tamil

ఆమోదం…

రాష్ట్ర ప్రభుత్వం శాసన సభలో  ప్రవేశపెట్టిన ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ ఆమోదం పై ఉత్కంటకు తెర పడింది. వివధ అంశాలను పరిశీలించిన గవర్నర్ తమిళి సై ఆర్టీసీ ఉద్యోగులలు ప్రభుత్వ ఉద్యోగులుగా విలీనం చేయడానికి రూపొందించిన బిల్లు పై సంతకం పెట్టారు. ఉన్నతాధికారులతో చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు.

Read More
rajbhavan

బిల్లు లొల్లి తేలేనా…!

రాష్ట్ర ప్రభుత్వం శాసన సభలో  ప్రవేశపెట్టిన ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ ఆమోదం పై ఇంకా ఉత్కంట కొనసాగుతూనే ఉంది. ఆర్టీసీ ఉద్యోగుల విలీన బిల్లుకు సంబందిచి ఐదు అంశాలపై గవర్నర్ తమిలిసై లేవనెత్తిన అంశాలకు సంబంధించిన వివరాలను ప్రభుత్వం రాజ్ భవన్ కి పంపింది. అయితే, ఆందోళన చేస్తున్న ఆర్టీసీ ఉద్యోగ, కార్మిక సంఘాల నేతలతో  గవర్నర్ వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. అంతే కాకా, ఈ బిల్లు పై  ఉన్నతాధికారుల నుంచి గవర్నర్ మరిన్ని వివరాలు…

Read More
rajbhavan

వీటికి సమాధానం ఇవ్వండి…

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఆర్టీసీ బిల్లుపై సంతకం చేయడానికి ముందు ఐదు అంశాల పై గవర్ప్రనర్భు తమిలిసై ప్రభుత్వాన్ని వివరణ కోరారు. రాజ్ భవన్ లేవనెత్తిన అంశాలు ఇలా ఉన్నాయి. 1, 1958 నుండి ఆర్టీసీ లో కేంద్ర గ్రాంట్ లు, వాటా లు, లోన్లు, ఇతర సహాయం గురించి బిల్లు లో ఎలాంటి వివరాలు లేవు. 2, రాష్ట్ర విభజన చట్టం షెడ్యూల్ 9 ప్రకారం ఆర్టీసీ స్థితి ని మార్చడం పై సమగ్ర వివరాలు…

Read More
rtc cf

మళ్ళీ లొల్లి షురూ..

రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్ బంగ్లాకి మధ్య మళ్ళి రచ్చ మొదలైంది. గతంలో నలుగు ఫైళ్ళ పై సంతకం పెట్టలేదని సుప్రీం కోర్టును ఆశ్రయించిన బారాస ప్రభుత్వానికి తాజాగా మరో సమస్య తలెత్తింది. ప్రజా రవాణా వ్యవస్థను , ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ ఇటీవలే మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అందుకు సంబంధించిన బిల్లును ప్రస్తుత శాసనసభ సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదింప చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఈ మేరకు మంత్రి వర్గ నిర్ణయానికి అనుగుణంగా యుద్ధ…

Read More
pres acadmy

“పెద్దసారు”కోసం…

తెలంగాణ మీడియా అకాడమీ భవనం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. వేయి గజాల స్థలంలో నాలుగు అంతస్తుల్లో 29,548 చదరపు అడుగుల్లో కార్పొరేట్ భవనంలా నిర్మించారు. 2015లో జరిగిన అకాడమీ మొదటి సర్వసభ్య సమావేశంలో నాంపల్లి లోని పాత ప్రెస్ అకాడమీ భవనం స్థానంలో కొత్త భవనం నిర్మించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ సూచించారు. ఆ మేరకు  2017లో భవన నిర్మాణానికి 15 కోట్లు విడుదల చేశారు. భవనంలో జర్నలిస్టుల కోసం నాలుగు తరగతి గదులు, కార్యాలయ సిబ్బంది కోసం ఒక…

Read More
dimond

ఘనంగా చేస్తాం…

75 ఏళ్ల దేశ స్వతంత్ర వజ్రోత్సవాల ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాలు, వేడుకల ముగింపు ఉత్సవాల నిర్వహణపై సి.ఎస్. శాంతి కుమారి ఉన్నతస్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా శాంతి కుమారి మాట్లాడుతూ వజ్రోత్సవాల ముగింపు వేడుకలను అత్యంత ఘనముగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు. ఈ ముగింపు వెడుకల్లో ప్రజా ప్రతినిదులు, యువజనులు, విద్యార్థులు, భిన్న రంగాలకు…

Read More
ktr j

ఇదా సమాధానం…

హైదరాబాద్ లో ఏంతో కాలంగా ఎదురు చూస్తున్న జర్నలిస్టులకు వెంటనే ఇళ్ళ స్థాసాలు మంజూరు చేయాలని శాసన సభలో కాంగ్రెస్ ఎంఎల్ఏ జగ్గారెడ్డి విజ్ఞప్తి చేశారు. జంట నగరాల్లో అనేక మంది జర్నలిస్టులు సుప్రీం కోర్టులో కేసు నెగ్గి కూడా ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూస్తున్నారని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళారు. శాసన సభ జీరో అవర్ లో జగ్గారెడ్డి ఈ మేరకు ప్రస్తావించారు. అయితే , దీనికి పురపాలక శాఖ మంత్రి కెటిఅర్ ఇచ్చిన సమాధానం…

Read More
central team in

నష్టం జరిగింది…

రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర బృందం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తో సమావేశమైంది. ఈ నెల ఒకటవ తేదీ నుండి మూడవ తేదీ వరకు కేంద్ర ప్రభుత్వ వివిధ శాఖలకు చెందిన ఏడుగురు సభ్యుల ప్రతినిధి బృందం వరంగల్, హన్మకొండ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పర్యటించింది. కేంద్ర ప్రతినిధి బృందంతో పాటు రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్…

