amit bandi

“షా “తో సంజయ్…

బిజెపి తెలంగాణ శాఖ మాజీ అధ్యక్షులు బండి సంజయ్ కేంద్ర హోం మంత్రి అమిత్ షా ని ధిల్లీలో కలిశారు. సంజయ్ అధ్యక్షునిక వైతోలగిన తర్వాత ధిల్లీ వెళ్ళడం రదే మొదటి సారి. అయితే, అమిత్ షా ని మర్యాదపూర్వకంగా కలిసినట్టు సంజయ్ తెలిపారు.

Read Full News
pawan kkd 2

కేసు పడింది…

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమపై చేసిన వ్యాఖ్యలు, ఆరోపణలకు తీవ్ర మనస్తాపం చెందినట్టు విజయవాడ సివిల్ కోర్టులో ఓ మహిళా వాలంటీర్ పవన్ కల్యాణ్ పై పిటిషన్ వేసింది. పవన్ మాటలు మానసిక వేదనకు గురిచేశాయని పేర్కొంది. ఈ మేరకు వాలంటీర్ దాఖలు చేసిన పిటిషన్ కోర్టు విచారణకు స్వీకరించింది.

Read Full News
speaker

మణిపూర్ మంట…

లోక్ సభ వర్షాకాల సమావేశాల్లో మణిపూర్ మంట రాజుకుంది. విపక్షాల నినాదాలు, ప్లకార్డులతో పార్లమెంట్ హాల్ హోరెత్తింది. ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌ అంశంపై ప్రధాని ప్రకటన చేయాలని విపక్షాలు డిమాండ్ చేయడంతో  సమావేశాల్లో ప్రతిష్టంభన నెలకొంది. దీనిపై చర్చకు సిద్ధమేనని కేంద్రం ప్రకటించినప్పటికీ ఆ  చర్చకు ముందే ప్రధాని ప్రకటన చేయాలని విపక్షాలు పట్టుపట్టాయి.సోమవారం సమావేశాలు ప్రారంభం కాగానే విపక్ష పార్టీలు లోక్‌సభలో ప్లకార్డు లతో దర్శనమిచ్చాయి. “ఇండియా ఫర్ మణిపుర్‌” మణిపుర్‌ పై ప్రధాని ప్రకటన…

Read Full News
Screenshot 2023 07 24 114251

ఇంతే పడుకుంటా…

అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం ఫలితంగా జనం నానా ఇబ్బందులు పడుతుంటారు. ముఖ్యంగా వర్షాలు వచ్చినప్పుడు రోడ్ల విషయంలో పడే బాధలు అన్నీ ,ఇన్నీ కావు. గల్లీ గల్లీలో రోడ్ల సమస్య పట్టిపీడిస్తుంది. ఇలాంటి సమస్యతోనే అలసిపోయాడు ఓ వ్యక్తి. రోడ్డు దుర్బర పరిస్థితిని అధికారుల దృష్టికి తీసుకెళ్ళడానికి నిరసన తెలియజేయలనుకున్నాడు. అంతే.. నడిరోడ్డుపై కూర్చోలేదు… కానీ పడుకున్నాడు… ఎలా అంటారా…ఏలూరు నగరంలో గంగానమ్మ గుడి వద్ద రహదారిపై నీరు నిలవడంతో ఓ వ్యక్తి వినూత్న నిరసన తెలిపలనుకున్నాడు….

Read Full News
tomato lorry

తుపాకీ గస్తీ..

అసలే ఆకాశాన్ని అంటిన ధరలతో కొండెక్కి కూర్చున్న టమాటోలకి మార్కెట్ లో ఇంతా, అంతా డిమాండ్ లేదు. కూరలోకి ఒక్క టమాట దొరికిన చాలానే ఆలోచన. అందుకే వాటిని సాగుచేస్తున్న రైతులు దొంగల బెడద నుంచి కాపాడలేక నానా తంటాలు పడుతున్నారు. ఎలాగో పంటను కోసి మార్కెట్ కి చేరవేద్దామంటే రవాణా భయం. వాటిని తీసుకువెళ్తున్న లారీ గమ్య స్థానానికి చేరేంత వరకు రైతుకు గుబులే. మొన్న ఆదిలాబాద్ జిల్లలో ఓ టమాటోల లారీ బోల్తా పడగా…

Read Full News
cycle c

“బర్త్ డే” సిప్..

ప్రకృతి సిద్ధమైన నీరా తాగడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందని మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రాష్ట్ర పురపాలక , ఐటి శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పుట్టిన రోజు సందర్భంగా తెలంగాణ క్రీడ ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్ లో నీరా కేఫ్ పాయింట్ వద్ద కేకును కట్ చేశారు. ఇక్కడ మంత్రి మాట్లాడుతూ అనేక ఔషధ గుణాలు కలిగిన నీరా సేవించడం వల్ల కిడ్నీ, క్యాన్సర్ వంటి రోగాలు రాకుండా…

