zero c

పార్టీ మూత  – ఫలితాలు సున్నా…

దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పార్టీని మరింత పటిష్టపరిచే వ్యూహాలతో  కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముందుకు వెళ్తుంటే దక్షిణాదిన ఆంధ్రప్రదేశ్ లో అంతర్గత కుమ్ములాటలు తలనొప్పిగా మారాయి. మొన్నటి సార్వత్రిక ఎన్నికలకు ముందు మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె షర్మిలను అనూహ్యంగా తెరపైకి తీసుకువచ్చిన అధిష్టానానికి  ప్రస్తుతం ఆమె వ్యవహార శైలి ఇరకటంలోకి లాగింది. మూడేళ్ల కిందట తెలంగాణ నా “మెట్టినిల్లు”, ఇక్కడే చదివా, ఇక్కడే పెళ్లి చేసుకున్నా, పిల్లాలను కన్నా, చివరి వరకు ఇక్కడే ఉంటా…

Read Full News
IMG 20240625 WA0036

కదలండి…

కాంగ్రెస్ పార్టీ జాతీయ క్రమ శిక్షణ కమిటీ ఛైర్మన్ తారిక్ అన్వర్ నిన ఆంద్రప్రదేశ్ కాంగ్రెస్ నేతలు కలిశారు. షర్మిల నేతృత్వంలో జరుగుతున్న అనేక పార్టీ వ్యతిరేక అంశాలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. గత ఎన్నికల్లో కేవలం షర్మిల ఒంటెత్తు పోకడలు మూలంగానే భారీ నష్టం కలిగిందని ఆయనకు వివరించారు. అంతేకాక,షర్మిల ఏకపక్ష నిర్ణయాలతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. ఈ విషయంలో అధిష్ఠానం వెంటనే నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఆంద్రప్రదేశ్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అధ్యక్షులు సుంకర…

Read Full News
IMG 20240621 WA0019

షర్మిల “క్విడ్ ప్రో కో”..!

తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీ, లోక్ సభ అభ్యర్థుల ఎన్నిక పారదర్శకంగా జరుగలేదని, ఆంద్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిలరెడ్డి, ఆమె అనుచరగణం అభ్యర్థుల ఎంపికలో “క్విడ్ ప్రో కో” (నీకు అది – నాకు ఇది) తరహా పద్ధతి అవలంభించారని ఆ రాష్ట్ర కాంగ్రెస్ కార్యనిర్వహక అధ్యక్షులు సుంకర పద్మశ్రీ, రాకేష్ రెడ్డి ఆరోపించారు. షర్మిల కోటరీ వైఖరి వల్ల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీపై తీవ్ర ప్రభావం పడిందన్నారు. అభ్యర్థులకు కాంగ్రెస్ అధిష్టానం అందించిన…

Read Full News
shrmil rahul

రాహుల్ ప్రధాని కావాలి…

రాహుల్ గాంధీని దేశ ప్రధానిగా చూడాలన్నది తన తండ్రి రాజశేఖర్ రెడ్డి ఆశయమని కాంగ్రెస్ నేత వై.ఎస్. షర్మిల చెప్పారు. వై.ఎస్.ఆర్. తెలంగాణ పార్టీని ఆమె కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. డిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ  కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి షర్మిలను పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం షర్మిల మాట్లాడుతూ స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీలో గొప్ప నేత అని, ఆయన…

Read Full News
revanth

“రేవంత్” అనే నేను…

తెలంగాణ ఉద్యమ పార్టీ ధాటికి ఉనికి కోల్పోయిందనుకున్న చారిత్రిక కాంగ్రెస్ పార్టీకి తన యువ రక్తంతో జవసత్వాలు పోసి తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే అంటూ ఉరూరా చాటిన రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎన్నికైయ్యారు. అధిష్టానం ఆలోచనల మేరకు మూడు రోజుల పాటు ఉత్కంటభరితంగా సాగిన అధిష్టాన ఓడిపోత కార్యక్రమంలో చివరకు యువనేతనే ముఖ్యమంత్రి పదవి వరించింది. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ లుగా ఉన్న అనేక మంది డిల్లీలో జరిగిన మంతనాల్లో ఎన్ని ఎత్తులు వేసినా…

Read Full News
rahul selfi

ప్రచారంలో “రేవంత్” దూకుడు..!

