ఈ సారి కాంగ్రెస్…
సినీ నటి, మాజీ ఎం.పి. విజయ శాంతి ఈ సారి కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. తగిన ప్రాధాన్యత దక్కడంలేదని భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసిన ఆమె కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే సమక్షంలో ఆ పార్టీలో చేరారు.
సినీ నటి, మాజీ ఎం.పి. విజయ శాంతి ఈ సారి కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. తగిన ప్రాధాన్యత దక్కడంలేదని భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసిన ఆమె కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే సమక్షంలో ఆ పార్టీలో చేరారు.
అసెంబ్లీ ఎన్నికల వేళ టీ- బీజేపీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే సీనియర్ నేతలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్ వంటి నేతలు బీజేపీ రాజీనామా చేయగా తాజాగా లేడీ ఫైర్ బ్రాండ్, మాజీ ఎంపీ విజయ శాంతి సైతం వారి బాటలోనే నడిచింది. బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు విజయశాంతి ప్రకటించింది. ఈ మేరకు బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్ రెడ్డికి రాజీనామా లేఖను పంపింది. బీజేపీ నాయకత్వంపై విజయశాంతి గత కొన్ని రోజులుగా తీవ్ర…
తెలంగాణ శాసనసభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్ల ఉపసంహరణ బుధవారం నుంచి ప్రారంభం అవుతోంది. దీంతో ప్రధాన పార్టీల్లో టిక్కట్లు దక్కక తిరుగుబాటు అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేసిన వారిని బుజ్జగించే చర్యలు మొదలయ్యాయి. కొన్ని పార్టీలు ముడో కంటికి తెలియకుండా ఈ తతంగం పూ[పూర్తీ చేస్తుంటే మరికొన్ని పార్టీలు మాత్రం బాహాటంగానే బుజ్జగిస్తున్నాయి. బిజెపి, బారాసలు జిల్లా స్తాయిల్లోనే రెబల్స్ తో సంప్రదింపులు జరుపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ మాత్రం సీనియర్ నేతలతో మాటా మంతి మొదలుపెట్టింది….
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం, జనసేన పొత్తుపై తెలంగాణ ఎన్నికల ప్రభావం పడే సూచనలు కనిపిస్తున్నాయా? జనసేన వ్యవహార శైలి దీనికి దారి తీసే అవకాశం ఉందా? తెలంగాణలో జనసేన బిజెపితో అంటకాగుతున్నతీరు తెలుగుదేశం అధినాయకత్వానికి మింగుడు పడడం లేదా? పొత్తుల విషయంలో జనసేన ఏకపక్షంగా, దూకుడుగా వ్యవహరిస్తోందా? రాజమండ్రి సెంట్రల్ జైలులో కలిసిన టిడిపి,“సేన” చేతుల పట్టుసడలే ప్రమాదం ఉందా? ఇలాంటి అనేక ప్రశ్నలకు రాజకీయ పరిశీలకుల నుంచి అవుననే సమాధానం వస్తోంది. తెలుగుదేశం పార్టీ అధినేత…
తెలంగాణలో జరిగే శాసనసభ ఎన్నికలలో అభ్యర్థులను గెలిపించుకునేందుకు, అధికార పీఠం దక్కించుకునేందుకు రాజకీయ పార్టీల ఎత్తుగడల్లో వింత పోకడలు కనిపిస్తున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా కులాలను అడ్డుపెట్టుకొని రాజకీయం చేయడం అధికమవుతోంది. ఒకవైపు కుల రహిత సమాజం కావాలంటూ ఊకదంపుడు ప్రసంగాలు చేసే నేతలే రాజకీయ పబ్బం గడుపుకోవడానికి కులాలను ఎన్నికల తెరపైకి తేవడం సామజిక, రాజకీయ పరిశీలకులను నివ్వెర పరుస్తోంది. బి.అర్.ఎస్., కాంగ్రెస్, బిజెపి ఇలా ప్రధాన రాజకీయ పార్టీలు గతంలో మాదిరిగా సాధారణ సభలు,సమావేశాల…
గత రెండు దశాబ్దాలుగా ఎన్నికలు సమీపిస్తున్నాయంటే చాలు వివిధ రాజకీయ పార్టీలు జనాకర్షణ కోసం సినీ నటులపై దృష్టి సారించేవి. ఏదో రకంగా వాళ్ళను రంగంలోకి దించేవి లేదా ఆసక్తి ఉన్న నటులే ముందుకు వచ్చి తమకు నచ్చిన పార్టీల పంచన చేరే వారు. కానీ, ఈ ఎన్నికల్లో ఆ తంతు జాడ లేకుండా పోయింది.గత ఎన్నికల వరకు కూడా సీట్లు, ప్రచారల్లో సందడి చేసిన “వెండి తారలు”ఈ సారి తెలంగాణ శాసన సభ ఎన్నికల తెరపై…
తెలంగాణ ఎన్నికల్లో జనసేన, వైఎస్అర్ తెలంగాణ పార్టీల నిర్ణయాలు రాజకీయ పరిశీలకులను, సాధారణ ప్రజానీకాన్ని సందిగ్దంలో పడేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో బలమెంతో స్పష్టంగా తెలియని ఆ రెండు పార్టీ లు రోజుకో దారిని వెతకడం ఓట్ల చిలికకు దారితీసే ప్రమాదం ఉందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య రాజకీయ వ్యూహంలో జనసేన తీసుకుంటున్న నిర్ణయాలు, తెలంగాణా ప్రాంతంలో వైఎస్అర్ తెలంగాణా పార్టీ వ్యవహారాన్ని పరిశీలిస్తే ఈ రెండు పార్టీలు దేన్నీ ఆశించి రాజకీయాలు…