Read More
pay c

గుడ్ న్యూస్ వస్తోంది…

తెలంగాణాలో ప్రభుత్వ ఉద్యోగుల జీతాల పెంపునకు సంబంధించి కొద్దిరోజుల్లో వేతన సవరణ కమిషన్ ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తోంది. టీఎన్జీఓలు, టీజీఓల ప్రతినిధుల బృందం ముఖ్యమంత్రి కేసీఆర్ తో శాసన సభ లో సమావేశం అయ్యారు. ఉద్యోగుల వేతనల పెంపు, కమిషన్ ఏర్పాటు, హెల్త్ కార్డులపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఎన్జీవో నేతలు మాట్లాడుతూ కొద్ది రోజుల్లోనే పీఆర్సీతో పాటు ఐఆర్ కూడా ప్రకటిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్టు తెలిపారు. ఉద్యోగులకు ఆరోగ్య పథకాన్ని కూడా…

Read More
jayasudha join c

తీర్ధం…

సినీ నటి  జ‌య‌సుధ భారతీయ జనతా పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. ఢిల్లీలో త‌రుణ్ చుగ్‌, కిష‌న్ రెడ్డి స‌మ‌క్షంలో ఆమె బీజేపీ చేరారు.

Read More
fire hubsi

అన్ లిమిటెడ్ “ఫైర్”

హబ్సిగూడ అన్ లిమిటెడ్ షో రూమ్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదానికి సంబంధించిన కారణాలు తెలియాల్సి ఉంది. అయితే, షో రూమ్ నుంచి భారీ గా మంటలు, పొగలు ఎగసిపడుతున్నాయి. ఉప్పల్ – సికింద్రాబాద్ ప్రధాన రహదారి కావడంతో ట్రాఫిక్ కి తీవ్ర ఆటంకం కలిగింది.అన్ లిమిటెడ్ షో రూమ్ పెట్రోల్ బంక్ స్థలానికి అనుకొని ఉండడంతో ఆందోళన నెలకొంది. ప్రస్తుతం అగ్నిమాపక శాఖ అధికారులు మూడు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి…

Read More
wgl floods c

భారీగా వరద నష్టం…

రాష్ట్రంలో ఇటివల కురిసిన భారీ వర్షాల వల్ల కలిగిన నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర బృందం వరంగల్,హన్మకొండ జిల్లాల్లో పర్యటించింది. ఏడుగురు సభ్యుల ఈ బృందం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించింది. కేంద్ర బృందం హైదరాబాద్ నుండి నేరుగా  హన్మకొండ కలెక్టరేట్   కార్యాలయంలో హన్మకొండ, వరంగల్ జిల్లాల్లో, వరంగల్ గ్రేటర్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో వర్షాలకు వాటిల్లిన నష్టం పై ఏర్పాటు హన్మకొండ, వరంగల్ గ్రేటర్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో వరదల కారణంగా దెబ్బతిన్న, నష్టపోయిన వివరాలను…

Read More
ktr 22

ఇవ్వన్నీ చేస్తాం..

ఎన్నికలు దగ్గర పడుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం తాయిలాలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా  సచివాలయంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన రాష్ట్ర కేబినేట్ సమావేశమైంది.  దాదాపు ఐదున్నర గంటల పాటు సుదీర్ఘంగా చర్చించి పలు కీలక అంశాలను ఆమోదించింది. కేబినేట్ లో తీసుకున్న నిర్ణయాలను మంత్రి కేటిఅర్ అధ్వర్యంలో పలువురు మంత్రులు విలేకర్లకు వివరించారు. రాష్ట్రంలో వదలపై కేబినెట్ సుదీర్ఘంగా చర్చించింది. అకస్మాత్తుగా కురిసిన అతి భారీ వర్షాల వల్ల  అనుహ్యరీతిలో వరదల్లో చిక్కుకుని మృత్యువాతపడ్డవారికి రాష్ట్ర…

Read More
chalo raj

ఛలో రాజ్ భవన్…

రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా, పేద వర్గాలకు చదువును దూరం చేసే నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం “ఛలో రాజ్ భవన్ ” కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ తెలిపింది. ఎస్ఎఫ్ఐ ముఖ్య కార్యకర్తలు సమావేలో రాష్ట్ర అధ్యక్ష్య, కార్యదర్శులు ఆర్ఎల్ మూర్తి, టి.నాగరాజు లు మాట్లడుతూ దేశంలో రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా కేంద్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్యావిధానం తీసుకొస్తోందన్నారు. ప్రభుత్వ విద్యకు నష్టం చేసి ప్రైవేట్, కార్పోరేట్…

Read More
jawdkr etela

ఢిల్లీలో వ్యూహాలు..

తెలంగాణ ఎన్నికలపై ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ వ్యుహాలకు కసరత్తు మొదలు పెట్టింది. రాష్ట్రానికి చెందినా ఆ పార్టీ నేతలతో చర్చలు జరుపుతోంది. మొన్న బండి సంజయ్ అమిత్ షా ని కలవడం, ఆతర్వాత ఆయనను పార్టీ జాతీయ కార్యదర్శిగా ప్రకటించడం, కిషన్ రెడ్డి రెండు రోజులుగా ఢిల్లీలోనే ఉంటూ చేరికపై మంతనాలు చేయడం కనిపిస్తోంది. తాజాగా బిజెపి తెలంగాణ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ ఢిల్లీలోని తెలంగాణ ఎలక్షన్ ఇంచార్జ్ ప్రకాష్ జవదేకర్…

Read More