ఈ నెల 30న జరగనున్న తెలంగాణ శాసన సభ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటనలతో ప్రచారం నిర్వహించారు. నోటిఫికేషన్ నుంచి ప్రచారం ముగిసే వరకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ దాదాపు 63 నియోజకవర్గాల్లో ప్రచార సభల్లో పాల్గొన్నారు. అక్టోబర్ 16న వికారాబాద్ లో నిర్వహించిన సభ నుంచి నవంబర్ 28న మాల్కాజిగిరి రోడ్ షో వరకు దాదాపు 87 సభలో పాల్లొన్నారు. వికారాబాద్, తాండూరు, పరిగి, చేవేళ్ల, ములుగు,…

Read Full News
priyanka mdr c

బాధలు తెలియని బీఆర్‌ఎస్‌…

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజల బాధలను పట్టించుకోలేద కాంగ్రెస్ పార్టీ అధినేత ప్రియాంక గాంధీ వ్యాఖ్యానించారు. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ప్రజల సొమ్ము దోచుకున్నారని, ఆరోపించారు. శాసన సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మం జిల్లా మధిరలో నిర్వహించిన సభలో ఆమె మాట్లాడారు. పేపర్‌ లీకులు జరుగుతుంటే పిల్లల తల్లిదండ్రుల బాధ వర్ణణాతీతంగా ఉందన్నారు.  బిడ్డల భవిష్యత్‌ పై వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారన్నారు. ఈ ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చిందా అని ప్రజలను ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ నేతలకు వందల…

Read Full News
priyanka meet

కెసిఆర్ కుటుంబానికే ఉద్యోగాలు…!

బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశ సంపదను పారిశ్రామికవేత్త ఆధానికి దోచి పెడుతున్నారని ప్రియాంక గాంధీ ఆరోపించారు. హుస్నాబాద్ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రియాంక మాట్లాడుతూ దేశంలో పారిశ్రామికవేత్తగా గుర్తింపు పొందిన ఆదాని ఒక రోజు సంపాదన 1600 కోట్లు అని తెలిపారు. కేంద్ర బిజెపి ప్రభుత్వం బడ పారిశ్రామికవేత్తలకు  తొత్తుగా మారి దేశ సంపదను అప్పనంగా…

Read Full News
priyanka speec

రెండు లక్షల ఉద్యోగాలు గ్యారంటీ..

కెసిఆర్ ప్రభుత్వ హయంలో  నిరుద్యోగుల హత్మహత్యలు  పెరిగాయని, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపడితే వెంటనే యువతకు రెండు లక్షల ఉద్యోగాలు తప్పనిసరి ఇస్తామని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీ హామీ ఇచ్చారు. పదేళ్ళ పాలనలో తెలంగాణ కెసిఆర్ చేతిలో నిలువుదోపిడికి గురైందని, భారత రాష్ట్ర సమితి అవినీతిలో కూరుకుపోయిందని దుయ్యబట్టారు. కెసిఆర్ ప్రభుత్వంలో నిరుద్యోగుల సమస్యలు తీరలేదన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్, కుమురం భీమ్ జిల్లా ఆసిఫాబాద్ ఎన్నికల సభల్లో ప్రియాంక పాల్గొన్నారు. తెలంగాణలో…

Read Full News
vijsnti karge

ఈ సారి కాంగ్రెస్…

సినీ నటి, మాజీ ఎం.పి. విజయ శాంతి ఈ సారి కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. తగిన ప్రాధాన్యత దక్కడంలేదని భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసిన ఆమె కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే సమక్షంలో ఆ పార్టీలో చేరారు.

Read Full News
IMG 20231027 WA00081

సొంత గూటికి….

మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి సొంత గూటికి చేరారు. గతంలో జరిగిన మునుగోడు ఉప ఎన్నికల సమయంలో బిజెపిలో చేరిన రెడ్డి తాజాగా తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఢిల్లీ లోని ఎ.ఐ.సి.సి. కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు మాణిక్ రావు ఠాక్రే రాజ గోపాల్ కి కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నేతలు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి తదతరులు పాల్గొన్నారు.

Read Full News
wgl rahul

కాంగ్రెస్ గెలుపు ఖాయం…

రాష్ట్రంలో అధికారం ఒక కుటుంబానికే పరిమితమైందని,  దొరల తెలంగాణ-ప్రజల తెలంగాణకు మధ్య ఎన్నికలు జరగబోతున్నాయని  కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ అన్నారు. వరంగల్ బస్సు యాత్రలో ఆయన మాట్లాడుతూ  తెలంగాణ ప్రజలు రాజ్యాధికారం చేపట్టాలని ఆశించాం, కానీ,  రాష్ట్రంలో కేసీఆర్ ప్రజలకు దూరమవుతూ వస్తున్నారని పేర్కొన్నారు. మీ ఉత్సాహం చూస్తుంటే కొద్ది రోజుల్లో జరిగే ఎన్నికలలో బిఆర్ఎస్, కేసీఆర్ ఓటమి ఖాయమనిపిస్తోందని వ్యాఖ్యానించారు. దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వం తెలంగాణలోనే ఉందనీ, బీఆర్‍ఎస్ అవినీతితో ప్రజలు…

Read Full News
rahul priyanka 1

రామప్పలో రాహుల్…

తెలంగాణా ఎన్నికల ప్రచారానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు వరంగల్ జిల్లా లోని రామప్ప ఆలయంలో పూజలు చేశారు. దేవాలయంలో పూజల అనంతరం వారిద్దరూ ములుగులో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. రాహుల్, ప్రియాంక వెంట తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, పలువురు నేతలు ఉన్నారు.

Read Full News