bindi

బొట్టు పెట్టుకుంటావా…

ఝార్ఖండ్ లోని సెయింట్ జేవియర్ స్కూలులో నుదిటి పై బొట్టుపెట్టుకొని వెళ్ళిన ఓ విద్యార్ధినిని టీచర్ చంప దెబ్బలు కొట్టడం తో అవమానభారం భరించ లేక ఆ విద్యార్ధిని ఆత్మహత్య ప్రయత్నం చేసింది. విషయం బయటకు పొక్కడంతో తల్లిదండ్రులు, పోలీసులు పాపను ఆసుపత్రికి తరలించారు.  

Read More
racha in1

కరెంటు రచ్చ..

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఉచిత కరెంటు పై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేకి అంటూ అధికార టిఆర్ఎస్ మండి పడుతోంది. రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా  రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు మేపట్టింది, నాయకులూ, మంత్రుల అధ్వర్యంలో అన్ని జిల్లాలలో నిరసనలో భాగంగా రాస్తారోకోలు, దిస్తిబోమ్మలను దగ్దం చేశారు.ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ లో ఇతర నాయకులు జిల్లాల్లో నిరసన చేపట్టారు.మహబూబ్ నగర్ లోని తెలంగాణ చౌరస్తాలో జరిగిన కార్యక్రమంలో  రాష్ట్ర…

Read More
cm sc c

పుస్తకం భేష్…

ఎస్టీ జాతుల్లో దాగిఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సృజనాత్మక పథకం‘చీఫ్ మినిస్టర్స్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎంటర్ ప్రెన్యూర్షిప్ అండ్ ఇన్నోవేషన్ స్కీం (సీఎంఎస్ఇఇఐ) ద్వారా వివిధ రంగాలలో లబ్ధిదారులైన ఎస్టీ యువతీ యువకుల విజయగాథలను, సాధించిన ప్రగతికి సంబంధించిన సమాచారాన్ని దశాబ్ధి ఉత్సవాల నేపథ్యంలో  రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ పుస్తక రూపంలో ప్రచురించింది. ఈ పుస్తకాన్ని సచివాలయంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు  ఆవిష్కరించారు. ఈ  కార్యక్రమంలో  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి…

Read More
himachal 12

క్షేమంగా రావాలి…

హైదరాబాద్ నగరానికి చెందిన ముగ్గురు డాక్టర్లు హిమాచల్ ప్రదేశ్ మనాలి లోని వరద ముంపు ప్రాంతంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఉస్మానియా ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ బానోత్ కమల్ లాల్, డాక్టర్ రోహిత్ సూరి, డాక్టర్ శ్రీనివాస్ వరదల్లో చిక్కుక్కున్నారు. ముగ్గురు డాక్టర్ల ఫోన్స్ స్విచ్చాఫ్ అయినట్లు సమాచారం. దీంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.డాక్టర్ల ఆచూకీ కోసం తెలంగాణ డాక్టర్ల సంఘం ఢిల్లీ రెసిడెంట్ కార్యాలయాన్ని సంప్రదించింది.

Read More
harish nirmala

ఆ నిధులు ఇవ్వండి…

తెలంగాణలో వెనుకబడిన జిల్లాల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం నిధులు మంజూరు చేయాలని  ఆర్థిక శాఖ మంత్రి హారీష్ రావు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు దిల్లీలో జరిగిన  50వ జిఎస్టీ కౌన్సిల్ సమావేశం సమావేశానంతరం కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి తో సమావేశమై వినతి పత్రాన్ని అందజేశారు.

Read More
hijra

ఏయ్…

మిర్యాలగూడలో హిజ్రాలు హాల్ చల్ చేశారు. అదీ ఎక్కడో కాదు సాక్షాత్తూ పోలీస్ స్టేషన్ లోనే జరగడం విశేషం. హిజ్రాల పరస్పర ఘర్షణలు, కొట్లాటలతో స్టేషన్ ఆవరణ హోరెత్తింది.వివరాల్లోకి వెళ్తే, పట్టణంలో ఆధిపత్య పోరులో భాగంగా ఓ వర్గం హిజ్రాలు పోలీసులను ఆశ్రయించారు. అయితే, ఈ విషయం తెలుసుకున్న మరో వర్గం స్టేషన్‌కు చేరుకుంది. రెండు వర్గాలు ఎదురెదురు పడటంతో తీవ్ర వాగ్వివాదం జరిగింది. పోలీస్‌ స్టేషన్‌లోనే హిజ్రాలు రెచ్చిపోయారు. రెండు గ్రూప్‌లుగా విడిపోయి తీవ్రంగా కొట్టుకున్నారు….

Read More
ap

ఉల్లంఘిస్తే తప్పదు…

కోర్టు ధిక్కరణ కేసులో ఐఏఎస్ అధికారి ప్రవీణ్‌ కుమార్‌కు హైకోర్టు జైలు శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది. ప్రవీణ్‌ కమార్‌ ప్రస్తుతం ఏపీఐఐసీ ఎండీగా ఉన్నారు. గతంలో విశాఖపట్నం కలెక్టర్‌గా ఉన్న సమయంలో కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారని కోర్టు ధిక్కరణ కేసు నమోదైంది. భీమునిపట్నం మండలంలోని కాపులప్పాడ గ్రామం పరిధిలో ఏడు ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ నిలిపివేసి దాన్ని నిషేధిత భూముల జాబితాలో చేర్చారని అభియోగాలున్నాయి. ఆ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని 2017లో…

