palvai ktr 1

రాజగోపాల్ కి డబ్బు మదం…

రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బిజెపిలోకి ఎందుకు వెళ్ళారో, మళ్లీ తిరిగి కాంగ్రెస్ లోకి ఎందుకు వెళ్ళారనేది ఎవరికీ అంతుపట్టని విషయమని  భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆయన రాజీనామా వల్ల రాష్ట్రం ఉప ఎన్నికను ఎదుర్కొని పరిపాలన అస్తవ్యస్తం అయిందని వ్యాఖ్యానించారు. డబ్బు మదంతో విర్రవీగుతున్న రాజగోపాల్ రెడ్డికి మునుగోడు లో బుద్ధి చెప్పాల్సిన బాధ్యత అందరిపై ఉందని విమర్శించారు. మునుగోడు కాంగ్రెస్ నాయకురాలు పాల్వాయి స్రవంతి ఆ…

Read More
jornlist harish

ఇస్తాం..ఇస్తాం..తప్పక ఇస్తాం..

హైదరబాద్ జర్నలిస్టుల ఇళ్ల స్థలాల అంశం త్వరలోనే పరిష్కరిస్తామని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. కొత్తగా ఏర్పాటైన “ది తెలంగాణా జర్నలిస్ట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ” ప్రతినిధులతో ఆయన ప్రగతి భవన్ లో భేటీ అయ్యారు. సొసైటీ సభ్యత్వ వివరాలు అడిగి తెలుసుకున్నారు. మూడోసారి కూడా తామే అధికారంలోకి వస్తామన్న మంత్రి హరీష్ రావు జర్నలిస్టుల హౌసింగ్ సమస్యని కూడా తప్పక పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మంత్రి కేటీఆర్ కలిసి ఇదే అంశంపై…

Read More
123187951 10sha1a

కొడుకూ,కూతురి కోసమే…

కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయటానికి, కవిత జైలుకు పోకుండా కాపాడుకోవటానికి కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లోని ఇంపీరియల్ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన మేధావుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీకి సిద్ధాంతాలతో పనిలేదని, బిజెపి మాత్రమే సిద్దాంతానికి అనుగుణంగా నడుస్తోందని తెలిపారు. కేసీఆర్ కారు స్టీరింగ్ మజ్లిస్ చేతిలో ఉందన్నారు.తెలంగాణలో పదేళ్ళు అవినీతిలో మునిగి పోయిన బీఆర్ఎస్ కు మళ్ళీ అవకాశం ఇవ్వొద్దని కోరారు….

Read More
Screenshot 20231003 235348 WhatsApp

బిఆర్ఎస్ తిన్నదంతా కక్కిస్తా…

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిజామాబాద్ పర్యటనలో తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పై విరుసుకు పడ్డారు. ఎన్డీఏ లో చేరతానని  కేసీఆర్‌ వెంటపడ్డారనీ, ఆ ప్రతిపాదనను తాను ఒప్పుకోలేదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్  జిల్లాలో ఏర్పాటు చేసిన “జనగర్జన” సభలో మోదీ మాట్లాడుతూ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల తర్వాత కేసీఆర్‌ ఢిల్లీ వచ్చి,తెలంగాణ పాలన పగ్గాలు మంత్రి కేటీఆర్‌కు ఇస్తానని చెప్పినట్టు మోడీ వెల్లడించారు. కేటీఆర్‌ను ఆశీర్వదించాలని కోరినప్పుడు, ఇది రాజరికం…

Read More
IMG 20230925 WA0053

ఆగేదే లే…

భాగ్య నగరానికి మధ్యలో ఉన్న మూసి నది, ఈసా నదులపై ఐదు వంతెనల నిర్మాణ పనులకు పురపాలక శాఖ మంత్రి కెటి రామారావు ఉప్పల్ భగాయత్ శిల్పారామం సమీపంలోని మూసి పరివాహక ప్రాంతంలో భూమి పూజ చేశారు. 168 కోట్ల రూపాయల వ్యయంతో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) ఐదు బ్రిడ్జిలను నిర్మించనున్నది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)లోపల పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా ప్రజా రవాణా వ్యవస్థను మరింతగా మెరుగుపరచాలన్న లక్ష్యంతో రాష్ట్ర…