Read Full News
Screenshot 2023 07 23 154142

“నయా”గరా…

ములుగు-వాజేడు మండలంలో ఓ ప్రకృతి దృశ్యం వెలుగు చూసింది. అరుణాచలపురానికి కిలోమీటర్ దూరంలో అద్భుత జలపాతం బయటపడింది. ఇంత కాలం సన్నని ధారగా ప్రవహించిన ఈ జలపాతం ఇటీవల కురుస్తున్న వర్షాలకు తన రూపు మార్చుకొని చూడ చక్కని జలపాతంగా మారింది. స్థానికులు దీన్ని గుండం జలపాతంగా పిలుస్తున్నారు. ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఉంది. అదేంటంటే ఈ జలపాతం వద్ద నీరు సముద్రపు నీరు మాదిరిగా నీలి రంగులో ఉండడం విశేషం. అందుకే పర్యాటకులు మరి ఆసక్తిగా…

Read Full News
bus

చెరువులో పడి…

బంగ్లాదేశ్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మరణించిన వాళ్ళల్లో ఏడుగురు మైనర్లు, ఐదుగురు మహిళలు కూడా ఉన్నారు. మరో 35 మందికి పైగా గాయపడ్డారు. ఝలకతి సదర్ ఉప జిల్లా పరిధిలోని ఛత్రకాండ ప్రాంతంలోని చెరువు వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ప్రాణాలతో బయటపడిన…

Read Full News
byc

పెట్టుబడికి బ్రేక్…

తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మరోసారి మోకాళ్ళడ్డింది. ఇప్పటికే నిధులు ఇవ్వక రాష్ట్రాన్ని ఇబ్బందులు కేంద్రం   కేంద్రం తాజాగా  రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులను అడ్డుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి.  అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ అయిన  బి.వై.డి. హైదరాబాదులో ఏర్పాటు చేయాలనుకున్న వాహన తయారీ విభాగానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. బివైడి సంస్థ నాణ్యమైన ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు బ్యాటరీలను కూడా తయారు చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ కంపెనీకి పేరు ఉన్నది. మన దేశంలోనూ బివైడి…

Read Full News
new cj c

కొత్త న్యాయమూర్తి…

తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ అలోక్ అరాధే ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గవర్నర్ తమిళి సై అరాధేచే ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పలువురు మంత్రులు పాల్గొన్నారు.

Read Full News
notes

సినిమా చూపిన ముఠా …

మార్కెట్ లో రోజుకో రూపంలో మోసగాళ్ళు తిరుగుతున్నా అత్యాశపడే వారికి మాత్రం వాళ్ళు కనిపించడంలేదు. “ఒకటికి రెండు” అనే బురుడీ మాటలు చెబుతున్నవారి వలలో చిక్కుకుంటున్నారు. ఆ క్రమంలో నిలువునా మోసపోతున్నారు. నంద్యాలలో సరిగ్గా ఇలాంటి సంఘటనే జరిగింది. ఒకటికి మూడింతలు అంటూ కోట్ల రూపాయలు దోచుకుపోయారు. ఈ వివరాల్లోకి వెళ్తే అసలు నోట్లకు మూడింతలు నకిలీ నోట్లు ఇస్తామని స్థానిక స్థిరాస్తి వ్యాపారి మదన్ మోహన్ రెడ్డి ని ఓ ముఠా నమ్మించింది. తాము ఇదే…

Read Full News
table

ఆటలూ ముఖ్యం..

విద్యార్థులు క్రీడలలో పాల్గొనడం వల్ల శారీరకంగా , మానసికంగా దృఢత్వం పొందగలుగుతారని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ అన్నారు. అబిడ్స్ లోని లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో టేబుల్ టెన్నిస్ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థులు క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. సమాజాభివృద్ధిలో విద్య కీలకపాత్ర పోషిస్తుందని, విద్యకు ప్రాధాన్యత ఇచ్చే సమాజం అభివృద్ధి చెందుతూనే ఉందని తెలిపారు . లిటిల్‌ ఫ్లవర్‌ స్కూల్‌ ప్లాటినం జూబ్లీ వేడుకల సందర్భంగా…

Read Full News
pention

వెయ్యి పెరిగింది…

రాష్ట్రంలో దివ్యాంగుల పింఛన్ ను పెంచుతూ ఉత్వర్వులు జారీ చేసిన సందర్భంగా మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుని కలిసి ధన్యవాదాలు తెలిపారు.దివ్యాంగులకు ప్రస్తుతం ప్రతి నెల ఇస్తున్న 3016 రూపాయల పెన్షన్ ను మరో వెయ్యి రూపాయలు పెంచడం పట్ల మంత్రి కొప్పుల హర్షం వ్యక్తం చేశారు. ఈ నెల నుంచి ప్రతీ దివ్యంగులకు రూ.4016 రూపాయలు చెల్లించడం జరుగుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు, పెన్షన్లు…

Read Full News
ranu sahu

ఐఏఎస్ అరెస్టు…

ఛత్తీస్ ఘడ్ లో మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ అధికారిని రానూ సాహు ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఇ.డి.) అధికారులు అరెస్టు చేశారు. బొగ్గు గనుల కేటాయింపులో జరిగిన అక్రమాల్లో సాహు సహా పలువురు అధికారుల పై విచారణ జరిపిన అధికారులు శనివారం నాడు వారికి సంబంధించిన 18 ప్రాంతాల్లో ఏక కాలంలో దాడులు నిర్వహించారు. అనంతరం రానూ సాహుని అరెస్టు చేసినట్టు అధికారులు తెలిపారు. ఆమెను కోర్టులో హాజరుపరచగా 3 రోజుల…

Read Full News