jayaprada3

అరెస్టుకు రంగం..

ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రదను అరెస్టు చేయాలంటూ ఉత్తరప్రదేశ్ లోని రాంపుర్ ప్రజా ప్రతినిధుల కోర్టు నాన్ బెయిలబుల వారెంట్ జారీ చేసింది. 2019 లో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ ఆమెపై రెండు కేసులు నమోదు కాగా, వాటికి సంబంధించి ఆరు సార్లు జయప్రదకు కోర్టు నోటీసులు జారీ చేసింది. అయినా, విచారణకు ఆమె గైర్హాజరు కావడంతో కోర్టు తీవ్రంగా పరిగణించింది. దీంతో, ఆమెను అరెస్ట్ చేసి ఈ నెల 27న న్యాయస్థానం ముందు హాజరు…

Read Full News
city cps

కొత్త “సింహాలు”…

తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సుపరిపాలనపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా మొదట జంట నగరాలకు ఉక్కు కవచాలను నియమించింది. హైదరాబాద్ కమిషనర్ గా కొత్తకోట శ్రీనివాసరెడ్డిని నియమించింది. అదేవిధంగా సైబరాబాద్ సీపీగా అవినాష్ మహంతి, రాచకొండ సిపి గా సుధీర్ బాబుని నియమించారు.ఇప్పటి వరకు నగర కమిషనర్ గా ఉన్న సందీప్ శాండిల్యను నార్కోటిక్ వింగ్ డైరెక్టర్ గా బదిలీ అయ్యారు.

Read Full News
flight c

కూలిన విమానం…

మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణం పరిధి రావెల్లి శివారులో విమాన ప్రమాదం జరిగింది. పైలెట్ లకు శిక్షణ ఇచ్చే విమానం ప్రమాదవశాత్తు కూలిపోయింది. హైదరాబాద్ దుండిగల్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన శిక్షణ విమానం సాంకేతిక లోపం కారణంగా ఒక్కసారిగా కూలిపోయి మంటలకు గురైంది. చిట్టడవిలో విమానం పూర్తిగా కాలిపోయింది. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Read Full News
boat cf

విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ లో సంభవించిన అగ్ని ప్రమాదంలో మత్యకారులకు చెందిన సుమారు 40 బోట్లు కాలి బూడిద అయ్యాయి. ఈ సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన హార్బర్ కు చేరుకొని మంటలు అదుపు చేసారు. అయితే ఈ ప్రమాదానికి సంబంధిండిన కారణాలు తెలియలేదు. మత్స్యకారుల బోట్లు దగ్ధమైన ఘటనపై సీఎం వైయస్‌ జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.ఈ ఘటనపై లోతైన దర్యాప్తు జరిపి కారణాలు వెలికి తీయాలని ఆదేశించారు. మంత్రి సీదిరి అప్పలరాజును ఘటనాస్థలానికి వెళ్లాలని…

Read Full News
Screenshot 20231113 150944 WhatsApp

తొమ్మిది మంది మృతి

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. నాంపల్లిలోని బజార్‌‌ఘాట్‌లోని కెమికల్ గోడౌన్‌లో సోమవారం ఉదయం భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో చిక్కుకొని తొమ్మిది మంది కార్మికులు దుర్మరణం చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. నాలుగు అంతస్తుల వరకు మంటలు వ్యాపించాయి. స్థానికులు ఇచ్చిన సమాచారంతో విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మూడు ఫైరింజన్లతో మంటలను అదుపుచేసేందుకు యత్నిస్తున్నారు. మరికొంతమంది కార్మికులు మంటల్లో చిక్కుకున్నట్లు సమాచారం. కార్మికులను రక్షించేందుకు సహాయక చర్యలు…

Read Full News
bab

ఇక పొడిగించం…

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణను హైకోర్టు కోర్టు మరోసారి వాయిదా వేసింది. ప్రభుత్వ అదనపు ఏ.జీ. హాజరు కాలేకపోతున్నట్టు, మరింత సమయం కావాలని సీఐడీ ప్రత్యేక పీ.పీ. వివేకానంద కోర్టును కోరారు. అంతేకాక విచారణను ఈనెల 22కు వాయిదా వేయాలని వివేకానంద హైకోర్టును అభ్యర్ధించారు. పి. పి. అభ్యర్ధనను కోర్టు అంగీకరించక పోగా, మరోసారి గడువు పొడిగించేది లేదని తేల్చి చెప్పింది.తదుపరి విచారణను ఈ నెల 15కు వాయిదా తెలిపింది.