Read More
IMG 20230918 WA0058

ఘనంగా పూజలు…

ప్రగతి భవన్ లో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అయన సతీమణి శోభమ్మ బొజ్జ గణపయ్యకు ప్రత్యేక పూజలు చేశారు. ప్ర‌జ‌ల‌కు సుఖ‌శాంతుల‌ను అందించాల‌ని, ప్రజలందరినీ చల్లగా చూడాలని, రాష్ట్ర ప్ర‌గ‌తి ప్ర‌స్థానానికి విఘ్నాలు రాకుండా చూడాల‌ని విఘ్నేశ్వరుడిని ఈ సంద‌ర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రార్ధించారు. గణపతి పూజా కార్య‌క్ర‌మంలో మంత్రి కేటీఆర్ అయన సతీమణి శైలిమ, కూతురు అలేఖ్య, పాల్గొన్నారు. ప్రత్యేక పూజా కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీలు…

Read More
IMG 20230910 WA0000

“బాబు”నేరం చేశారా..

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు సంబంధించి కొందరు ప్రముఖులు, రాజకీయ నేతలు స్పందించక పోవడం విస్మయం కలిగిస్తోంది. జాతీయ స్థాయిలో కొందరు నాయకులు ఆయనను ఏదో రూపంలో పరామర్శిస్తుంటే అయన దగ్గర పనిచేసిన అనేక మంది స్పందించక పోవడం చర్చనీయాంశంగా మారింది. మమత బెనర్జీ, అఖిలేష్, రజినీ కాంత్ వంటి వారు తమ సానుభూతి తెలిపారు. కానీ, ఆయనతో అంటకాగిన తెలుగు రాష్ట్రాల నేతలు మాత్రం ఎలాంటి ప్రకటన చేయక…

Read More
IMG 20230913 WA0015

ఎవడురా బానిస…

ఎవడిదిరా బానిసత్వ పార్టీ అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రి కెటిఆర్ పై ధ్వజమెత్తారు. మద్యం కేసులో కవిత ప్రమేయం పై అమిత్ షా ని కలిసిన తర్వాత ఆగిపోయిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు.మా చెల్లిని అరెస్ట్ చేయకండి, ఎన్నికలు ఎప్పుడైనా పెట్టుకోండి అని కేటీఆర్ అమిత్ షా కి చెప్పి వచ్చాదాని వ్యాఖ్యానించారు.కేటీఆర్ కి ఎంతోకొంత తెలివి ఉందనుకున్ననాని, ఈ రోజు చిట్ చాట్ తర్వాత ఆయనకు…

Read More
suprime

ఇదెక్కడి న్యాయం…!

హైదరాబాద్ లో జర్నలిస్టులకు కేటాయించిన భూమి వ్యవహారం గందరగోళంగా మారుతోంది. పేట్ బషీరాబాద్ లో  గత ప్రభుత్వం కేటాయించిన 38 ఎకరాల భూమిని జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీకి బదలాయించడంలో జరుగుతున్న తీవ్ర జాప్యం సభ్యులను తీవ్ర ఆవేదనకు గురి చేస్తోంది. అంతేకాక్, ఈ నెల 6 తేదిన సుప్రీంకోర్టులో చోటుచేసుకున్న పరిణామం అంతుపట్టకుండా ఉందని సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జస్టిస్ ఎన్.వి. రమణ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పుడు ఆయన నేతృత్వంలోని…

Read More
IMG 20230822 WA0003

వడివడిగా ప్రక్రియ…

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల మంజూరు, కేటాయింపుపై అటు సచివాలయం, ఇటు ప్రగతి భవన్ లోనూ జరుగుతున్న కసరత్తు తుది దశకు చేరుకుందని, మరికొన్ని రోజుల్లోనే ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారని “ఈగల్ న్యూస్” మొన్ననే చెప్పింది. ఆవ గింజంత సమాచారం అయినా సరే ఫలితం కోసం తాపత్రయ పడుతున్న వారికి ఖచ్చితంగా అది వార్త అవుతుంది. సుప్రీం కోర్టు తీర్పును అమలు చేయడం, పేట్ బషీరాబాద్ లోని 38 ఎకరాల స్థలాన్ని జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టు హౌసింగ్…

Read More
Screenshot 20230820 082933 Gallery

స్టీల్ బ్రిడ్జి…

హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్ మీదుగా విఎస్టీ వరకు నిర్మించిన ఇనుప దిమ్మెల బ్రిడ్జిని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ ప్రారంభించారు.13 వేల టన్నుల ఇనుముతో సుమారు రెండున్నర కిలోమీటర్ల దూరం వరకు నిర్మించారు.

