pawan55

పవన్ కి వెన్నునొప్పి…

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రమైన వెన్ను నొప్పికి గురయ్యారు.కృష్ణా జిల్లాలో నిర్వహించిన జనవాణిలో పవన్ తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడ్డారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తూ ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో నొప్పిని తట్టుకోలేక ఆయన జనవాణి కార్యక్రమం నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోయారు.

Read Full News
IMG 20231002 WA0045 2

తెలంగాణలో సై…

తెలంగాణలో రానున్న ఎన్నికల బరిలోకి దిగడానికి జనసేన సిద్ధమైంది. వివిధ జిల్లాల్లో మొత్తం 32 నియోజక వర్గాలలో తమ అభ్యర్ధులు పోటీ చేస్తారని జనసేన ప్రకటించింది. ఉమ్మడి హైదరాబాద్, రంగరెడ్డి జిల్లాలోని కూకట్‌పల్లి, ఎల్‌బి నగర్, కుతుబుల్లాపూర్, శేరిలింగంపల్లి, సనత్‌నగర్, ఉప్పల్, పటాన్‌చెరువు, మల్కాజిగిరి, మేడ్చల్ వంటి 9 నియోజక వర్గాలు సహా ఖమ్మం జిల్లాలోని 7 నియోజక వర్గాల్లో జనసేన పార్టీ అభ్యర్థులు ఎన్నికలలో పోటీ చేస్తారు.

Read Full News
jagan babu pawan

“కురుక్షేత్రం”లో ద్రౌపది ఎవరో…

అంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వింత పోకడలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఒక పార్టీ పై మరో పార్టీ అడ్డూఅదుపూ లేని ఆరోపణలకు దిగుతున్నాయి. కొన్ని సందర్భాల్లో రాయలసీమ శైలిలో, మరికొన్ని సార్లు బెజవాడ తరహాలో ప్రసంగాలు సాగుతుంటే, ఇంకొన్ని సభల్లో ఏకంగా సినిమా డైలాగులను మరిపించే విధంగా మాటల తూటాలు పేలుతున్నాయి. తెలుగుదేశం నేతలపై మంత్రి రోజా చేస్తున్న ఘాటైన విమర్శలకు అదే స్థాయిలో  రోజాపై టిడిపి మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో…

Read Full News
pawan 16

పవన్ ఎక్కడ…

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడ? చంద్రబాబు అరెస్టు అనంతరం రాజమండ్రి జైలులో  ఆయన్ని కలిసి తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నట్టు ప్రకటించిన పవన్ ఎక్కడ ఉన్నారు? పార్టీ శ్రేణులతో బిజీగా ఉన్నారా? లేక సినిమా షూటింగుల్లో మునిగి పోయారా ? ఏ విషయం తెలియక “సేన” సైన్యం సందిగ్ధంలో ఉంది. వచ్చే నెలలో అయన వారాహి యాత్ర ప్రారంభించనున్న నేపథ్యంలో తెలుగదేశం పార్టీ పొత్తుకు సంబంధించి ఏం చెప్పాలనుకుంటున్నారు అనే విషయం చర్చనీయాంశంగా మారింది. టిడిపితో పొత్తు…

Read Full News
JAGAN

జగన్ మరో “యాత్ర”…

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి కొత్త కార్యక్రమానికి రంగం సిద్దం చేస్తున్నారు. గత ఎన్నికలకు ముందు ఓదార్పు, ప్రజా సంకల్ప యాత్రల పేరుతో జనంలోకి వెళ్ళిన అయన ఈ 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. అయితే , ఈ సారి రాబోయే ఎన్నికల్లో జనంలోకి వెళ్లేందుకు అయన కొత్త పందాని అవలంభిచనున్నారు. వైసిపి అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు గడిచిన నేపథ్యంలో ప్రభుత్వ కార్యక్రమాలను చూపుతూ ప్రజా…

Read Full News
babu pawan c

ఆ పొత్తు నిజమేనా…!

