టెక్నాలజీ ఫలితాలు ఆమోగం..

టెక్నాలజీ సమర్థంగా వినియోగించుకుంటే ఎవరైనా మంచి ఫలితాలు సాధిస్తారని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గ్లోబల్ ఫోరమ్ ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ అధ్వర్యంలో డీప్ టెక్నాలజీస్ అనే అంశంపై జరిగిన సదస్సులో అయన  పాల్గొన్నారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు టెక్నాలజీ పై  దృష్టి సారించాడ వల్లే హైటెక్ సిటీ అందుబాటులోకి వచ్చిందన్నారు. అప్పటి  ప్రధాని వాజ్ పేయితో మాట్లాడి డీ రెగ్యులేషన్ ఇన్ టెలికమ్యూనికేషన్ విధానాన్ని తీసుకువచ్చినట్టు చెప్పారు….

Read More

కేసుల ఎత్తివేత ….

పౌర హక్కుల నేత ప్రొఫెసర్‌ హరగోపాల్‌ సహా ఇతరులపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(ఉపా) కింద నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. వెంటనే కేసుల ఎత్తివేతకు తగు చర్యలు తీసుకోవాలని డీజీపీ అంజనీకుమార్‌ను సీఎం ఆదేశించారు. మావోయిస్టు కార్యకలాపాలకు సహకరిస్తున్నారన్న ఆరోపణలపై హరగోపాల్‌తో పాటు ఇతర ప్రజాసంఘాల నేతలపై ఉపా చట్టం కింద తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎలాంటి తప్పు చేయకపోయినా, ఆధారాలు లేకుండా ఉపా చట్టం…

Read More

లంచం తో చిక్కిన వి.సి. రాజేందర్…

తెలంగాణ వర్సిటీ ఉపకులపతి(వీసీ) దాచేపల్లి రవీందర్ అవినీతి నిరోధక శాఖ (అనిశా) వలలో చిక్కారు. తార్నాకలోని తన నివాసంలో రూ.50వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. భీంగల్‌లో పరీక్షా కేంద్రం ఏర్పాటు కోసం ఆర్మూర్ లోని శ్రీ షిర్డిసాయి ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షులు  దాసరి శంకర్ అనే వ్యక్తి నుంచి రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.అరెస్టు చేసి వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తలించారు.

Read More

కేజీబీవీ లో ఉద్యోగాలు ..ఇలా చేయండి…

కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు( కేజీబీవీ), అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్(యూఆర్ఎస్)లో ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేజీబీవీ, యూఆర్ఎస్ లలో 1,241 ఉద్యోగాలు కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయనున్నారు. 854 పీజీసీఆర్, 273 సీఆర్డీ, 77 పీఈటీ, 12 ఎసీ పోస్టుల భర్తీకి శనివారం నోటిఫికేషన్ వెలువడనుంది. కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో పోస్టులకు మహిళలు మాత్రమే అర్హులు. ఈనెల 26 నుంచి జులై 7 వరకు ఆన్లైన్ లో ధరఖాస్తులు స్వీకరిస్తారు. https:// schooledu.telangana.gov.inలో వివరాలు…

Read More

కాంగ్రెస్ లో చేరేందుకు ముహూర్తం..

తెలంగాణ రాజకీయాల్లో త్వరలోనే కీలక పరిణామం చోటు చేసుకోనుంది. ఖమ్మం జిల్లా కీలక నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరికకు ముహూర్తం ఖరైనట్టు తెలుస్తోంది. ఈ నెల 22వ తేదీన ఆయన కాంగ్రెస్‌ కండువా కప్పుకుంటారని సమాచారం. ఈ మేరకు తాజాగా ఆయన కాంగ్రెస్‌ కీలక నేత రాహుల్‌ గాంధీతో జూమ్‌ మీటింగ్‌లో మాట్లాడినట్లు పార్టీ వర్గాల ద్వారానే తెలుస్తోంది. రాహుల్‌ గాంధీతో జూమ్‌ మీటింగ్‌లోనే పొంగులేటి చేరిక తేదీ ఖరారు అయ్యింది….