Read Full News
babu cort

“బాబు”బెయిల్ పై విచారణ…

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన బెయిల్ పిటీషన్‌ పై ఈ రోజు హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారందరికీ న్యాయస్థానాలు బెయిల్ మంజూరు చేశాయి. ఇదే కేసులో చంద్రబాబుకు బెయిల్‌ దక్కకపోవడంపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే అనారోగ్య కారణాలతో చంద్రబాబుకు హైకోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిలు మంజూరు చేసింది. ఇటీవల సిమెన్స్ సీనియర్ డైరెక్టర్ భాస్కర్‌కు గతంలో ఇచ్చిన మధ్యంతర ముందస్తు బెయిల్‌ను సుప్రీంకోర్టు…

Read Full News
jagan notic

మళ్లీ నోటీసులు…

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులపై మాజీ ఎంపీ హరిరామ జోగయ్య దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) తెలంగాణ ఉన్నత న్యాయ స్థానంలో విచారణకు వచ్చింది. హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్ వి శ్రావణ్ కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టింది. హరిరామ జోగయ్య వేసిన పిల్ ను పరిగణించేందుకు రిజిస్ట్రీ పేర్కొన్న అభ్యంతరాలపై మొదట విచారణ చేశారు. అనంతరం హైకోర్టు పిల్ లో సవరణలను…

Read Full News
vja bus c

నిర్లక్ష్యం ఖరీదు..నిండు ప్రాణాలు…

విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ లో జరిగిన ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ప్లాట్ ఫాం పైకి బస్సు దూసుకురావడం వల్ల ఈ ప్రమాదం సంభవించినట్లు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.ఈ బస్సు ప్రమాదం పై ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు స్పందించారు. సంఘటన జరగడం దురదృష్ట కరమని, 24 గంటల్లో విచారణ పూర్తిచేసి కారణం తెలుసుకుంటామని చెప్పారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని, మృతుల కుటుంబానికి 5 లక్షల రూపాయనల చొప్పున పరిహారం, గాయపడిన వారికి ఆస్పత్రి…

Read Full News
IMG 20231029 WA0016

కేరళలో కుట్ర…

కేరళలోని ఓ కన్వెన్షన్ సెంటర్లో భారీ పేలుడు సంభవించి ఒకరు మరణించారు. ఆదివారం ఉదయం జరిగిన ఈ ఘటనలో 36 మంది గాయపడ్డారు. వీరిలో పది మంది తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎర్నాకులంలోని కాళామస్సేరీలో ఉన్న జమ్రా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. రెండు వేల మందికిపైగా పాల్గొన్న ఓ మతపరమైన కార్యక్రమం జరుగుతున్న సమయంలో పేలుడు సంభవించిందని పోలీసులు తెలిపారు. ఇందుకు ఐఈడీ ఉపయోగించారని వెల్లడించారు.పేలుడుకు సంబంధించి ఆదివారం…

Read Full News
jagana police c

“ఖాకీ” అంటే త్యాగనిరతి…

పోలీసులు వేసుకునే ఖాకీ డ్రెస్ అంటేనే త్యాగనిరతికి నిలువెత్తు సాక్ష్యం అనీ, పోలీస్‌ అంటే అధికారం మాత్రమే కాదనీ, సమాజంలో అతను ఒక బాధ్యత గల వ్యక్తీ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్.జగన్మోహన్ రెడ్డి అన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో అయన పాల్గొన్నారు. నేరం వేగంగా తన రూపాన్ని మార్చుకుంటున్న ఈ యుగంలో అంతకుమించిన వేగాన్ని అందుకుంటేనే పోలీసింగ్‌కు మరింత విలువ పెరుగుతుందన్నారు. జన రక్షణ…

