rebal cong

బుజ్జగింపులు…

తెలంగాణ శాసనసభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్ల ఉపసంహరణ బుధవారం నుంచి ప్రారంభం అవుతోంది. దీంతో ప్రధాన పార్టీల్లో టిక్కట్లు దక్కక తిరుగుబాటు అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేసిన వారిని బుజ్జగించే చర్యలు మొదలయ్యాయి. కొన్ని పార్టీలు ముడో కంటికి తెలియకుండా ఈ తతంగం పూ[పూర్తీ చేస్తుంటే మరికొన్ని పార్టీలు మాత్రం బాహాటంగానే బుజ్జగిస్తున్నాయి. బిజెపి, బారాసలు జిల్లా స్తాయిల్లోనే రెబల్స్ తో సంప్రదింపులు జరుపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ మాత్రం సీనియర్ నేతలతో మాటా మంతి మొదలుపెట్టింది….

Read More
sena bjp

“దేశం-సేన” పొత్తుపై తెలంగాణ ప్రభావం…?

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం, జనసేన పొత్తుపై తెలంగాణ ఎన్నికల ప్రభావం పడే సూచనలు కనిపిస్తున్నాయా? జనసేన వ్యవహార శైలి దీనికి దారి తీసే అవకాశం ఉందా? తెలంగాణలో జనసేన బిజెపితో అంటకాగుతున్నతీరు తెలుగుదేశం అధినాయకత్వానికి మింగుడు పడడం లేదా? పొత్తుల విషయంలో జనసేన ఏకపక్షంగా, దూకుడుగా వ్యవహరిస్తోందా? రాజమండ్రి సెంట్రల్ జైలులో కలిసిన టిడిపి,“సేన” చేతుల పట్టుసడలే ప్రమాదం ఉందా? ఇలాంటి అనేక  ప్రశ్నలకు రాజకీయ పరిశీలకుల నుంచి అవుననే సమాధానం వస్తోంది. తెలుగుదేశం పార్టీ అధినేత…

Read More
cast c

ఎన్ని”కుల” సమ్మేళనాలు…!

తెలంగాణలో జరిగే శాసనసభ ఎన్నికలలో అభ్యర్థులను గెలిపించుకునేందుకు, అధికార పీఠం దక్కించుకునేందుకు రాజకీయ పార్టీల ఎత్తుగడల్లో వింత పోకడలు కనిపిస్తున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా కులాలను అడ్డుపెట్టుకొని రాజకీయం చేయడం అధికమవుతోంది. ఒకవైపు కుల రహిత సమాజం కావాలంటూ ఊకదంపుడు ప్రసంగాలు చేసే నేతలే రాజకీయ పబ్బం గడుపుకోవడానికి కులాలను ఎన్నికల తెరపైకి తేవడం సామజిక, రాజకీయ పరిశీలకులను నివ్వెర పరుస్తోంది. బి.అర్.ఎస్., కాంగ్రెస్, బిజెపి ఇలా ప్రధాన రాజకీయ పార్టీలు గతంలో మాదిరిగా సాధారణ సభలు,సమావేశాల…

Read More
palvai ktr 1

రాజగోపాల్ కి డబ్బు మదం…

రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బిజెపిలోకి ఎందుకు వెళ్ళారో, మళ్లీ తిరిగి కాంగ్రెస్ లోకి ఎందుకు వెళ్ళారనేది ఎవరికీ అంతుపట్టని విషయమని  భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆయన రాజీనామా వల్ల రాష్ట్రం ఉప ఎన్నికను ఎదుర్కొని పరిపాలన అస్తవ్యస్తం అయిందని వ్యాఖ్యానించారు. డబ్బు మదంతో విర్రవీగుతున్న రాజగోపాల్ రెడ్డికి మునుగోడు లో బుద్ధి చెప్పాల్సిన బాధ్యత అందరిపై ఉందని విమర్శించారు. మునుగోడు కాంగ్రెస్ నాయకురాలు పాల్వాయి స్రవంతి ఆ…

Read More
taraluf c

“రాములమ్మ”జాడ లేదు..”శివరంజని”ఊసు లేదు…!

