ్సరంలో  అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం స్థలాలను కేటాయించింది. నిజాం పేట్ ప్రాంతంలో 32 ఎకరాలు, పేట్ బషీరాబాద్ లో 38 ఎకరాలు…

Read More
images 20

అక్కడ ముమ్మరం…ఇక్కడ నీరసం…

హైదరాబాద్ జర్నలిస్టులకు ప్రభుత్వ హామీ మేరకు మంజూరు చేయాల్సిన ఇళ్ల స్థలాల విషయంలో జరుగుతున్న జాప్యం విలేకర్లు, జర్నలిస్టు సంఘాలను అసంతృప్తికి గురి చేస్తోంది. డబ్బు చెల్లించి, 16 ఏళ్ల నుండి ఎదురు చూస్తున్న పాత్రికేయులకు, కొత్తగా ఇళ్ల స్థలాల కోసం వేచిచూస్తున్న వారికీ ప్రభుత్వం న్యాయం చేస్తామనే చెబుతోంది. కానీ, ఎప్పుడు అనేది మాత్రం స్పష్టంగా చెప్పడం లేదు.అయితే, ఇదే విలేకర్ల వర్గానికి జిల్లాల్లో మాత్రం స్థలాలు కేటాయించడం, వారికి మంజూరు చేయడం వేగంగా జరిగి…

Read More
image

డిల్లీలో ఏం జరుగుతోంది…..!

జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీకి చెందిన పేట్ బషీరాబాద్ లోని 38 ఎకరాల భూమి పై ప్రభుత్వంలో కదలిక వచ్చినట్టు తెలుస్తోంది. ఆ స్థలంపై ఉన్న న్యాయపరమైన చిక్కులపై చర్చించడానికి సొసైటీ నేతలతో రాష్ట్ర రెవిన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, ప్రభుత్వ న్యాయవాది (రెవిన్యూ)లతో సోమవారం సమావేశం ఉన్నట్టు సొసైటీ కార్యదర్శి వంశీ తెలిపారు. ఇదిలా ఉంటే, సుప్రీం కోర్టు ఆదేశించినా ప్రభుత్వం సొసైటీకి అప్పజెప్పక పోవడతో ఈ నెల 10వ తేదిన నగరంలోని హెచ్ఎండిఎ…

Read More
pet land 1

ఈ అంశం కీలకం…!

జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీకి చెందిన పేట్ బషీరాబాద్ లోని 38 ఎకరాల భుమిని దక్కించుకోవడానికి సొసైటీ సభ్యుల్లో కొందరు కోర్టుధిక్కార పిటిషన్ దాఖలు చేయడానికి డిల్లీ వెళ్ళడంతో కొత్త అంశాలు తెరపైకి వస్తున్నాయి. ప్రభుత్వం ఒకవైపు సుప్రీం కోర్టు తీర్పునకు అనుకూలంగా ఉన్నట్టు పురపాలక శాఖ మంత్రి కేటిఅర్ చెబుతున్నప్పటికీ, ప్రభుత్వం ఆలస్యం చేస్తోందనే ఆందోళనతో కొందరు సభ్యులు పిటిషన్ వేయడానికి డిల్లీ వెళ్ళిన విషయం తెలిసిందే. అయితే, పిటిషన్ దాఖలు చేయడంలో…

Read More
Screenshot 2023 08 09 082232

డిల్లీలో ముమ్మరంగా…

జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టుల హౌసింగ్  సొసైటీకి 2007 వ సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం  పేట్ బషీరా బాద్ లో కేటాయించిన స్థలాన్ని కాపాడుకోవడానే కార్యక్రమంలో భాగంగా కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేయడానికి డిల్లీ వెళ్ళిన  కొందరు సొసైటీకి సభ్యులు అక్కడ రెండు రోజులుగా న్యాయ నిపుణులతో పాటు పలువురు ప్రముఖులను సంప్రదిస్తున్నారు. ఇప్పటికీ ఆ స్థలాన్ని సొసైటీకి అప్పజెప్పే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి సానుకూలత కనిపించక పోవడంతో డిల్లీ లోని నిపుణుల అభిప్రాయాలు…