Read Full News
poce commo

“ధీరుల”కు నివాళి రోజు…

పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్నిపురస్కరించుకొని శనివారం హైదారాబాద్ గోషామహల్ స్టేడియం లో పోలీస్ ఫ్లాగ్ డే జరుగుతుంది. ఉదయం 8 .45 గంటలకు ప్రారంభమయ్యే ఈ ఫ్లాగ్ డే కార్యక్రమంలో డీజీపీ అంజనీ కుమార్ పాల్గొంటారు. ఉంటుంది. ఈ సంవత్సరం దేశ వ్యాప్తంగా విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన అమర పోలీసులకు నివాళులు అర్పిస్తారు. సీనియర్ పోలీస్ అధికారులు, పదవీ విరమణ పొందిన పోలీసాధికారులు, పోలీసు అమరుల కుటుంబాలుఈ కార్యక్రంలో పాల్గొంటాయి.

Read Full News
dgp batukamma

పోలీసుల బతుకమ్మ…

తెలంగాణ డీజీపీ కార్యాలయంలో బతుకమ్మ ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించారు. కార్యాలయ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ బతుకమ్మ పండగకు డీజీపీ అంజనీ కుమార్,అడిషనల్ డీజీ సౌమ్య మిశ్రా, అభిలాష బిస్ట్, సంజయ్ కుమార్ జైన్, ఐ.జి రమేష్ రెడ్డి, ముఖ్య పరిపాలనాధికారి నవానీత తోసహా పలువురు పోలీస్ ఉన్నతాధికారులు హాజరయ్యారు. తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలను ఒక చోట చేర్చి ఉద్యోగులు, వారి పిల్లలు, చిన్నారులతో ఆటపాటలతో సంబరాలు చేసారు. దాండియా, బతుకమ్మ ఆటపాటల…

Read Full News
betting raja

బెట్టింగ్ రాజా సస్పెండ్…..

డ్రీమ్ 11 బెట్టింగ్ లో 1.5 కోట్ల రూపాయలు గెలుచుకున్న మహారాష్ట్రలోని పుణేకు చెందిన ఎస్సై సోమనాథ్ సస్పెండ్ అయ్యారు. ఆన్ లైన్ లో బెట్టింగ్ చేసిన ఎస్.ఐ. ఇంత పెద్ద మొత్తం గెలిచారనే వార్త బయటకు గుప్పుమనడంతో ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ఈ క్రమంలో అనుమతి లేకుండా బెట్టింగ్ కు పాల్పడడం, మీడియా ఎదుట పోలీస్ యూనిఫామ్ లో మాట్లాడటం వంటివి నిబంధనలకు విరుద్ధమని విచారణాధికారి పేర్కొన్నారు. దీంతో సోమనాథ్ పై చర్యలు తీసుకున్నట్లు పుణే…

Read Full News

తరలుతున్న డబ్బు…

నిన్న నల్గొండ జిల్లాలో మూడు కోట్ల రూపాయల నగదు దొరకగా ఈ రోజు కరీంనగర్ జిల్లాలో మరో రెండు కోట్ల రూపాయల నగదు పట్టుపడింది. అనేక చోట్ల చెక్ పోస్టులు ఏర్పాటు చేసినప్పటికీ డబ్బు ప్రవాహం ఆగడంలేదు. నగదు స్వదినంపై కరీంనగర్ పోలీస్ కమిషనర్ ఎల్.సుబ్బరాయుడు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర  అసెంబ్లీ ఎన్నికల నియమావళి  అమలులో ఉన్నందున జిల్లాలో అక్రమంగా డబ్బు, మద్యం, ఇతరములను  నిరోధించుటకు పలు చోట్ల చెక్ పోస్టులను ఏర్పాటు  ఎప్పటికప్పుడు వాహన తనిఖీలు…

Read Full News