ఆంధ్రప్రదేశ్ లో తెలుగదేశం, జనసేన మధ్య పొడపొచ్చలు వచ్చినట్టు కనిపిస్తోంది. చంద్రబాబు నాయుడు రిమాండ్ తో రాజమండ్రి కేంద్ర కారాగారానికి వెళ్ళగానే హుటహుటీన బాబుని జైలులో కలిసి వచ్చే ఎన్నికలలో టిడిపితో పొత్తు పెట్టుకుంటున్నట్టు ప్రకటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆలోచన సరళి మారిందా అనే సందేహం తలెత్తుతోంది. సుమారు 15 రోజులుగా చంద్రబాబుకు సంబంధించి పవన్ నుంచి ఒక్క ప్రకటన కూడా వెలుగు చూడక పోవడంతో ఆయా పార్టీ శ్రేణులు సందిగ్ధంలో పడ్డాయి.ఇటు బాబు…

Read Full News
IMG 20230924 WA0004

అరాచకం, విద్వేషం….

ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న విద్వేష పూరిత రాజకీయాల గతంలో ఎప్పుడూ లేవని బ్రాహ్మణి ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన జనసేన నాయకులు, పలు నియోజవర్గాల ఇంచార్జ్ లు నారా బ్రాహ్మణిని కలిసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా నారా బ్రాహ్మణి మాట్లాడుతూ రాష్ట్రంలో పరిస్థితులు రోజురోజుకూదిగజారుతున్నాయని, రాక్షస పాలనపై ఉమ్మడం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు ఎన్నడూ, ఎవరూ చూడలేదని అన్నారు. చంద్రబాబుపై కేసు విషయంలో అన్ని డాక్యుమెంట్లు,…

Read Full News
babu pawan c

గెలిస్తే ముఖ్యమంత్రి ఎవరో…!

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టుతో రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య మార్పులు, ఆసక్తికర కొత్త కొత్త విషయాలు తెరపైకి వస్తున్నాయి. మొన్నటి వరకు భారతీయ జనతా పార్టీతో అంటకాగిన జనసేన చంద్రబాబు జైలులో ఉండగానే తెలుగుదేశంతో పొత్తు ఖరార చేసుకుంది. ఇదే సందర్భంలో బిజెపితోనూ సఖ్యతగా మెలుగుతామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పడం రాజకీయ పరిశీలకులను ఆలోచనల్లో పడేసింది. దీంతో తెలుగుదేశం, జనసేన కలసి ఎన్నికల బరిలోకి దిగితే…

Read Full News
babu pavan

జైలు సాక్షిగా పొత్తు….

ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సమీకరణలు వేగం పుంజుకుంటున్నాయి. అక్కడి జనసేన పార్టీ  బిజెపి తో కలిసి వైసిపితో పోటీకి దిగుతుందని వచ్చిన ఉహాగానాలకు పవన్ కళ్యాణ్ తెర దించారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కలిసి రంగంలోకి దిగనున్నాటు జనసేన అధినేత స్పష్టం చేశారు. రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఉన్న టిడిపి అధినేత చంద్రబాబు నాయుడితో ములాఖత్ అయిన తర్వాత పవన్ విలేకర్లతో మాట్లతుతూ పొత్తు విషయాన్నీ చంద్రబాబుతో చర్చించినట్టు, వచ్చే ఎన్నికల్లో…

Read Full News
roja

రీమేక్‌ స్టార్‌ “పవన్‌”…

వెనకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం విశాఖను పరిపాలన రాజధానిగా సీఎం వైయస్‌ జగన్‌ ప్రకటించిన నాటి నుంచి  చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ అదే పనిగా విషం చిమ్ముతున్నారని మంత్రి ఆర్‌కె రోజా అన్నారు. విశాఖ నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయడానికి సీఎం కృషి చేస్తుంటే, ఆ నగరాన్ని క్రైమ్‌ సిటీగా, అక్కడి ప్రజలను అవమానించే విధంగా పవన్‌కళ్యాణ్‌ మాట్లాడుతున్నారు. చంద్రబాబు మాట్లాడినట్టు , విమర్శించినట్టు పవన్‌ కళ్యాణ్‌ కూడా అదే బాటలో వెళ్తూ పవర్‌స్టార్‌గా కాకుండా, రీమేక్‌…