Read More

రాష్ట్రపతికి పట్టు చీర…

రాజ్ భవన్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి సత్యవతి రాథోడ్ మినిస్ట్రీ ఇన్ వేటింగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సత్యవతి రాథోడ్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పట్టు చీరను గిఫ్ట్ గా అందజేశారు. ద్రౌపది ముర్ము సంతోషాన్ని వ్యక్తం చేశారు.

Read More

ఆ నియామకాలు ఏంటి…

తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్పీఎస్సీ) సభ్యుల నియామకంపై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. టీఎస్పీఎస్సీ సభ్యులను నియమిస్తూ 2021 మే 19న జారీ చేసిన 108 జీవో ను తిరిగి సమీక్షించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.  ఆరుగురు టీఎస్పీఎస్సీ లోని లింగారెడ్డి, కారం రవీందర్ రెడ్డి, ఆర్.సత్యనారాయణ, రమావత్ ధన్ సింగ్, సుమిత్ర ఆనంద్ తనోబా, ఆరవెల్లి చంద్రశేఖర్ ల నియామకాలపై జారీ చేసిన ఉత్తర్వులను  పునపరిశీలించాలని సూచించింది.  కాకతీయ యూనివర్సిటీ విశ్రాంత ప్రొఫెసర్ ఎ.వినాయక్ రెడ్డి…

Read More

గవర్నర్, ముఖ్యమంత్రి…

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ వచ్చిన సందర్భగా ఆమెకు స్వాగతం పలికేందుకు విమానాశ్రయానికి వెళ్ళిన గవర్నర్ తమిళి సై, ముఖ్యమంత్రి కెసిఆర్ చాలా కాలం తర్వాత తారసపడ్డారు.

Read More

స్థలాల పై కేటీఆర్ సానుకూలం…

హైదరాబాద్ జర్నలిస్టుల ఇళ్ళ స్థలాలకు సంబంధించి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పూర్తి సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. శుక్రవారం ప్రగతిభవన్ లో తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్, తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ తో కలిసి ఈ విషయమై మంత్రి సుదీర్ఘంగా చర్చించారు. హైదరాబాద్ నగరంలోని జర్నలిస్టుల సంఖ్య ఎంత..? అర్హులైన జర్నలిస్టులు ఎంతమంది ఉన్నారు, అందరికీ ఇళ్లు కేటాయించడానికి ఎంత స్థలం అవసరం అవుతుందనే విషయాలను చర్చ…

Read More

ఫోరెన్సిక్ ఆడిట్‌ కావాలి..

తెలంగాణాలో భారత రాష్ట్ర సమితి, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య ధరణి పోర్టల్‌పై రాజకీయ వేడి మరింతగా రాజుకుంటోంది..  ధరణి పోర్టల్‌ను ఉపయోగించుకుని అధికార పార్టీ నేతల అండతో కొందరు భూములను ఆక్రమించుకోవడమే కాకా ఇతర అక్రమాలకు పాల్పడుతున్నారని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు ఎ.రేవంత్ రెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌,ఆయన కుమారుడు కేటీఆర్‌ సైబర్‌ నేరగాళ్లలా ప్రజల సొమ్మును దోచుకుంటున్నారని రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. పోర్టల్ వెనుక భూస్వాములు ఉన్నారని కూడా ఆయన పేర్కొన్నారు….

Read More

నిజంగా చేస్తే పిల్లలు సూపర్…

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు మూడు రోజులు కోడిగుడ్డు, మరో మూడు రోజుల పాటు రాగిజావను అందించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఫోర్టిఫైడ్‌ రాగిజావను ఇందుకు వినియోగించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ శ్రీదేవసేన రాగిజావ పంపిణీపై డీఈవోలకు ఉత్తర్వులు జారీచేశారు. ఈ నెల 20న రాగిజావ పంపిణీని ప్రారంభించనుండగా, జులై ఒకటి నుంచి రాష్ట్రంలోని 28,606 పాఠశాలల్లో పూర్తిస్థాయిలో అందజేయాలని వివరించారు. ఈ నెల 20న ఒక్కో జిల్లాల్లో 5వేల మంది విద్యార్థులకు…

Read More

లాసెట్, పిజిఎల్ సెట్ ఫలితాలు..

