jornlist harish

ఇస్తాం..ఇస్తాం..తప్పక ఇస్తాం..

హైదరబాద్ జర్నలిస్టుల ఇళ్ల స్థలాల అంశం త్వరలోనే పరిష్కరిస్తామని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. కొత్తగా ఏర్పాటైన “ది తెలంగాణా జర్నలిస్ట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ” ప్రతినిధులతో ఆయన ప్రగతి భవన్ లో భేటీ అయ్యారు. సొసైటీ సభ్యత్వ వివరాలు అడిగి తెలుసుకున్నారు. మూడోసారి కూడా తామే అధికారంలోకి వస్తామన్న మంత్రి హరీష్ రావు జర్నలిస్టుల హౌసింగ్ సమస్యని కూడా తప్పక పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మంత్రి కేటీఆర్ కలిసి ఇదే అంశంపై…

Read More
FB IMG 1697385278554

బి.ఫారం+డబ్బు చరిత్రే…

నాంచారయ్య, సీనియర్ ఎనలిస్ట్ పోలింగ్‌ ముందు పార్టీ అభ్యర్థులకు రహస్యగా కోట్లాది రూపాయలు పంపే ఈ రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్‌ రాకుండానే బీ–ఫాంతోపాటు రూ.40 లక్షల చెక్కులు పింపిణీ చేసిన కేసీఆర్‌ నిజంగా కొత్త చరిత్ర రాసేశారా?..పార్టీ అభ్యర్థులకు బీ–ఫాం ఇచ్చిన కొన్ని రోజులకు గుట్టుచప్పుడు కాకుండా, అత్యంత రహస్యంగా పది కోట్ల వరకూ పంపించే నేతలున్న దేశంలో… బీఆరెస్‌ అసెంబ్లీ అభ్యర్థులకు ప్రతి ఒక్కరికీ బీ–పారంతోపాటు రూ.40 లక్షల చెక్కులు పంపిణీ చేసిన ఏకైక ‘జాతీయపక్షం’…

Read More
IMG 20231015 WA0014

నామినేషన్ వేయండి….

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ తరఫున బరిలోకి దిగుతున్న అభ్య‌ర్థుల‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ బీ-ఫారాలు అందించారు. తెలంగాణ భ‌వ‌న్‌లో 51 మంది ఎమ్మెల్యే అభ్య‌ర్థుల‌కు బీ-ఫారాలు ఇచ్చారు. ఒక్కో అభ్య‌ర్థికి రెండు బీ-ఫారాలు అందిస్తున్న‌ట్లు కేసీఆర్ తెలిపారు. మిత‌గా వారికి రేపు అందిస్తామ‌న్నారు. కేసీఆర్ త‌ర‌పున గంప గోవ‌ర్ధ‌న్, మంత్రి ప్ర‌శాంత్ రెడ్డి త‌ర‌పున ఎమ్మెల్సీ క‌విత బీ-ఫార‌మ్ అందుకున్నారు. ఉమ్మ‌డి మెద‌క్, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్, ఖ‌మ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల‌కు చెందిన బీఆర్ఎస్ అభ్య‌ర్థుల‌కు బీ-ఫారాలు అంద‌జేశారు….

Read More
123187951 10sha1a

కొడుకూ,కూతురి కోసమే…

కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయటానికి, కవిత జైలుకు పోకుండా కాపాడుకోవటానికి కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లోని ఇంపీరియల్ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన మేధావుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీకి సిద్ధాంతాలతో పనిలేదని, బిజెపి మాత్రమే సిద్దాంతానికి అనుగుణంగా నడుస్తోందని తెలిపారు. కేసీఆర్ కారు స్టీరింగ్ మజ్లిస్ చేతిలో ఉందన్నారు.తెలంగాణలో పదేళ్ళు అవినీతిలో మునిగి పోయిన బీఆర్ఎస్ కు మళ్ళీ అవకాశం ఇవ్వొద్దని కోరారు….

Read More
kavit 2 c

సంస్కరణలు రావాలి…!

తెలంగాణా అన్ని రంగాల్లో రాష్ట్రం అగ్రగామిగా నిలబడిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. లండన్ పర్యటనలో ఉన్న ఆమె నేషనల్ ఇండియన్ స్టూడెంట్స్ అండ్ అలుమినీ -‌ యూకే (ఎన్ఐఎస్ఏయూ) సభ్యులతో సంభాషించారు. విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. మహిళా రిజర్వేషన్లు, తెలంగాణ అభివృద్ధి, తన రాజకీయ జీవితం వంటి అంశాలపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. తెలంగాణ ఏర్పడిన వెంటనే సకల జనుల సర్వే నిర్వహించామని, దాని వల్ల రాష్ట్రంలోని ప్రజల సామాజిక…

Read More
Screenshot 20231004 114252 Gallery 1

రైల్వే స్టేషన్ లో రచ్చ….

