evm

అతిక్రమిస్తే ఉక్కు పాదం…!

వచ్చే ఎన్నికల్లో ఓటర్ల సౌలభ్యం కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఈవీఎంలలో స్వల్ప మార్పు చేసింది. ఈవీఎంపై గతంలో పార్టీ గుర్తు, అభ్యర్థి పేరు మాత్రమే  ఉండేవి. కానీ ఈ సారి ఎన్నికల్లో వీటితో పాటు అభ్యర్థి ఫొటో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇదే విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ వెల్లడించారు. పోస్టల్‌ బ్యాలెట్‌పైనా అభ్యర్థుల ఫొటోలు ఉంటాయి. ఈ నెల 31 వరకు ఓటు హక్కు నమోదుకు దరఖాస్తు చేసుకోవచ్చు. చిరునామా…

Read Full News
srinivas goud

గండం తప్పింది…

తెలంగాణా మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై ఎన్నికల అఫిడవిట్ కేసును హైకోర్టు కొట్టి వేసింది. మహబూబ్ నగర్ కు చెందిన చలవుగాలి రాఘవేంద్ర రాజు అనే వ్యక్తి శ్రీనివాస్ గౌడ్ గత ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారని ఆరోపిస్తూ, గౌడ్ ఎన్నిక చెల్లదంటూ హైకోర్టులో కేసు వేసిన విషయం తెలిసిందే. అయితే, సుదీర్ఘ విచారణ అనంతరం వివిధ అంశాలను పరిశీలించిన కోర్టు తుది తీర్పు వెల్లడించింది. రాఘవేంద్ర రాజు వేసిన ఎన్నికల కేసు చెల్లదంటూ తీర్పు…

Read Full News
Telangana map

వచ్చే నెల ౩౦న ఎన్నికలు…..

దేశం లోని ఐదు రాష్ట్రాలలో జరగనున్న ఎన్నికలకు సంబంధించిన తేదీల వివరాలను ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్ అనూప్ చంద్ర పాండే, అరుణ్ గోయల్ వివరించారు. తెలంగాణాలో నవంబర్ ౩౦వ తేదీన ఒకేవిదతలో పోలింగ్ జరుగుతుంది. డిసెంబర్ ౩న ఫలితాలు ప్రకటిస్తారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ని నవంబర్ ౩న విడుదల చేస్తారు. నామినేషన్లను 10వ తేదీ నాటికీ దాఖలు చేయాలి. 13 వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 15 వ…

Read Full News
kavit 2 c

సంస్కరణలు రావాలి…!

తెలంగాణా అన్ని రంగాల్లో రాష్ట్రం అగ్రగామిగా నిలబడిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. లండన్ పర్యటనలో ఉన్న ఆమె నేషనల్ ఇండియన్ స్టూడెంట్స్ అండ్ అలుమినీ -‌ యూకే (ఎన్ఐఎస్ఏయూ) సభ్యులతో సంభాషించారు. విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. మహిళా రిజర్వేషన్లు, తెలంగాణ అభివృద్ధి, తన రాజకీయ జీవితం వంటి అంశాలపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. తెలంగాణ ఏర్పడిన వెంటనే సకల జనుల సర్వే నిర్వహించామని, దాని వల్ల రాష్ట్రంలోని ప్రజల సామాజిక…

Read Full News
IMG 20231007 WA0049

ప్రమిదల వెలుగులో…

అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ టీడీపీ తెలుగు రాష్ట్రాల్లో ‘‘కాంతితో క్రాంతి’’ కార్యక్రమాన్ని చేపట్టింది. వివిధ జిల్లాల్లో పలువురు సంఘీభావం తెలిపారు. రాజమండ్రి లో నిర్వహించిన కార్యక్రమంలో నారా భువనేశ్వరి ప్రమిదలు వెలిగించి నిరసన లో పాల్గొన్నారు. ఆమెతో పాటు స్థానిక మహిళలు కార్యక్రమంలో పాల్గొన్నారు. మేము సైతం బాబు కోసం, బాబుతో మేము అంటూ మహిళలు నినాదాలు చేశారు. తెలంగాణలో టిడిపి శ్రేణులు, సినీ దర్శకులు రాఘవేంద్ర రావు, నందమూరి రామకృష్ణ…

Read Full News
vote from home

“ఓటు” ఫ్రమ్ హోమ్….!