గత రెండు దశాబ్దాలుగా ఎన్నికలు సమీపిస్తున్నాయంటే చాలు వివిధ రాజకీయ పార్టీలు జనాకర్షణ కోసం సినీ నటులపై దృష్టి సారించేవి. ఏదో రకంగా వాళ్ళను రంగంలోకి దించేవి లేదా ఆసక్తి ఉన్న నటులే ముందుకు వచ్చి తమకు నచ్చిన పార్టీల పంచన చేరే వారు. కానీ, ఈ ఎన్నికల్లో ఆ తంతు జాడ లేకుండా పోయింది.గత ఎన్నికల వరకు కూడా సీట్లు, ప్రచారల్లో సందడి చేసిన “వెండి తారలు”ఈ సారి తెలంగాణ శాసన సభ ఎన్నికల తెరపై…

Read More
cong comunist

కలిసిన “కాంగీ”-కామ్రేడ్స్…

ఎఐసిసి ఆదేశాల మేరకు సిపిఐ,కాంగ్రెస్ జాతీయ నాయకత్వంతో, రాష్ట్ర నాయకత్వంతో సంప్రదించి ఒక ఒప్పందానికి వచ్చినట్టు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పారు. దేశంలో మోడీ కారణంగా, రాష్ట్రంలో కెసిఆర్ కారణంగా ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు. ఎన్ డి ఎ కూటమిని ఇండియా కూటమి ఓడించాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, సిపిఐల మధ్య స్పష్టంగా పొత్తు ఖరారైందని, కొత్తగూడెం నియోజకవర్గంలో సిపిఐని గెలిపించేందుకు కాంగ్రెస్ శ్రేణులు సహకరించాలని, కలిసి పని చేయాలని ఎఐసిసి…

Read More
sharmila c1

“చెయ్యి”ఎత్తిన షర్మిలా…!

కేసీఆర్ మీద ప్రజలకు తారా స్థాయిలో వ్యతిరేకత ఉందని, కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేక ఓటును చీల్చొద్దనే ఒకే ఒక్క ఆలోచనతో వైయస్ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తోందని ఆ పార్టీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిలా రెడ్డి చెప్పారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోయే అవకాశం ఉందని, మళ్లీ కేసీఆర్ కు అవకాశం ఇవ్వద్దని కాంగ్రెస్ పార్టీ నాయకులు విజ్ఞప్తి చేసినట్టు ఆమె తెలిపారు. ఈ విషయంలో లోతుగా పరిశీలించిన తర్వాతే రాబోయే ఎన్నికల్లో…

Read More
IMG 20231027 WA00081

సొంత గూటికి….

మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి సొంత గూటికి చేరారు. గతంలో జరిగిన మునుగోడు ఉప ఎన్నికల సమయంలో బిజెపిలో చేరిన రెడ్డి తాజాగా తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఢిల్లీ లోని ఎ.ఐ.సి.సి. కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు మాణిక్ రావు ఠాక్రే రాజ గోపాల్ కి కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నేతలు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి తదతరులు పాల్గొన్నారు.

Read More
journ sridher

మేనిఫెస్టోలో”కలం”వీరులు..!

దశాబ్దాలుగా అపరీష్కృతంగా ఉన్న తమ సమస్యలను పరిష్కరించడానికి వీలుగా రాబోయే ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ రూపొందించే మేనిఫెస్టో లో వాటిని చేర్చాలని తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక కోరింది. ఈ మేరకు తెలంగాణా కాంగ్రెస్ మ్యానిఫెస్టో ఛైర్మెన్ దుద్దిళ్ళ శ్రీధర్ బాబుని వేదిక ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం కలిసింది. తెలంగాణ జర్నలిస్టుల సమస్యలు, సంక్షేమానికి సంబంధించి 9 ప్రధాన అంశాలతో కూడిన వినతిపత్రం అందజేశారు. తమ దీర్ఘకాలిక సమస్యలను కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచి వాటి…

Read More
rahul tea c

“దొర”ల పాలన వద్దు.…

తెలంగాణలో ప్రజల రాజ్యం నడవాలని పదేళ్ళ కిందట  సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని, కానీ అది ఈనాడు దొరల చేతుల్లోకి వెళ్లిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ కోరుకుందీ, ఆశించింది దొరల తెలంగాణ కాదు, ప్రజల తెలంగాణ అని పేర్కొన్నారు. “దొరల తెలంగాణ కు, ప్రజల తెలంగాణకు” మధ్య కొద్దిరోజుల్లో ఎన్నికలు జరగనున్నాయని అన్నారు. ఆర్మూరులో జరిగిన విజయభేరీ తొలి విడత బస్ యాత్ర ముగింపు సభలో రాహుల్ గాంధీ…