Read Full News
pawan 1

జగన్ అడ్డాగా విశాఖ…

ఆంధ్ర ప్రదేశ్ లో ప్రశాంతమైన నగరంగా ఉన్న విశాఖ పట్నం ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అడ్డాగా మారిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. విశాఖ నుంచి ప్రారంభమైన “వారాహి” మూడో విడత యాత్ర సందర్భంగా జగదంబా సెంటర్ లో ఆయన మాట్లాడారు. విశాఖ ప్రస్తుతం కబ్జాదారులు, రాబందుల చేతులోకి వెళ్లిందన్నారు. 150 మంది ఎమ్మెల్యేలతో నీ ఇష్టం వచ్చినట్లు ఆంధ్ర రాష్ట్రం ఏలుతున్నావని, ఐనా నీకు ఎవరూ భయపడరని ముఖ్యమంత్రి జగన్ ని ఉద్దేశించి…

Read Full News
pawan puja 2

ఆయన మంచోడు…

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఒక్కసారిగా తెరపైకి రావడం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశం అయింది. తన విషయంలో పవన్ పవన్ చేసింది నూరు శతం తప్పే అయినా అయన చాల మంచి వాడని కితాబు ఇచ్చింది. సమాజం సేవ కోసం ప్రయత్నిస్తున్న అతన్ని మొదటి నుంచి ప్రోత్సాహిస్తున్నాట్టు తెలిపారు.ఆమె ఏమి మాట్లాడిందో ఒకసారి చూద్దాం..

Read Full News
pawan 16

ఆదుకోండి…

తెలంగాణలో వరద బాధితులను తక్షణమే ఆదుకోవాలని జనసేన  అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కోరారు.   రాష్ట్రంలో భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. వర్షాలకు తోడు వరద ప్రభావం కూడా భూపాలపల్లి జిల్లాలో పలు గ్రామాలను జల దిగ్బంధం చేసిందని, భూపాలపల్లి జిల్లా, మోరంచపల్లి గ్రామం వరదలో చిక్కుకున్న విషయం నా దృష్టికి వచ్చిందన్నారు. దాదాపు 200 కుటుంబాలు సాయం కోసం ఎదురుచూస్తున్నాయని, ములుగు జిల్లాలోని ముత్యాలధార జలపాతం వద్దకు వెళ్ళిన 40…

Read Full News
pawan kkd 2

కేసు పడింది…

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమపై చేసిన వ్యాఖ్యలు, ఆరోపణలకు తీవ్ర మనస్తాపం చెందినట్టు విజయవాడ సివిల్ కోర్టులో ఓ మహిళా వాలంటీర్ పవన్ కల్యాణ్ పై పిటిషన్ వేసింది. పవన్ మాటలు మానసిక వేదనకు గురిచేశాయని పేర్కొంది. ఈ మేరకు వాలంటీర్ దాఖలు చేసిన పిటిషన్ కోర్టు విచారణకు స్వీకరించింది.

Read Full News
prp logo

“జనసేన” తడబాటు…

పి.ఆర్.పి గుర్తుండే ఉంటుంది..అదే ప్రజారాజ్యం పార్టీ ..మెగాస్టార్ కలల సాకారం.. రాష్ట్ర ప్రజలకు ఏదో చేయాలనే సంకల్పం. ఆనాడు ప్రజల్లో ఎన్నో ఆశలు రేపింది. అధికార పక్షానికి తానే పోటీ అని చాటింది. ప్రతీ  మీటింగ్ లో అశేష జనవాహినిని చూసి తబ్బిబ్బయింది. గెలుపు ఖాయమని అంచనా వేసింది. కొన్ని సందర్భాల్లో అధికారం మాదే అన్న నిర్ణయానికీ వచ్చింది. కానీ, అది మెగాస్టార్ పై అభిమానమే తప్ప ప్రజలు ఏలికను కోరుకోవడంలేదని ఎన్నికలు జవాబు చెప్పాయి. 2008…

Read Full News