దేశంలోనే తొలిసారిగా ఇంటి నుంచే ఓటు వేసే సౌకర్యం ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణలో జరగనున్న శాసన సభ ఎన్నికల నుంచి ఈ వెసులు బాటు అందుబాటులోకి వస్తుంది. అయితే, వయో వృద్ధులు, 40శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులకు ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్య అధికారి రాజీవ్ కుమార్ తెలిపారు. పోలింగ్ కేంద్రాలకి రాలేని సీనియర్ సిటిజన్లు పోలింగ్ కేంద్రంలోనే ఓటు వేయడానికి ఇష్టపడితే అటువంటి వారి…

Read Full News
babu pavan

టిడిపి-“సేన”లో పొత్తు చిచ్చు..!

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వివిధ రాజకీయ పార్టీల పొత్తుల వ్యవహారం గందరగోళంగా మారుతోంది. పెద్ద పార్టీలతో చేతులు కలుపుతున్న పార్టీల వ్యూహాలు సామాన్యులకు అంతు పట్టడం లేదు. గత ఎన్నికలలో అంటకాగిన పార్టీలు ఈ సారి ఎడమొహం పెడమొహంగా ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే రాజకీయ శత్రువులుగా మారాయి. తెలంగాణ, అంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఆంధ్రాలో బిజెపితో కలిసి తిరిగిన జనసేన ఈ సారి రూటు మార్చింది. మొన్నటి వరకు…

Read Full News
Screenshot 20231004 114252 Gallery 1

రైల్వే స్టేషన్ లో రచ్చ….

సిద్దిపేట – సికింద్రాబాద్ రైలు ప్రారంభోత్సవ కార్యక్రమం రచ్చ బండగా మారింది. ఈ రైలుని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నిజామాబాద్ నుంచి వర్చువల్ గా ప్రారంభిస్తే, సిద్దిపేట రైల్వే స్టేషన్ లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఅర్ ఫోటోలు, ఫ్లెక్సీలు లేకపోవడం వివాదంగా మారింది. మంత్రి హరీశ్ రావు, బా.రా.స. ఎం.పి.కొత్త ప్రభాకర్ రెడ్డిలు సైతం ఆవేశానికి గురవడంతో పరిస్థితి అదుపుతప్పి ఆందోళనకు దారితీసింది.ఒక సందర్భంలో హరీశ్ రావు ప్రధాని ప్రసంగం ప్రసారం అవుతున్న ఎల్.ఇ.డి….

Read Full News
Screenshot 20231003 235348 WhatsApp

బిఆర్ఎస్ తిన్నదంతా కక్కిస్తా…

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిజామాబాద్ పర్యటనలో తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పై విరుసుకు పడ్డారు. ఎన్డీఏ లో చేరతానని  కేసీఆర్‌ వెంటపడ్డారనీ, ఆ ప్రతిపాదనను తాను ఒప్పుకోలేదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్  జిల్లాలో ఏర్పాటు చేసిన “జనగర్జన” సభలో మోదీ మాట్లాడుతూ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల తర్వాత కేసీఆర్‌ ఢిల్లీ వచ్చి,తెలంగాణ పాలన పగ్గాలు మంత్రి కేటీఆర్‌కు ఇస్తానని చెప్పినట్టు మోడీ వెల్లడించారు. కేటీఆర్‌ను ఆశీర్వదించాలని కోరినప్పుడు, ఇది రాజరికం…

Read Full News
IMG 20231003 WA0049

షెడ్యూల్ కోసం…

తెలంగాణలో శాసనసభ ఎన్నికల నిర్వహణను అధ్యయనం చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘానికి చెందిన అధికారుల బృందం హైదరాబాద్‌కు చేరుకుంది. చీఫ్ ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, అరుణ్ గోయల్, అనూప్ చంద్రపాండేతో పాటు మరికొంత మంది సభ్యులు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకోగా రాష్ట్ర అధికారులు స్వాగతం పలికారు. కాసేపట్లో ఈ బృందం రాజకీయ పార్టీలతో సమావేశం కానుంది. మూడు రోజుల పాటు ఈ బృందం రాష్ట్రంలో పర్యటించి, అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతపై అధికారులతో సమీక్ష సమావేశం…