రాష్ట్రంలో న్యాయవిద్య కోర్సుల్లో  ప్రవేశాల కోసం నిర్వహించిన టిఎస్ లాసెట్, పిజిఎల్ సెట్ లో  80.21 శాతం ఉత్తీర్ణత నమోదైంది. గురువారం ఉన్న‌త విద్యామండ‌లి చైర్మ‌న్ ప్రొఫెస‌ర్ ఆర్ లింబాద్రి టిఎస్ లాసెట్, పిజి ఎల్‌సెట్‌-2023 ఫ‌లితాలను విడుద‌ల‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ ప్రొఫెసర్ డి.రవీందర్, లాసెట్ కన్వీనర్ బి. విజయలక్ష్మి, ప్రొఫెసర్ జి.బి.రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మూడేళ్ల  ఎల్ఎల్‌బీలో 78.59 శాతం, ఐదేళ్ల ఎల్ఎల్‌బీలో 80.21 శాత్తం ఉత్తీర్ణ‌త‌…

Read More
nizmpet1

చచ్చి పోతున్నారు…స్థలాలు ఇవ్వండి….

దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చే తీర్పులకు ప్రతీ ఒక్కరు కట్టుబడి ఉండాలి. సుప్రీం కోర్ట్ ఆదేశాలను విధిగా, బాధ్యతగా గౌరవించాలి, అమలు చేయాలి. కానీ, తెలంగాణలో జరుగుతున్న తంతు అందుకు భిన్నంగా ఉంది. ఎప్పుడో 16 సంవత్సరాల కిందట హైదరాబాద్ లో జర్నలిస్టులు కొనుగోలు చేసిన ఇళ్ళ స్థలాల వ్యవహారం కోర్టుల్లో నలిగి చివరకు 14 ఏళ్ల సుధీర్గ విచారణల తర్వాత  జర్నలిస్టులకు కేటాయించిన  స్థలాలు వారికి ఇవ్వాలని  గత ఏడాది  సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది….

Read More
parlamant

నో టిఆర్ఎస్..ఓన్లీ బిఆర్ఎస్..

తెలంగాణా రాష్ట్ర సమితి పేరును లోక్ సభలో ఇక నుంచి భారత్ రాష్ట్ర సమితి గా మార్పు చేస్తూ లోక్ సభ సచివాలయం ఉత్తర్వులు జరీ చేసిందని బీఆర్ ఎస్ లోక్ సభా పక్ష నాయకులు, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నామా నాగేశ్వరరావు తెలిపారు. పార్టీ అధ్యక్షులు కె. చంద్రశేఖర్ రావు చేసిన అభ్యర్థన మేరకు భారత ఎన్నికల సంఘం జారీ చేసిన నోటిఫికేషన్ ఆధారంగా ఈ ఉత్తర్వులు వెలువడ్డాయని చెప్పారు. తాజా ఆదేశాల మేరకు…

Read More
revant

కెసిఆర్ ని చెట్టుకి ఉరి తీయాలి…

ముఖ్యమంత్రి  కేసీఆర్ ను అసెంబ్లీలో చెట్టుకు ఉరి తీసినా, గల్ఫ్ దేశాల్లో మాదిరిగా రాళ్లతో కొట్టినా తప్పు లేద ని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ రైతులందరూ కేసీఆర్, కేటీఆర్ లను చెట్టుకు కట్టేసి.. రాళ్లతో కొట్టినా తప్పు లేదంటూ తీవ్రంగా మండిపడ్డారు. ఇలాంటి మాటలు అనటానికి ఏ మాత్రం భయపడటం లేదన్నారు.  75 ఏళ్లలో ఏ రాజకీయ పార్టీ, రాజకీయ నాయకుడు కేసీఆర్ మాదిరిగా దోపిడీకి పాల్పడలేదని రేవంత్…

Read More