కరీంనగర్ బీజేపీ అసెంబ్లీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్నా. నిండు మనస్సుతో మీ బిడ్డను ఆశీర్వదించండి. అత్యధిక మెజారిటీతో గెలిపించండి.’’ అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ అసెంబ్లీ అభ్యర్ధి బండి సంజయ్ కుమార్ విజ్ఝప్తి చేశారు. ఈరోజు వేద పండితులు నిర్ణయించిన ముహుర్తానికి కరీంనగర్ అసెంబ్లీ అభ్యర్ధిగా 2 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సీహెచ్.విఠల్, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిల్ల రమేశ్, సోదరుడు బండి సంపత్, కిరణ్ సింగ్…
దేశానికి నరేంద్ర మోడీ ఇంకోసారి ప్రధానమంత్రి కావలసిన ఆవశ్యకత ఉందని, ముచ్చటగా మూడోసారి మోడీ ప్రధాని కావాలని ఆకాంక్షిస్తున్నట్టు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడించారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడారు. ఈ నెల 7వ తేదీన హైదరాబాద్ లో బీజేపీ నిర్వహించే బహిరంగ సభలో పాల్గొనాలని ఆహ్వానం అందినట్టు తెలిపారు. కిషన్ రెడ్డి మాట్లాడుతూ “ఎన్డీయే భాగస్వామ్య పక్షంగా ఉన్న జనసేన పార్టీ జీహెచ్ఏంసీ…
నలభై ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న తెలుగదేశం పార్టీ ఎవరూ ఊహించని రీతిలో తొలిసారి ఎన్నికల బరికి దూరమైంది. వచ్చే నెలలో జరగనున్న తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పోటీకి మొహం చాటేయడంతో రాజకీయ పరిశీలకులు సహా సామాన్య జనం ఒక్కసారిగా విస్తుపోయారు. తెలంగాణలోని అనేక జిల్లాల్లో అంకితభావంతో పనిచేస్తున్న క్యాడర్, కొన్నినియోజక వర్గాల్లో ఇప్పటికీ పట్టు సడలని ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ తెలుగుదేశం పోటీకి దూరం కావడం ఆ పార్టీ మనుగడను మరింత దెబ్బతీసే అవకాశం…
ములుగు జిల్లాలో 9 వందల కోట్ల రూపాయల వ్యయంతో కేంద్రీయ గిరిజన విశ్వ విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చెప్పారు. మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో భాగంగా తెలంగాణలోసుమారు 13,500 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టే వివిధ రకాల అభివృద్ధి పనులకు అయన శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మోడీ మాట్లాడారు. సమ్మక్క- సరక్క ల పేరుతో గిరిజన యూనివర్సిటీ ప్రారంభించనున్నట్టు వివరించారు. అదేవిధంగా రాష్ట్రంలో పసుపు…
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడ? చంద్రబాబు అరెస్టు అనంతరం రాజమండ్రి జైలులో ఆయన్ని కలిసి తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నట్టు ప్రకటించిన పవన్ ఎక్కడ ఉన్నారు? పార్టీ శ్రేణులతో బిజీగా ఉన్నారా? లేక సినిమా షూటింగుల్లో మునిగి పోయారా ? ఏ విషయం తెలియక “సేన” సైన్యం సందిగ్ధంలో ఉంది. వచ్చే నెలలో అయన వారాహి యాత్ర ప్రారంభించనున్న నేపథ్యంలో తెలుగదేశం పార్టీ పొత్తుకు సంబంధించి ఏం చెప్పాలనుకుంటున్నారు అనే విషయం చర్చనీయాంశంగా మారింది. టిడిపితో పొత్తు…
వచ్చే ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలులోకి వస్తే తెలంగాణా రాష్ట్రంలో రాజకీయ పార్టీలు భారీ కసరత్తు చేయాల్సిన పరిస్ధితులు కనిపిస్తున్నాయి. దాదాపు 35 స్థానాలకు పైగా మహిళల చేతుల్లోకి వెళ్ళాక తప్పదు. మహిళా జనాభా ఆధారంగా చేసుకొని నియోజక వర్గాల కేటాయింపులు జరిగే అవకశాలున్నాయనే సమచారం అందుతోంది. ఒకవేళ ఇదే జరిగితే ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన భారత రాష్ట్ర సమితి (బి. అర్.ఎస్.) మళ్ళీ కొత్త జాబితాను తయారు చేయాలి, సరైన మహిళా అభ్యర్ధులను…
ఆంధ్రప్రదేశ్, గోవా, ధాయిలాండ్ తదితర ప్రాంతాల్లో నిర్వహించిన క్యాసినోలతో తెరపైకి వచ్చిన చీకోటి ప్రవీణ్ బిజెపిలో చేరుతున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డిని కలిసినట్టు సమాచారం అందుతోంది. ఒకటి, రెండు రోజుల్లో ప్రవీణ్ కమలం కండువా కప్పుకోనున్నారు.