Read More
jnj vh

సున్నితత్వం ముఖ్యం…

రాష్ట్రంలో ప్రత్యేకంగా హైదరాబాద్ లో అర్హులైన జర్నలిస్టులకు ప్రభుత్వం ఇవ్వాలనుకుంటున్న ఇంటి స్థలాల విషయంలో ఎందుకు చొరవ చూపడం లేదు. ప్రత్యేక తెలంగాణ సాధించుకొని పదేళ్ళు కావస్తున్నా ఆ పోరాటంలో ప్రత్యక్ష సాక్షులు , కలం వీరులైన విలేకరులను ప్రభుత్వం ఎందుకు చిన్న చూపు చూస్తోందో అర్ధం కానీ పరిస్థితి నెలకొంది. సమాజంలో బాధ్యత కలిగిన నాలుగో వర్గం (ఫోర్త్ ఎస్టేట్)గా ఉన్న జర్నలిజాన్ని , దాని కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయడం ఎంత వరకు సమంజసం అనే…

Read More
pet supr

నిర్లక్ష్యం విలువ…ధిక్కరణ మార్గం…

హైదరాబాద్ జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాల విషయంలో ప్రభుత్వం ఏ విషయాన్ని తేల్చక పోవడం సమస్యగా మారుతోంది. ముఖ్యంగా సుప్రీం కోర్టు తీర్పు మేరకు పేట్ బషీరాబాద్ లోని 38 ఎకరాల భూమిని జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీకి అప్పజెప్పడంలో అధికారుల నాన్చుడు ధోరణి సొసైటీ సభ్యులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. రాష్ట్రంలో ఏ సమస్యనైనా ఇట్టే పరిష్కరించే సామర్ధ్యం ఉన్న ప్రభుత్వం ఒక్క జర్నలిస్టుల ఇళ్ళ స్థలాల వ్యవహారంలోనే ఎందుకు స్తబ్దంగా వ్యవహరిస్తోందో అర్ధం…

Read More
jnj members

అటు నిర్లక్ష్యం.. ఇటు నిస్సహాయత…

ఒకవైపు ప్రభుత్వ నిర్లక్ష్యం, అసలు ఏం చేయలనుకుంటుందో తెలియని అయోమయం…. మరోవైపు ఈ సమయంలో చురుకుగా వ్యవహరించాల్సిన  హౌసింగ్ సొసైటీ  నత్త నడక పనులు…సమస్య పరిష్కారానికి సరైన ప్రయత్నాలు చేయకపోవడం ఇవ్వన్నీ కలిసి సభ్యులను మనోవేదనకు గురిచేస్తున్నాయి. ఈ విషయాల్లోనే  జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టుల హౌజింగ్  సొసైటీ  సభ్యుల మధ్య అగాధం పెరగడానికి దారి తీస్తోంది. ప్రభుత్వానికి, జర్నలిస్టులకు మధ్య సమన్వయ కర్తగా ఉండాల్సిన మీడియా అకాడమీ సైతం ఎలాంటి పరిష్కార మార్గాలు వెతుకుతుందో బాహ్య…

Read More
pres acadmy

“పెద్దసారు”కోసం…

తెలంగాణ మీడియా అకాడమీ భవనం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. వేయి గజాల స్థలంలో నాలుగు అంతస్తుల్లో 29,548 చదరపు అడుగుల్లో కార్పొరేట్ భవనంలా నిర్మించారు. 2015లో జరిగిన అకాడమీ మొదటి సర్వసభ్య సమావేశంలో నాంపల్లి లోని పాత ప్రెస్ అకాడమీ భవనం స్థానంలో కొత్త భవనం నిర్మించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ సూచించారు. ఆ మేరకు  2017లో భవన నిర్మాణానికి 15 కోట్లు విడుదల చేశారు. భవనంలో జర్నలిస్టుల కోసం నాలుగు తరగతి గదులు, కార్యాలయ సిబ్బంది కోసం ఒక…