Read Full News
IMG 20231002 WA0045 2

తెలంగాణలో సై…

తెలంగాణలో రానున్న ఎన్నికల బరిలోకి దిగడానికి జనసేన సిద్ధమైంది. వివిధ జిల్లాల్లో మొత్తం 32 నియోజక వర్గాలలో తమ అభ్యర్ధులు పోటీ చేస్తారని జనసేన ప్రకటించింది. ఉమ్మడి హైదరాబాద్, రంగరెడ్డి జిల్లాలోని కూకట్‌పల్లి, ఎల్‌బి నగర్, కుతుబుల్లాపూర్, శేరిలింగంపల్లి, సనత్‌నగర్, ఉప్పల్, పటాన్‌చెరువు, మల్కాజిగిరి, మేడ్చల్ వంటి 9 నియోజక వర్గాలు సహా ఖమ్మం జిల్లాలోని 7 నియోజక వర్గాల్లో జనసేన పార్టీ అభ్యర్థులు ఎన్నికలలో పోటీ చేస్తారు.

Read Full News
Screenshot 20231002 004606 WhatsApp

వరాల “మోడీ”…

ములుగు జిల్లాలో 9 వందల కోట్ల రూపాయల వ్యయంతో కేంద్రీయ గిరిజన విశ్వ విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చెప్పారు. మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో భాగంగా తెలంగాణలోసుమారు 13,500 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టే వివిధ రకాల అభివృద్ధి పనులకు అయన శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మోడీ మాట్లాడారు. సమ్మక్క- సరక్క ల పేరుతో గిరిజన యూనివర్సిటీ ప్రారంభించనున్నట్టు వివరించారు. అదేవిధంగా రాష్ట్రంలో పసుపు…

Read Full News
IMG 20231001 WA0008

పీఆర్సీ పరిధిలోకి…

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అంగన్ వాడీ టీచర్ల పై రాష్ట్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. వేతన సవరణలో అంగన్ వాడీ టీచర్లను చేర్చనున్నట్లు సీఎం కేసీఆర్ నిర్ణయించినట్టు ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు వెల్లడించారు. అంగన్ వాడీ టీచర్లు, హెల్పర్ల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సిఐటియు, ఐఐటియు యూనియన్ ల నేతలు హరీష్ రావు ని కలిశారు. అంగన్ వాడీల సమ్మె పై నాయకులతో మంత్రులు హరీష్ రావు, సత్యవతి రాథోడ్…

Read Full News
3 party

“మార్పు” ముంచొచ్చు..!

వచ్చే ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలులోకి వస్తే తెలంగాణా రాష్ట్రంలో రాజకీయ పార్టీలు భారీ కసరత్తు చేయాల్సిన పరిస్ధితులు కనిపిస్తున్నాయి. దాదాపు 35 స్థానాలకు పైగా మహిళల చేతుల్లోకి వెళ్ళాక తప్పదు. మహిళా జనాభా ఆధారంగా చేసుకొని నియోజక వర్గాల కేటాయింపులు జరిగే అవకశాలున్నాయనే సమచారం అందుతోంది. ఒకవేళ ఇదే జరిగితే ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన భారత రాష్ట్ర సమితి (బి. అర్.ఎస్.) మళ్ళీ కొత్త జాబితాను తయారు చేయాలి, సరైన మహిళా అభ్యర్ధులను…

Read Full News
IMG 20230913 WA0015

ఎవడురా బానిస…

ఎవడిదిరా బానిసత్వ పార్టీ అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రి కెటిఆర్ పై ధ్వజమెత్తారు. మద్యం కేసులో కవిత ప్రమేయం పై అమిత్ షా ని కలిసిన తర్వాత ఆగిపోయిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు.మా చెల్లిని అరెస్ట్ చేయకండి, ఎన్నికలు ఎప్పుడైనా పెట్టుకోండి అని కేటీఆర్ అమిత్ షా కి చెప్పి వచ్చాదాని వ్యాఖ్యానించారు.కేటీఆర్ కి ఎంతోకొంత తెలివి ఉందనుకున్ననాని, ఈ రోజు చిట్ చాట్ తర్వాత ఆయనకు…

Read Full News