సిద్దిపేట – సికింద్రాబాద్ రైలు ప్రారంభోత్సవ కార్యక్రమం రచ్చ బండగా మారింది. ఈ రైలుని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నిజామాబాద్ నుంచి వర్చువల్ గా ప్రారంభిస్తే, సిద్దిపేట రైల్వే స్టేషన్ లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఅర్ ఫోటోలు, ఫ్లెక్సీలు లేకపోవడం వివాదంగా మారింది. మంత్రి హరీశ్ రావు, బా.రా.స. ఎం.పి.కొత్త ప్రభాకర్ రెడ్డిలు సైతం ఆవేశానికి గురవడంతో పరిస్థితి అదుపుతప్పి ఆందోళనకు దారితీసింది.ఒక సందర్భంలో హరీశ్ రావు ప్రధాని ప్రసంగం ప్రసారం అవుతున్న ఎల్.ఇ.డి….

Read More
Screenshot 20231003 235348 WhatsApp

బిఆర్ఎస్ తిన్నదంతా కక్కిస్తా…

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిజామాబాద్ పర్యటనలో తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పై విరుసుకు పడ్డారు. ఎన్డీఏ లో చేరతానని  కేసీఆర్‌ వెంటపడ్డారనీ, ఆ ప్రతిపాదనను తాను ఒప్పుకోలేదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్  జిల్లాలో ఏర్పాటు చేసిన “జనగర్జన” సభలో మోదీ మాట్లాడుతూ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల తర్వాత కేసీఆర్‌ ఢిల్లీ వచ్చి,తెలంగాణ పాలన పగ్గాలు మంత్రి కేటీఆర్‌కు ఇస్తానని చెప్పినట్టు మోడీ వెల్లడించారు. కేటీఆర్‌ను ఆశీర్వదించాలని కోరినప్పుడు, ఇది రాజరికం…

Read More
IMG 20231001 WA0008

పీఆర్సీ పరిధిలోకి…

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అంగన్ వాడీ టీచర్ల పై రాష్ట్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. వేతన సవరణలో అంగన్ వాడీ టీచర్లను చేర్చనున్నట్లు సీఎం కేసీఆర్ నిర్ణయించినట్టు ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు వెల్లడించారు. అంగన్ వాడీ టీచర్లు, హెల్పర్ల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సిఐటియు, ఐఐటియు యూనియన్ ల నేతలు హరీష్ రావు ని కలిశారు. అంగన్ వాడీల సమ్మె పై నాయకులతో మంత్రులు హరీష్ రావు, సత్యవతి రాథోడ్…

Read More
3 party

“మార్పు” ముంచొచ్చు..!

వచ్చే ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలులోకి వస్తే తెలంగాణా రాష్ట్రంలో రాజకీయ పార్టీలు భారీ కసరత్తు చేయాల్సిన పరిస్ధితులు కనిపిస్తున్నాయి. దాదాపు 35 స్థానాలకు పైగా మహిళల చేతుల్లోకి వెళ్ళాక తప్పదు. మహిళా జనాభా ఆధారంగా చేసుకొని నియోజక వర్గాల కేటాయింపులు జరిగే అవకశాలున్నాయనే సమచారం అందుతోంది. ఒకవేళ ఇదే జరిగితే ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన భారత రాష్ట్ర సమితి (బి. అర్.ఎస్.) మళ్ళీ కొత్త జాబితాను తయారు చేయాలి, సరైన మహిళా అభ్యర్ధులను…

Read More
IMG 20230918 WA0058

ఘనంగా పూజలు…

ప్రగతి భవన్ లో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అయన సతీమణి శోభమ్మ బొజ్జ గణపయ్యకు ప్రత్యేక పూజలు చేశారు. ప్ర‌జ‌ల‌కు సుఖ‌శాంతుల‌ను అందించాల‌ని, ప్రజలందరినీ చల్లగా చూడాలని, రాష్ట్ర ప్ర‌గ‌తి ప్ర‌స్థానానికి విఘ్నాలు రాకుండా చూడాల‌ని విఘ్నేశ్వరుడిని ఈ సంద‌ర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రార్ధించారు. గణపతి పూజా కార్య‌క్ర‌మంలో మంత్రి కేటీఆర్ అయన సతీమణి శైలిమ, కూతురు అలేఖ్య, పాల్గొన్నారు. ప్రత్యేక పూజా కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీలు…

Read More
IMG 20230910 WA0000

“బాబు”నేరం చేశారా..