Read More
dimond

ఘనంగా చేస్తాం…

75 ఏళ్ల దేశ స్వతంత్ర వజ్రోత్సవాల ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాలు, వేడుకల ముగింపు ఉత్సవాల నిర్వహణపై సి.ఎస్. శాంతి కుమారి ఉన్నతస్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా శాంతి కుమారి మాట్లాడుతూ వజ్రోత్సవాల ముగింపు వేడుకలను అత్యంత ఘనముగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు. ఈ ముగింపు వెడుకల్లో ప్రజా ప్రతినిదులు, యువజనులు, విద్యార్థులు, భిన్న రంగాలకు…

Read More
tamil wglc

ఓరుగల్లులో గవర్నర్…

వరంగల్ , హన్మకొండ జిల్లాలలో కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలను గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ పరిశీలించారు. జవహర్ నగర్, నయీమ్ నగర్, భద్రకాళి బండ్, ఎన్టీఆర్ నగర్, ఎన్ ఎన్ నగర్ ప్రాంతాలను పర్యటించి అధికారులను అడిగి నష్టం వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జవహర్ నగర్ లో“ రెడ్ క్రాస్ సొసైటీ” ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గవర్నర్ మాట్లాడుతూ రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు వరంగల్ హన్మకొండ ప్రాంతాలలో…

Read More
ktr 22

ఇవ్వన్నీ చేస్తాం..

ఎన్నికలు దగ్గర పడుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం తాయిలాలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా  సచివాలయంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన రాష్ట్ర కేబినేట్ సమావేశమైంది.  దాదాపు ఐదున్నర గంటల పాటు సుదీర్ఘంగా చర్చించి పలు కీలక అంశాలను ఆమోదించింది. కేబినేట్ లో తీసుకున్న నిర్ణయాలను మంత్రి కేటిఅర్ అధ్వర్యంలో పలువురు మంత్రులు విలేకర్లకు వివరించారు. రాష్ట్రంలో వదలపై కేబినెట్ సుదీర్ఘంగా చర్చించింది. అకస్మాత్తుగా కురిసిన అతి భారీ వర్షాల వల్ల  అనుహ్యరీతిలో వరదల్లో చిక్కుకుని మృత్యువాతపడ్డవారికి రాష్ట్ర…

Read More
cs shanti 1

ఇక ఆరోగ్యంపై దృష్టి…

గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు తగ్గు ముఖం పట్టినందున వరద ప్రభావిత ప్రాంతాల్లో అంటు వ్యాధులు ప్రబలకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. భారీ వర్షాలు, వరదల తాకిడికి గురైన జిల్లాల్లో చేపట్టిన సహాయ, పునరావాస చర్యలు, ముందు జాగ్రతల పై ఆమె జిల్లా కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా సి.ఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ ఇప్పటి వరకు వరద…

Read More
pawan 16

ఆదుకోండి…

తెలంగాణలో వరద బాధితులను తక్షణమే ఆదుకోవాలని జనసేన  అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కోరారు.   రాష్ట్రంలో భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. వర్షాలకు తోడు వరద ప్రభావం కూడా భూపాలపల్లి జిల్లాలో పలు గ్రామాలను జల దిగ్బంధం చేసిందని, భూపాలపల్లి జిల్లా, మోరంచపల్లి గ్రామం వరదలో చిక్కుకున్న విషయం నా దృష్టికి వచ్చిందన్నారు. దాదాపు 200 కుటుంబాలు సాయం కోసం ఎదురుచూస్తున్నాయని, ములుగు జిల్లాలోని ముత్యాలధార జలపాతం వద్దకు వెళ్ళిన 40…

Read More