Read More
wgl rahul

కాంగ్రెస్ గెలుపు ఖాయం…

రాష్ట్రంలో అధికారం ఒక కుటుంబానికే పరిమితమైందని,  దొరల తెలంగాణ-ప్రజల తెలంగాణకు మధ్య ఎన్నికలు జరగబోతున్నాయని  కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ అన్నారు. వరంగల్ బస్సు యాత్రలో ఆయన మాట్లాడుతూ  తెలంగాణ ప్రజలు రాజ్యాధికారం చేపట్టాలని ఆశించాం, కానీ,  రాష్ట్రంలో కేసీఆర్ ప్రజలకు దూరమవుతూ వస్తున్నారని పేర్కొన్నారు. మీ ఉత్సాహం చూస్తుంటే కొద్ది రోజుల్లో జరిగే ఎన్నికలలో బిఆర్ఎస్, కేసీఆర్ ఓటమి ఖాయమనిపిస్తోందని వ్యాఖ్యానించారు. దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వం తెలంగాణలోనే ఉందనీ, బీఆర్‍ఎస్ అవినీతితో ప్రజలు…

Read More
rahul priyanka 1

రామప్పలో రాహుల్…

తెలంగాణా ఎన్నికల ప్రచారానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు వరంగల్ జిల్లా లోని రామప్ప ఆలయంలో పూజలు చేశారు. దేవాలయంలో పూజల అనంతరం వారిద్దరూ ములుగులో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. రాహుల్, ప్రియాంక వెంట తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, పలువురు నేతలు ఉన్నారు.

Read More
IMG 20231015 WA0034

మేనిఫెస్టోలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు..

జర్నలిస్టుల ఇంటి స్థలాల అంశాన్ని తమ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టే అంశాన్ని పరిశీలిస్తామని, ఈ విషయాన్ని శ్రీధర్‌బాబు నేతృత్వంలోని మేనిఫెస్టో కమిటీకి నివేదిస్తామని తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఈ మేరకు డెక్కన్‌ జర్నలిస్ట్స్‌ హౌసింగ్‌ సొసైటీ (డీజేహెచ్‌ఎస్‌) అధ్యక్షులు బొల్లోజు రవి, ఉపాధ్యక్షులు మరిపాల శ్రీనివాస్, కోశాధికారి చిలుకూరి అయ్యప్ప, డైరెక్టర్లు జి.ప్రతాప్‌రెడ్డి, దండ రామకృష్ణ, సభ్యులు క్రాంతి తదితరులు ఆదివారం రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. ఎన్నికల మేనిఫెస్టోలో జర్నలిస్టుల…

Read More
Screenshot 20231014 161826 WhatsApp

సిగ్గుండాలి….

నలభై ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో పనిచేసి, పదవులు, అధికారం అనుభవించి నేడు అదే పార్టీని వీడి పోవడం సిగ్గుచేటు వ్యవహారమని పి.సి.సి. అధ్యక్షులు రేవంత్ రెడ్డి పొన్నాల లక్ష్మయ్య పై విరుసుకు పడ్డారు.

Read More
batti c

ప్రజల”చేయి”వదలని “విక్రమార్క”…

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నాయకులకే కాదు, సామాన్య ప్రజలకు సైతం అందరికి తెలిసిన నేత మల్లు భట్టి విక్రమార్క. ఉద్యమాల ఖిల్లా ఖమ్మం జిల్లాకు చెందిన ఆయన రాజకీయ నేపద్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చి రాష్ట్ర స్థాయి నేతగా ప్రజలకు చేరువయ్యారు. కాంగ్రెస్ నేతలు, లోక్ సభ మాజీ సభ్యులు స్వర్గీయ మల్లు అనంత రాములు, మరో పార్లమెంటు సభ్యుడు మాజీ శాసన సభ మాజీ సభ్యులు మల్లు రవి సొంత తమ్ముడు విక్రమర్క. 1990వ దశకంలో…

Read More