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు సంబంధించి కొందరు ప్రముఖులు, రాజకీయ నేతలు స్పందించక పోవడం విస్మయం కలిగిస్తోంది. జాతీయ స్థాయిలో కొందరు నాయకులు ఆయనను ఏదో రూపంలో పరామర్శిస్తుంటే అయన దగ్గర పనిచేసిన అనేక మంది స్పందించక పోవడం చర్చనీయాంశంగా మారింది. మమత బెనర్జీ, అఖిలేష్, రజినీ కాంత్ వంటి వారు తమ సానుభూతి తెలిపారు. కానీ, ఆయనతో అంటకాగిన తెలుగు రాష్ట్రాల నేతలు మాత్రం ఎలాంటి ప్రకటన చేయక…

Read More
image

ఎందుకీ నిర్లక్ష్యం…

అనలోచిత నిర్ణయాల వల్ల చేతికందుతుందనుకున్న ఫలాలు దక్కని పరిస్థితి నెలకొంది. ఒకే సంఘంలో భిన్నాభిప్రాయాలు సభ్యుల భవిష్యత్తును, ఆశలను వేదనకు గురి చేస్తున్నాయి. డబ్బు చెల్లించి  దాదాపు ఒకటిన్నర దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న హైదరాబాద్ జర్నలిస్టుకు ఆ భూములు ఇవ్వండని సాక్షాత్తూ దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం ఖాతరు చేయకపోవడం, జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీ సభ్యుల్లో అభిప్రాయ భేదాలు తలెత్తడం ఆ సొసైటిలోని సామాన్య సభ్యులను ఆందోళనకు గురి చేస్తోంది….

Read More
sangam kcr

ముఖ్యమంత్రుల భేటీ…

మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ కె. సంగ్మా ప్రగతి భవన్ లో  ముఖ్యమంత్రి కె చంద్ర శేఖర్ రావుతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ప్రగతి భవన్ చేరుకున్న సీఎం సంగ్మాను ముఖ్యమంత్రి కేసీఆర్ సాదరంగా ఆహ్వానించారు. సంగ్మా గౌరవార్ధం తేనీటి విందు ఇచ్చారు. కాసేపు ఇరువురు ముఖ్యమంత్రులు ఇష్టాగోష్ఠిగా మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా దేశ రాజకీయ పరిస్థితులను చర్చించుకున్నారు. అనంతరం సీఎం సంగ్మాను శాలువాతో సిఎం కేసీఆర్ సత్కరించి,మెమొంటో  బహుకరించారు. తిరుగు ప్రయాణమైన మేఘాలయ సిఎం కు సిఎం కేసీఆర్…

Read More
sholapur

ఛలో షోలాపూర్…

షోలాపూర్ లో వేలాది మంది పద్మశాలిల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జరుగనున్న రథోత్సవంలో పాల్గొనేందుకు మంత్రులు మహమూద్ అలీ, హరీష్ రావు, ఎమ్మెల్సీ ఎల్ రమణ వెళ్ళారు. హైదరాబాద్ నుండి షోలాపూర్ కు హెలికాప్టర్ లో బయలు దేరారు. అక్కడ రథోత్సవంలో పాల్గొన్న అనంతరం బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో షోలాపూర్ లో నిర్వహించే బహిరంగ సభ స్థలాన్ని కూడా నేతలు పరిశీలిస్తారు.

Read More
close c 2

ఘనంగా చేస్తాం…

స్వతంత్ర భారత వజ్రోత్సవ ముగింపు వేడుకలను సెప్టెంబర్ 1 వ తేదీన హెచ్.ఐ.సి.సి లో అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. స్వతంత్ర భారత వజ్రోత్సవ ముగింపు వేడుకల నిర్వహణ ఏర్పాట్లపై బి.ఆర్.అంబేద్కర్ సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు కేవీ రమణ చారి, దేశపతి శ్రీనివాస్, డీజీపీ అంజనీ కుమార్ లతో సహా పలువురు కార్యదర్శులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా…

Read More