Read More
images 20

అక్కడ ముమ్మరం…ఇక్కడ నీరసం…

హైదరాబాద్ జర్నలిస్టులకు ప్రభుత్వ హామీ మేరకు మంజూరు చేయాల్సిన ఇళ్ల స్థలాల విషయంలో జరుగుతున్న జాప్యం విలేకర్లు, జర్నలిస్టు సంఘాలను అసంతృప్తికి గురి చేస్తోంది. డబ్బు చెల్లించి, 16 ఏళ్ల నుండి ఎదురు చూస్తున్న పాత్రికేయులకు, కొత్తగా ఇళ్ల స్థలాల కోసం వేచిచూస్తున్న వారికీ ప్రభుత్వం న్యాయం చేస్తామనే చెబుతోంది. కానీ, ఎప్పుడు అనేది మాత్రం స్పష్టంగా చెప్పడం లేదు.అయితే, ఇదే విలేకర్ల వర్గానికి జిల్లాల్లో మాత్రం స్థలాలు కేటాయించడం, వారికి మంజూరు చేయడం వేగంగా జరిగి…

Read More
pet land 1

ఈ అంశం కీలకం…!

జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీకి చెందిన పేట్ బషీరాబాద్ లోని 38 ఎకరాల భుమిని దక్కించుకోవడానికి సొసైటీ సభ్యుల్లో కొందరు కోర్టుధిక్కార పిటిషన్ దాఖలు చేయడానికి డిల్లీ వెళ్ళడంతో కొత్త అంశాలు తెరపైకి వస్తున్నాయి. ప్రభుత్వం ఒకవైపు సుప్రీం కోర్టు తీర్పునకు అనుకూలంగా ఉన్నట్టు పురపాలక శాఖ మంత్రి కేటిఅర్ చెబుతున్నప్పటికీ, ప్రభుత్వం ఆలస్యం చేస్తోందనే ఆందోళనతో కొందరు సభ్యులు పిటిషన్ వేయడానికి డిల్లీ వెళ్ళిన విషయం తెలిసిందే. అయితే, పిటిషన్ దాఖలు చేయడంలో…

Read More
Screenshot 2023 08 09 082232

డిల్లీలో ముమ్మరంగా…

జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టుల హౌసింగ్  సొసైటీకి 2007 వ సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం  పేట్ బషీరా బాద్ లో కేటాయించిన స్థలాన్ని కాపాడుకోవడానే కార్యక్రమంలో భాగంగా కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేయడానికి డిల్లీ వెళ్ళిన  కొందరు సొసైటీకి సభ్యులు అక్కడ రెండు రోజులుగా న్యాయ నిపుణులతో పాటు పలువురు ప్రముఖులను సంప్రదిస్తున్నారు. ఇప్పటికీ ఆ స్థలాన్ని సొసైటీకి అప్పజెప్పే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి సానుకూలత కనిపించక పోవడంతో డిల్లీ లోని నిపుణుల అభిప్రాయాలు…

Read More
jnj vh

సున్నితత్వం ముఖ్యం…

రాష్ట్రంలో ప్రత్యేకంగా హైదరాబాద్ లో అర్హులైన జర్నలిస్టులకు ప్రభుత్వం ఇవ్వాలనుకుంటున్న ఇంటి స్థలాల విషయంలో ఎందుకు చొరవ చూపడం లేదు. ప్రత్యేక తెలంగాణ సాధించుకొని పదేళ్ళు కావస్తున్నా ఆ పోరాటంలో ప్రత్యక్ష సాక్షులు , కలం వీరులైన విలేకరులను ప్రభుత్వం ఎందుకు చిన్న చూపు చూస్తోందో అర్ధం కానీ పరిస్థితి నెలకొంది. సమాజంలో బాధ్యత కలిగిన నాలుగో వర్గం (ఫోర్త్ ఎస్టేట్)గా ఉన్న జర్నలిజాన్ని , దాని కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయడం ఎంత వరకు సమంజసం అనే…

Read More