Read More

కరెంటు మంట…

తెలంగాణలో రైతులకు 3 గంటలు కరెంట్ ఇస్తే చాలు అని  టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. అమెరికా పర్యటనలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణలో 95 మంది 3 ఎకరాల లోపు చిన్న, సన్నకారు రైతులే ఉన్నారని, వారికి మొత్తంగా రోజుకి 8 గంటలు ఉచిత విద్యుత్తు ఇస్తే సరిపోతుందని అభిప్రాయపడ్డారు. విద్యుత్తు సంస్థలతో కమీషన్ లకు కక్కుర్తిపడి కేసీఆర్ అనవసరంగా 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నారని ఆరోపించారు. రేవంత్ వ్యాఖ్యలపై…

Read More
gst 1

వసూళ్ళు ఎలా…

ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షత జరిగిన 50వ జిఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర ఆర్ధిక,వైద్య శాఖ మంత్రి టి.హారీష్ రావు.

Read More
Screenshot 2023 07 11 133536

నిర్లక్ష్యం…

ఉత్తర ప్రదేశ్ ఘజియాబాద్ లో రాంగ్ రూట్ లో వచ్చిన ఓ స్కూల్ బస్సు ఎదురుగా వస్తున్న కారుని డి కొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందారు.అయితే, బస్సులో పిల్లలు లేకపోవడం గమనార్హం.

Read More

శుభకార్యానికి వెళ్తూ..

ప్రకాశం జిల్లా దర్శి లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బృందంతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి సాగర్ బ్రాంచి కాలువలో పడడంతో ఏడుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఆరుగురు మహిళలు, ఒక వృద్ధుడు ఉన్నారు. వీరంతా కాకినాడలో జరిగే ఓ శుభకార్యంలో పాల్గొనడానికి పొదిలి నుండి వెళ్తున్నట్లు తెలిపారు. ఒంగోలు డిపోకు చెందిన ఆర్టీసీ బస్ లో వీరంతా ప్రయాణిస్తున్నారు. చనిపోయిన వారిలో ఓ మైనర్ బాలిక కూడా ఉంది. బస్సులో మొత్తం…

Read More
pawan 12

ఆ మాటలేంటి…

ఆంధ్రప్రదేశ్ లో మానవ అక్రమ రవాణా ఎక్కువైందననీ జనసేన అధినేత పవన్ కల్యాణ్  చేసిన వ్యాఖ్యలు  వివాదంగా మారాయి.  వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థే మానవ అక్రమ రవాణాకు ప్రధాన కారణమని ఆరోపించడంతో మహిళలు భగ్గుమంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వాలంటీర్ల నుండి నిరసనలు వెల్లువెత్తుసున్నాయి. పవన్ కళ్యాణ్ ఆరోపణలపై స్పందించిన ఏపీ మహిళా కమిషన్ ఆయనకు నోటీసులు జారీ చేసింది. దీనిపై కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ పవన్ కల్యాణ్ క్షమాపణ చెప్పాలని…

Read More
kavita c

కంకి రుచి..

జగిత్యాల జిల్లాలో పర్యటించిన ఎమ్మెల్సీ కవిత తిరుగు ప్రయాణంలో మల్యాల మండలం నూకపల్లి వద్ద రోడ్డు పక్కన మొక్కజొన్న కంకులు కాలుస్తున్న ఓ మహిళా దగ్గరికెళ్లి కంకులు కొనుగోలు చేసి అక్కడే రుచి చూశారు. రుచిని ఆస్వాధిస్తూ ఆమె వివరాలు సేకరించారు. కంకులు విక్రయించే మహిళ తన పేరు కొమురమ్మ అని తెలంగాణ వచ్చిన తర్వాత కెసిఆర్ పాలన గురించి వివరించింది. ఇంటింటికి పించన్ తదితర రూపాల్లో కేసీఆర్ మంచిగిస్తుండని కొమురమ్మ పేర్కొంది. స్వయంగా కేసీఆర్ కూతురే…

Read More
Screenshot 2023 07 11 111758

ఉగ్రం…

హిమాచల్ ప్రదేశ్ మండి జిల్లాలో భారీ వరదలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. సోలాన్ ప్రాంతంలో 140 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. 50 ఏళ్లలో ఒకరోజులో నమోదైన అత్యధిక వర్షపాతం ఇదేనని పేర్కొన్నారు.  బియాస్ నది ఉప్పొంగడంతో వరద ధాటికి  ఇళ్లు, దుకాణాలు కొట్టుకుపోయాయి. ఇప్పటికీ భారీ వరదలు లోతట్టు ప్రాంతాలను ముంచెత్తుతున్నాయి. జాతీయ విపత్తు నివారణ బలగాలు రంగంలోకి దిగి లోతట్టు ప్రాంత ప్రజలకు సహకరిస్తున్నాయి.

Read More
cs delhi c

చాలా అవసరం…

రాష్ట్రంలోని పలు అభివృద్ధి పథకాలకు సంబంధించి కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్న సమస్యలను త్వరగా పరిష్కరించాలని కోరుతూ న్యూ ఢిల్లీలోని పలువురు కేంద్ర కార్యదర్శులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి కలసి విజ్ఞప్తి చేశారు. ఒక రోజు పర్యటన కోసం ఢిల్లీ వెళ్లిన సి.ఎస్, కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి గిరిధర్ , కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ కార్యదర్శి లీలా నందన్, కేంద్ర రహదారులు, రవాణా, జాతీయ రహదారుల శాఖ కార్యదర్శి…

Read More